22, మే 2024, బుధవారం

మహాభాగవతం

 


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఆరవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు గోపకాంతలకడకు ఉద్దవుని పంపుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*46.17 (పదిహేడవ శ్లోకము)*


*దిష్ట్యా కంసో హతః పాపః సానుగః స్వేన పాప్మనా|*


*సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యః సదా॥10065॥*


కంసుడు సాధువులను, ధర్మాత్ములైన యదువంశమువారిని సర్వదా ద్వేషించుచుండెను. అట్టి పాపాత్ముడు తాను చేసికొనిన దుష్కర్మల ఫలితముగా, తన అనుచరులతో గూడి హతుడయ్యెను. ఇది మన అందరి అదృష్టము.


*46.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*అపి స్మరతి నః కృష్ణో మాతరం సుహృదః సఖీన్|*


*గోపాన్ వ్రజం చాత్మనాథం గావో వృందావనం గిరిమ్॥10066॥*


*46.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*అప్యాయాస్యతి గోవిందః స్వజనాన్ సకృదీక్షితుమ్|*


*తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితేక్షణమ్॥10067॥*


శ్రీకృష్ణుడు మమ్ములను అందఱిని ఎప్పుడైనను జ్ఞాపకము చేసికొనుచున్నాడా? తల్లి యశోదను, నన్ను, సుహృదులను, ప్రాణమిత్రులైన గోపాలురను, గోవులను, గోవర్ధనగిరిని, తననే దైవముగా నమ్ముకొనిన వ్రజభూమిని, బృందావనమును ఎన్నడైనను స్మరించుచున్నాడా? ఆ గోవిందుడు తనకు ఆత్మీయులమైన  మమ్ములను అందఱిని చూచుటకు ఒక్కసారియైనను అచటికి వచ్చునా? ఆయనను చూచెడి అదృష్టము మాకు ఎప్పుడు కలుగును? ఒప్పిదమైన నాసికతో, మధురములైన చిఱునవ్వులతో, ప్రేమతో నిండిన చూపులతో అలరారుచుండెడి ఆ చిన్నారిముఖమును చూచి ఆనందించెడి భాగ్యము మాకు అబ్బునా?


*46.20 (ఇరువదియవ శ్లోకము)*


*దావాగ్నేర్వాతవర్షాచ్చ వృషసర్పాచ్చ రక్షితాః|*


*దురత్యయేభ్యో మృత్యుభ్యః కృష్ణేన సుమహాత్మనా॥10068॥*


మహాత్ముడైన శ్రీకృష్ణుడు మమ్ములను దావాగ్ని గండమునుండి రక్షించినాడు, పెనుగాలులతో గూడిన వర్షప్రమాదమునుండి కాపాడినాడు. వృషభాసురుని, అఘాసురుని (కొండచిలువను) వధించి మమ్ము ఆదుకొనినాడు. అంతేగాక, మృత్యురూపములైన పెక్కు విపత్తులనుండి వ్రజవాసులను అందఱిని గట్టెక్కించినాడు. ఇంతయేల? ఆపన్నులకు ఆర్తిహరుడైన ఆ సర్వశక్తిమంతుడు మాకు చేయని సహాయమేలేదు.


*46.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*స్మరతాం కృష్ణవీర్యాణి లీలాపాంగనిరీక్షితమ్|*


*హసితం భాషితం చాంగ సర్వా నః శిథిలాః క్రియాః॥10069॥*


ఆ ప్రభువుయొక్క అద్భుత కృత్యములను, విలాసశోభితములైన క్రీగంటి చూపులను, మనోహరమైన చిఱునవ్వులను, మధురభాషణములను మేము అందరము నిరంతరము స్మరించుచునే యుందుము. ఆ తన్మయత్వములో మునిగియున్నప్ఫుడు మాకు మా గృహకృత్యములు ఎవ్వియును పట్టకుండెడివి.


*46.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*సరిచ్ఛైలవనోద్దేశాన్ ముకుందపదభూషితాన్|*


*ఆక్రీడానీక్షమాణానాం మనో యాతి తదాత్మతామ్॥10070॥*


మా చిన్నికృష్ణుడు విహరించిన నదీతీరములను, పర్వతప్రాంతములను, వనభూములను, క్రీడా ప్రదేశములను, అంతేగాక, ఆయన పాదపద్మముల యొక్క చిహ్నములతో విరాజిల్లుచుండెడి ఏ ప్రదేశమునైనను గాంచినప్పుడు మా మనస్సులన్నియును ఆయనలో తాదాత్మ్యము చెందుచుండును.


*46.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*మన్యే కృష్ణం చ రామం చ ప్రాప్తావిహ సురోత్తమౌ|*


*సురాణాం మహదర్థాయ గర్గస్య వచనం యథా॥10071॥*


'బలరామకృష్ణులు సకలదేవతల పరమప్రయోజనార్థము ఈ లోకమున అవతరించిన దివ్యపురుషులు' అని గర్గమహర్షి పలికియుండెను.  ఆ మహాముని వచనములు ముమ్మాటికిని నిజమేయని నేను తలంతును.


*46.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*కంసం నాగాయుతప్రాణం మల్లౌ గజపతిం తథా|*


*అవధిష్టాం లీలయైవ పశూనివ మృగాధిపః॥10072॥*


వేయి ఏనుగుల బలముగల కంసుని, ద్వంద్వయుద్ధమున ఆఱితేఱిన చాణూరముష్టికాది మల్లురను, *కువలయాపీడనము* అను మదపుటేనుగును, సింహము వనమృగములనువలె ఆ సోదరులు అవలీలగా వధించిరి.


*46.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*తాలత్రయం మహాసారం ధనుర్యష్టిమివేభరాట్|*


*బభంజైకేన హస్తేన సప్తాహమదధాద్గిరిమ్॥10073॥*


*46.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*ప్రలంబో ధేనుకోఽరిష్టస్తృణావర్తో బకాదయః|*


*దైత్యాః సురాసురజితో హతా యేనేహ లీలయా॥10074॥*



*సాక్షాత్తు శ్రీకృష్ణునకు అనుచరుడు, ఆయనకుమిగుల ప్రీతిపాత్రుడైన ఉద్ధవుడు, శ్రీకృష్ణుని తరపున నందుని  ఇంటికి వెళ్ళగా, నందుడు ఆదరముగా ఇంకను ఇట్లు పలుకుచెండెను:-*


"కృవ్ణప్రభువు  గోవర్ధనగిరిని ఒక చేతితో ఎత్తిపట్టుకొని, ఏడుదినములపాటు దానిని సునాయాసముగా ధరించెను. మూడు తాళవృక్షముల ప్రమాణముగలిగిణ, ఇనుమువలె దృఢమైన ధనుస్సును, గజేంద్రుడు కర్రనువలె ఆ స్వామి విరచివేసెను. ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, అరిష్టాసురుడు, తృణావర్తుడు, బకాసురుడు మొదలగుదైత్యులు పెక్కుమంది దేవదానవులను జయించినవారు. అట్టి మహాయోధులను సైతము శ్రీకృష్ణుడు అనాయాసముగా హతమార్చెను".


*శ్రీశుక ఉవాచ*


*46.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ఇతి సంస్మృత్య సంస్మృత్య నందః కృష్ణానురక్తధీః|*


*అత్యుత్కంఠోఽభవత్తూష్ణీం ప్రేమప్రసరవిహ్వలః॥10075॥*


*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! నందుని హృదయమంతయును శ్రీకృష్ణునిపైగల అనురాగముతో నిండియుండెను. ఇప్పుడు అతడు ఆ ప్రభువుయొక్క లీలలలో ఒక్కొక్కదానిని స్మరించుచు ప్రేమప్రసారములో విహ్వలుడాయెను. నేత్రములు అశ్రుపూరితములయ్యెను. కంఠము మూగవోయెను.


*46.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*యశోదా వర్ణ్యమానాని పుత్రస్య చరితాని చ|*


*శృణ్వంత్యశ్రూణ్యవాస్రాక్షీత్స్నేహస్నుతపయోధరా॥10076॥*


*46.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*తయోరిత్థం భగవతి కృష్ణే నందయశోదయోః|*


*వీక్ష్యానురాగం పరమం నందమాహోద్ధవో ముదా॥10077॥*


తన కన్నయ్య గుణములను, అద్భుతలీలలను తన భర్త (నందుడు) మెచ్చుకొనుచుండగా వినుచు యశోదాదేవి మాతృ ప్రేమతో పరవశించిపోయెను. ఆ ఆనందములో ఆ తల్లికి స్తన్యము పొంగాఱెను. తన తనయునితో పెనవైచుకొనిన ఆత్మీయత కారణమున కనులనుండి అశ్రువులు స్రవించుచుండగా ఆమె మిగుల చలించిపోయెను. ఇట్లు శ్రీకృష్ణుని (కన్నయ్యను) తనివిదీర చూచుకొనెడి భాగ్యము కఱవైనందున విలవిలలాడుచున్న యశోదానందులయొక్క పుత్రప్రేమకు ముగ్ధుడై ఉద్ధవుడు నందునితో ఇట్లనెను.


*ఉద్ధవ ఉవాచ*


*46.30 (ముప్పదియవ శ్లోకము)*


*యువాం శ్లాఘ్యతమౌ నూనం దేహినామిహ మానద|*


*నారాయణేఽఖిలగురౌ యత్కృతా మతిరీదృశీ॥10078॥*


*ఉద్ధవుడు ఇట్లనెను* "మహాత్మా! ఈ లోకమునందలి ప్రాణులకెల్ల మీరిద్దరు నిశ్చయముగా ఎంతయో కొనియాడదగినవారు. ఏలనన, సకల ప్రాణులకు తండ్రియగు నారాయణునిపై మీరు అత్యధికమైన వాత్సల్య పూరితమగు ప్రేమను, పుత్రభావమును కలిగియున్నారు.


*46.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*ఏతౌ హి విశ్వస్య చ బీజయోనీ  రామో ముకుందః పురుష ప్రధానమ్|*


*అన్వీయ భూతేషు విలక్షణస్య  జ్ఞానస్య చేశాత ఇమౌ పురాణౌ॥10079॥*


ఈ బలరామకృష్ణులు పురాణపురుషులు. వీరు జగత్తునకు నిమిత్తకారణమేగాక, ఉపాదానకారణము కూడ. వీరు సమస్త శరీరములయందు ప్రవేశించి, వాటికి ప్రాణదానము చేయుటయేగాక అత్యంత విలక్షణమైన జ్ఞానమును గూడ ప్రసాదింతురు. అంతేగాక, వారిని (శరీరధారులను) నియంత్రింతురు.


*46.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యస్మిన్ జనః ప్రాణవియోగకాలే క్షణం సమావేశ్య మనోవిశుద్ధమ్|*


*నిర్హృత్య కర్మాశయమాశు యాతి పరాం గతిం బ్రహ్మమయోఽర్కవర్ణః॥10080॥*


మానవుడు ప్రాణావసానదశయందు  క్షణకాలము పాటైనను లౌకిక విషయములయందు ఆసక్తిని వీడిన పరిశుద్ధమనస్సును శ్రీమన్నారాయణునిపై నిల్పినచో అతని కర్మవాసనలు అన్నియును దగ్ధమైపోవును. అతడు బ్రహ్మజ్ఞానమును పొంది, తేజోమయ (అపాకృత) రూపముతో పరమగతిని (మోక్షమును) పొందును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

మహాభాగవతం

 *


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఆరవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు గోపకాంతలకడకు ఉద్దవుని పంపుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*46.1 (ప్రథమ శ్లోకము)*


*వృష్ణీనాం ప్రవరో మంత్రీ కృష్ణస్య దయితః సఖా|*


*శిష్యో బృహస్పతేః సాక్షాదుద్ధవో బుద్ధిసత్తమః॥10049॥*


*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! వృష్ణివంశము వారిలో ప్రముఖుడైన ఉద్ధవుడు మిగుల ప్రజ్ఞాశాలి. అతడు సాక్షాత్తుగా బృహస్పతికి శిష్యుడు. శ్రీకృష్ణునకు ప్రాణమిత్రుడు, ఆంతరంగికుడు.


*46.2 (రెండవ శ్లోకము)*


*తమాహ భగవాన్ ప్రేష్ఠం భక్తమేకాంతినం క్వచిత్|*


*గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నార్తిహరో హరిః॥10050॥*


కృష్ణభగవానుడు ప్రపన్నుల (శరణాగతుల) ఆపదలను తొలగించువాడు. ఆ స్వామి ఒకనాడు తనకు అనన్యమగు ప్రియభక్తుడగు ఆ ఉద్ధవుని తనకడకు పిలిపించుకొనెను. తన చేతితో ఆయన చేతిని కలిపి పట్టుకొని, ఆ ప్రభువు ఏకాంతమున ఇట్లు నుడివెను.


*46.3 (మూడవ శ్లోకము)*


*గచ్ఛోద్ధవ వ్రజం సౌమ్య పిత్రోర్నౌ ప్రీతిమావహ|*


*గోపీనాం మద్వియోగాధిం మత్సందేశైర్విమోచయ॥10051॥*


"సౌమ్యుడవైన ఉద్ధవా! నీవు వ్రజభూమికి వెళ్ళుము. మా తల్లిదండ్రులైన యశోదానందులకు ప్రీతిని గూర్పుము. నా యెడబాటువలన గోపికలు మిగుల మనస్తాపము చెందియున్నారు. నా సందేశమును వినిపించి వారి వేదనను తొలగింపుము.


*46.4 (నాలుగవ శ్లోకము)*


*తా మన్మనస్కా మత్ప్రాణా మదర్థే త్యక్తదైహికాః|*


*మామేవ దయితం ప్రేష్ఠమాత్మానం మనసా గతాః|*


*యే త్యక్తలోకధర్మాశ్చ మదర్థే తాన్ బిభర్మ్యహమ్॥10052॥*


ఆ గోపకాంతలు తమ మనస్సులయందు నిరంతరము నన్నే నిలిపికొనియుందురు. వారి ప్రాణములు, జీవితములు, సర్వస్వము నేనే. వారు నా కొఱకై తమ దేహముతో సంబంధముగల పతి, పుత్ర బంధువులందరిని కూడ త్యజించివేసిరి. వారు హృదయపూర్వకముగా నా యెడ ఆత్మీయత గలిగియుండి నన్ను తమకు ప్రియతమునిగా భావించుచుందురు. నా కొరకై లోక పరలోకధర్మములను, సుఖములను  ప్రక్కనబెట్టి నన్నే నమ్ముకొనియున్న వారిని నేను సర్వదా పాలించుచుందును.


*46.5 (ఐదవవ శ్లోకము)*


*మయి తాః ప్రేయసాం ప్రేష్ఠే దూరస్థే గోకులస్త్రియః|*


*స్మరంత్యోఽఙ్గ విముహ్యంతి విరహౌత్కంఠ్యవిహ్వలాః॥10053॥*


ఉద్ధవా! ఆ గోపికలకు మిక్కిలి ప్రియతముడనైన నేను దూరము కాగా, వారు నన్నే స్మరించుచుందురు. నా యెడబాటు కారణముగా ఉత్కంఠతో విహ్వలులై నన్ను గుర్తుచేసికొని మీదు మిక్కిలి వ్యామోహమును పొందుచుందురు.


*46.6 (ఆరవ శ్లోకము)*


*ధారయంత్యతికృచ్ఛ్రేణ ప్రాయః ప్రాణాన్ కథంచన|*


*ప్రత్యాగమనసందేశైర్వల్లవ్యో మే మదాత్మికాః॥10054॥*


మిత్రమా! నేను గోకులమునుండి మథురకు బయలుదేఱు నప్పుడు వారికి 'నేను వ్రజభూమికి తప్పక తిరిగి వత్తును' అని మాట ఇచ్చి యుంటిని. అందు వలన తమ చిత్తముల యందు నన్నే నిలుఫుకొనియున్న ఆ గోపికలు అనుక్షణము నా రాకకై ఎదురు చూచుచు అతికష్టము మీద తమ ప్రాణములను నిలుపుకొనియుందురు.


*శ్రీశుక ఉవాచ*


*46.7 (ఏడవ శ్లోకము)*


*ఇత్యుక్త ఉద్ధవో రాజన్ సందేశం భర్తురాదృతః|*


*ఆదాయ రథమారుహ్య ప్రయయౌ నందగోకులమ్॥10055॥*


*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట ఉద్దవుడు ఆ స్వామి సందేశమును సాదరముగా స్వీకరించి, రథమునందు ఆసీనుడై నందగోకులమునకు బయలుదేరెను.


*46.8 (ఎనిమిదవ శ్లోకము)*


*ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ|*


*ఛన్నయానః ప్రవిశతాం పశూనాం ఖురరేణుభిః॥10056॥*


శోభాసంపన్నుడగు ఉద్ధవుడు సూర్యుడు అస్తమించు సమయమునకు గోకులమునకు చేరెను. అప్పుడే మేతకై వనమునకు వెళ్ళిన గోవులు ఇండ్లకు చేరుచుండెను. వాటి కాలిగిట్టల తాకిడికి చెలరేగిన దుమ్ము ఉద్ఢవుని రథమును కప్పివేసెను.


*46.9 (తొమ్మిదవ శ్లోకము)*


*వాసితార్థేఽభియుధ్యద్భిర్నాదితం శుష్మిభిర్వృషైః|*


*ధావంతీభిశ్చ వాస్రాభిరూధోభారైః స్వవత్సకాన్॥10057॥*


పశువుల మందలోని బలిష్ఠములై, మదించియున్న ఆబోతులు ఎదకు వచ్చిన గోవులకొఱకై పరస్పరము పోట్లాడుకొనుచు ఱంకెలు వేయుచుండెను. ఆ ఱంకెలు గోకులమునందు అంతటను ప్రతిధ్వనించు చుండెను. క్రొత్తగా ఈనిన ఆవులు లేగల కొఱకై తమ పొదుగుల భారమును విస్మరించి పరుగులు తీయుచుండెను.


*46.10 (పదియవ శ్లోకము)*


*ఇతస్తతో విలంఘద్భిర్గోవత్సైర్మండితం సితైః|*


*గోదోహశబ్దాభిరవం వేణూనాం నిఃస్వనేన చ॥10058॥*


ఇటునటు గెంతులు వేయుచు, పరుగులు తీయుచున్న ఆవుదూడలు చూడముచ్చట గొలుపుచుండెను. గోకుల మంతటా పాలను పితికే శబ్దములతో, పిల్లనగ్రోవుల కమ్మని ధ్వనులతో మారుమ్రోగుచుండెను.


*46.11 (పదకొండవ శ్లోకము)*


*గాయంతీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోః|*


*స్వలంకృతాభిర్గోపీభిర్గోపైశ్చ సువిరాజితమ్॥10059॥*


చక్కని వస్త్రాభరణములను ధరించిన గోపికలు, గోపాలురును బలరామకృష్ణుల సుచరిత్రములను, అద్భుతలీలలను పారవశ్యముతో గానము చేయుచుండిరి. మనోరంజకముగా నున్న వారి మధురగానములు వ్రజభూమిని ఆనందధామముగా జేయుచుండెను.


*46.12 (పండ్రెండవ శ్లోకము)*


*అగ్న్యర్కాతిథిగోవిప్రపితృదేవార్చనాన్వితైః|*


*ధూపదీపైశ్చ మాల్యైశ్చ గోపావాసైర్మనోరమమ్॥10060॥*


గోపాలుర గృహములలో అగ్ని, సూర్యుడు, అతిథులు, గోవులు, విప్రులు, పితృదేవతలు, దేవతలు ఆరాధింపబడు చుండిరి. ఆ సందర్భముగా వేయబడిన ధూపములు పరిమళములను వెదజల్లుచుండెను. దీపముల కాంతులు దర్శనీయముగా ఉండెను. పూలమాలలచే అలంకృతములై ఆ భవనములు నందగోకుల శోభలను ఇనుమడింప చేయుచుండెను.


*46.13 (పదమూడవ శ్లోకము)*


*సర్వతః పుష్పితవనం ద్విజాలికులనాదితమ్|*


*హంసకారండవాకీర్ణైః పద్మషండైశ్చ మండితమ్॥10061॥*


అచటి వనముల యందలి వృక్షములు అన్నియును చక్కగా పూవులతో అలరారుచుండెను. వాటిపై జేరియున్న పక్షులయొక్క కలరవములు, పుష్ప మకరందములను గ్రోలి మత్తిల్లియున్న తుమ్మెదల ఝంకారములు వినసొంపుగా నుండెను. నిర్మల జలములుగల సరస్సులలో పూర్తిగా వికసించియున్న కమలములు శోభాయమానముగా ఉండెను. అందు సంచరించుచున్న హంసలు, కారండవములు మొదలగు పక్షుల కదలికలు మనోజ్ఞముగానుండెను. ఇవి యన్నియును వ్రజభూమియొక్క అందచందములకు వన్నె చిన్నెలను దిద్దుచుండెను.


*46.14 (పదునాలుగవ శ్లోకము)*


*తమాగతం సమాగమ్య కృష్ణస్యానుచరం ప్రియమ్|*


*నందః ప్రీతః పరిష్వజ్య వాసుదేవధియార్చయత్॥10062॥*


*46.15 (పదునైదవ శ్లోకము)*


*భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపౌ సుఖమ్|*


*గతశ్రమంభూ పర్యపృచ్ఛత్పాదసంవాహనాదిభిః॥10063॥*


శ్రీకృష్ణునకు అనుచరుడు, ఆయనకు మిగుల ప్రీతిపాత్రుడు ఐన ఉద్ధవుడు తమ ఇంటికి వచ్చినందులకు నందుడు ఎంతయు సంతసించి, ఆయనను అక్కున జేర్చుకొనెను. పిదప నందుడు ఆ ఉద్ధవుని సాక్షాత్తు శ్రీకృష్ణునిగా భావించి, భక్తిశ్రద్ధలతో పూజించెను. అనంతరము షడ్రసోపేతములైన పదార్థములతో ఆయనకు భోజనమిడెను. హాయిగా మృదుశయ్యపై జేరిన పిమ్మట ఆ మహాత్మునకు పాదసేవలతో బడలికలు తీర్చుచు క్షేమసమాచారములను గూర్చి ఇట్లు  ప్రస్తావించెను-


*46.16 (పదహారవ శ్లోకము)*


*కచ్చిదంగ మహాభాగ సఖా నః శూరనందనః|*


*ఆస్తే కుశల్యపత్యాద్యైర్యుక్తో ముక్తః సుహృద్వృతః॥10064॥*


"మహాత్మా! ఉద్ధవా! మాకు పరమమిత్రుడైన వసుదేవుడు చెఱసాలనుండి విముక్తుడైనాడు గదా! ఆ మహాపురుషుడు పుత్రులతోడను, బంధుమిత్రులతోడను గూడి క్షేమముగా ఉన్నాడు గదా!


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

శ్రీలలితా సహస్రనామ భాష్యము*



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*378వ నామ మంత్రము* 


*ఓం జాలంధర స్థితాయై నమః*


అధిభూతము *(పరమాత్మ-పరబ్రహ్మము)*

అయిన జాలంధరపీఠమునందు విలసిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జాలంధరస్థితా* యను ఆరక్షరముల (షడక్షరీ) నామ మంత్రమును *ఓం జాలంధరస్థితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి కరుణచే సకలార్థసిద్ధి కలుగును.


*జాలంధర పీఠము*


తులసీకృష్ణ జీవనీ!


ఈ తులసీ దేవి నామములు స్మరిస్తేనే చాలు జీవన్ముక్తి కలుగుతుందని, అశ్వమేధ యజ్ఞ ఫలం లభిస్తుందని దేవిభాగవతం చెపుతోంది.   తులసి మొక్క క్షీర సాగరమధనంలో కామధేనువు, కల్పతరువులు, అమృతంతో బాటు ఉద్భవించిందని పద్మ పురాణంలో ఉంది. ఇంత విశిష్టమైన తులసి ఎవరు? ఒక మొక్కకి ప్రపంచమంతటా పవిత్రంగా భావించే శక్తి ఎలా వచ్చింది అని ఆశ్చర్యం వేస్తుంది. ఇంటింటా ఉంటూ, అనుదినం అర్చించబడుతూ, మూలికగా, మౌలిక దేవతగా అపురూప దివ్యశక్తిగా కీర్తించబడే తులసీ దేవి అసలు ఎవరు? 


తులసిని స్త్రీ పురుషులు,బాలురు, వృద్ధులు ఎవరైనా పూజిస్తారు. దివ్య మహద్భుత రామ గాథను *రామాయణం* గా అందించిన మహర్షుల్లో *తులసీ దాసు* మహిమాన్వితులు. దీన్ని బట్టి తులసీ అర్చన అనేక కాలాల్లోంచి వస్తోందనీ తెలుస్తోంది. తులసి అసలు *జలంధరుడు* అనే రాక్షసుని భార్య అనియు, ఆమె పాతివ్రత్య మహిమతోనూ, తన బలంతోనూ జలంధరుడు శక్తివంతుడై అందరిని క్షోభింపచేశేవాడు.


ఇప్పటికి పంజాబ్ లో *జలంధర్* ఈ రాక్షసుని పేరు మీదే వచ్చింది. దీన్నే *జాలంధర పీఠం* అని అష్టాదశ శక్తిపీఠముల్లో ఒకటిగా కొలుస్తారు  ఈ పీఠంలో నివసిస్తుంది గనుక అమ్మవారు *జాలంధరస్థితా* యని అనబడినది.


కాత్యాయనీ చోఢ్యాణె కామాఖ్యా కామరూపకే పూర్ణేశ్వరీ పూర్ణగిరౌ చండి జలంధరే స్మృతా (కాళీ పురాణం)


*జలంధరుడు, మరియు అతని భార్య బృంద తులసిమొక్కగా జన్మించిన వృత్తాంతం:*


శివపురాణంలో జలంధరుని పుట్టుక గురించిన కథను గురించి తెలుసుకుంటే వనమాలి కథ గురించి తెలుస్తుంది. శివుని కోపాగ్ని నుండి పుట్టినవాడు జలంధరుడు. ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగా సాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్ని బాలుని రూపం ధరించగా సముద్రుడు ఆ బాలుడిని బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటి నుండి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మ స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరుపెట్టాడు. 

 

శివుడు తప్ప మరెవర్వరు ఇతణ్ణి చంపలేరని వరమిచ్చాడు. శుక్రుని శిక్షణలో జలంధరుడు రాక్షస రాజు అయ్యాడు. క్షీర సాగర మథనంలో దేవతలు రాక్షసులకు చేసిన అన్యాయానికి జలంధరుడు చాలా బాధపడి దీక్షగా బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరమిమ్మన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనితో నీ భార్య పాతివ్రత్యం తొలిగిపోనంతవరకు నీకు మరణంలేదని వరమిచ్చాడు. మరణ భీతి లేని జలంధరుడు దేవతలపై గెలుపొంది స్వర్గం కైవసం చేసుకున్నాడు. 

 

దీంతో దేవతలంతా శ్రీమహావిష్ణువుని శరణు వేడుకున్నారు. ఐతే సముద్రంలో తనతో పుట్టినవాడు కనుక జలంధరుని చంపవద్దని మహాలక్ష్మీ బ్రతిమాలగా మహావిష్టువు అతడిని క్షమించాడు. పైగా బావమరిది కోరిక కాదనలేక సతీసమేతంగా వెళ్ళి అతడి ఇంట్లోనే కాపురం పెట్టాడు. అలాంటి సమయంలో నారద మహర్షి జలంధరుడి ఇంటికి వచ్చి అతనితో నీ సోదరియైన లక్ష్మీ ఇంటిలోనే వుంది. నీకు తగిన ఇల్లాలు పార్వతీ దేవియే. లక్ష్మీకి తోడు పార్వతి కూడా నీ ఇంట వుంటే నీకు తిరిగేలేదు అని పురికొల్పాడు. 


నిజమేననుకొని జలంధరుడు కైలాసానికి బయలుదేరాడు. వస్తున్న ముప్పును ముందుగానే పసిగట్టిన పార్వతి దేవి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. పార్వతి కోరిక మేరకు విష్ణువు మాయ రూపం ధరించి బృంద పాతివ్రత్యాన్ని చెడగొట్టాడు. అనంతరం శివుడు అతడిని వధించాడు. ఇది తెలుసుకున్న బృంద కూడా మరణిస్తుంది. వారి మరణానికి పశ్చాత్తాపంతో వారిద్దరికి చెరో వరం ఇచ్చాడు. బృందను తులసీ చెట్టుగా జలంధరుడుని అత్తిపత్తిగా భూలోకంలో ఉండమని దీవించాడు. బృంద శాపాన్ని ఔదలదాల్చి ప్రతి ఇంటి తులసి కోటలో రాయిగా విష్ణువు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.


జాలంధర పీఠం మనశరీరంలో ఆజ్ఞాచక్రమందు గలదు. అది ఎలాగంటే,  సాధకుడు మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలిపి, సుషుమ్నానాడిద్వారా ఊర్ధ్వముఖంగా పయనింపజేయగా, కుండలినీ శక్తి బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులను భేదిస్తూ, షట్చక్రమలకావల సహస్రారం చేరుక్రమంలో ఆజ్ఞాచక్రంలో కూడా ఒకింత సమయం నివసిస్తుంది. షట్చక్రాలలో ఒకటి అయిన ఆజ్ఞాచక్రమే *జాలంధరపీఠము* మరియు అందు కుండలినీ శక్తిస్వరూపిణి అయిన పరమేశ్వరి *జయ* అను పేరుతో విలసిల్లుతుంది గనుకనే ఆ తల్లి *జాలంధరస్థితా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు  *ఓం జాలంధరస్థితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీ సదాశివ దేవాలయం*

 🕉 *మన గుడి : నెం 325*


⚜ *కర్నాటక  : సూరత్కల్ -మంగుళూరు*


⚜ *శ్రీ సదాశివ దేవాలయం*



💠 భారతదేశంలో శివుని ఆలయాలు పుష్కలంగా ఉన్నాయి. 

హిందూ పురాణాలలో అత్యున్నత శక్తులుగా పిలువబడే ముగ్గురు దేవతలలో ఇతను ఒకడు

(బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు)

ప్రపంచంలో చెడు మరియు పాపం వాటి సహించదగిన పరిమితులను దాటినప్పుడల్లా, శివుడు తన మూడవ కన్ను తెరిచి నాశనం చేస్తాడు. అతను చెడును ప్రక్షాళన చేసేవాడు. భగవంతుడు శివుని భక్తులు ఎల్లప్పుడూ సరళత మరియు స్వచ్ఛమైన విశ్వాసంతో ప్రసన్నంగా ఉంటారని నమ్ముతారు. 

అందువల్ల, వారు ఎల్లప్పుడూ అతని కోపాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు మరియు సరళమైన ఆచారాల ద్వారా అతని దయకు విజ్ఞప్తి చేస్తారు. 


💠 మనం దేవతను ఎక్కువగా చూడడానికి ఉపయోగించే రూపం శివలింగం అని అందరికీ తెలుసు. శివలింగాన్ని దేవతకి ప్రతీకగా విశ్వవ్యాప్తంగా పూజిస్తారు. కోస్తా కర్నాటకలోని సూరత్‌కల్‌లోని సూరత్‌కల్ సదాశివ దేవాలయం కూడా అదే రూపంలో దేవతను ప్రదర్శిస్తుంది.



🔆 చరిత్ర


💠 కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న సదాశివ దేవాలయం రాష్ట్రంలోని ప్రధాన ఆకర్షణ. ఇది సూరత్‌కల్ బీచ్‌కు సమీపంలో ఉంది. 

ఆలయ నిర్మాణం పూర్తిగా మంత్రముగ్దులను చేస్తుంది మరియు ఆధ్యాత్మికత మరియు నిర్మాణ నైపుణ్యం యొక్క సంపూర్ణ సమ్మేళనాన్ని అందిస్తుంది. 


💠 తుళునాడు శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం సూర్యోదయానికి స్వాగతం పలికేందుకు తూర్పు ముఖంగా ఉంది. 

ఈ ఆలయం తుళునాడు కాలంలో నిర్మించబడిందని అంచనా.



💠 ఇది ప్రత్యేకమైన వాస్తుశిల్పంతో ప్రశాంతమైన ప్రార్థనా స్థలం.  బూడిద రంగు  రాతి పుంజం స్తంభాల నిర్మాణం అద్భుతంగా ఉంది.

ఆలయం చుట్టూ శంఖం, చక్రం, గదా, కమలం ఆకారంలో చెరువులు ఉన్నాయి.

ఆలయంలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

శివుని అనుగ్రహం కోసం ఏడాది పొడవునా అనేక మంది భక్తులు మరియు పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.



💠 సదాశివ ఆలయానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది.

 ప్రఖ్యాతి గాంచిన 'ఆత్మలింగం' పైభాగం ఇక్కడ పడిందని నమ్ముతారు.

హిందూ పురాణాలలో, 'ఆత్మ-లింగం' దేవుళ్లను అమరత్వంతో మార్చే శక్తిని కలిగి ఉందని కథ చెబుతుంది. ఈ ఆత్మలింగం శివుని ఆధీనంలో ఉంది. రావణుడు అమరత్వాన్ని పొందాలని కోరుకున్నారు. 

అతను శివుని కోసం తపస్సు చేసి, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడంలో విజయం సాధించాడు. 


💠 రావణుని తప్పసుకి సంతోషించిన శివుడు అతనికి ఒక వరం ఇచ్చాడు.

రావణుడు ఆత్మలింగాన్ని అడిగాడు మరియు శివుడు లంకకు చేరుకునే వరకు దానిని నేలపై లేదా మరెక్కడా వేయకూడదనే షరతుతో ఇచ్చాడు.


💠 నారదుడు రావణుడు అమరత్వం పొందే అరిష్ట పరిస్థితిని గమనించి ఈ విషయంలో గణేశుని సహాయం కోరాడు. 

విష్ణువు యొక్క భ్రమ సహాయంతో, గణేశుడు, బ్రాహ్మణ బాలుడి వేషంలో రావణుడు స్నానం చేయవలసిన సమయంలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. 

రావణుడు స్నానం చేసి తిరిగి రావడానికి చాలా సమయం తీసుకున్నాడు మరియు బ్రాహ్మణ బాలుడు (గణేశుడు) అసహనానికి గురయ్యాడు. 

అతను లింగాన్ని నేలపై విడిచిపెట్టి వెళ్లిపోయాడు - ఇప్పుడు ఆ ప్రదేశాన్ని గోకర్ణం అని పిలుస్తారు.


💠 నేలపై ఉన్న ఆత్మలింగాన్ని చూసి ఉగ్రుడైన రావణుడు దానిని నేల నుండి వేరు చేయడానికి ప్రయత్నించాడు. 

లింగాన్ని కొట్టినప్పుడు, దాని భాగాలు విరిగిపోయాయి మరియు పైభాగం సదాశివ ఆలయం ఉన్న సూరత్‌కల్‌లో పడిపోయిందని చెబుతారు. 

శిలాఫలకం చుట్టూ సదాశివ ఆలయాన్ని నిర్మించగా, రెండవ ముక్క పడిన చోట ప్రసిద్ధ మురుడేశ్వరాలయాన్ని నిర్మించారు.

యాదృచ్ఛికంగా సూరత్‌కల్‌కు ఈ పేరు వచ్చింది - కన్నడలో 'శిరడకల్' అంటే శిరస్సు.

పద్మనాభ స్వామి ఆలయం విముక్తి పొందింది...

 ఈ రోజు కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వ బారి నుండి పద్మనాభ స్వామి ఆలయం విముక్తి పొందింది...

రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ హక్కు లేదు...

రెండు లక్షల కోట్ల ఆస్తులు, గొప్ప వారసత్వం కలిగిన పద్మనాభస్వామి ఆలయం ఇకపై ప్రభుత్వానికి చెందినది కాదు, ఇప్పుడు దీనిని ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ చూసుకుంటుంది... సుబ్రమణియన్ స్వామి ఈ కేసుతో పోరాడి ఆలయాన్ని పొందారు...

 ఆలయ నిర్వహణ సభ్యులందరూ ఇప్పుడు హిందువులే అవుతారు. 

ఈ సమాచారం ట్రావెన్కోర్ కిరీట యువరాజు ఆదిత్య వర్మ తన తల్లి గౌరీ లక్ష్మికి వివరించినప్పుడు, 

ఇద్దరూ ఆనందంతో కేకలు వేశారు..

ఇది ఆరంభం దేవాలయాల ప్రభుత్వ యాజమాన్యాన్ని వదిలించుకోవడానికి పోరాటం ఇంకా చాలా కాలం. హిందువులు ఐక్యత గురించి ఆలోచిస్తే, ఇదే పరిస్థితి, మీరు ఐక్యమయ్యే రోజు, భూమిని తిప్పగల సామర్థ్యం మీకు ఉంది, మీరు దేశంలోని అన్ని దేవాలయాలను విడిపించాలి. # జై సనాతన ధర్మం # భారత్ మాత కి జై 👏👏🙏

*మే 23, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌹 *గురువారం*🌷

    🌷 *మే 23, 2024*🌷

    *దృగ్గణిత పంచాంగం*                 

            ఈనాటిపర్వం: *మహావైశాఖి/గురుపూర్ణిమ/బుద్దపూర్ణిమ* 

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంతఋతౌః* *వైశాఖమాసం - శుక్లపక్షం*

*తిథి : పౌర్ణమి* రా 07.22 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

వారం :*గురువారం* ( బృహస్పతి వాసరే)

*నక్షత్రం : విశాఖ* ఉ 09.15 వరకు ఉపరి *అనూరాధ*

*యోగం : పరిఘ* మ 12.12 వరకు ఉపరి *శివ*

*కరణం : భద్ర* ఉ 07.09 *బవ* రా 07.22 ఉపరి *బాలువ* 

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00* 

అమృత కాలం :*రా 11.22 - 01.02*

అభిజిత్ కాలం :*ప 11.38 - 12.30*

*వర్జ్యం : మ 01.24 - 03.04*

*దుర్ముహుర్తం : ఉ 09.54 - 10.46 మ 03.06 - 03.58*

*రాహు కాలం : మ 01.42 - 03.19*

గుళిక కాలం :*ఉ 08.50 - 10.27*

యమ గండం :*ఉ 05.35 - 07.12*

సూర్యరాశి : *వృషభం*

చంద్రరాశి : *వృశ్చికం* 0

సూర్యోదయం :*ఉ 05.35*

సూర్యాస్తమయం :*సా 06.34*

*ప్రయాణశూల  :‌ దక్షిణ* దిక్కుకు ప్రయాణం పనికిరాదు


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.35 - 08.11*

సంగవ కాలం :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం :*10.46 - 01.22*

అపరాహ్న కాలం :*మ 01.22 - 03.58*

*ఆబ్ధికం తిధి : వైశాఖ పూర్ణిమ*

సాయంకాలం :*సా 03.58 - 06.34*

ప్రదోష కాలం :*సా 06.34 - 08.46*

నిశీధి కాలం :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.5*

_____________________________

        🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

🌹🙏 *ఓం సాయి శ్రీ సాయి* 

  🌹 *జయ జయ సాయి*🌹

🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌷🌷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌹🌷🌹🌷🌹🌷🌹

Panchaag


 

వైశాఖ పూర్ణిమ*

 _*రేపు వైశాఖ పూర్ణిమ*_



*మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు – *వసంత ఋతువు, శరదృతువు.* *శరదృతువు ఆశ్వయుజ , కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది.* ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి – చైత్ర పూర్ణిమ , 

వైశాఖ పూర్ణిమ , ఆశ్వయుజ పూర్ణిమ , కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం.


ఆశ్వయుజ పూర్ణిమకు *‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా”* అనే నామంలోనే *‘ముఖ్యరాకా’* అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి , అమ్మవారి ఆరాధనకి , శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమా వ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు.

అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు.

ఋగ్వేదం అడ్మిషన్

 అందరికి నమస్కారం నా పేరు శ్రీదత్త ఘనపాఠి ఋగ్వేదం . ఎవరైనా బ్రాహ్మణ పిల్లలు ఋగ్వేదం నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ సంవత్సరం అడ్మిషన్ ఓపెన్ అయ్యాయి .కావున వయసు 8 సంవత్సరాలు నుంచి 13 సంవత్సరాలు లోపు ఉంటే సరిపోతుంది ఋగ్వేదం పూర్తి చేసి పంపగలము .ఆసక్తి ఉన్నవారు కర్నూలు లో గల కంచి వారి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన అఖిల బ్రాహ్మణ కరివిన సత్రం శంకరా చార్య వేద పాఠశాలలో అధ్యాపకుడిగా ఉన్నాను.విద్య , వైద్యం ఉచితంగా చక్కటి భోజన సదుపాయాలతో ఉన్నది. ఆసక్తి ఉన్నవారు .చేర్పించవచ్చు .అలాగే ఋగ్వేదం సంపూర్ణం గ నేర్పించి సర్టిఫికెట్ ఇప్పించగలను దయచేసి ఎవరైనా ఉంటె చెప్పండి 🙏8277246156 . ఈ మెసేజ్ forword చెయ్యండి.ఒకరైన ధర్మoవైపు నడిపించిన వాళ్ళం అవుతాము . నమశ్శివాయ🙏

మహావైశాఖీ

 *రేపు 23/05/2024 మహావైశాఖీ* 

*వైశాఖశుక్ల పూర్ణిమా మహావైశాఖీ| యద్యవ్యస్యా యోగవ దేవ మహత్వసంజ్ఞ తథాపి వైశాఖాషాఢ కార్తికమాఘపూర్ణిమానాం యోగమన్తరేణాప్యతీవ పుణ్యద్వన్మహత్వ సంజ్ఞా! తథా చోక్తం నిర్ణయసిస్ధా భవిష్యే- వైశాఖీ కార్తికీ మాఫీ హ్యాషాఢ్యప్యతి పుణ్యదాః|* 

*స్నానదానవిహీనా పై తాసు గౌరవగామినః|| ఇతి అస్యాం దధ్యన్నవ్యజనచ్ఛత్రపాదుకోపానహదానాని కర్తవ్యాని| తథా చోక్తమ్ దన్నవనం ఛత్రం పాదుకా ప్రదాపయేది| వైశాఖ్యం విప్రముఖ్యేభ్యో మోదతే విష్ణుమన్దిరే|| ఇతి|*


*వైశాఖ పూర్ణిమ* వైశాఖ శుద్ధపూర్ణిమను మహావైశాఖి యందురు. యోగవిశేషముచే వైశాఖ ఆషాఢ కార్తిక మాఘ పూర్ణిమలు మహత్వ సంజ్ఞను కలిగియుండును. ఈ మహాపూర్ణిమలందు స్నానదానాదులు చేయనివాడు రౌరవాది నరకములకు పోవునని నిర్ణయసింధుపు, భవిష్యపురాణములు చెప్పుచున్నవి. ఈ పూర్ణిమనాడు దధ్యన్నము, విసనికఱ్ఱ, గొడుగు, పావుకోళ్ళు, చెప్పులు మొ|| మహాదానములను చేయవలెను. అట్లాచరించినచో విష్ణుమందిరమును జేరి యానందించునని చెప్పబడినది.

వైశాఖ పురాణం - 14

 వైశాఖ పురాణం - 14


14వ అధ్యాయము - ఛత్రదాన మహిమ


శ్రుతదేవమహాముని యిట్లు పలికెను. వైశాఖమాసమున యెండకు బాధపడు సామాన్యులకు, మహాత్ములకు యెండ వలని బాధ కలుగకుండుటకై గొడుగుల నిచ్చిన వారి పుణ్యమనంతము. దానిని వివరించు కథను వినుము.


పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించు కథ యిది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడగు నతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి యచటనున్న మునుల యాశ్రమమునకు బోయెను. ఆ ఆశ్రమము శతర్చినులను మునులయాశ్రమము. ఆ విషయము నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగ పలుకరించినను వారు సమాధానమీయక పోవుటచే వారిని చంపపోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడా మునుల శిష్యులు అనేకులచటకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధీ! మా గురువులు తపోదీక్షలోనున్నారు. వారికి బాహ్యస్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేదు. గౌరవింపలేదు. ఇట్టివారిపై కోపము కూడదని వారు పలికిరి.


అప్పుడు కుశకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని జూచి మీ గురువులు తపోదీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిధ్యమునిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు రాజకుమారా! మేము భిక్షాన్నమును తినువారము మీకు ఆతిధ్యమిచ్చుటకు మా గురువుల యాజ్ఞలేదు. ఇట్టిమేము నీకాతిధ్యము నీయజాలము అని చెప్పిరి. హేమకాంతుడు ప్రభువులమగు మేము క్రూరజంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగువానిని పొందియు మీరు మాయెడల నీ విధముగ నుండరాదు. కృతఘ్నులైన మిమ్ము చంపినను తప్పులేదు. అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి. ఆశ్రమమును పాడు చేసిరి.


పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగనుండదగవని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశబహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగ నిరువదియెనిమిది సంవత్సరములు గడచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాతధర్మముల నాచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యాదోషమున నిలకడలేక అడవుల బుట్టి తిరుగుచు జీవించుచుండెను.


వైశాఖమాసమున త్రితుడను ముని ఆ యడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు నొకచోట మూర్ఛిల్లెను. దైవికముగ ఆ యడవిలోనే యున్న హేమకాంతుడు వానిని జూచి జాలిపడెను. మోదుగ ఆకులనుదెచ్చి ఎండపడకుండ గొడుగుగ చేసెను. తన యొద్ద సొరకాయ బుఱ్ఱలోనున్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాని చేసిన యుపకారములచే సేదదీరి సొరకాయబుఱ్ఱలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగ నుండెను. హేమాంగదుడు వ్రతము నాచరింపక పోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని యిచ్చుటచే వానికి గల పాపములన్నియు పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంత కాలమునకతడు రోగగ్రస్తుడై యుండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణములగొనిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని జూచి భయపడెను. వైశాఖమున మోదుగాకుల గొడుగును, సొరకాయ బుఱ్ఱనీటిని యిచ్చిన పుణ్యబలమున వానికి శ్రీమహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను.


దయాశాలియగు శ్రీమహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖధర్మము నాచరించి నాకిష్టమైన వాడయ్యెను. పాపహీనుడయ్యెను. ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖధర్మము నాచరించి ఒక మునిని కాపాడినవాడు. మోదుగాకుల గొడుగును నీటిని యిచ్చినవాడు. ఆ దాన ప్రభావమున నితడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి. శౌర్యాదిగుణ సంపన్నుడు. నీకు సాటియైనవాడు. కావున వీనిని రాజుగ చేయుమని నామాటగ చెప్పుమని శ్రీమహావిష్ణువు విష్వక్సేనుని హేమాంగదుని వద్దకు బంపెను.


భగవంతుని యాజ్ఞ ప్రకారము విష్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు గొనిపోయి శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడ సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యము నిచ్చి విష్వక్సేనుని యనుమతితో భార్యతో బాటు వనముల కేగి తపమాచరింపబోయెను. విష్వక్సేనుడును కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణుసాన్నిధ్యమున కెరిగెను.


హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖమాసమున వైశాఖవ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యెను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞానియై ధర్మమార్గము నవలంభించి, శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వసంపదలను పొంది, పుత్ర పౌత్రులతో కూడినవాడి సర్వభోగముల ననుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శ్రుతకీర్తి మహారాజా! వైశాఖ ధర్మములు సాటిలేనివి. సులభసాధ్యములు పుణ్య ప్రదములు. పాపమును దహించునని ధర్మార్థకామమోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమునిచ్చునని శ్రుతదేవుడు వివరించెను, అని నారదుడు అంబరీషునకు చెప్పెను.


వైశాఖ పురాణం 14వ అధ్యాయం సమాప్తం.

Photos







 

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, పేటియం లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

హైదరాబాద్ న’గరం’

 శీర్షిక: హైదరాబాద్ న’గరం’ (మినీ కవితలు)

             *తుమ్మ జనార్దన్ (కలం పేరు : జ్ఞాన్)*


51. వీధి వీధిలో జొన్న రొట్టెలు చేసే ఆడవారు

దేనికి సంకేతం 

పట్టణ ఆరోగ్యానికా, వారి కడు పేదరికానికా?

52. కొత్త నగర రోడ్లు కొండచిలువల్లా

        శేషనాగుల్లా కనిపిస్తున్నాయి

        పాతనగర రోడ్లే వానపాములైపోయాయి.

53. మూసీనది నగర మురికిని 

        రోజూ తోసుకేల్తూనే ఉంది

        వచ్చేవారు మళ్ళీ తీసుకొస్తున్నారు.

54. చాయి బండ్లు, కేఫ్ లు, పాన్ డబ్బాలు

        రూపం మార్చుకున్నాయి

        కార్పోరేట్ హంగులద్దుకున్నాయి

55. ORR దాటి RRR దాకా 

        నగరం మాత్రమే విస్తరిస్తుంది

        నగరవాసుల మనస్తత్వాలు కాదు.

56. నగర సంస్కృతి

        ఒక సం”స్మృతి”గా మిగిలిపోయింది.

57. మారిన నగరానికి

        రాత్రేదో, పగలేదో తెలియడం లేదు 

        విశ్వనగరం కదా!

58. ముందుచూపు లేనితనం

        పాతనగరంలో మెట్రో విస్తరణకు అడ్డం 

        ఇప్పటికైనా, కళ్ళు తెరిస్తేనే అభివృద్ధి ఫలం.

59. నగరం సంబరపడింది

        ORR ఒడ్డానంతో

        కానీ, నాయకులు RRR కూడా

        తొడగాలని ఆశపడుతున్నారు.

60. నగర మెయిన్ రోడ్లు 

        ఊడ్చే కార్మికులకు

        ఎప్పుడూ నైట్ షిఫ్టే.

బుద్ధాయ పరమాత్మనే

 *నమో వేదాత్మనే తుభ్యమ్*


నామసామ్యత చేత ఇద్దఱు బుద్ధులు ఒకరనే భ్రమ ఏర్పడుటకు అవకాశము కలిగినది. ద్వాపర యుగమున కూడా వాసుదేవుఁడను పేరున ఇద్దఱుండిరి. పౌండ్రక వాసుదేవుడను వాడిని వాసుదేవుడైన శ్రీకృష్ణుడు వధించెను.

   శ్రీ విష్ణుమూర్తి అనంతావతారములలో దశావతారములు ప్రసిద్ధము. ఒక్కొక్క కాలమున ఒక్కొక్క అవతారము వైదిక ధర్మరక్షణము బాధ్యతగా ఏర్పడినది. శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణమైన పిదప యాదవుల అనైక్యత తదితరములు పెౘ్చుపెరిగినవి. ఇవి క్రమముగ నాస్తిక, అవైదిక, నిర్హేతుక సిద్ధాంతముల వ్యాప్తికి, అనుసరణకు కారణభూతములయినవి. 

   వేదోద్ధార విచారగతి శీలుడయిన నారాయణుఁడు వైదికమార్గ పరిరక్షణకై అవతరింప సంకల్పించినాడు.


*బుద్ధదేవ-గౌతమబుద్ధ* భేదాలు...

1.

బు.దే.: హిమాలయముల మధ్యప్రదేశమైన కపాల పర్వత శ్రేణులలోని శంబళ గ్రామమున ఆవిర్భవించినాడు. 

గౌ.బు.: మగధదేశమున మాయాదేవీ శుద్ధోదనులకు జన్మించినవాడు.

2.

బు.దే.: త్రిపురములను జయించినాడు.

గౌ.బు.: త్రిపిటకములు (సూత్ర-నియమ-అభిధర్మ) రచించినాడు.

3.

బు.దే.: శిఖా ప్రాధాన్యత నిలబెట్టినాడు

గౌ.బు.: నిండు ముండనము ఉండాలన్నాడు.

4.

బు.దే.: దేవతారాధన విధానము గొప్పదన్నాడు.

గౌ.బు.: విగ్రహారాధన వద్దన్నాడు.

5.

బు.దే.: ధర్మబద్ధమైన సంసారము మోక్షానికి అడ్డుకాదన్నాడు.

గౌ.బు.: మోక్షానికి సంసారము ఆటంకము అన్నాడు.

6.

బు.దే.: వేదములు చెప్పినదంతా సత్యమన్నాడు.

గౌ.బు.: వైదికమార్గము ఐనుసరింౘకూడదన్నాడు.

7.

బు.దే.: శబ్దగుణతత్వ ఆకాశము పంచభూతాలలో ఒకటి అన్నాడు.

గౌ.బు.: ఆకాశమును భూతముగా అంగీకరింౘలేదు.

8.

బు.దే.: బుద్ధ్యా వైదికమ్ ధర్మమ్ గృహ్యతే ఇతి బుద్ధః

గౌ.బు.: సర్వమ్ క్షణికమ్ నశ్యతే ఇతి బుద్ధ్యతే బుద్ధః

9.

బు.దే.: దానవసతి శీలరక్షణము చేసినవాడు.

గౌ.బు.: ధర్మపత్ని శీలమును కూడా నిరాకరించినవాడు.

10.

బు.దే.: పరమాత్మ అస్తిత్వమును సత్యమని వ్యిప్తిచేసినవాడు.

గౌ.బు.: పరమాత్మ స్వరూపమును గుర్తింౘనివాడు.


*బుద్ధాయ పరమాత్మనే*


స్వస్తి ప్రజాభ్యః...


                     •••••

       గోలోకాశ్రమ సేవామండలి.

pension scheme

 *Central government has announced pension scheme for those having certificate in Vedha and Sanskrit aged 65 yrs and above. Please pass on the message to your circle so that needy will get the benefit🙏*


*Eligible candidate can contact Shri Venkat Ramana Bhatt on 94800 19367*

మోక్షానికి అర్హత

 

 

మోక్షానికి అర్హత


ప్రతి సాధకుడు తెలుసుకోవలసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే మోక్ష సాధన చేసే సాధకుడు సదా విరాగి అయి నిత్యం పరబ్రహ్మలో లయం అయి ఉండి ఎటువంటి బాహ్య డాంబికాలు లోను కాకుండా ఉండాలని శాస్త్రం చెబుతున్నది.  ఈ విషయానికి మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవలి కాలంలో అరుణాచలంలో వుండిన శ్రీ రమణ మహర్షి గారు.  ఈ సందర్భంలో శ్రీ ఆది శంకర భగవతపాదులు వివేక చూడామణిలో పేర్కొన్న ఒక శ్లోకాన్ని తెలుసుకుందాము. 

వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్యబోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి 6

ఒకడు ఎన్ని శాస్త్రప్రసంగములనైనను వివరించవచ్చును. ఎందరు దేవతలను ఉద్దేశించి యైనను యజ్ఞవిధుల నాచరింపవచ్చును. ఎన్ని శుభకర్మములైనను చేయవచ్చును. కాని వానికి బ్రహ్మము, ఆత్మయు నొక్కటియే యను జ్ఞానము కలుగనంత వరకు నూర్గురు బ్రహ్మల కాలము గడచినను ముక్తి లభింపదు.

("చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దిన ముచ్యతే” అనగా నాలుగువేల యుగముల కాలము బ్రహ్మయొక్క ఆయువులో ఒక్క దినము, అంతియే కాలము రేయి యగుచుండును. ఈ క్రమమున నూరు ఏండ్లు అయినచో ఒక కల్పముగా బ్రహ్మయొక్క ఆయువగును.)

ఇక్కడ శంకరులవారు మనకు భగవత్పరంగా ఎన్ని కర్మలు చేసినా అంటే పూజలు, జపాలు, వ్రతాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేసినా కూడా మోక్షం సిద్దించ్చదు అని అనటమే కాకుండా ఒక మానవులు వంద బ్రహ్మ కల్పములు కష్టపడినను వృధా అని అంటున్నారు. సాధారణంగా ఒక మానవుని ఆయుర్దాయము 100 సంవస్త్సరాలు అన్ని అన్నకూడా మనకు తెలుసు ఒక మానవుడు సగటున 70 సంవత్సరాలు కూడా బ్రతకటం లేదు. అందునా మొదటి 15 సంవత్సరాలు ఇతర వ్యాపకాలవలన బుద్ధిహీనుడిగానే పేర్కొనవచ్చు. ఆ తరువాత ఒకనికి దైవచింతన కలిగితే కలగవచ్చు. అదికూడా అనుమానాస్పదమే. నేను కొందరు మిత్రుల తమకు తాము ఆధ్యాత్మిక చింతనలో ఉన్నామని అనుకునే వారిని అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాదానాలు చాలా విడ్డురంగా ఉంటున్నాయి. ఒకరు మనం ఈ జన్మలో భక్తి కలిగి ఉంటే చాలు అని ఇంకొందరు మనం జపం చేస్తే చాలు గాయిత్రి పరమో మంత్రః అన్నారు కదా రోజుకు 108 గాయిత్రి చేస్తే సరిపోతుంది అని నేను ఫలానా బాబాను నమ్ముతాను ఆయనే అన్ని చూసుకుంటాడు. అయన తలచుకుంటే మోక్షం ఇవ్వగలడు అని ఇలాంటి సమాదానాలు చెపుతున్నారు.. వీటికి ఏమిటి కారణం అంటే వారికి ఇంకా కర్మపరిపక్వత రాలేదు అని నేను అనుకున్నాను. నేను మాట్లాడినవారు అందరు 70 ఏళ్ళ  పైబడినవారే. వారి పరిస్థితే ఇలా ఉంటే మంచి 20,30 యెల్లవాళ్ళు మోక్షార్థులు ఎలా అవుతారు. 

ఇంకా వుంది. 

పంచాంగం

 *శుభోదయం, పంచాంగం **


తేదీ.22.05.2024

బుధ వారం (సౌమ్య వాసరే) 


మేర వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సర, ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  శుక్ల పక్షే  చతుర్దశ్యాం

సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.30

సూ.అ.6.21

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

శుక్ల పక్షం 

చతుర్దశి సా. 5.42 వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం స్వాతి ఉ.7.04 వరకు. 

అమృతం రా.11.22 ల 1.05 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 8.04 ల 8.55 వరకు.

దుర్ముహూర్తం ప.11.30 ల 12.21 వరకు

వర్జ్యం ప. 1.04 ల 2.47 వరకు. 

యోగం వరీయాన్  ప.12.16 వరకు.  

కరణం వనజి సా.5.42 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 12.00 ల 1.30 వరకు. 

గుళిక కాలం ఉ.10.30ల 12.00 వరకు. 

యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. . 

 ************   

పుణ్యతిధి వైశాఖ శుధ్ధ చతుర్దశి. 

  ****************

మహావైశాఖి

 *మహావైశాఖి*


 విశాఖనక్షత్రం ఉండటంవల్ల వైశాఖమాసం అనే పేరు వచ్చింది. వైశాఖమాసంలో ఆవునెయ్యి దానం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలము లభిస్తుంది.


వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమను మహావైశాఖి అని అంటారు. విశాఖనక్షత్రంలో కలిసి వచ్చిన పూర్ణిను కనుక వైశాఖమాస పూర్ణిమ అని అంటారు. మనకున్న ఇరవైఏడు నక్షత్రాలలో విశాఖ పదహారవ నక్షత్రం. విశాఖ అనే పదానికి చాలా అర్థాలున్నాయి. కాంతిని వ్యాపింపచేసేది అనే అర్థం వాటిలో ఒకటి. వైశాఖ పూర్ణిమనాడు ప్రధానంగా సముద్రస్నానం చేయాలన్నది సంప్రదాయం.


మహావైశాఖి ఓ రకంగా చెప్పాలంటే కొన్ని వ్రతాల సమాహారంగా కూడా కనిపిస్తుంది. ఈ రోజున అనేక పూజలు జరుపుతుంటారు. వీలైనంతలో ఎవరికి వారు శక్తికొద్దీ దానాలివ్వాలని, ఈనాడిచ్చిన దానాలు మామూలు రోజుల్లో చేసే దానాలకన్నా అధిక పుణ్యాన్నిస్తాయని పురాణాలు, వ్రతగ్రంథాలు పేర్కొంటున్నాయి.


వైశాఖశుద్ధ పూర్ణిమ ఇంత పవిత్రతను సంతరించుకోవటానికి కూడా చాలా కారణాలున్నాయి. భగవంతుడు కొన్ని అవతారాలు వైశాఖ పూర్ణిమనాడే జరిగి ఉండటం ఆ కారణాలలో ఓ కారణం. స్వామి ధరించిన అవతారాలలో శరభావతారం, కూర్మావతారం లాంటి అవతారాలు వైశాఖ పూర్ణిమనాడే జరిగాయి.


భగవంతుడి అవతారాలలో శరభజయంతిని పరిశీలిస్తే గొప్ప భక్తిభావంతో మనసు ఉప్పొంగుతుంది. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత నరసింహస్వామిలోని ఉగ్రం తగ్గలేదు. ఆ రౌద్ర భీకరమూర్తిని చూసి అంతా తల్లడిల్లిపోసాగారు. ఆ విషమస్థితి నుంచి ఎలా బయటపడాలా అని దేవతలంతా ఆలోచించి శివుడి గురించి ప్రార్థించారు. శివుడు తన అపార కరుణారస దృక్కులను దేవతలపై ప్రసరిస్తూ లోకాల క్షేమం కోరి తాను శరభావతారాన్ని ధరిస్తున్నట్లు చెప్పాడు. అంతేకాక వెంటనే మహాశివుడు శరభరూపాన్ని ధరించి బయలుదేరాడు. మహాశివుడు అలా శరభరూపుడైంది వైశాఖ పూర్ణిమనాడే. ఆ శరఖాన్ని చూసిన నరసింహుడు తన రౌద్రాన్ని ఉపసంహరించుకోవటంతో ఆనాటి పరిస్థితి శాంతిమయమైంది. ఈ నేపథ్యాన్ని తలచుకొంటూ శరభ జయంతిని జరుపుకోవటం ఓ ఆచారంగా వస్తోంది.


ఇక ఆ తర్వాత శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో రెండవదైన కూర్మావతారం కూడా వైశాఖ పూర్ణిమనాడే జరిగింది. విష్ణువంతటివాడు తాబేలుగా మారి లోకకల్యాణానికి సహకరించిన మహత్తర పుణ్యదినం వైశాఖ పూర్ణిమ, అమృతం కోసం ఆనాడు క్షీరసాగరమధనాన్ని జరపాల్సి వచ్చింది.


ఆ పాలసముద్రాన్ని చిలకటానికి కవ్వంగా మందర పర్వతాన్ని, కవ్వపు తాడుగా వాసుకి అనే నాగరాజును సిద్ధంచేసి దేవతలు, రాక్షసులు సముద్రమథనాన్ని ప్రారంభించారు. అయితే కవ్వంగా ఉన్న మందరపర్వతం క్షీరసాగరంలో కింద ఏ ఆధారం లేని కారణంగా పట్టుతప్పి జారిపోసాగింది. దాంతో అంతా కలిసి శ్రీమహావిష్ణువును ప్రార్థించారు. విష్ణువు అప్పుడు ఓ పెద్ద తాబేలు రూపాన్ని ధరించి సముద్రపుటడుగుకు వెళ్లి తన వీపు మీద మందర పర్వతాన్ని మోపుకొని అమృత ఆవిర్భావానికి కారకుడయ్యాడు. లోకకల్యాణం కోసం విష్ణువు అలా మహాకూర్మంగా అవతరించింది వైశాఖశుద్ధ పూర్ణిమనాడే. అందుకే కూర్మజయంతి ఈనాడు జరుపుతుంటారు.


ఇలాంటి ఎన్నెన్నో మహత్తర పుణ్యకర అంశాలనేపథ్యంలో మహావైశాఖి కనిపిస్తుంది. ఈనాడు సముద్రస్నానంతో పాటు పూజలు, వ్రతాలు, దానాలు బాగా జరుగుతుంటాయి.


ఇలా జరగటం వెనుక కేవలం భక్తి, దేవుడి అనుగ్రహం అనేవి మాత్రమే కాక సామాజిక అంశాలు కూడా దాగి ఉన్నాయి. మహావైశాఖి వచ్చేది మండుటెండల కాలంలో, కేవలం దేవుడికి ఒక నమస్కారం పెట్టి కూర్చోక, ప్రత్యేకించి కొన్ని దానాలను చెయ్యాలని చెబుతుంటారు. వాటిలో విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు లాంటి వాటితోపాటు దద్ధోజనం (పెరుగన్నం), ఉదకకుంభాలు (మంచినీటితో నింపిన కుండలు) లాంటివి దానం చేయాలి. ఇవన్నీ కాలానుగుణంగా శాంతిని, హాయిని కలిగించే వస్తువులు. ఎండాకాలంలో వీటి అవసరం ఏమేరకు ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ వస్తువులను అవసరమైన వారికి దానం చేస్తే ఎంతమేలో ఎవరైనా ఊహించవచ్చు. కనుకనే వెలుగు వెన్నెలల మహావైశాఖి తరతరాలుగా తన పవిత్రతను, ప్రత్యేకతల కాంతులను విరజిమ్ముతూ వ్రతసమాహార పర్వదినంగా ఈనాటికీ కనిపిస్తోంది.

కష్టంకూడా నా భోజనంలో ఉంది.

 ఒక స్కూల్లో  చిన్న పిల్లవాడు భోజనసమయంలో తన మిత్రులతో పాటు తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు.

ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న

అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. 

అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, 

క్రింద పైన వేసుకుంటూ తినేవారు.

మరికొందరైతే గొడవపడుతూ కోపంతో 

ఆహారాన్ని విసిరిపారేస్తుంటారు.

కానీ ఈ అబ్బాయి మాత్రం 

ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు.

ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు 

ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని

ఉన్నాకూడా వాటిని కూడా తినేవాడు. 

అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని

ఎగతాళి చేసేవారు.

 " అరే! వీడొక తిండిపోతు రా! 

ఒక్కమెతుకు కూడా  

వదలకుండా తింటాడు" అని ఎగతాళి చేసినా 

ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. 

ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ 

గమనిస్తూ ఉండేవాడు,

ఒకరోజు తన  మిత్రున్ని ఇలా అడిగాడు.


" నువ్వు ప్రతిరోజూ ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా

  ఇంత చక్కగా తింటున్నావు కదా! 

 మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా

  నీకు బాధ అనిపించదా? "  దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం

ఇచ్చాడు.


" ఏదో వారికి తెలియకుండా ....

నన్ను ఎగతాళి చేస్తున్నారు. 

నాకేం బాధలేదు.

  ఇక నేను అలా తినడానికి కారణం చెప్పనా? 

అలా తినడం అన్నది 

 నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం. అమ్మ ఉదయాన్నే

 లేచి నాకు ఇష్టమైన పదార్థాలను 

వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది,

 వండటానికి కావలసిన వస్తువులను 

నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి

తెస్తాడు. ఇద్దరి ప్రేమతో పాటు వారి 

కష్టంకూడా నా భోజనంలో ఉంది.

అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును 

వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!

అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు.

అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా! అందుకే నేను ఎవరు

నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను .అంతేకాదు ఎంతోమందికి

రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది. నా తల్లిదండ్రుల

పుణ్యమా అని. అమ్మ ఎప్పుడూ చెపుతుంది. ఆహారాన్ని వృధా చేయకూడదని "

అని చాలా చక్కగా చెప్పాడు.


నేర్చుకోవాలని మనసు ఉంటే చాలు చిన్న పిల్లల నుంచి కూడా 

చాలా నేర్చుకోవచ్చు.ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచరించవలసిన అవసరం 

ఎంతైనా ఉంది కదా! ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి

వారిలో ఆలోచనా శక్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది 🙏


#Courtesy #WhatsApp

🪷 *మే 22, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🌷 *బుధవారం*🌷

       🪷 *మే 22, 2024*🪷

       *దృగ్గణిత పంచాంగం*  

             ఈనాటిపర్వం: 

*సర్వేషాం శ్రీ నృసింహ జయంతి* 

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*               

*ఉత్తరాయణం - వసంతఋతౌః* *వైశాఖమాసం - శుక్లపక్షం*

*తిథి      : చతుర్ధశి* సా 06.47 వరకు ఉపరి *పౌర్ణమి*

వారం :*బుధవారం*(సౌమ్యవాసరే)

*నక్షత్రం : స్వాతి* ఉ 07.47 వరకు ఉపరి *విశాఖ*

*యోగం : వరీయాన్* మ 12.37 వరకు ఉపరి *పరిఘ*

*కరణం : గరజి* ఉ 06.17 *వణజి* సా 06.47 ఉపరి *భద్ర* 

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 08.00 - 11.00 సా 03.30 - 04.30* 

అమృత కాలం :*రా 11.54 - 01.36*

అభిజిత్ కాలం :*ఈరోజు లేదు*

*వర్జ్యం : మ 01.43 - 03.25*

*దుర్ముహుర్తం : ప 11.38 - 12.30*

*రాహు కాలం : మ 12.04 - 01.42*

గుళిక కాలం :*ఉ 10.27 - 12.04*

యమ గండం :*ఉ 07.12 - 08.50*

సూర్యరాశి : *వృషభం* 

చంద్రరాశి : *తుల/వృశ్చికం* 


సూర్యోదయం :*ఉ 05.35* 

సూర్యాస్తమయం :*సా 06.33*

*ప్రయాణశూల :‌ ఉత్తర* దిక్కుకు ప్రయాణం పనికిరాదు


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.35 - 08.11*

సంగవ కాలం :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం :*10.46 - 01.22*

అపరాహ్న కాలం :*మ 01.22 - 03.58*

*ఆబ్ధికం తిధి :వైశాఖ శుద్ధ చతుర్దశి*

సాయంకాలం :*సా 03.58 - 06.33*

ప్రదోష కాలం :*సా 06.33 - 08.46*

నిశీధి కాలం :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*

_________________________

          🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷

సరస్వతీ నమస్తుభ్యం-వరదే కామరూపిణీ ।

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥


యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా।

యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।

సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥

🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

🌹🌷🍁🌷🌷🍁🌷🌹

అడ్మిషన్లు జరుగును

 *శ్రీ చంద్రశేఖర విశ్వ మహా విద్యాలయం (దీమ్డ్ యూనివర్సిటీ). కాంచీపురం.*


జూన్ 2 వ తేదీన విజయవాడలో బందరు రోడ్ లో గల లబ్బిపేట వేంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 4 గంటలవరకు యూనివర్సిటీ వారి స్పాట్ అడ్మిషన్లు జరుగును. కావున ఈ సమాచారం మీ తోటి విద్యార్థిని విద్యార్థుల కు పంపించండి.... ఎందువలన అంటే.....


కంచి యూనివర్సిటీ లో


డోనేషన్లు లేవు

మేనేజ్మెంట్ కోటా సీట్లు లేవు

మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ లు కలవు

చక్కని హాస్టల్ వసతి

UGC అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అతి తక్కువ ఫీజులు.

ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దూరలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ/శిక్షణ.


అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్/యూనివర్సిటీ ల లాగానే అన్ని కోర్సులు అందుబాటులో..


ముఖ్యంగా ఈ యూనివర్సిటీ గురించి ఎక్కడా వ్యాపార ప్రకటనలు ఉండవు. ఇది స్వామీజీ వారి ఆజ్ఞ. విద్యని వ్యాపార దృష్టితో చూడకూడదు అని వారి భావన. విద్యార్థులకు ఉన్నత ప్రమాణ విద్య అందించి వారి సామర్ధ్యాలను అనుసరించి మంచి ప్లేస్మెంట్స్ ఇప్పించడమే కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ వారి లక్ష్యం.


*ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఈ యూనివర్సిటీ లో అన్ని కులాలవారికి అడ్మిషన్లు ఇవ్వబడును.*


*ఇటువంటి సదావకాశం మీరు పొందడమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కూడా పొందేలా ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోండి. ఈ సమాచారం అందరికీ పంపించండి*


*స్పాట్ అడ్మిషన్ కొరకు తెచుకోవలసిన డాక్యుమెంట్లు 20 వ తేదీన తెలియచేయబడును.*


*మరిన్ని వివరాలకు*

*యామిజాల నరసింహ మూర్తి*

*చీఫ్ కో ఆర్డినేటర్*

*కంచికామకోటి ఘటికస్థానం*

*సెల్ 9912626900*

అరుణాచలం గిరి ప్రదక్షిణ

 ప్రశ్న:అరుణాచలం గిరి ప్రదక్షిణ 14కి.మీ. నడవలేని వాళ్ళు ఎం చెయ్యాలి నేను 1కి.మీ. అయితే నడవగలను అంతకు మించి మా వల్ల కాదు అండీ మా ఆరోగ్యరీత్యా అంత దూరం ప్రయాణం చేయలేము మాకు ఆ ప్రదక్షిణ ఫలితం దక్కదా అని బాధ పడేవాళ్ళు ఏం చెయ్యాలి?

స:- అరుణాచలం ప్రదక్షిణ కాలికి ఆపరేషన్ చేసి మీరు నడవలేరు ఎక్కువ దూరం అన్నవాళ్ళు కూడా 14కి.మీ. ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహముతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇప్పటికీ కూడా చేస్తుంటారు. శతవిధాలా ప్రదక్షిణ చెయ్యడానికి ప్రయత్నించండి ఇంకా ఆరోగ్యరీత్యా నా వల్ల అవ్వదు అనుకునేవాళ్ళు అరుణాచలం ప్రధాన దేవాలయం అదే అగ్ని లింగం ఉండే ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు అరుణాచలేశ్వరుడి నామ స్మరణ చేస్తూ చేసినా అదే ఫలితం వస్తుంది అని భగవాన్ రమణ మహర్షి చెప్పారు ఇది శాస్త్రంలో కూడా చెప్పబడింది. లేదండీ ఇది కూడా మా వల్ల అవ్వదు అనుకుంటే అరుణాచలం గర్భాలయం వెనుక వైపు పేయి గోపురం ఉంటుంది దానిలో నుంచి వస్తుంటే మీకు కుడి వైపు ఒక గేట్ కనిపిస్తుంది(ఇది గర్భాలయం వెనుక పేయి గోపురం మధ్యలో ఉంటుంది) ఆ గేట్ తీసి లోపలికి వెళ్తే ఒక చిన్న మండపంలో ఈ క్రింది ఫొటోలో ఉన్న పాదాలు కనిపిస్తాయి. అవి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడి పాదాలు వాటికి నమస్కారం చేసుకుని నామ స్మరణ చేసుకుంటూ మూడు ప్రదక్షిణలు చేస్తే అరుణాచలం గిరి ప్రదక్షిణ ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు.ఇవి ప్రదక్షిణ ఫలితం కావాలి అనుకునే వారికోసం మాత్రమే అరుణగిరికి ప్రదక్షిణ చెయ్యలేని వాళ్ళు వీటికి చేసుకోవడం ఉత్తమం, కానీ జీవితంలో ఒక్కసారైనా అరుణగిరికి పాదచారియై ప్రదక్షిణ చేస్తుంటే అస్సలు ఆ ప్రశాంతత, ఆనందం(ప్రదక్షిణ ఫలితం దేవుడెరుగు) వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మనస్సు చిందులేస్తుంది అంతే. ఈ ఆనందం, ప్రశాంతత కోసమే చాలామంది ప్రదక్షిణ ఖచ్చితంగా నియమం పెట్టుకుని చేస్తుంటారు. అందుకే విశ్వ ప్రయత్నం చేసైనా సరే అరుణగిరికి ఒక్క ప్రదక్షిణ చెయ్యాలి అంటారు అంత అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఈ ప్రదక్షిణ కోసం జీవితాలు జీవితాలు ఇచ్చేస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఆ ప్రదక్షిణ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అమోఘం, అపూర్వం, అనంతం, చిత్ ప్రకాశం, సచ్చిదానందం, సకల మంత్ర స్వరూపం, సకల మంగళ దాయకం, సర్వ సమ్మోహనం, సకలము మోక్షముతో సహా ఇచ్చేసే సర్వ సిద్ధి ప్రదాయకం.

సేకరణ 🙏

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు

ఇంద్రియ నిగ్రహము

 वश्येन्द्रियं जितात्मानं धृतदण्डं विकारिषु ।

परीक्ष्यकारिणं  धीरं अत्यन्तं श्रीर्निषेवते  ॥


Vashyendriyam Jitaatmaanam dhrutadandam vikaarishu

Pareekshyakaarinam dheeram atyantam shreernishevate


వశ్యేంద్రియం జితాత్మానం ధృతదండం వికారిషు|

పరీక్ష్యకారిణం ధీరం అత్యంతం శ్రీర్నిషేవతే||


An essential management lesson for those in spiritual path and also in Gruhastaashramam: Goddess Lakshmi is always with people who keep their senses  and mind under control, who firmly fight (oppose) wrongdoing, whose actions are preceded by a thorough examination of its pros and cons and who is of great determination.


లౌకిక కార్యాచరణలో ఉంటూ, ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వారికి ఉపయోగించే విదురనీతి: ఇంద్రియ నిగ్రహము (దమము), మనోనిగ్రహము కలిగి, లౌకికమైన విషయాలలో గట్టి పరిశీలన (Introspection) కలిగి, ధైర్యవంతులై ప్రవర్తించు వారివద్ద లక్ష్మి స్థిరనివాసం చేయును.

మెచ్చుకోలులో

 మెచ్చుకోలులో మతలబు!


"మెచ్చుడు మెచ్చవచ్చునెడ,మెచ్చకుడిచ్చకు మెచ్చురానిచో,/

మెచ్చియు మెచ్చుమ్రింగకుడు,మెచ్చక మెచ్చితిమంచుగ్రుచ్చలై/

మెచ్చకు,డిచ్చమెచ్చుగనిమెచ్చుడు,మెచ్చనుమానమైనచో /

మెచ్చియు,మెచ్చకుండకయు,మెచ్చుడు,

సత్కవులారమ్రొక్కెదన్!


"ఆంధ్రభాషాభూషణము-మూలఘటిక కేతన.

              తెనుగు భాషకు పద్యాలలో తొలివ్యాకరణం రచించబూనినదిట్ట మూలఘటిక కేతన.ఆకాలంలో విద్యాలయాలను ఘటిక లనేవారు.అలాంటి విద్యాలయానికాతడు అధికారి.తిక్కనకు ప్రియశిష్యుడు.దండి దశకుమార చరిత్రము ననువదించి తిక్కనకు కృతినొసంగినమహనీయుడు.

"తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును,

దానివలన కొంతగానబడియె,

కొంత తానగలిగె నంతయునేకమై

తెనుగుబాసనాగ వినుతికెక్కె;-అంటూ తెలుగు సంస్కృత జన్యమని నొక్కి వక్కాణించినవాడు. 


ప్రస్తుతానికివద్దాం.

సత్కవులకు మ్రొక్కుతూ అవతారికలో కవిచెప్పిన మాటలే పైపద్యం.


భావం:నాగ్రంధంలో నచ్చినవిషయంమీకు కనిపిస్తే మెచ్చుకోండి.మీమనస్సుకు నచ్చకపోతే మెచ్చుకోకండి.మనస్సులో మెచ్చుకుంటున్నా పైకి గాంభీర్యంనటిస్తూమెచ్చనట్లు ప్రవర్తించకండి.నచ్చకపోయినా కుటిలురై నచ్చినదని మెచ్చుకోకండి.మనఃపూర్వకంగా మెచ్చుకోండి.మీకు మెచ్చు అనుమానమైతే మెచ్చిమెచ్చనట్లుమెచ్చుకోండి. సత్కవులారా! మీకిదే నాప్రణామములు.

            మెచ్చు అనే క్రియను వృత్యనుప్రాసముగా నుపయోగించి అశేషవిమర్శకుల యభిప్రాయములెట్లుండునో సద్విమర్శయెటులుండవలెనో కేతన నిపుణముగా సూచించినాడు.నేడిట్టికవులొక్కరైననుగలరా? సంశయమే!


                               స్వస్తి!

త్ర్యంబకేశ్వరుడు

 _*త్ర్యంబకేశ్వరుడు*_


‘త్ర్యంబకం గౌతమీ తటే’ అని మనం అంటాము. 

సహ్యాద్రి శీర్శే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్రదేశే, 

యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తమ్ త్ర్యంబకమీశమీడే!! (ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం – ౧౦)


త్ర్యంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు. ఆయనను స్మరించిన వారిని, ఆయనను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించే స్వరూపం ఉన్నవాడు. 


ఇప్పటివరకు చదివిన స్వయంభూలింగముల విశేషం ఒకలా ఉంటుంది. త్ర్యంబకేశ్వరుని వద్దకు వచ్చేటప్పటికి ఒకలా ఉంటుంది. ఇది కేవలము ఒక లింగము ఆవిర్భవించిన కథ కాదు. గౌతమ మహర్షి జీవితమును, ఆయన శీలమును, ఆయన గొప్పతనమును ఇందులో చూస్తారు. అక్కడి శివలింగం గొప్పదా, గౌతముడు గొప్పవాడా అని ఒకసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది. ఇక్కడ ఒక నది, ఒక శివలింగం ఆవిర్భవించాయి. 


మనం తెల్లవారి లేస్తే ఏ నదీజలములు త్రాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర ఇప్పుడు చదవబోతున్నాము. 


గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజూ శంభు లింగారాధనము చేస్తుండేవాడు. ఆ లింగానికి శంభులింగము అని పేరు పెట్టాడు. ‘శం భావయతి ఇతి శంభుః’ – మంచి భావములను కల్పించ గలిగిన లింగమును ఆరాధనా చేశాడు. అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే. లోకమంతటినీ లోకేశ్వరునిగా చూడడం. 


చాలామంది శిష్యులు ఆయనను అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వతశిఖర పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమయిన జీవితమును గడుపుతున్నాడు. 


ఇలా నడుస్తుండగా కొంతకాలమునకు అనావృష్టి వలన భయంకరమయిన క్షామం వచ్చింది. వర్షములు పడలేదు. ఎక్కడా నీరు లేదు. ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే శివలింగామునకు సహస్ర ఘటాభిషేకం చేస్తారు. చేస్తే వర్షములు పడతాయి. 


ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనిని గౌతముడు చూసి నేను ఎలాగయినా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను’ అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. ‘నీవు తపస్సు చేశావు. సంతోషించాను. కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు. కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను. లోకమునకంతటికీ నేను నీరు ఇవ్వలేను. నీవు ఒక చిన్న గుండం తవ్వు. నేను అందులో నీళ్ళు పోస్తాను. ఒక వరం ఇస్తాను. ఆ కుండం ఆరదు. ఎప్పుడూ నీళ్లు ఉంటాయి’ అని చెప్పాడు వరుణుడు. 


అపుడు గౌతముడు ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది. తప్పకుండా అలా చేస్తాను’ అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు. అహల్య గొప్ప పతివ్రత. వారు తవ్విన గుండంలో నీరు నింపాడు వరుణుడు. అపుడు గౌతముడు అహల్య కలిసి ఈ నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమయిన పంటలు పండించాడు. 


అందరికీ ఉచితంగా భోజనం లభించింది. అక్కడి ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమమునకు వెళ్లి చక్కగా ఆ పెట్టిన పదార్థముల నన్నిటిని తినడమే కాక ఈ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు. 


ఇలా జరుగుతుండగా గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు తెల్లవారు జామున మహర్షి శివలింగమునకు అభిషేకం చేయాలి. వరుణ గుండంలోకి వెళ్ళి నీళ్ళు పట్టుకురండి అన్నారు శిష్యులను మహర్షి. వాళ్ళు నీళ్ళు తేవడానికి వెళ్ళారు. అదే సమయమునకు మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాములే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది కాబట్టి అమ్మలారా, మీరు ఒక్కదారి అలా ప్రక్కకి తొలగితే మీము నీళ్ళు పట్టుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. స్త్రీలు అన్నారు ‘ మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది. మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం, అభిషేకం ఎక్కువయ్యాయా?అవతలికి పొండి ’ అన్నారు. ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకుని ఖాళీ కుండతో తిరిగివచ్చారు. అప్పుడు వాళ్లకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి ‘అమ్మా, ముని పత్నులు మమ్మల్ని అనరాని మాటలు అని పంపించి వేశారు. ఇప్పుడు గురువుగారి వద్దకు ఎలా వెళ్ళడం’ అని అడిగారు. ఆమాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది. 


వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయింది అని దెప్పిపొడిచారు. వాళ్ళలో అక్కసు బయలుదేరింది. వెళ్ళి భర్తలను “మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా?” అని అడిగారు. అలా భార్యలు అడిగేసరికి వాళ్లకి కష్టం వచ్చింది. 


వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలు పెట్టారు. వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతిమఖము అనే మఖము ఒకటి చేశారు. వీళ్ళు చేసినటువంటి మఖమునకు తృప్తిపొందిన గణపతి యజ్ఞ గుండంలోంచి ఆవిర్భవించాడు. ‘నేను మీకు ఏమి చేసిపెట్టాలి?” అని అడిగాడు. అపుడు వాళ్ళు ‘గౌతముడు పొగరెక్కి ఉన్నాడు. కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు తరమబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి’ అన్నారు.

అపుడు విఘ్నేశ్వరుడు ‘ఇది మీరు అడగవలసిన మాట కాదు.ఒకనాడు మీకు తాగడానికి నీళ్ళు లేక, తినడానికి అన్నం లేకపోతె ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఈ ఆశ్రమం నుండి తరిమి క్షామంలోకి తొరి మీరు సుఖములను అనుభవిద్దామని అనుకుంటున్నారా? ఇది ఎంత కృతఘ్నత! ఇలా చేయకూడదు. అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు” అన్నాడు.


అపుడు వాళ్ళు “నీ దగ్గర నీతులు వినదానిమి మేము ఈ మఖము చేయలేదు. మాకోరిక ఒక్కటే. గౌతముడు ఈ ఆశ్రమం నుండి తరమబడాలి. అలా నువ్వు చేస్తే మేము చేసిన మఖమునకు ఫలితం ఇచ్చినట్లు అవుతంది. కానినాడు నీవు కృతఘ్నుడవు అయిపోయినట్లు మేము భావిస్తాము” అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను. తప్పకుండా మీకోరిక తీరుస్తాను. కానీ మీరు పాడయిపోతారు. తన ఉపాసన యందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సర్వోత్క్రుష్టమయిన కీర్తిని పొందుతాడు. దీనిని మీ మనస్సులో పెట్టుకోండి. మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు. ఒక వృద్ధ గోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు, ఆకుకూరలు వచ్చి తినేస్తోంది. గణపతి ఆ వృద్ధ గోవు రూపంలో వచ్చాడు మునుల కోర్కెను తీర్చడానికి గాను. బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టినా, చేతితో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డిపరక తీసి ఆవుమీద పడేసి ‘హ హ’ అన్నాడు. ఆ గడ్డిపరక పడగానే ఆవు చచ్చిపోయింది. నాకు గోహత్యాదోషం వచ్చింది’ అని ఏడ్చాడు. ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడలేదు. అక్కడికి అహల్య, ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. మునులు, మునిపత్నులు వచ్చారు. ఏమయిందని గౌతముని అడిగారు. జరిగింది చెప్పాడు గౌతముడు. 


అపుడు వారు’ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహా పాతకములు వస్తాయి. నీవు నీ భార్యను, శిష్యులను తీసుకుని ఆశ్రమం వదలి ఎక్కడికయినా పో’ అన్నారు. అక్కడితో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడివి, ఇక్కడ నీవు ఉంటె మేము ఉండము అంతేకాక ఈవేళ నుండి నీవు దేవతలను ఆరాధించకూడదు. 


గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజచేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు. అదేమీ కుదరు పో’ అన్నారు. గౌతముని ప్రాణం ఈశ్వరార్చన. అప్పుడు ఆయన ‘అయ్యో, నేను తప్పకుండా వెళ్ళిపోతాను. అని వెళ్ళిపోయాడు. అక్కడ నుండి బయలుదేరి అక్కడ అక్కడ తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయశ్చిత్తం వుంటే చెప్పండి. నేనది చేసుకుని మరల నా జీవితమును ఈశ్వరాభిముఖం చేసుకుంటాను’ అన్నాడు. 


నిజానికి ఆయనకు తెలియని విషయమా? ఆయన ఇంకా మెట్లు దిగి వినయమునకు వెళుతున్నాడు. వీళ్ళు మెట్లెక్కి అహంకారమునకు వెడుతున్నారు. అపుడు వీళ్ళు ‘అయితే ఈ భూమండలమునంతటినీ మూడు మార్లు ప్రదక్షిణ చెయ్యి. అలా చేస్తున్నప్పుడు అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా గోవును చంపిన మహా పాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి. వచ్చిన తరువాత చాంద్రాయణ వ్రతం చెయ్యి. అప్పుడు నీకు ఆవును చంపిన పాపం పోతుంది’ అని చెప్పారు. 


ఒకవేళ అలా చేయలేక పోయినట్లయితే వెళ్లి శంకరుని గూర్చి తపస్సు చెయ్యి. శంకరుడు ప్రత్యక్షమయిన తర్వాత గంగను ఇమ్మని అడుగు. ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి గంగను ప్రవహింపజెయ్యి. తర్వాత అఘమర్షణవ్రతం చెయ్యి. కోటి లింగములు పెట్టు. వాటికి అర్చన చెయ్యి. అలా చెయ్యి అన్నారు. మరల గౌతముడు ఆశ్రమమునకు తిరిగి రాకుడా ఉండేవిధంగా ఉపదేశం చేశారు. 


గౌతమ మహర్షి వెళ్లి అద్భుతమయిన తపస్సు ప్రారంభం చేశారు. ఒక పార్థివ లింగమును తీసుకుని పంచాక్షరీ మహామంత్రముతో తదేక నిష్ఠతో శివుణ్ణి ఆరాధన చేశారు. అలా తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షం అయి ‘నాయనా, ఎందుకింత గొప్ప తపస్సు చేశావు?” అన్నాడు. కన్నుల నీరు కారుస్తూ గౌతముడు ‘ఈశ్వరా నీకు తెలియనిది ఏముంటుంది? నేను ఆవుని చంపి మహాపాపం చేశాను. నేను చేసిన గోహత్యా పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాక్కు కల్పించవలసినది’ అని ప్రార్థించాడు. 


శంకరుడు ‘అయ్యో పిచ్చివాడా. ఇంత తపస్సు చేసి పాపమును తియ్యమని అడుగుతున్నావా? నీకు పాపం ఉన్నాడని అనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదు. నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. జగత్తులో ఎవడయినా గౌతమమహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపములు నశించిపోతాయి. నీవు అంతటి పుణ్యాత్ముడవు. నిన్ను చూడడానికి నేను వచ్చాను’ అన్నాడు. గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు. సత్యం తెలిసిపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరచి శంకరుని చూసి ఆహా పరమేశ్వరా, వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను అలా తిట్టక పొతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడిని కాదు. వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయింది. వాళ్లకు నేను ఋణపడిపోయాను అన్నాడు.


తరువాత శివుడు ‘గౌతమా! ఏదైనా వరం కోరుకో ఇస్తాను’ అన్నాడు. అపుడు గౌతముడు స్వామీ మీరు నిజంగా నన్నుకానీ అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగను విడిచి పెట్టండి.

నేను ఆంద్రదేశమునకు తీసుకువెడతాను’ అనగానే గభాలున గంగ స్త్రీరూపంలో పైనుండి క్రిందికి దూకి తెల్లటి వస్త్రములతో నిలబడింది. గౌతమునికి గంగాదర్శనం అయింది.


వెంటనే ఆయన తన రెండు చేతులు ముకుళించి నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లీ అన్నాడు. అపుడు ఆ తల్లి నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒక్కసారి నేను ఆగుతాను. నీటి రూపంలో నీ తలమీద పడతాను. అపుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు. నీవు నిర్మలుడవు అయినట్లే. వెంటనే శివుని తలమీద వెళ్ళిపోతాను. ఇంకొకసారి భూమిమీద ప్రవహించను అన్నది. అపుడు గౌతముడు ‘అమ్మా, లోకం అంతా సుభిక్షం కావాలి. నీవు ప్రవహించాలని కదా తల్లీ నేను కోరింది అన్నాడు. అపుడు గంగ శంకరుని వంక చూసి స్వామీ, గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను. మీరు లింగరూపంలో ఇక్కడ వెలయండి. 33 కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటువెడుతుందో అటు ఉండాలి. అంది. శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు అమ్మా మేము మాత్రం ఏడాదికి ఒకమారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము. పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము. అని గంగామాతను ప్రార్థించారు. గంగ సరే సంవత్సరమునకు ఒకరోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది. 


గౌతముని మీద వెడుతున్న గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు. స్వామి ఇక్కడ త్ర్యంబకుడు అనే పేరుతో వెలశాడు. ఇది పరమశివుని అపారమయిన కారుణ్యమును, సౌలభ్యమును తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఏ మునులయితే గౌతమ మహర్షిని పో పో అని తరిమేశారో వాళ్ళందరూ గంగ క్రింద పడిందిట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి, శిష్యుల తోటి, దిగుతున్నారు. గంగ వారిని చూసి ‘ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా దూర్తులారా? అని అంతర్ధానం అయిపోయింది. గౌతముడు ఏడ్చాడు. 


ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు.


కొన్నిచోట్ల గౌతముడు మునులను శపించాడు అని వ్రాయబడింది. అలా చెప్తే ఈ ఆఖ్యానమునకు అర్థం ఉండదు. గౌతముడు శపించలేదు. తమ గురువుగారు ఇంత చేసినా సరే, గంగాస్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసిన అసారే స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. 


ఆనాటి నుండి వాళ్ళు జడులై, తమ జీవితములను పాడుచేసుకుని తిరగసాగారు. ఆనాడు వెలసిన త్రయంబక లింగమే మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వరుడు అని పిలవబడుతూ గౌతమీ తటి ఒడ్డునే మనం చూస్తున్నది. ఆయన త్ర్యంబకుడు. అనగా మూడు కన్నులు కలవాడు. ఆ త్ర్యంబకుడిని చూసి ఒక్కసారి మూడు కన్నుల వాడా మహాదేవా అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకింత ఫలితమును ఇచ్చేస్తాడు. ఒకనది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి మనవరకు బ్రతుకుతున్నాం అంటే ఇన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడయిన గౌతముడిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి.


ఓం శివాయనమః 🙏☘️🌿

సర్వాత్ముడు

 


సర్వాత్ముడు!!


అణువోగాక కడున్ మహావిభవుఁడో, యచ్ఛిన్నుఁడో, ఛిన్నుఁడో, 

గుణియో, నిర్గుణుఁడో, యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వమా

ర్గణులై యే విభుపాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ

క్షణముం జేసెద రట్టి విష్ణుఁ బరమున్ సర్వాత్ము సేవించెదన్.


భావం:


అత్యంత సూక్ష్మమైన అణుస్వరూపుడా, 

లేక  అత్యధికమైన  గొప్ప  వైభవము కలవాడా.. 

విభజింపశక్యముకాని వాడా, 

లేక ఎక్కడికక్కడే భిన్న భిన్న స్వరూపాలుగా ఉన్న వాడా.. 

సమస్త గుణములు తానైన వాడా లేక గుణ రహితుడా..

అనుకుంటూ..


ఎవ్వాని అన్వేషణలో మహా జ్ఞానులైనవారి

యథార్థ జ్ఞాన తత్త్వము సైతము మొక్కపోయినదై యుండగా.. 


వారు కూడా వినమ్రతతో.. 

ఏ ప్రభువు యొక్క పాద పద్మములను భజన చేస్తూ, 

ఉత్కర్ష విన్యాసాలతో మైమరచి యుంటారో!!  అటువంటి సర్వాంతర్యామిని, 

సర్వమునకు ఆత్మయైన విష్ణు దేవుని సేవించెదను.


సేకరణ!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏

మానవజన్మ సార్ధకత

 *ఈ మానవజన్మ సార్ధకతకు ధర్మాన్ని ఆచరించండి* 


ప్రపంచంలో మనిషిగా పుట్టడం చాలా అరుదు.. ఇలాంటి అరుదైన మానవజన్మ మనకు లభించింది.. ఈ జన్మలో విశ్వాసం లేదు, ధర్మాచరణం లేదు అని చెబితే ఈ మానవ జన్మకు అర్థం లేదు..                                                        

  అయితే ఈ పుణ్య భారతంలో ఇంతటి పుణ్య జన్మ తీసుకున్నాం అని అంటున్నాం కదా,మరి దాన్ని సాకారం చేసుకోవాలిఅంటే..?! అదీ మనిషి స్వభావాన్ని బట్టి ఉంటుంది. నిత్య ధర్మాచరణ చేసేవారి సాంగత్యంలో ఉంటే వారి స్వభావం అతడికి వస్తుంది..అదే అతను వివిధ దుర్మార్గపు పనులెజ్ చేసే వారి సాంగత్యంలో ఉంటే దుర్మార్గుల సాంగత్యం, దుర్మార్గుల స్వభావమే అతడికి వస్తుంది.ఈ పుణ్య భారతంలో పుడితేనే, ఈ సనాతన ధర్మ వంశంలో పుడితేనే అర్థం ఉంటుంది.. లేకుంటే ముందు చెప్పినట్లుగా జంతువులతో మనం సమానం అవుతాం. .అలా ఉండకూడదు.. ఈ జన్మకు సార్థకత కలగాలి.. ఈ ధర్మాన్ని పాటించే విషయంలో గొప్పవారు ఎప్పటికీ మనకు ఆదర్శం.వారు చూపించింన మార్గాన్నే తప్పక పాటించండి..


 -- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ* 

 *మహాస్వామి వారు*

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*22-05-2024 / బుధవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


చేపట్టిన వ్యవహారాలలో అవరోధలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక విషయాలలో శ్రమపడ్డా ఫలితం లభించదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది.

---------------------------------------

మిధునం


ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మంచి మాట తీరుతో ఇంటా బయట అందర్నీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

---------------------------------------

కర్కాటకం


ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.

---------------------------------------

సింహం


వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహమును కొందరు ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

---------------------------------------

తుల


కీలక వ్యవహారంలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------

ధనస్సు


సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రులు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

మకరం


ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------

కుంభం


సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు.

---------------------------------------

మీనం


చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వాహనాలు కొలత కలుగుతుంది. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలు గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

ఆకొన్నకూడె

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*ఆకొన్నకూడె యమృతము*

     *తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్*

     *సోకోర్చువాడె మనుజుడు*

     *తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ!*


భావం : ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం.... అది చాలా రుచిగా ఉంటుంది..... ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు.... అలాగే ఎప్పుడైనా *కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైనమానవుడు.....ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు*....


   👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇


శ్లో𝕝 

*సుఖతః క్రియతే రామాభోగః*

*పశ్చాద్ధంత శరీరే రోగః* ౹

*యద్యపిలోకే మరణం శరణం*

*తదపి నముంచతి పాపాచరణం* ॥28॥


భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే *మానవుడు పాప కార్యములను వదలనే వదలడు*.

నృసింహ జయంతి

 *ॐ నృసింహ జయంతి శుభాకాంక్షలు.* 


*హిరణ్యకశిపుడు అడిగిన వరం :*  


       ఇంట్లోగానీ - బయటగానీ, 

        పగలుగానీ - రాత్రిగానీ, 

       మానవునిచేతగానీ - ఏ జంతువుచేతనైనా గానీ, 

       ప్రాణం ఉన్నటువంటివాటితోగానీ - ప్రాణం లేనటువంటివాటితోగానీ,     

      తనకి మరణం లేకుండా ఉండాలని. 


*హిరణ్యకశిపుని మరణం*  


    శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుని,


       ఇంటిలోపలా బయటా కాక, గుమ్మం మధ్యలో, 

       పగలూ రాత్రీ కాక సాయం సంధ్యవేళ, 

        అటు మానవుడూ, ఇటు జంతువూకాని నరసింహుడుగా, 

       ప్రాణం ఉన్నవీకాని, లేనివీకాని గోళ్ళతో సంహరించాడు. 

       

*నారసింహావతారం - అంతరార్థం*   


**హిరణ్యకశిపుడు*   


హిరణ్యము - ప్రకృతి

    ప్రకృతినే చూచి, దానితోనే ఆనందం పొందువాడు.


**ప్రహ్లాదుడు*  


ప్ర - ఉత్తమమైన 

హ్లాద - (జ్ఞాన) ఆనందం.


**నరసింహ*    

*సింహ(దైవీ) ఆలోచన - నర(మానవీయ) క్రియ*  


నర మొండెం - మానవ క్రియ 


సింహం శిరస్సు - దైవ ఆలోచన   

( "మృగములలో మృగేంద్రుడైన సింహాన్ని నేను"

    మృగాణాం మృగేంద్రోఽహం - భగవద్గీత ) 


**స్తంభం - నిశ్చలతత్త్వం*  


జ్ఞానానందాన్ని కాపాడటంకోసం, 

హింసాత్మకమైన ప్రకృతిపట్ల ఉన్న ప్రలోభాన్ని నాశనం చేయటం "నరసింహావతారం"


    ఈ నరసింహావతారం జరిగి ఇప్పటివరకు 8,64,59,204 సంవత్సరాలయింది. 


                    =x=x=x=


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

డొనెషన్లు

 

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, పేటియం లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు

 ఇతర పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.22.05.2024

బుధ వారం (సౌమ్య వాసరే) 

***********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్ల పక్షే చతుర్దశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)సౌమ్య వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  శుక్ల పక్షే  చతుర్దశ్యాం

సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.30

సూ.అ.6.21

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

శుక్ల పక్షం 

చతుర్దశి సా. 5.42 వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం స్వాతి ఉ.7.04 వరకు. 

అమృతం రా.11.22 ల 1.05 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 8.04 ల 8.55 వరకు.

దుర్ముహూర్తం ప.11.30 ల 12.21 వరకు

వర్జ్యం ప. 1.04 ల 2.47 వరకు. 

యోగం వరీయాన్  ప.12.16 వరకు.  

కరణం వనజి సా.5.42 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 12.00 ల 1.30 వరకు. 

గుళిక కాలం ఉ.10.30ల 12.00 వరకు. 

యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. . 

 ************   

పుణ్యతిధి వైశాఖ శుధ్ధ చతుర్దశి. 

  ****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

తప్పులను

 ఇతరులు 

చేసిన తప్పులను 

కష్టం లేకుండా 

లెక్కపెట్ట వచ్చు. 


తేలికగానే 

క్షమించవచ్చు కూడా. 


మన తప్పులను 

ఒప్పుకోవడం కష్టం 


వాటిని 

ఎత్తిచూపే వారిని క్షమించడం 

అసాధ్యమేనని 

చెప్పవచ్చు. 


*శుభోదయం*

పంచాంగం 22.05.2024

 ఈ రోజు పంచాంగం 22.05.2024  Wednesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల   పక్ష: చతుర్థశి తిధి సౌమ్య వాసర: స్వాతి నక్షత్రం వరీయాన్ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


త్రయోదశి సాయంత్రం06:44 వరకు.

స్వాతి ఉదయం 07:44 వరకు.

సూర్యోదయం : 05:46

సూర్యాస్తమయం : 06:40


వర్జ్యం : మధ్యాహ్నం 01:41 నుండి 03:23 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 11:47 నుండి 12:39 వరకు.


అమృతఘడియలు : రాత్రి 11:52 నుండి 01:34 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: పగలు 07:30 నుండి 09:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

బొట్టు" హిందువు

 🛑 "బొట్టు" లేకుండా ఒక హిందువు ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి. పుట్టిన 11 వ రోజునుండి చనిపోయిన 11 వ రోజువరకూ బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారుగా! నువ్వు ఏ రకం బొట్టు ఆయినా పెట్టుకో! కానీ, నీ నుదురు స్మశానం లా ఉండకుండా చూసుకో! నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి Fashion అనే పేరుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నావని అర్థం.

🛑 చందనం గుండ్రంగా పెట్టుకుంటావా? పెట్టుకో! అది పూర్ణత్వానికి చిహ్నం!


🔴 విభూతి పెట్టుకుంటావా? పెట్టుకో! అది ఐశ్వర్యానికి ప్రతీక! ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా!


🩸నామం పెట్టుకుంటావా? పెట్టుకోండి! అది నువ్వు ఉన్న స్థితినుండి, నిన్ను ఉన్నతస్థితికి చేరుకోమనీ అంటోంది!


🔴 కుంకుమ పెట్టుకుంటావా? పెట్టుకో! ఇది సౌభాగ్యానికి సోపానం!


🔴 సింధూరం పెట్టుకుంటావా? పెట్టుకో! హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. 


🔴 కనుబొమ్మల మధ్యనుండేది ఆజ్ఞాచక్రం. 72000 నాడులకది నిలయం. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టుపెట్టు! బొట్టుపెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది. బొట్టుపెట్టుకున్న నీముఖం చూసినవారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. నీకు కీడు చేయాలన్నా చేయలేరు. మంచిని నువ్వు అడగకపోయినా చేసిపెడతారు. కనుక నీ మంచి కోసమైనా నువ్వు బొట్టు పెట్టుకో!                                

                                                 

మీ ఆరోగ్య ఐశ్వర్యాభిలాషి🪷🕉️🚩

సంపదలు ఉన్నచోట

 💐🙏 జై శ్రీ రామ్ 


కంచర్ల వెంకట రమణ శుభదినం💐🙏

"సంపదలు ఉన్నచోట దొంగలు, బంధువులు, స్నేహాలు..

కోర్కెలు ఆశలు ఉన్నచోట రోగాలు సమస్యలు తిష్ఠ వేసుకొని కూర్చుంటాయి కానీ జ్ఞానం ఉన్నచోట

ప్రపంచమే నీ కాళ్ళకి మ్రొక్కుతుంది."

     

👉"శాంతంగా ఉంటేనే జీవితంలో దృఢంగా ఉండగలం.

చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము వేడెక్కితే బలహీనం అయిపోతుంది.

🙏