20, జనవరి 2022, గురువారం

ఈశావాస్యోపనిషత్తు

 ఈశా వాస్యమిదxసర్వం యత్కించ జగత్యాం జగత్, 

తేన త్యక్తేన భుంజీథా మాగృధః కస్య స్విద్ ధనమ్.

ఇది ఈశావాస్యోపనిషత్తు లోని మొదటి మంత్రము. ఈ మంత్రము పూర్తి జగత్తు అంతా ఈశ్వరుని చేతనే వ్యాపించబడి వున్నదని పేర్కొంటున్నది.

జగత్యామ్ = అఖిల బ్రహ్మాండము నందు; యత్ కించ ఏదైతే; జగత్ =జడ, చేతన స్వరూపమైన జగత్తుగలదో; ఇదమ్ = ఈ; సర్వమ్ = సమస్తమును; ఈ = ఈశ్వ రునిచే; వాస్యమ్ =వ్యాపించియున్నది; తేన=అందుచే; త్యక్తేన త్యాగపూర్వకముగ (ఈశ్వరుని వెంట నిడుకొని); భుంజీథా= (దీనిని) అనుభవింపుము; మాగృధః= ( దీనియందు) ఆసక్తుడవు గాకుండుము; (ఏలయన) ధనమ్ = ధనము-సంపద భోగ్య పదార్థములు; కస్యస్విత్ = ఎవరిది? అనగా ఎవరిదీకాదు.

తాత్పర్యము ఈశ్వరుని చేత : అఖిల బ్రహ్మాండము నందుగల చేతనా చేతన జగత్తంతయు వ్యాపించియున్నది. అందుచే ఈశ్వరుని సాన్నిహిత్యము ననుభవించుచు, సమర్పణ బుద్ధి ద్వారా త్యాగపూర్వకముగ, ప్రాప్తించిన దానిని అనుభవింపుము. కాని దాని యందు ఆసక్తుడవు గాకుండుము. ఈ సంపద, ధనము, భోగ్యసామగ్రి ఎవరిది? అనగా ఎవరికీ చెందినదికాదు.

వ్యాఖ్య: అఖిల విశ్వబ్రహ్మాండము నందుగల చరాచరాత్మకమైన జగత్తు నీ చూపుద్వారా, వినికిడి ద్వారా తెలియవచ్చు చున్నదంతయునూ సర్వాధారుడు, సర్వనియంత, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సకల కళ్యాణగుణ స్వరూపుడునగు పరమేశ్వరుని చేత వ్యాపింపబడి యున్నది; సదా, సర్వత్ర అతనిచేత పరపూర్ణమై యున్నది. (గీత.9-4) ఇందలి ఏ అంశము కూడా అతనితో రహితమై లేదు. (గీత.10-39, 42) ఈ విధంగా తెలిసి ఆ పరమేశ్వరుని నిరంతరము సన్నిహితంగా భావిస్తూ - సదా, సర్వదా అతనిని స్మరించుచునే నీవు ఈ జగత్తునందు త్యాగభావం కలిగి కేవలం కర్తవ్య నిర్వహణకై మాత్రమే విషయములను యధోచితముగా ననుభవింపుము. అనగా - విశ్వరూపుడగు -

ఈశ్వరుని అర్చించుట కొరకే కర్మలను ఆచరించుము. విషయములందు మనస్సును చిక్కుకొననివ్వకుము. ఇందులోనే నీకు నిశ్చితమైన మేలు గలదు. (గీత.2-64; 3-9; 18–46) నిజమునకు ఈ భోగ్యపదార్ధములు ఎవరివీ కావు. మనుజుడు పొరపాటుగా వీనియందు మమతా, ఆసక్తిని (ముడి వేసుకొని కూర్చుంటాడు) ఇవన్నియును పరమేశ్వరునివే, ఆతని కొరకే వీటినుపయోగించ వలయును. (త్వదీయం వస్తు గోవింద తుల్యమేవ సమర్పయే) అని మనుజుల పట్ల వేదభగవానుడిచ్చిన పవిత్రమైన ఆదేశము నెరుగుము.

వివరణ: ఈ ప్రపంచం మొత్తం కూడా ఈశ్వరుని శక్తితోటె వ్యాపించి యున్నది.  అంటే ఈ జగత్తులో ఏది కూడా ఈశ్వరునికన్నా బిన్నంగా లేదు. అంటే నీవు నీ ఇంద్రియ జ్ఞ్యానంతో ఏదయితో తెలుసుకుంటున్నావో అది మాత్రమే కాదు తెలుసుకుంటున్నాను అని అనుకునే నీవు కూడా ఆ ఈశ్వరుని స్వరూపమే కాక్ మరొక్కటి కాదు. కానీ మనుసులమైన మనం నేను, నాది, నావాళ్లు అనే భ్రాంతిలో ఉండి ఆ పరమేశ్వరుని కన్నా భిన్నంగా ఉన్నట్లు భవిస్తూ ఐహిక వాంఛల వెంట పరుగులిడుతూ ఆ భగవంతుని మరచి కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాన్ని పొందుతున్నాము.  మనలో యెంత స్వార్ధం పెరుగుతుందో అంతగా పాప కర్మలు చేస్తూ ఉంటాము.  మీరు గమనించండి. నాకు వున్నదానితో నేను తృప్తి పడటం లేదు. కాబట్టి నాకు ఇంకా ఇంకా సంపద కావలి అంటే నేను నా తహతకు మించిన సంపదను కోరుకుంటున్నాను అని అర్ధం.  ఆ కోరికలు తీరటానికి నేను అన్యాయ పద్ధతులు వెతికి వాటి వల్ల సంపదను పోగు చేసుకుంటాను.  మరి ఆ సంపద నాకు మనశాంతిని ఇస్తుందా అంటే ససేమిరా ఇవ్వదు. ఎప్పుడు ఏదో ఒక అపరాధ భావం వెంటాడుతుంది.  ఖరీదైన మంచం, పరుపు అన్యాయ అర్జితంతో కొనగలను కానీ నిద్ర మాత్రం రాదు.  ఎందుకంటె నేను చేసిన పాపపు పనులు నా మదిని తొలచి నాకు నిద్ర రాకుండా చేస్తున్నాయి.  ఈ విషయం నేను ఇంకొకరికి చివరికి నా వాళ్ళు అనుకునే భార్యాపిల్లలకు కూడా చెప్పలేను.  అనవసరపు ఆలోచనలతో గుండె జబ్బులు, చెక్కర వ్యాధులు వెన్నాడుతాయి.  ఇప్పుడు పశ్చాత్తాప పడి ప్రయోజనమేముంది. కాబట్టి చేసిన ప్రతి కర్మకు ఫలితంగా కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే.  దానిని ఎవ్వరు ఆ ఆపలేరు. 


తిలకధారణతో

 🔴తిలకధారణతో..బ్రహ్మవ్రాతను మార్చుకోవడం !

*మన హిందుమతములో మాత్రమే బొట్టు పెట్టుకొనే ఆచారమున్నది. ప్రపంచములో మరి ఏ ఇతర మతములలోనూ ఈ ఆచారములేదు.*


*”లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే''*


*”బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన గీత తప్పింప ఎవరికి శక్యముగాదు,” అని చెప్పుకొంటారు. లోకములో, కష్టములు తప్పించుకోలేము అంటారు, కాని ఎవరు ముఖమున బొట్టు పెట్టుకుంటారో వారు బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతను చెరిపి మంచి వ్రాత వ్రాసుకుంటున్నారన్నమాట, ఒక టేపురికార్డరు మీద ఏదైనా ఒక ఉపన్యాసము రికార్డు చేస్తే దానిని చెరిపి వేసి మరొకటి రికార్డు చేయటములా - అలాగే ఇది కూడా!* 


*బ్రహ్మదేవుడి వ్రాత ఎలా తప్పుతుంది అంటారేమో - పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు, పరమేశ్వరుని గుర్తుగా విభూతి, పార్వతీదేవి గుర్తుగా కుంకుమ మనము ధరిస్తాము. ముఖము చూడగానే విభూతి కుంకుమలు చూస్తే మనకు పార్వతీపరమేశ్వరులు జ్ఞాపకమువస్తారు, అట్లాగే ఇతర విధములైన బొట్లు కూడా భగవంతుని స్మరింపచేస్తాయి.* 


*భగవంతుడు జ్ఞాపక మున్నంతవరకూ మనకు మంచిబుద్ధి కలుగుతూనే వుంటుంది. మంచిబుద్ధి కలిగితే పాపములు చేయలేము. ఈ విధముగా పుణ్యకర్మలుచేసి బాగుపడుతాము. కాబట్టి హిందువులందరూ ముఖమున బొట్టు పెట్టుకొనడము తప్పక చేయాలి.*


*ఉదయమున లేచి బొట్టుపెట్టుకుని శుచిగా భగవంతుని ధ్యానము చేయాలి. తమకు ఇష్టము వచ్చిన స్తోత్రమునో, శ్లోకమునో, మంత్రమునో చదువుకొని భగవంతుని మానసికముగా ప్రార్థించాలి. కేవలము తమక్షేమము కొరకు మాత్రమే భగవంతుడిని ప్రార్థించకూడదు. “అందరూ క్షేమముగా వుండాలి. వర్షాలు కురవాలి. అందరికీ కష్టములు తొలగిపోవాలి. అందరి మనస్సూ శాంతిగా ఉండాలి" అని ప్రార్థించాలి.* 


*అంటే "లోకాస్సమస్థా స్సుఖినోభవంతు" అనుకోవాలి. తమ క్షేమముకొరకు ప్రార్థించేవారికంటే, అందరిక్షేమము కొరకూ ప్రార్థించేవారు ఉత్కృష్టులు. మానసికంగా ప్రార్థన చేయటానికి డబ్బుఖర్చు లేదు కదా!*


*లోకాలు మూడువిధాలుగా ఉన్నాయి, సుఖలోకములు. దుఃఖలోకములు. మిశ్రమలోకములు. ఇంద్రాది దేవతలున్న స్వర్గాదులు పుణ్యలోకములు. నరకాదులు దుఃఖలోకములు, స్వర్గములో దుఃఖముండదు. నరకములో సుఖముండదు. మానవలోకము మిశ్రమలోకము, ఇక్కడ సుఖము, దుఃఖము రెండూ ఉంటవి. సుఖదుఃఖములు రెండూ తెలుసు కాబట్టే దుఃఖము తొలగేందుకు సుఖము కలిగేందుకు పుణ్యకర్మ చేయాలి.* 


*స్వర్గనరకాదులలో దేనిని పొందడానికైనా మార్గము మానవలోకములోనే వున్నది.* 

*“జంతూనాం నరజన్మ దుర్లభం'' అన్నారు శంకరులు, అట్టి మానవ జన్మ పొందిన తరువాత దానిని వ్యర్థము చేయకూడదు.*


*లోకములో కొందరు… ‘హృదయంలో కేవలం ధ్యానం చేస్తే చాలదా, కర్మానుష్ఠానము ఎందుకు అంటారు. కాని అది సరికాదు, మానవుడు తరించటానికి ఈశ్వరభక్తి, కర్మానుష్ఠానము రెండూ ఉండాలి. అంతశ్శౌచము, బాహ్యశౌచము రెండూ కావాలి. ముందు బాహ్యశౌచము పాటిస్తే హృదయ శుద్ధి ఏర్పడుతుంది. దేవపూజ చేసేముందు, ఇక్కడికి వచ్చే ముందు స్నానముచేసి రావాలి. భగవన్నామము స్మరిస్తూ స్నానమాచచించాలి.* 


*జీవితమంతా వ్యర్థ సంభాషణలతో, కేవలము ఉదరపోషణ ప్రయత్నములో గడుపితే మనకూ, జంతువులకూ భేదమేమి? ఒక యంత్రములా తిని, నిద్రపోయి చనిపోతే జీవితము వ్యర్థమవుతుంది.* 


*కొందరు, అన్నీ భగవంతుడే చేస్తాడని, మనము ఏమీ చేయనక్కరలేదని చెప్పుతుంటారు. జంతువులకు కావలసినవన్నీ భగవంతుడు చూస్తాడు కానీ, మానవులకు భగవంతుడు స్వతంత్రంగా ఆలోచించే బుద్ధియిచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి యుక్తాయుక్త విచక్షణతో కర్మను ఆచరించమని భగవంతుని అభిప్రాయము. ఆ బుద్ధిని సక్రమముగా వినియోగించుకొనక, కాలము వ్యర్థముచేస్తే పతితుడవుతాడు.*


*కావున హిందువులందరూ…*

*1. తిలకధారణము, 2. సమిష్టి క్షేమము కొరకు మానసిక ప్రార్థన, 3. ఈశ్వరభక్తి, 4. కర్మానుష్ఠానమునందు శ్రద్ధ అలవరచుకొందురుగాక !*

విద్యా దదాతి

 //!! *శ్లోకం* !//


విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతామ్।

పాత్రత్వాధన మాప్నోతి,

ధనాద్ధర్మం తతస్సుఖ్ ॥ 


భావం : *విద్య వల్ల వినయం లభిస్తుంది*..... 

దానితో *యోగ్యత వస్తుంది*.... 

యోగ్యత వల్ల *ధనం*, 

దానిద్వారా *సుఖాన్ని ప్రజలు పొందుతారు*......


✨✨✨✨✨✨✨✨✨


//!! *శ్లోకం* !//


ఇతో న కించిత్ పరతో న కించిత్ 

యతో యతో యామి తతో న కించిత్ 

విచార్య పశ్యామి జగన్న కించిత్

ఆత్మావ బోధాత్ అధికం న కించిత్ 


!!!!భావం!!!!...


*ఈ లోకంలో ఏమీ లేదు పరలోకంలో ఏమీ లేదు ఎన్ని లోకాలు తిరిగినా ఏమీ లేదు* 

బాగా విచారిస్తే ఈ జగత్తు అంతా మిథ్య అని అర్థమవుతుంది.... 

ఎప్పుడు అర్థమవుతుంది అంటే *ఆత్మావగాహన చేసుకున్నప్పుడు ఇదంతా అర్థం అవుతుంది అని దీని అర్థం*....


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏