27, ఫిబ్రవరి 2021, శనివారం

సంస్కారం

 🌷🌹*సంస్కారం*🌹🌷


 నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడు, అది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ఆస్కారమిస్తుంది. నమస్కారానికి ఆశీర్వాదం పొందేశక్తి వుంది.


 మార్కండేయుడు పదహారేళ్ళకే చనిపోతాడని కొందరు పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు నారదుడ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్ళు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్ధించాడు. అందుకు ఆయన "కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడుతో పాదాభివందనం చేయించా"లన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతడ్ని వారందరూ "దీర్ఘాయుష్మాన్ భవ" అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీశ్శులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనట్లు పురాణగాథలు చెబుతున్నాయి.


      ఒక మహారాజు అడవి మార్గంలో వెళుతున్నాడు. దారిలో ఒక బౌద్ధ బిక్షువు ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి "ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?" అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు. 


తరవాతి రోజు ఆ మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు.

      వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడయ్యాయి. మనిషితలను తీసుకెళ్ళేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆ రాజు "మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా ఉండదు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?" అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది.


 యోగశాస్త్రంలో "నమస్కారాసనం" ప్రసక్తి వుంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య.


  రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్ళబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెకు స్మరించి నమస్కరించాడు.


 "ఎదిగేకొద్దీ ఒదగాలి" అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు.



      ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో, బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్ళు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే, శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది.


 శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలచాడు.  వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. 


ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని పాదాభివందనంలోని పరమార్ధాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు. అందుకే అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్య రహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో, పకృతిలో శాంతి వర్ధిల్లాలి. ఇలా ప్రార్ధించుకుంటూ, ఒకరికొకరం నమస్కరించుకుందాం!🙏


(ఫేస్ బుక్ నుండి సేకరణ)

రామాయణం

 *ఒక ఊరిలో ఎవరో రామాయణ ప్రవచనం చెప్తున్నారు. బండోడు శ్రద్ధగా విని అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు.* 


 *"రామాయణం నీకేం అర్ధమైంది" అని అడిగింది భార్య.... "నాకేం అర్ధం కాలేదు" అన్నాడు బండోడు* 


 *ప్రవచనం జరిగిన పది రోజులూ ఇదే తంతు. ప్రవచనం నుండి రాగానే* *నీకేమర్ధమయింది అని భార్య అడగడం, నాకేం అర్ధం కాలేదని బండోడు చెప్పడం. భార్యకి కోపం నషాళానికి అంటింది.* 


 *"ఇదిగో ఆ గుండ్రాయి తీసుకు పోయి దాన్తో నీళ్ళు పట్రా" అంది. .  బండోడు వెళ్ళి గుండ్రాయిని నీళ్ళల్లో ముంచాడు. గుండ్రాయి లో* *నీళ్ళు నిలబడవు కదా. అలాగే తీసుకొచ్చాడు... భార్య మళ్ళీ తెమ్మంది.... మళ్ళీ వెళ్ళాడు.... అలా పది సార్లు తిప్పింది.* 

 *"చూసావా.. ఆ గుండ్రాయితో నీళ్ళు తేలేకపోయావు..... అలాగే పది రోజులు* *రామాయణం విన్నా నీకు ఏమీ అర్ధం కాలేదు.* 

 *నువ్వా గుండ్రాయితో సమానం" అని ఈసడించింది.* 


 *అప్పుడు బండోడు అన్నాడు, ".గుండ్రాయి నీళ్ళు తేలేక పోయిన మాట నిజమే కానీ పదిసార్లు నీళ్ళల్లో మునగడం వల్ల మాలిన్యం అంతా పోయి అది శుభ్రపడింది కదా.....*  *అలాగే రామాయణం నాకేమీ అర్ధం కాకపోయినా పది రోజుల్నుండీ వినడం వల్ల మనసు తేలిక పడ్డట్టు హాయిగా వుంది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నాడు.* 


 *భర్తకి అర్ధం కావల్సిన దానికన్నా ఎక్కువే అర్ధం అయిందని భార్యకి అర్ధం అయింది !* 


 **నవ విధ భక్తి మార్గాల్లో #శ్రవణం ఒకటి... విన్నా చాలు!* 


🎊💦🌹🦚🌈💥🦜

మాసానాం మార్గశీర్షోహం..

 మాసానాం మార్గశీర్షోహం.... కాలము ప్రకృతి పరంగా నడచుట. యిది జీవ చైతన్యలక్షణమునకు  సంబంధమైనది. దీనికి భూమి కారణం. భూచలనమునకు రాహు కేతు మాగ్నెట్ లక్షణం. రాహుకేతు శక్తి లక్షణము పార్వతీ పరమేశ్వర తత్వం. క్షీర సాగరమధనం మాఘ మాసంలో జరుపబడిన మూలంగా మాఘమాసము సృష్టికి జీవజాలమునకు పూర్ణ లక్షణము. ప్రకృతికి సంబంధించిన దంతయు సముద్రమధనం నుండే ఆవిర్భవించి సకల కళలు అనగా షోడశ కళల రూపము మరియు దానిని నాలుగు సంఖ్యతో విశ్లేషణ అనగా 16xనాలుగు 64 కళల పూర్ణమైన లలితమ్మగా రూపుదాల్చింది. చతుషష్ట్యపరాధ్యై చతుషష్టి కళామయి. యివి అన్ని మాఘా నక్షత్ర కేతు తత్వమని మహా మాఘియని సంభోధన. మాఘమాసము నకే మహా మాఘియని వేరే మాసమునకు మహా సంబోధన లేదు. యిది కేతు తత్వం సింహరాశి ప్రారంభంలో కలదు. దీని కేతు తత్వం సింహ వాహినీ యైన అమ్మ సంబంధం. కేతు తత్వం అమ్మ యని రాహు తత్వం శతభిషం శివ తత్వ సంబంధమని దీని ని సమ సప్తకమే జ్యోతి ఉష శాస్త్ర కళత్ర స్థాన ఫలము తెలుపు స్త్రీ పురుష తత్వం తెలియును. సృష్టి కి సంబంధించిన సమస్తం యీ మాసము నుండే ప్రారంభం. సప్తమి శక్తి రూపమైన సూర్యజయంతి ప్రారంభం లయకారకత్వమైన శివరాత్రితో  లయమని తెలియుచున్నది. గ్రహచలనమే సృష్టి మానవ గమనము సృష్టికి మూలం. మఘలో పుట్టి పుబ్బ లో పోవుట యనగా కేతువు నుండి జీవశక్తి మనుగడ ప్రారంభమై పుబ్బానక్షత్రముతో శుక్రునితో పరిపూర్ణమై 120 పూర్తి గ్రహ దశలు సంచరించు కకాలముతో అనగా 120 సంవత్సరములు పూర్తిగా జీవించి ముక్తిని పొందుట. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 *దంపతుల పై దయ..*


"ఈరోజు బుధవారం కదండీ..ఈరోజు నుంచీ వచ్చే సోమవారం ఉదయం వరకూ స్వామివారి సన్నిధి లో ఉండాలని వచ్చామండీ..ఇద్దరమూ పెద్దవాళ్ళం..మా కొఱకు వసతి చూపించండి..మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయుడి వద్దకు వెళ్లి నిద్ర చేసి వద్దాము..అని ఈవిడ ఐదారు నెలల నుంచీ నాతో చెపుతోంది..ఈరోజుకు మాకు కుదిరింది..ఇక్కడకు వచ్చాము..ఏదైనా ఒక రూమ్ ఇప్పించండి.." అని ఆ దంపతులు ప్రాధేయపూర్వకంగా మా సిబ్బందిని అడిగారు..మా సిబ్బంది కూడా వెంటనే వాళ్లకు ఒక గది కేటాయిస్తూ.."మీకు కేటాయించిన గది ని శనివారం నాటికి వేరేవాళ్లకోసం అట్టే పెట్టాము..ప్రస్తుతానికి మీరు అందులో వుండండి..శనివారం రోజు మీకు మరో చోట వసతి చూపిస్తాము.." అని చెప్పారు.."అలాగే..సర్దుకుంటాము.." అని చెప్పారు..


ఆరోజు సాయంత్రం నేను మందిరానికి వచ్చేసరికి..ఈ దంపతులు వచ్చిన వైనం మా వాళ్ళు నాకు తెలిపారు..ఈలోపల ఆ దంపతులు నా వద్దకు వచ్చి.."మీరేనా ఈ మందిరానికి ధర్మకర్త? మీ పేరు ప్రసాద్ కదా? " అని అడిగారు..అవును అని సమాధానం ఇచ్చి.."మీరెక్కడినుండి వస్తున్నారు..?" అని అడిగాను.."మాది కడప జిల్లా..నాపేరు ఈశ్వర రావు..ఈమె సరస్వతి..గవర్నమెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యాము..నేను రెవెన్యు లో ఈమె టీచర్ గా పనిచేసేవాళ్ళము..కొన్ని సమస్యలతో బాగా మనస్తాపం చెందాము..మా జీవనానికి ఏలోటూ లేదు..జరిగిపోతుంది..ఇద్దరికీ పెన్షన్ వస్తుంది..సమస్య ఆర్ధికంగా కాదు..మాకు ఇద్దరు బిడ్డలు..ఇద్దరూ అబ్బాయిలే..పెద్దవాడికి ఇప్పుడు ముప్పై రెండేళ్లు..రెండో వాడికి ఇరవై తొమ్మిది..రెండోవాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు..మంచి సాఫ్ట్ వేర్ కంపెనీ లో వాడికి ఉద్యోగం..మంచి జీతం వస్తుంది..మా దిగులంతా పెద్దవాడి గురించే..డిగ్రీ చదివే నాటి నుంచే చెడు అలవాట్లకు లోనయ్యాడు..సిగరెట్లు..తాగుడు..వాడితో నరకం పడుతున్నాము..చదువు అబ్బలేదు..నాకున్న పలుకుబడితో రెండు మూడు చోట్ల..ఏవో చిన్న ఉద్యోగాలలో చేర్పించాను..ఆరు నెలలు తిరక్కముందే..అక్కడి అధికారులతో గొడవపడి ఆ ఉద్యోగం మానేసి వచ్చేవాడు..వీడి ప్రవర్తన తో విసిగి పోయాము..అందరి దేవుళ్లకూ మొక్కుకున్నాము..మేమూ రిటైర్మెంట్ అయిన తరువాత..చిన్నవాడి వద్ద కొన్నాళ్ళు ఉన్నాము..వాడికి వివాహం చేసుకోవాలని ఉన్నది..కానీ పెద్దవాడి పరిస్థితి చూస్తే..ఇలా ఉన్నది..పెద్దవాడి గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ వాడికి అమ్మాయిని ఇవ్వరు..రెండోవాడికి వివాహం చేయడానికి సిద్ధపడ్డాము..ఈలోపల ఈ స్వామివారి గురించి విని ఒక్కసారి ఈ స్వామికి కూడా మొక్కుకొని వెళదామని వచ్చాము.." అన్నారు..అలా చెప్పేటప్పుడు ఆ దంపతుల కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి..నిజమే..పెద్దకొడుకు ఎందుకూ పనికిరాని అప్రయోజకుడు అయితే..ఆ తల్లిదండ్రులకు మనస్తాపం సహజమే కదా..


ఆ దంపతులిద్దరూ మొత్తం ఐదు రోజులు వున్నారు..రోజూ ఉదయం, సాయంత్రం స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు..శనివారం పల్లకీసేవ లో తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారు..శని, ఆదివారాల్లో మందిరం వద్ద జరుగుతున్న కార్యక్రమాలు, అన్నదానం అన్నీ శ్రద్ధగా చూసారు..స్వామివారి వద్ద తమ సమస్యలు తీరిపోయిన కొందరు భక్తుల అనుభవాలు అడిగి తెలుసుకున్నారు..సోమవారం ఉదయం తిరిగి తమ ఊరు వెళ్ళిపోతూ.."ప్రసాద్ గారూ..ఇక్కడ చాలా ప్రశాంతంగా వుందండీ..మా అబ్బాయి సమస్య అంతా స్వామివారి మీదే పెట్టాము..ఇక నీటముంచినా..పాలముంచినా..ఆయనదే భారం..మా మనసులో ఏదో ఆశ పుట్టింది..చూద్దాం..మా ప్రాప్తం యెట్లున్నదో.." అని చెప్పారు..


ఆరేడు నెలల తరువాత..ఆ దంపతులు మళ్లీ వచ్చారు..ఈసారి వాళ్ళతో పాటు వాళ్ళ చిన్న కుమారుడు, కోడలు ను కూడా వెంటబెట్టుకు వచ్చారు..స్వామివారి సమాధి దర్శించుకొని నావద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..వీడు మా రెండో అబ్బాయి..వీడికి రెండు నెలల క్రితం వివాహం చేసాము..మేము ఇక్కడినుంచి వెళ్లిన నెల తరువాత..మా పెద్దవాడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు..ఒక నెల వాడి జాడ తెలియలేదు..బాగా బాధపడ్డాము..ఒక రకంగా మేము పడుతున్న వేదనకు దేవుడు ఇలా పరిష్కారం చూపించాడేమో అని సమాధాన పడ్డాము..ఈలోపల వీడికి సంబంధాలు వచ్చాయి..ఇక ఆలస్యం చేయకుండా వివాహం చేసాము..చిత్రంగా మా పెద్దవాడు పోయిన నెలలో వచ్చాడు..ఎవరో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడట..తాగుడు మానేసాడట..ముందు మేము నమ్మలేదు..ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడించాడు..తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు..ప్రస్తుతం మాతో రోజు మార్చి రోజు మాట్లాడుతున్నాడు..వాడు బాగుపడ్డాడనే నమ్మకం కుదిరింది..స్వామిదయవల్ల వాడి బతుకు వాడు బతికితే అదే చాలు..మాకు పెద్ద కోరికలు లేవు..ఆరోజు స్వామిని వాడి గురించే మొక్కుకున్నాము..స్వామివారు దయ చూపారు..కాబట్టే..ఈనాడు వాడి స్థితి కి తగ్గ జీవనోపాధి దొరికింది..ముఖ్యంగా తాగుడు మానేశాడు..స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాము.." అని చెప్పారు..చెప్పేటప్పుడు ఇద్దరి కళ్ళలో నీళ్లు ఉన్నాయి..కానీ అవి వేదనతో వచ్చినవి కాదు..సంతృప్తి తో వచ్చిన కన్నీళ్లు..


జీవిత చరమాంకం లో ఆ దంపతులకు మనోవేదన దూరం చేసి..తృప్తిని ఇచ్చారు స్వామివారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

వాస్తవం

 వాస్తవం

                                 ***

ఏవండీ...మీకీ సంగతి తెలుసా...?   మన పక్క ఫ్లాట్ లో ఉండే  కరుణాకర్ గారూ, వసుంధర గారూ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లిపోతున్నారట...   

వాళ్ళుండే  ఫ్లాట్ అద్దెకి ఇస్తారట ప్రస్తుతం అంది భర్త తో..ప్రభావతి..  

అవునా...నీకెలా తెలుసు..నీకు చెప్పారా..?  అన్నారు ప్రభావతి భర్త ముకుంద రావు గారు..

.                              

ఈ విషయం మన పనిమనిషి చెప్పింది అందామె'.

"పోనీలే పాపం,  అక్కడ ఉంటే మంచి కాలక్షేపం, 

కనిపెట్టుకుని చూసే వాళ్ళు ఉంటారు...సేఫ్టీ కూడా...

అన్నారు"  ముకుందం గారు...

:ఏంటో... ఖర్మ కాకపోతే,  ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని దిక్కులేనట్టు... అక్కడ ఉండటం ఏంటో..అంది"  ఆవిడ దీర్ఘం తీస్తూ...

"చూడు..నువ్వు అలా మాట్లాడటం తప్పు...

ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు బ్రతుకుతారు అంతే గానీ ఇలానే బ్రతకాలి అని ఒక రూల్ పెట్టుకుని అందరం బ్రతకడం కష్టం...ఆ రూల్ ఎంత సహేతుకమైనా...

మనం విమర్శించడం మానేస్తే మంచిది"...అన్నారు ముకుందం గారు...

"సరే లెండి ఏదో పక్క వాళ్ళు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకోవడం అంతే... నాకెందుకు...?

సాయంత్రం వంట పని చూసుకోవాలి అంది ఆవిడ తనలో తను మాట్లాడుకున్నట్లు గా పైకే..

ఆవిడ కొడుకూ కోడలు ఉద్యోగాలనుండి రాత్రి 7 దాటాక  వస్తారు...ఈవిడే వాళ్ళొచ్చే టైంకి వంట చేసి పెట్టాలి....

కోడలు చిన్న సాయం కూడా చేయదు...మనవలిద్దరినీ వీళ్లే చూసుకోవాలి.. ఒకడు స్కూల్ కి వెళ్తాడు... రెండో వాడు రెండేళ్ల వాడు....

ఈవిడ ఓపిక లేక,  పిల్లల్ని చూసుకోలేక... పని చేయలేకుండా ఉంటుంది...

'ఆవిడకి పక్కవాళ్ళ మీద అసూయ....చక్కగా ఇద్దరే ఉంటారు లింగు లిటుకు అంటూ...

పనేమీ ఉండదు ఆవిడకి అంతా రెస్ట్ అని ఆవిడ భావన'...

కొన్ని రోజులకే అందరికీ తెలిసింది...

కరుణాకర్ గారి విషయం...

ఫ్లాట్స్ లో ఉన్న అసోసియేషన్ వాళ్ళ ఫంక్షన్ హాల్ లోనే ఆయనకి చిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశారు...

ఆ రోజు సాయంత్రం అందరూ వచ్చారు...చాలా మంది మాట్లాడారు...

కరుణాకర్ గురించి ఆయన భార్య గురించి...వాళ్ళు ఎంత మంచి వాళ్ళో...ఎంత హుందాగా ఉండేవారో...అని..

కొంతమంది సానుభూతి గా మాట్లాడారు...

పిల్లలుండీ ఈ పరిస్థితి రావడం మీద...ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోవడం లేదని..

ఇలాంటి తల్లి తండ్రుల ని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించడం బాధాకరమని...

ఇలా అనేక రకాలుగా...

కొంతమంది కి మాట్లాడే అవకాశం వచ్చినా...చేతికి మైకు ఇచ్చినా పట్టలేము...

అందరూ కరుణాకర్ గారి  జంట వంక సానుభూతి తో చూస్తున్నారు...

చివరిగా కరుణాకర్ గారి వంతు వచ్చింది...

ఆయన మాట్లాడేస్తే..అందరూ భోజనాలు చేసేసి వెళ్లిపోవచ్చని ఆత్రుత అందరిదీ...

ఆయన లేచి స్టేజి మీదకి వెళ్లి మైకు తీసుకున్నారు...

మాట్లాడటం ప్రారంభించారు...అందరికీ కృతజ్ఞతలు... మా మీద చాలా సానుభూతి చూపించారు..

మా లైఫ్ కూడా మీ అందరి సాన్నిధ్యంలో చాలా బాగా గడిచింది...

నేను ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడతాను...దయచేసి వినండి...

మాకు ఇద్దరు అబ్బాయిలు...ఇద్దరికీ రెండేళ్ల తేడా...

మేము ఇద్దరం కూడా ఉద్యోగస్థులం...

పిల్లల్ని మంచి స్కూల్ లోనే చదివించాం...

ఆ రోజుల్లో అందరూ నడిచిన  దారిలోనే నడిచాం...

పిల్లల పదో తరగతి అవగానే ఒక కార్పొరేట్ కాలేజ్ లో  ఎం.పి. సి గ్రూప్ లో జాయిన్ చేయడం...

దానితో పాట ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం...

డబ్బుకు చూసుకోలేదు...

పిల్లలకి దీని మీద ఆసక్తి ఉందా లేదా అని  అడగలేదు...

ఒకటే ధ్యేయం...

ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అవ్వాలి అంతే...

మా పిల్లలూ మేము ఏది చెప్తే అదే చేశారు..

ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకపోయినా,  లక్షల్లో డొనేషన్ కట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించాం....

ఇంజనీరింగ్ అయ్యాకా,  క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం వచ్చింది మా పెద్ద వాడికి...

మాకు అస్సలు ఆ ఉద్యోగం ఆనలేదు...

అందరిలాగే అమెరికా పంపించాలని ఆశ...

వాడిని జి.ఆర్.యి.  టోఫెల్ ఎక్జామ్స్ వ్రాయించాం...

ఏదో యావరేజ్ గా గట్టెక్కాడు...

అమెరికాలో అన్ని యూనివెర్సిటీస్ కి అప్లై చేయించాం...

ఇద్దరం ఉద్యోగస్థులం కదా...డబ్బుకి వెనకాడలేదు...

బాంక్ లోన్స్ పెట్టి మొత్తానికి అక్కడ యూనివర్సిటీస్ లో ఎయిడ్ రాకపోయినా మా డబ్బుతోనే పంపించేసాం...

అక్కడ చదువు అయ్యాకా అక్కడే ఉద్యోగం వచ్చింది...

మా ఆనందానికి అవధులు లేవు..గర్వంగా ఫీల్ అయ్యాము..

రెండో వాడిని కూడా అదే దారిలో పెట్టేసాము...

రెండో వాడు వెళ్లనన్నాడు..."ఇక్కడే చదువుకుంటాను నాన్నా  అని"  రిక్వెస్ట్ చేశాడు...

మేము ఒప్పుకోలేదు...ఇండియా లో ఏముందిరా...డెవలప్మెంట్ ఉండదు...ఎక్సపోజర్ ఉండదు అని వాడిని ఒప్పించి, ఇంచుమించు బలవంతంగా ఆస్ట్రేలియా పంపించేసాం పై చదువుకి....

మాకు ఎంత గర్వం గా ఉండేదో...మా ఇద్దరి పిల్లలు  విదేశాల్లో ఉన్నారని...

దానికి తోడు,  మా చుట్టాలు, ఆఫీస్ లో మా ఇద్దరి కోలీగ్స్,  మమ్మల్ని పొగుడుతుంటే...నా ఛాతీ గర్వంతో వెడల్పు అయ్యేది...

మీకేమండి... మీ ఇద్దరి పిల్లలూ విదేశాల్లో ఉన్నారు అనగానే మాకు గాలిలో తెలిపోతున్నట్టు ఉండేది...

అసలు మా పూజలు, మా మొక్కులు అన్నీ మా ఇద్దరి పిల్లలు ఇండియా దాటి వెళ్లాలనే...

అవన్నీ ఫలించి మా పిల్లలు అక్కడ ఉన్నారు అనుకునే వాళ్ళం...

ఇద్దరికీ ఉద్యోగాలు అక్కడే వచ్చాయి...

ఇంకా పండగ మాకు...

కొంత కాలానికి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ అమ్మాయిలని భారత్ మెట్రిమోనియల్ డాట్ కాం లో చూసి పెళ్ళిళ్ళు కూడా చేసేసాం...

మరి ఇక్కడ అమ్మాయిని చేస్తే అక్కడికి వెళ్లడం...స్థిరపడటం టైం తీసుకుంటుంది అని...

మేము రెండు మూడేళ్ళ కోసారి అమెరికా, ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్లి వస్తూ ఉండేవాళ్ళం...మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు మావాడు, కోడలు మమ్మల్ని మొత్తం అంతా తిప్పి చూపించారు...

వాళ్ళ వైభోగం, ఆ దేశం చూడటానికి  మా కళ్ళు చాలలేదు...

మేమిద్దరమనుకున్నాం..మనం పిల్లల్ని ఇక్కడికి పంపించి మంచి పని చేశాం అని...మమ్మల్ని మేము మెచ్చుకోలుగా  భుజాలు తట్టుకున్నాం...

వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వచ్చేవాళ్ళు...

వాళ్ళ హోదా, అలవాట్లు కి తగ్గట్టు మా ఇల్లుని పూర్తిగా మార్చేసామ్...అన్నట్లు మధ్యలో

మేము రిటైర్ అయిపోయాం....

మాకు మనవలు కలిగారు...

మేము కూడా వెళ్లి అక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్నాం...

రెండోసారి వెళ్ళినప్పుడు మొదటిసారి లా ఎక్కడికీ తీసుకెళ్లలేదు వాళ్ళు...

అప్పటికే అన్నీ చూసేసి ఉండటం...చిన్న పిల్లలతో వీలు కాకపోవడం వలన...

అప్పుడు మాత్రం నాలుగు గోడల మధ్య ఓ ఆరు నెలలు జైలు లా, నరకం గా ఉండేది...

ఇంట్లో పనులు, వంట, పిల్లల్ని చూసుకోవడం మా వల్ల కాలేదు...

తరువాత ఇండియా లో మా ఇంటికి వచ్చాకా మాకు ఇక్కడ స్వేచ్ఛ అర్ధమయ్యింది....స్వేచ్ఛ విలువ తెలిసింది...

కొన్నాళ్ళకి మా పిల్లలు "మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది" అని ఫోన్ చేసినప్పుడు, నిజంగా మా సంతోషానికి అవధులు లేవు...

ఈ సారి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసామ్...

చుట్టాలకి ఫ్రెండ్స్ కి హోటల్ లో పార్టీ ఇచ్చాం...

కనిపించిన వాళ్లందరికీ స్వీట్స్ పంచాం....

అంత ఆనందం ఎప్పుడూ పొందలేదు....

కాలం ఆగదు కదా...సాగిపోతూనే ఉంటుంది...

మా పిల్లలు అక్కడే ఇళ్లు వాకిళ్ళు కొనుక్కున్నారు...

మా మనవలు పెద్ద వాళ్ళైయ్యారు....మా పిల్లలకి కూడా 40 ఏళ్ళు వస్తున్నాయి...

మాకు అంత పెద్ద ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలంటే కష్టం గా ఉండేది...

పిల్లలు ఇప్పుడు ఇండియా కి రావడం తగ్గిపోయింది...

అంత ఇంట్లో ఇద్దరం బిక్కు బిక్కు మంటూ ఉండలేకపోయాం...

మా పిల్లలు కూడా ఆలోచించి...రోజులు బాగాలేవు, క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి...ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చాలా వింటున్నాం...

ఎందుకైనా మంచిది  మీరు అపార్ట్మెంట్ లో ఉంటే మంచిది అని,  ఇక్కడ ఫ్లాట్ కొని మమ్మల్ని షిఫ్ట్ అవమన్నారు...

ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసాం...ఇక్కడికి వచ్చాం...

నాకు 70 ఏళ్ళు, మా ఆవిడకి 65 దాటాయి...

వయసుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి...సహజం కదా....

ఇద్దరం ముసలి వాళ్ళు ఏ తోడూ లేకుండా ఒంటరిగా ఉండటంలో కష్టనష్టాలు తెలియడం మొదలు పెట్టాయి...

నెమ్మదిగా వాస్తవాలు బోధపడసాగాయి...

మా పిల్లలు ఫోన్లు చేస్తూ ఉంటారు...

మనకి పగలైతే వాళ్ళకి రాత్రి కదా...

వాళ్ళు వాళ్ళ పగలు టైం లో మాకు ఫోన్ చేస్తే...రాత్రి పదింటికి కొంచెం నిద్రపడుతున్న మాకు మెలుకువ వస్తుంది...

వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసినాకా ఇంక నిద్ర పట్టదు...

అలా అని ఫోన్ చేయొద్దు అని చెప్పలేం..

ఇలా ఎన్నాళ్లు అనే ఆలోచన వచ్చేసింది....

ఏ అర్ధ రాత్రో ఎవరికి బాగోలేకపోయినా,వాళ్ళని తీసుకుని ఇంకొకరు హాస్పిటల్ కి వెళ్లడం అసంభవం....

మా ఆవిడ వంట చేయలేకపోతోంది మా ఇద్దరికే అయినా కూడా...

వంటమనిషిని పెట్టుకుందామంటే భయం...

కార్ కి డ్రైవర్ ని పెట్టుకుందాం అంటే  భయం...

మేము ఇద్దరమే అని తెలిసి మాకు ఏ హాని తలపెడతారో అని...

ఈ మధ్యనే  నమ్మిన ఒక  డ్రైవర్ తన ముసలి ఓనర్స్ ని చంపి దొరికినవన్నీ పట్టుకుపోయాడు.అని విన్నాం...

సాటి మనుషుల్ని నమ్మలేని స్థితి కి వచ్చాం...

మా ఈ దీనావస్థకి కారణం మా పిల్లలని, వాళ్ళకి హృదయం లేదని మీలో చాలా మంది అన్నారు...

కానీ ఎంత మాత్రం కాదు...

మా పిల్లలు చాలా మంచి వాళ్ళు...మేము చెప్పిందల్లా చేశారు...!

మమ్మల్ని ఆనంద పెట్టారు...!

వాళ్ళు విదేశాలు వెళ్తామని అడగలేదు...మేమే పంపాము...!

మాచిన్నబ్బాయి "నేను ఎక్కడికీ వెళ్ళను నాన్నా, ఇక్కడే మీ దగ్గరే ఉంటా"  అని రిక్వెస్ట్ చేసాడు...

మేము కొట్టి పారేసామ్...వినలేదు వాడి మాట...

ఎందుకంటే మాకు సొసైటీ లో గుర్తింపు కావాలి...మా ప్రతిష్ట పెరగాలి...

అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలనే యావ...

అక్కడ ఉద్యోగం వస్తే సంబరపడిపోయాం...

అక్కడ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తే...అయ్యో...పిల్లలు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారే అన్న బాధ లేకపోగా, ఎగిరి చంకలు గుద్దుకున్నాం...

ఆరోజుల్లో "ఇండియా వచ్చేయండి రా" అని మేము ఒక్క మాటంటే,  వచ్చేసేవారు...కనీసం ఒక్కళ్ళయినా...

మేము అనలేదు సరికదా అక్కడి పిల్లల్నిచ్చి పెళ్లి చేసామ్...

ఇప్పుడు మా కోడళ్ళకి కూడా అక్కడే ఉండాలని ఆశ...

ఒకవేళ మా పిల్లలకి రావాలని ఉన్నా తమ భాగస్వాములు, తమ పిల్లలూ కూడా ఒప్పుకోరు...

మేమే వాళ్ళని అక్కడనుండి కదలకుండా అనేక బంధనాలతో బంధించేసాం...

నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఈ పరిస్థితి మేమే కారణం...

మా పిల్లలు కాదు...ఇది స్వయం కృతం...

మా పిల్లల్ని తిడుతుంటే నేను భరించలేక వచ్చి చెప్తున్నాను...

ఇప్పుడు ఇక్కడ కూడా మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తున్నాయి...

మీరు మీ పిల్లల్ని ఈ దిశగా మరలించండి...

మీకు తెలుసు అనుకోండి..ఆయినా చెప్తున్నాను...

మీ పిల్లల ఫ్యూచర్ తో పాటు,  మీ ఫ్యూచర్ సంగతి కూడా చూసుకోండి...

ఇక్కడ కొన్ని కుటుంబాలు కొడుకుకొడళ్లతో, మనవలతో ఉండటం చూస్తుంటే ఆనందం వేస్తుంది...

మాకు అలాంటి అదృష్టం ఎప్పటికీ రాదు కదా...

అటువంటి అదృష్టాన్ని కోల్పోకండి...

మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తున్నా...

అది ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో ఉంది...

మా పిల్లలే ఆన్లైన్ లో చూసి ఏర్పాటు చేశారు...

అక్కడ ఉండటానికి చిన్న చిన్న కాటేజీలు, 

ఎవరికి ఎలాంటి తిండి అవసరమో అలాంటి ఫుడ్ వండి పెట్టె వంటమనుషులు....

మాలాంటి వాళ్ళు ఎందరో అక్కడ మాకు కాలక్షేపం....

పదిహేను రోజులకి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్ లు చేస్తారు.....

వాకింగ్ సౌకర్యం...అందరికీ ఇంట్లో టీవీ...

కామన్ హాల్ లో పెద్ద టీవీ....

ఆకుపచ్చని వాతావరణం....ఇవన్నీ ఉన్నాయి....

ఒక్కొకళ్ళకీ నెలకి 50000 కట్టి మా పిల్లలు ఇందులో చేర్చారు....

అంటే మా ఇద్దరికీ నెలకి ఒక లక్ష ఖర్చు పెడుతున్నారు...

ఒకప్పుడు మేము వాళ్ళ చదువులకి లక్షలు ఖర్చు  పెడితే, వాళ్ళు ఇప్పుడు మాకోసం ఖర్చు పెడుతున్నారు...

వాళ్ళు ఇప్పుడు మా విషయంలో ఇలా చేయక పోయినా మేము చేసేది ఏమీ లేదు... అంటే నా ఉద్దేశ్యం ఇంత జాగ్రత్త తీసుకోకపోయినా అని...

మా పిల్లలకి మేమంటే ప్రేముంది కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి, స్థోమత ఉంది కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు...

మేము ఒక విధంగా అదృష్టవంతులమే...

పిల్లలతో మనవలతో ఉండటమే ఎక్కువ అదృష్టం...దానితో ఏ అదృష్టానికి పోలిక లేదు...

కానీ ఉన్నంతలో సంతృప్తి చెందాలి...

కానీ ఇండియా లో ఉంటూ కూడా  ముసలితనం లో తల్లి తండ్రులని పట్టించుకోకుండా వదిలేసిన పిల్లలూ ఉన్నారు...

ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా దయనీయం...

US లో ఉన్న పిల్లలు తాము రాలేక, తల్లిదండ్రులని తీసుకుపోలేక, పెద్దవయసైన తల్లిదండ్రులని ఒంటరిగా ఉంచలేక...

అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో,  వాళ్ళు తమ తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుతున్నారు...వాళ్ళకి వేరే దారి లేక...

కనీసం అక్కడ ఉంచితే, 

రక్షణ తో పాటు వాళ్ళ అతీ గతీ చూసేవాళ్ళు ఉంటారని...

వైద్య సదుపాయం ఉంటుందని....

మంచి ఆహారం తో పాటూ... ఒకే ఏజ్ వాళ్ళ సహచర్యంతో,  కొంత టైం పాస్ ఉంటుందని...

వాళ్ళని విమర్శించకండి...

దయచేసి మీ పిల్లల అభిప్రాయం తెలుసుకుని, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి చదివించండి...ఇది నా సలహా...అందని వాటికి అర్రులు చాచొద్దు...

మీకు వీలున్నప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి పోతూ ఉండండి...

మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ దగ్గరికి రాలేకపోవచ్చు....

మా మీద జాలి పడకండి...

నమస్తే....

అని ఆయన ఆపేశారు...

కొన్ని సెకండ్స్ నిశ్శబ్దం గా గంభీరమైపోయిన  ఆ ప్రదేశం... కొద్ది క్షణాల అనంతరం చప్పట్లతో మారు మ్రోగిపోయింది..

.

వసుంధర గారు చెంగుతో కళ్ళు వొత్తుకున్నారు....

                          ***

(రచన: ఉమాబాల

మాఘ పౌర్ణమి*

 *_నేడు మాఘ పూర్ణిమ ,  మాఘ పూర్ణిమ ప్రత్యేకత_* 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*మాఘ పౌర్ణమి*


హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ.. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 27న వచ్చింది. ఈరోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు.


*మాఘ పౌర్ణమికి శుభసమయం..*


ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం 3.49 నుంచి పౌర్ణమి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 1.46 నిమిషాలకు ముగుస్తుంది.


ఉదయ తిథి ఫిబ్రవరి 27న ఉంది పూర్ణిమ తిథి ప్రధానంగా ఈ రోజున జరుపుకుంటారు. ఈ రోజున , నదులలో స్నానం చేయడం మెరిట్ ఇస్తుంది. పౌర్ణమిని ఉపవాసం పాటించేవారు. 2021 ఫిబ్రవరి 26న సత్య నారాయణ వత్రం చేయించాలి. అయితే పౌర్ణమి రోజు ఫిబ్రవరి 27న స్నానం చేయాలి.


చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.

కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి.

మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.

*"మా - అఘం''* అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.


*"మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ*


*బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''*


*"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా ... బ్రాహ్మీముహూర్తము  నుంచి జలములన్నియు బ్రహ్మహత్య , సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును''*  అని అర్థం.


అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు.


*☘మాఘం అమోఘం :☘*


మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. *"మా'' అంటే మహాలక్షీ. "ధనుడు''* అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీమహాలక్ష్మీ కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత , వాగ్దేవి , జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని *"శ్రీపంచమి''* అని అంటారు. "శ్రీ'' అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం.


*"శుద్ధలక్ష్మీ: మోక్షలక్షీ: జయలక్ష్మీహ సరస్వతే*


*శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా''*


మానవునకు అవసరమైన ఆరు సంపదలలోను విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మీ *"శ్రీపంచమి''* నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు *"అక్షరభ్యాసం''* జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధసప్తమి *"రథసప్తమి''* పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్ధశిని *"శివరాత్రి''* పర్వదినం చేశాడు. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి , మాఘశుద్ధ ఏకాదశి *"భీష్మ ఏకాదశి''* పర్వదినం చేశాడు.


త్రిమతాచార్యులలో ఒకరైన *"మధ్వాచార్యుడు''* ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ద నవమిని *"మధ్వనవమి''* గా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహాలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు , వేడుకలు చేస్తారు.

జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని *"కేతువు''* పరిపాలిస్తూంటాడు. కేతువు జ్ఞానప్రదాత , మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు *"మఖ''* నక్షత్ర మండలంతో కూడి వుండే మాసం కనుక ఈ మాసానికి *"మాఘమాసం"* అనే పేరు వచ్చింది. అందుకే మాఘం - అమోఘం .

 

*☘పితృయజ్ఞానికి ప్రాధాన్యత :☘*


మాఘ అమావాస్య పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు *"పైతృకాలకు''* ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే , ఆదివారం , అమావాస్య , శ్రవణనక్షత్రం , వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని *"అర్ధోదయ పుణ్యకాలం''* అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య , శతభిష నక్షత్రంలో కూడి వుంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక , ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం. 


*☘మాఘపూర్ణిమ - మహామాఘి :☘*


మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా ! నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే *"మాఘమాసం''*. పవిత్రస్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ , ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కానీ పని తెలిసే ... కనీసం *"మాఘపూర్ణిమ''* నాడైనా నదీస్నానం గానీ , సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘపూర్ణిమను *"మహామాఘి''* అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ *"మాఘ పూర్ణిమ''* అత్యంత విశేషమైనది. ఈ *"మహామాఘి''* శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేసితీరాలి. శివ , కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి. 


*☘సముద్ర స్నానం ఎందుకు చేయాలి?☘*


 *"నదీనాం సాగరో గతి:''*


సకల నదీ , నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక , సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల , ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే , ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. 

అఘాది , జడత్వాలు ఆయన తత్త్వం.

సాగరుడు సంతోశప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా *"ఆషాఢ పూర్ణిమ , కార్తీక పూర్ణిమ , మాఘపూర్ణిమ , వైశాఖ పూర్ణిమ''* లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. *"స్నానం''* అంటే *"షవర్ బాత్''* చేయడమో , *"స్విమ్మింగ్ పూల్''* లో చేయడమో కాదు. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి , కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటీ ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు , సైన్స్. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.


సూర్యోదయకాలం నుంచి , సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు , సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామాయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని , ఔశదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి *"నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి"* అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర , నదీజలాలలో నిక్షిప్తమై వున్నా సౌరశక్తి , సోమశక్తులు , ఈ నాభినుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా , ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో *"మాఘ పూర్ణిమ''* స్నానం ముఖ్యమైనది.


సముద్రం , నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ , చెరువుల వద్దగానీ *"గంగ , సింధు , కావేరి , కృష్ణ , గౌతమి''* నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి , కర్రలా తేలినా ఫలితం శూన్యం. 


*☘మాఘ పూర్ణిమ స్నానఫలం :☘*


1 . *ఇంటిలోనే వేడినీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.*


2 . *బావి నీళ్ళతో స్నానం చేస్తే , 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది.*


3 . *చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది.*


4 . *సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


5 . *పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


6 . *సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


7 . *గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.*


8 . *ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ... గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది.*


9 . *సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.*


ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే , మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర మూడు స్నానాలనూ *"అంత్యపుష్కరిణీ స్నానాలు''* అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే , మాఘమాసం , మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.

 


*☘మాఘస్నానం చేస్తున్నప్పుడు :-☘*

    *"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ*


*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం*


*మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*


*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''* 


అని పఠించి , మౌనంగా స్నానం చేయాలి , అంటే *"దుఃఖములు , దారిద్ర్యము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా ! అచ్యుతా ! మాధవా ! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు''* అని అర్థం. 

ఆ తరువాత ...

*"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ*   


*త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''*


అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే *"ఓ పరంజ్యోతి స్వరూపుడా ! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక''* అని అర్థం.

ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత , పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని , ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత , దానధర్మాలు చేయాలి. వస్త్రములు , కంబలములు (దుప్పటిలు), పాదరక్షలు , గొడుగు , తైలము , నెయ్యి , తిలపూర్ణఘటము , బంగారము , అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత , అవకాశం ఉన్నవారు *"నేతితో తిలహోమం''* చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.

 

*☘తిలల (నువ్వులు)కున్న ప్రత్యేకత :☘*


నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్చరునికి ప్రతిరూపమని , వాటిని తాకితేనే కష్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు.

శ్రీమహావిష్ణువు స్వేదబిందువులే *"తిలలు''* ... అనగా నువ్వులు.

తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే , శివునకు ఏకదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్టస్థానం వుంది. కనుక ఈ మాఘమాసం నెలరోజులూ ఒకవంతు చెక్కరకు , మూడువంతులు తిలలు కలిపి  శ్రీహరికి నివేదన చేసి , అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది.

మాఘపూర్ణిమనాడు *"తిల పాత్రదానము''* చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే , ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి , వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి -


*"వాజ్మానః కాయజ త్రివిధ పాపనాశపూర్వకం*


*బ్రహ్మలోకా వాప్తి కామ స్తిల పాత్ర దానం కరిష్యే''* అని సంకల్పించి -


*"దేవదేవజగన్నాథ వంఛితార్ధ ఫలప్రద*


*తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం''*


అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్రప్రమాణము. ఈ తిలపాత్ర దానము , జాతకరీత్యా శనిదోష , పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి. 


*☘చివరగా ఓ మాట☘*


మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ , ముఖ్యంగా మాఘపూర్ణిమనాడు సముద్రస్నానం చేయాలని , అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా ! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు , అమావాస్యకు సముద్రానికి *"పోటు''* ఎక్కువగా ఉంటుంది. *"పూర్ణిమ''* దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం. 

జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథినాడు రవి , చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు. అమావాస్యనాడు రవి , చంద్రులు ఒకే కేంద్రంలో కలిసి వుంటారు. రవి , చంద్రులకు , సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా ! ఇక ఆలస్యం ఎందుకు ? మాఘస్నానాలకు ఉపక్రమించండి. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని , ఆనందాన్ని అందుకుని తరించండి.


*ఓం నమో భగవతే వాసుదేవయ* మంత్రాన్ని జపించడం మంచిది.


*☘️మాఘ పూర్ణిమ వ్రత కథ..☘️*


పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతిక నగరంలో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడిపాడు. బ్రాహ్మణుడు అతనికి పిల్లలు లేరు. ఒక రోజు అతని భార్య నగరంలో భిక్ష అడగడానికి వెళ్ళింది. కానీ అందరూ భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేనిదానివని అవహేళన చేశారు. అప్పుడు ఎవరో ఆమెను కాళీక దేవిని  16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు ఆరాధనతో కాళీక దేవిని 16 రోజుల ఆరాదించడంతో కాళికా దేవి వారికి కనిపించింది. తల్లి కాళీక దేవి బ్రాహ్మణ భార్యకు  గర్భం పొందటానికి  వరం ఇచ్చింది. మీ బలం ప్రకారం ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పింది.


ఆరాధన కోసం బ్రాహ్మణుడు చెట్టు నుండి మామిడి పండ్ల , పండ్లను తెంపాడు. అతని భార్య పూజలు చేయండంతో ఆమె గర్భవతి అయింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళికా దేవి చెప్పినట్లు ఆమె దీపం వెలిగించడం కొనసాగించింది. కాళికా దయవల్ల దేవదాస్ అనే కుమారుడికి అతని ఇంటికి ఒక కుమారుడు జన్మించాడు. దేవదాస్ పెద్దయ్యాక తన మామయ్యతో కలిసి చదువుకోవడానికి కాశీకి వెళ్లాడు. కాశీలో వారిద్దరికి ఒక ప్రమాదం జరిగింది. దీని కారణంగా దేవదాస్ మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. దేవదాస్ తాను చిన్నవాడని ఇంకా బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పాడు. కొంత సమయం తరువాత కాళీ తన ప్రాణాలను తీయడానికి వచ్చెను  కానీ బ్రాహ్మణ దంపతులు పౌర్ణమిని వేగంగా ఉంచారు , కాబట్టి కాళికా దేని ఏమి చేయలేకపోయను. అప్పటి నుండి , పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం ద్వారా , ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు అన్ని కోరికలు నెరవేరుతాయి.

26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

కుమ్మరి కేశప్పకథ

 🏵️🌸🌸🏵️🌸🌸🏵️🌸🌸కుమ్మరి కేశప్పకథ

అటికేశ్వరుని కథ

          పూర్వం శ్రీశైలమునకు కొంతదూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కేశప్ప అనే కుమ్మరి ఉండేవాడు. గొప్ప శివభక్తుడు అయిన కేశప్ప కుండలు చేసుకుని జీవిస్తూ కాలినడకన శ్రీశైలమునకు వచ్చే భక్తులకు అన్నదానం చేస్తూ తేనె పండ్లు మొదలైన పదార్థాలను అతిథి సేవకు ఉపయోగించుతూ కాలం వెళ్ళబుచ్చేవాడు. ఆ ఊరి మీదుగా వచ్చి వెళ్లే భక్తులు, జంగములు కేశప్ప భక్తిని, అతిధి సేవలనూ ఊరురా చెప్పుకుంటూ వెళ్ళేవారు. ఈవిధంగా కేశప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందాడు.

             కేశప్పకు మంచిపేరు రావడాన్ని అతని ఇంటిలో భక్తులు సందడిని చూసి సాటి కుమ్మరులు కొందరు ఓర్చుకోలేకపోయారు. ఎలాగైనా సరే అతడు దానధర్మములు చేసే అవకాశం లేకుండా చేయాలని అనుకొని కుట్రపన్ని అర్ధరాత్రి వేళ కేశప్ప కుండలను ముంతలను ఇతర సామాగ్రిని పగులగొట్టి ఉన్న కాస్త సొమ్ము దొంగిలించి కుండలు తయారు చేసే అటికను(సారెను) కూడా పగులగొట్టారు. కేశప్ప తెల్లవారుజామున లేచి ఇల్లంతా చూసి బావురమన్నాడు. శివరాత్రి వచ్చింది. వచ్చే యాత్రికులు లో కనీసం కొంతమంది కి అయినా అన్న సంతర్పణ చేయలేకపోతానే అని దిగులు పడ్డాడు.

        కేశప్ప చేసేది ఏమి లేక చివరకు ధైర్యం తెచ్చుకుని అటిక తయారు చేయడం ప్రారంభించాడు. ఆ సమయం చూసి సాటి కుమ్మరులు దారిని పోయే కొందరు భక్తులు ను పిలిచి కేశప్ప ఇంటికి భోజనానికి పంపించారు. చీకటి పడింది. శివభక్తులకు భోజనం ఎలా ఏర్పాటు చేయాలో కేశప్పకు తోచలేదు. ఆరోజు తన ఇంటిలో ఎవరూ భోజనం చేయలేదు. పదార్థాలు కూడా లేవు. అయినా భక్తులు ను ఇంట్లో కి ఆహ్వానించాడు. పెరటిలోకి వెళ్లి మారేడు చెట్టు కింద దిగాలుగా కూర్చుని ఆలోచించసాగాడు. అతనికి ఏడుపు ఆగలేదు. కంటి నిండా నీళ్లు నిండినాయి. ఎదురుగా అటికపై పగిలిన కుండ పెంకులో శివుడు బంగారు లింగ రూపంలో ప్రత్యక్చమయ్యాడు. "కేశప్పా! ఇంటిలోనికి వెళ్లి నా భక్తులు కు భోజనం వడ్డించు. నా భక్తులు కు ఎన్నడూ లోటుఉండదు. లే! వెళ్ళు!" అన్నాడు. కేశప్ప లోపలికి వెళ్లి చూసేసరికి కుండల నిండా వివిధ భోజన పదార్థాలు ఉన్నాయి. భక్తులకు భోజనం పెట్టి పంపించాడు కేశప్ప.

      శివుడు అటికలో ప్రత్యక్చం అయిన ప్రదేశమే అటికేశ్వరము.

శ్రీశైలం లో ఈ అటికేశ్వరుని లింగ రూపంలో చూడవచ్చును. 🌸🏵️🌸🏵️🌳🏵️🌸🏵️🌸🏵️

వ్రుద్ధ మల్లికార్జునుని కథ

 🍁🍁🍀🍀🍁🍁🍀🍀🍁🍁వ్రుద్ధ మల్లికార్జునుని కథ

       పూర్వం ఒక రాజకుమార్తె ఆ పరమేశ్వరుడు ని ప్రేమించి ఆయననే వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. తల్లిదండ్రులు ఆమె కోరికను నిరాకరించారు. ఆమె నిరంతరం ఆ పరమేశ్వరుడు ని గురించి ఆలోచించుతూ పూజలలోనూ జపాలలోనూ కాలం వెళ్ళబుచ్చ సాగింది. అంతలో ఒకరోజు ఆ పరమేశ్వరుడు ఆమెకు కలలో కనిపించి ఒక తుమ్మెదను చూపించి అది వాలినచోట తనకోసం వేచి ఉండమని, తానే వచ్చి వివాహం ఆడతానని చెప్పాడు ఆమెకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూచేసరికి ఎదురుగా ఒక భ్రమరం (తుమ్మెద)

కనిపించింది ఆ రాజకుమారి ఎగురుతున్న ఆ తుమ్మెదను అనుసరిస్తూ శ్రీశైలం ప్రాంతంలోని అడవికి చేరి అక్కడ తుమ్మెద వాలిన పొదక్రింద శివుని ధ్యానిస్తూ ఆయనకోసం నిరీక్చించ సాగింది. ఆ అడవిలో చెంచులు ఆమెను చూసి ప్రతీ రోజూ పాలు, తేనె, పండ్లు మొదలైనవి ఆమెకు ఆహారం గా

ఇవ్వసాగారు.

           ఇది ఇలా ఉంటే ఒక రోజు పరమేశ్వరుడు పార్వతీదేవి తో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. పార్వతీదేవి కి ఆ రాజకుమార్తె ను చూపించి ఆమె తనను వివాహం చేసుకోబోతోంది అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి హేళన చేయగా పరమేశ్వరుడు తన మాటను నిరూపించ దలచి ఒక వ్రుద్ధుని రూపంలో రాజకుమార్తె వద్దకు వెళ్లి "రాకుమారి! నేను నీకొరకై వెదికి వెదికి ముసలివాడ నైతిని. ఇంతకాలమునకు నీచెంత చేరగలిగితిని. నా ముసలి రూపం లెక్కచేయకుండా వివాహం ఆడెదవా" అని అడిగాడు. అందుకు ఆ రాజకుమార్తె సమ్మతించి తనను సొంత బిడ్డ వలే సాకిన చెంచులు వద్దన్నా వినక ఆ పరమేశ్వరుని వివాహం చేసుకుంది.

         ఈ సందర్బంగా చెంచులు కొత్త అల్లునికొరకు వివాహము ఏర్పాటు చేయగా మధ్య మాంసము ల లోని విందుకు శివుడు అంగీకరించలేదు. రాజకుమార్తె ఎంతగానో నచ్చ జెప్పింది. అయినా వినబడనట్టు అలిగి పోసాగాడుశివుడు.అప్పుడు ఆమె మల్లయ్యా!..... ఓ చెవిటి మల్లయ్యా! నిలబడు"అని గట్టిగా అరిచింది. అయినా ఆ పరమేశ్వరుడు లెక్క చేయలేదు. అప్పుడు రాజకుమార్తె" లింగ రూపియైన నిన్ను వివాహం ఆడలాని అనుకోవడం నాదే తప్పు. అక్కడే లింగముగా మారిపో"అని శపించింది. వ్రుద్ధుడైన శివుడు అక్కడే అదే రూపములో లింగముగా మారిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన పార్వతీదేవి రాజకుమార్తె ను చూసి "ఓసీ భ్రమరమును వెంబడించిన నీవు తుమ్మెదగా మారిపోదువుగాక"అని శపించింది. శివుడి భార్య అయిన భ్రమరి(తుమ్మెద) భ్రమరాంబ గా నిలిచిపోయింది. ఇప్పటికీ వ్రుద్ధ మల్లికార్జున స్వామి ని చెవిటి మల్లయ్య, వ్రుద్ధ మల్లయ్య అని భక్తులు పిలుస్తారు. మీరు శ్రీశైలం వెళ్లినప్పుడు తప్పకుండా గుడిలో ఉంటుంది. ఈ వ్రుద్ధ మల్లయ్య లింగము. ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁

శ్రీశైలం మహిమ :- 12

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁శ్రీశైలం మహిమ :- 12 జ్యోతి ర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి కి 18 శక్తి పీఠం లలో ఒకరైన శ్రీభ్రమరాంబాదేవికి, నిలయమైన ఈ మహాక్షేత్రం వేదములు కు అలవాలమై సకల సంపదలకు పుట్టినిల్లైఎనిమిది శ్రుంగాలతో 44 నదులతో 60 కోట్ల తీర్ధరాజాలతో పరాశర, భరద్వాజాది మహార్షులతో తపోవనాదులతో, చంద్రగుండ, సూర్యగుండ, మొదలైన పుష్కరిణులతో స్పర్శవేదులైన లతలు, చెట్లు మరియు లింగాలతో అనంతమైన ఓషధులతో విరాజిల్లుతున్నది.

శ్రీశైల దర్శనం పలితం :-కురు క్చేత్రమునందు లక్షల కొలది దానము ఇచ్చిన రెండువేల సార్లు గంగా స్నానం చేసినా నర్మదా నదీతీరం నందు బహుకాలం తపస్సు ఆచరించినా కాశీ క్షేత్రం లో లక్షల సంవత్సరాలు నివసించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహా పుణ్యం శ్రీశైలమల్లికార్జునుని దర్శించినంతనే కలుగుతుంది అని స్కాందపురాణము చెబుతోంది.

          ఇక శిఖరం దర్శన మాత్రాన, అనంతమైనటువంటి పుణ్యాన్ని సంతరించిపెట్టే పునర్జన్మ నుండి ముక్తి ని కలిగించే ఈ క్చేత్రమును ఆయా మాసాల్లో సందర్శించేవారు వాజపేయ, అతిరాత్ర మొదలైన మహాయఙ్ఞాలు ఆచరించినందువలన కలిగిన ఫలాన్ని కన్యాదానం గోదానం మొదలైన మహాదానాలు చేసినందువలన కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతీదేవి కి స్వయంగా చెప్పినట్లు స్కాందపురాణము చెబుతున్నది.

         యుగయుగాలుగా ప్రసిద్ధి చెందిన ఈ శైవక్చేత్రాన్ని క్రుతయుగంలో హిరణ్యకశిపుడు కి పూజా మందిరం కాగా, అహోబిలక్చేత్రం సభామండపం అనీ, త్రేతాయుగం లో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం సమయంలో సతీసమేతుడై శ్రీశైల నాధుని సేవించి సహస్ర లింగాన్ని ప్రతిష్ఠించాడని, పాండవులు తమ వనవాసం సమయంలో ద్రౌపది సమేతంగా ఈ క్చేత్రము లో కొంతకాలం ఉండి లింగాలను ప్రతిష్ఠించారని చెప్పబడుచున్నది. అందుకు నిదర్శనం గా నేటికీ ఈ క్చేత్రము లో రామప్రతిష్ఠిత సహస్ర లింగము, సీతాప్రతిష్ఠిత సహస్ర లింగం, పాండవులచే ప్రతిష్ఠించబడిన 'సద్యోజాత' మొదలైన ఐదు లింగాలు భక్తుల సేవలు అందుకుంటున్నాయి.

      క్చేత్రము ప్రాముఖ్యత :-

       సకల లోకారాధ్యమైన శ్రీశైల మహాక్షేత్రం భూమండలం నకు నాభిస్ధానమని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతములో ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా మనము సంకల్పం లో శ్రీశైలాన్ని స్మరిస్తూ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, ఉత్తరదిగ్భాగే అని, తాము శ్రీశైల క్చేత్రమునకు ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో వివరంగా సంకల్పం చెబుతాము.

         అక్చయ వరాలను ఇచ్చే దక్చాధ్వరహరుడు తనను చూడటానికి వచ్చే లక్షలాది మంది భక్తులు కు మోక్షం ను ప్రసాదిస్తూ కొలువుతీరి ఉన్న ఈ దక్షిణ కైలాసం ప్రతీ భక్తుని మనస్సు ను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఉత్సవసమయాల్లో తప్ప సాధారణ రోజుల్లో కుల మత లింగ వయో వివక్షత లేకుండా స్వామిని తాకి, తల ఆనించి తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు అది కనపడలేదు.

        బ్రహ్మ గిరి, విష్ణు గిరి, రుద్ర గిరి, అనే మూడు పర్వతాలకు, పాదాభివందనాలు చేస్తూ తన మువ్వలసవ్వడులతో వేదఘోషలను గుర్తుకు తెచ్చే పావన క్రుష్ణవేణీనది, పాతాళగంగ అనేపేరు తో ఉత్తర వాహిని గా ప్రవహిస్తోంది మరియు ఈ క్చేత్రమునకు మరింత శోభను పవిత్రతను సంతరించి పెడుతోంది.

         ఇక 18 పురాణాలలోనే కాకుండా భారతరామాయణాల లోనూ సంస్క్రుతాంద్ర తమిళ కన్నడ మరాఠి గ్రంధాలెన్నింటిలోనో ప్రస్తావించబడిన ఈ క్చేత్రము గురించి స్కాందపురాణము లో "శ్రీశైలఖంఢం" పూర్తిగా వివరిస్తోంది.

     ఇంకా చెప్పాలంటే ఈ క్చేత్రము ప్రశాంతతకు ముగ్ధులైన శ్రీ శంకరభగవత్పాదులు కొంతకాలంగా ఇక్కడ తపస్సు చేసి "శివానందలహరి" అనే గ్రంథం ను వ్రాసినట్లు చెప్పబడుతోంది. హర హర మహాదేవ శంభో శంకర.. ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నక్షత్రము - నాటాల్సిన వృక్షం

 నక్షత్రము - నాటాల్సిన వృక్షం


వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చేయాలో ఈ శాస్త్రములో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది.


జ్యోతిష్య శాస్త్రములోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా  ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. అయితే నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈ సూత్రాన్ని ఆచరించడం శుభం. మీరు జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచితే అది పెరిగి పెద్దయ్యే కొద్దీ శుభాలను కలుగుతాయి.


నాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటవచ్చు. అయితే అది పెరిగేలా శ్రద్ద చూపించాలి. మీ నక్షత్రము చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆ వృక్షాన్ని దర్శించి నమస్కరించడం శుభం. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ వృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసి పిల్లలచేత కూడా ఇలా జన్మనక్షత్రానికి అనుగుణంగా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలోనూ శుభాలే కలుగుతాయి.

 

జన్మనక్షత్రాన్ని అనుసరంచి పెంచాల్సిన వృక్షాలు - ఫలితాలు

 

అశ్వని నక్షత్రము

అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి, పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది. 

 

భరణి నక్షత్రము

భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది 

 

కృత్తిక నక్షత్రము

కృత్తిక నక్షత్రము అత్తి / మేడి చెట్టును పెంచాలి, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే  సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది.  అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

 

రోహిణి నక్షత్రము

రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షనాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.

 

మృగశిర నక్షత్రము

మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్త.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

 

ఆరుద్ర నక్షత్రము

ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి. పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.

 

పునర్వసు నక్షత్రము

పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్  నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు.  జఠిల సమస్యలు వచ్చినా , చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

 

పుష్యమి నక్షత్రము

పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల  నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు. 

 

ఆశ్లేష నక్షత్రము

ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.

 

మఖ నక్షత్రము

మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి

 

పుబ్బ నక్షత్రము

పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

 

ఉత్తర నక్షత్రము

ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

 

హస్త నక్షత్రము

హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి  ఉపయోగపడుతుంది.

 

చిత్త నక్షత్రము

చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా  తాళ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

 

స్వాతి నక్షత్రము

స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే వుంటాయి. రకరకాల విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది.  భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి  ఉపయోగపడుతుంది.

 

విశాఖ నక్షత్రము

విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

 

అనురాధ నక్షత్రము

అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

 

జ్యేష్ఠ నక్షత్రము

జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.

 

మూల నక్షత్రము

మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి.  అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.

 

పూర్వాషాడ నక్షత్రము

పూర్వాషాడ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

 

ఉత్తరాషాడ నక్షత్రము

ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.

 

శ్రవణం నక్షత్రము

శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

 

ధనిష్ఠ నక్షత్రము

ధనిష్ఠ నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

 

శతభిషం నక్షత్రము

శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

 

పూర్వాభాద్ర నక్షత్రము

పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి  ఉపయోగపడుతుంది.

 

ఉత్తరాభాద్ర నక్షత్రము

ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచాలి. పూజించాలి. దీనివల్ల శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే  విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

 

రేవతి నక్షత్రము

రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి,  జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.....

మొగలిచెర్ల

 *శిష్యుడికి బోధ..*


"మీరొకమారు స్వామివారి సహాధ్యాయి అని ఒక సాధువు గురించి వ్రాసారు..మొగిలిచెర్ల గ్రామ సరిహద్దులో ఉన్న ఫకీరు బీడు..లేదా ఫకీరు మాన్యం అనే పేరుతో పిలువబడుతూ..ఉన్న పొలంలో ఒక అవధూత ఆశ్రమం నిర్మించుకొని..తీవ్రమైన తపస్సు చేసి..కఠోర నియమాలు పాటించి..తనకుతానే హఠయోగం పట్టి..కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దిగంబర అవధూత దత్తాత్రేయుడి తోపాటు కొంతకాలం ఏర్పేడు వ్యాసాశ్రమం లో సాధన చేసాను..అని మా గురువుగారు నాతో చెప్పేవారు..ఆయన ఇక్కడికి ఒకసారి వచ్చి వెళ్లారని కూడా చెప్పారు..అదే విషయాన్ని మీరు కూడా వ్రాసారు..మీరు చెప్పిన సాధువు గారి వద్ద శిష్యరికం చేస్తూ ఉండేవాడిని..వారు హృషీకేశ్ లో వున్నప్పుడు కూడా నేను కొంతకాలం వారివద్ద శిష్యరికం చేసాను..ప్రస్తుతం నేను మా ఊరిలో ఉంటున్నాను..సంవత్సరం లో రెండు మూడు సార్లు మా గురువు గారి వద్దకు వెళ్లివచ్చేవాడిని..గత ఆరునెలలుగా వారి వద్దకు వెళ్ళలేదు..వారెక్కడ ఉన్నారో కూడా నాకు సమాచారం తెలియలేదు..మా గురువుగారి తో పాటు సాధన చేసి సిద్ధిపొందిన ఈ స్వామివారిని చూడలేకపోయాను..కనీసం వారి సమాధిని దర్శించుకొని వెళదామని వచ్చాను.." అని కాషాయ వస్త్రాలు ధరించిన ఆ వ్యక్తి నాతో చెప్పాడు..అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు..


"ముందుగా మీరు కాళ్ళూ చేతులూ శుభ్రం గా కడుక్కొని రండి..స్వామివారి సమాధి దర్శించుకొని వచ్చిన తరువాత మనం మాట్లాడుకుందాము.." అని చెప్పాను.."అలాగే నండీ.." అని ముగ్గురూ బైటకు వెళ్లి..స్నానాలు చేసి వచ్చారు..శిష్యరికం చేసాను అని చెపుతున్న అతనితో పాటు మిగిలిన ఇద్దరు కూడా స్వామివారి సమాధి వద్దకు వెళ్లారు..సమాధికి నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చి ఉత్సవ మూర్తి వద్ద హారతి తీసుకొని..మళ్లీ నావద్దకు వచ్చారు..


"ఇప్పుడు చెప్పండి..మీరు శిష్యరికం చేశానన్నారు కదా..మీరు కూడా సాధన చేసేవారా..?" అని అడిగాను..


"మా గురువుగారు కొంత బోధ చేసారండీ..కానీ నాకు సాధన మీద పట్టు దొరకలేదండీ..ఆయన వద్ద వున్నంతకాలం నాకేదో ఒకటి చెప్పేవారు..అలా చెప్పే క్రమం లోనే..ఈ స్వామివారి గురించి కూడా చాలాసార్లు చెప్పారు..సాధన చేస్తే..అలా మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన దత్తాత్రేయ స్వామిలాగా కఠోర సాధన చేయాలి..అప్పుడే మోక్షప్రాప్తి కలుగుతుంది..సగం లౌకికం..సగం సాధన అనుకుంటే..ఎటూ కాకుండా పోతావు..ఒక్కసారన్నా మొగిలిచెర్ల వెళ్లి ఆ స్వామివారి సమాధిని దర్శించు..నీకు జ్ఞానం వస్తుంది..పో..పోయి..ఆ స్వామిని శరణు వేడుకో..ఇంతదూరం నా వద్దకు వచ్చి నువ్వు సాధించేది ఏమీ లేదు." అని పదే పదే చెప్పారు..నేను అంతగా ఆలకించలేదు..ఈమధ్య నాకు రాత్రివేళ "నువ్వు మొగిలిచెర్ల వెళ్ళావా..?" అని మా గురువుగారు తీవ్ర స్వరంతో అడుగుతున్నట్టు ఆలాపనగా అనిపించింది..ఒకసారి కాదు..రెండుమూడు సార్లు అలానే అనిపించింది..ఇక వుండబట్టలేక ఈరోజు వచ్చాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి అక్కడ నిలుచున్నప్పుడే నా ఒళ్ళంతా ఒక విధమైన జలదరింపు కలిగింది..ఆ ప్రకంపనలు తట్టుకోలేకపోయాను..స్వామివారి పాదుకలు ముట్టుకొని..వాటికి నా శిరస్సు ఆనించి కళ్ళుమూసుకున్న తరువాతే నా ఒళ్ళు నా స్వాధీనం లోకి వచ్చింది..మా గురువుగారు నన్ను ఎందుకు ఇక్కడికి వెళ్ళమన్నారో అర్ధం అయింది..ఈ స్వామివారు సిద్ధిపొంది సుమారు నలభై ఏళ్ళు పైబడే అయింది..కానీ ఆయన తపశ్శక్తి ఇక్కడ ఉన్నది..స్వామీ యేదారీ తెలియక అటు సంసారం లోనూ..ఇటు సన్యాసం లోనూ ఇమడలేకుండా వున్నాను..నువ్వే దారి చూపించు అని మొక్కుకున్నాను..నా ప్రశ్నకు సమాధానం దొరికింది..స్వామివారి ఆదేశం అనిపించింది..మా గురువుగారు కూడా ఈ స్వామినే శరణు వేడుకో అన్నారు..మా గురువుగారి జాడ తెలిసిన తరువాత వారిని కలిసి..ఈరోజు నేనుపొందిన అనుభూతి వారికి చెప్పుకుంటాను..ఇన్నాళ్లకు ఒక సాధకుడి సమాధి వద్ద నాకు మార్గ నిర్దేశనం జరిగింది.." అంటూ కళ్ళ నీళ్లతో చెప్పాడు..


స్వామివారి తపశ్శక్తి గురించి చాలామంది తాము పొందిన అనుభూతులను నాతో చెప్పుకుంటూ వుంటారు..ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా స్వామివారు తమ అనుగ్రహాన్ని చూపుతారు..అది వారి వారి మనో పరిపక్వత మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటూ ఉంటాను..అది నా భావన..కానీ స్వామివారు తనను శరణు వేడిన వారికి ఏ రకంగా తన కృప చూపుతారో అది వారికే తెలియాలి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

అమ్మతో మాట*

 🕉️🕉️🕉️                  *🍀అమ్మతో మాట* 



ఏంటమ్మా ఇది.. ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా! 

కొంచెం మావైపు కూడా చూడొచ్చు కదా! 

 “ఏమిట్రా నీ గోల! నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని ఉరమకు. 

చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు. 

పామరుడిని మహాకవిని చేయడానికీ, మూగవాడితో అయిదొందల పద్యాలు చెప్పించడానికీ, నువ్వొక చూపు చూశావే! అదీ, ఆ చూపూ చూడాలి. అమ్మా! అవడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా! 


ఆమాట కొస్తే, సర్వేశ్వరుడైన నీ మగడే, నీ అనుమతి లేనిదే ఏ పనీ చేయడు. 

అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే.. 

పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొర్రో! విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెడుతుంటే.., 

అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, వెళ్ళిరానా?  అన్నట్టు నీవైపు చూశాడు. 

“పాపం మీ అన్నయ్య ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి ఈ హాలాహలం సంగతేదో చూస్తే, అతను పొంగిపోతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది. మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న *“స్వాధీనవల్లభ”* వు కదా! 


పుట్టింటివాళ్ళ పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కానీ, వాళ్ళైనా మీ ఆయన గురించి, ఒక చిన్నమాట తప్పుగా అన్నా, కళ్ళెర్ర జేస్తావు. అసలే నువ్వు *సదాశివ పతివ్రతవు*

*కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరవు.* 


మీ నాన్న దక్షుడు నీ మగని కోసం నానా మాటలు అంటే, ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా! 

మీ  ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా! నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామారి. 

మరి *“మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా”* అని ఊరికే అన్నారా ఆ వసిన్యాది దేవతలు. 


నీ నవ్వులో ఉన్న మధురిమ ముందు ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెల బోయిందటగా. *“నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ”* అని వాళ్ళువీళ్ళూ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది.

 

*మా ఆది శంకరులు* కూడా *సౌందర్య లహరిలో *“విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః.. ”* అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు. 

*సరస్వతీ దేవి నీ దగ్గర కూర్చొని, మీ ఆయన లీలలను తన వీణ కచ్ఛపిపై గానం చేస్తోందట. నువ్వేమో పొంగిపోయి, “భలే పాడుతున్నావ్!” అన్నావట. అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ*, ఆవిడా గభాలున ఆ వీణను మూటకట్టేసిందట. 


ఇక్కడ ఇంకొక విషయం.. మీ ఆయనన్నా, మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంతిష్టమో కదా! 

 *“ఓ మహా కామేశ మహిషీ”* అని పిలిస్తే చాలు పొంగిపోతావ్. అవున్లే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా! 

ఈ సృష్టి మొత్తం లయం చేసేసి, నీ మగడు ఆనంద తాడవం చేస్తుంటే.. అసలు పోలికే లేనంత అందమైన చుబుకం గల *“అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా”* వైన నువ్వు, నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబుకం కింద పెట్టుకుని, ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ.. *“మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి”గా* ఉన్నావు. 


నువ్వసలే *“లాస్యప్రియ”వు* కూడానాయే. 

   ఎంతటి *“మహాలావణ్య శేవధి”వి*. *“ఆబ్రహ్మకీటజనని”వి* అయినా, 

నీకు మీ ఆయన తొడమీద కూర్చుని, *“శివకామేశ్వరాంకస్థా”* అని అనిపించుకోవడమే ఇష్టం.  

 అందుకే మా కాళిదాసు 

*"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే*

*జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”* అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ, నమస్కరించుకున్నాడు. 

అసలు *మా కాళిదాసు నీపై వ్రాసిన *“దేవీ అశ్వధాటి”* స్తోత్రం చదివితే తెలుస్తుందమ్మా! మా కవుల కవిత్వంలోని సొగసు. 

సంగీతం ఏమాత్రం రానివాడికి కూడా తనకు సంగీతం వచ్చేసునేమో అన్న భ్రమకలిగించేంత అందంగా ఉంటుందా శ్లోకాల నడక.


*చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ* 

*కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా* 

*పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్* 


ఆహా! మొదటి శ్లోకమే ఎంత అందంగా ఉందో చూశావా? 

*ఇలాంటివి 13 శ్లోకాలున్నాయి* ఆ స్తోత్రంలో. ఈ శ్లోకాలలో కూడా ఒకచోట నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమను రసవత్తరంగా చెప్పాడు కాళిదాసు. 

*“శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా..”* అంటాడు. 

మీ ఆయన నిన్ను గాఢంగా ఆలిగనం చేసుకున్నప్పుడు నీకు కలిగే పులకరింతలు నీకా పరమేశ్వరునిపై ఉన్న అపారమైన అనురాగానికి సూచికలట. 

మీ ఆయన కోసమే చెప్పుకుంటూ కూర్చుంటే నీకూ, నాకూ ఇద్దరికీ ఇక ఈ లోకం పట్టదు. 

కనుక కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం.


అమ్మా! అసలు మీ *అన్న దశావతారాలను* అలా నీ చేతివేళ్ళ గోళ్ళలో నుండి అలా ఎలా పుట్టించేశావమ్మా! చిత్రం కాకపోతేను. 

*“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః”* అన్న మాట తలచుకుంటేనే భలేగా ఉంటుంది. ఇక్కడే ఇంకొక్క విషయం చెప్పాలి. మళ్ళీ మరచిపోతానేమో! *“సాగరమేఖలా”* అనే నీ పేరు కూడా నాకెంత ఇష్టమో!  

*సముద్రాన్నే వడ్డాణంగా* పెట్టుకున్న దానివంటకదా! ఎంత బావుంటుందో తెలుసా ఈ మాట. 


ఈ నీ నామాన్నే 

*మా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు* 

*“తేనెలతేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమా..”* అనే ఓ చక్కని గీతంలో అందంగా వాడారు. 

*“సాగర మేఖల చుట్టుకొని -  సురగంగ చీరగా మలచుకొని”* అంటూ నీ నామాన్ని దేశమాతకు అన్వయిస్తూ వ్రాశారు. 

అసలు మా సినీ కవులు కూడా నీమీద పాట రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతారు. 


ముందుగా మాత్రం నేను *మా మల్లాది రామకృష్ణశాస్త్రి* గారినే చెబుతాను. 

*“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ*

*విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ*

*మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ*

*సుమరదన విధువదన.. దేవి…”* అంటూ ఆయన వ్రాస్తే, 

ఆ సాహిత్యానికి మా ఘంటశాల వేంకటేశ్వర్రావు గారు బాణీ కట్టారు. 

మల్లాది వారి సూచన మేరకు, ఈ పాటలో 

*సరస్వతీ దేవి కోసం వచ్చినప్పుడు సరస్వతి రాగంలో*, 

*శ్రీదేవి కోసం వచ్చినప్పుడు శ్రీరాగంలో, లలితాదేవి కోసం వచ్చినప్పుడు లలితరాగంలో స్వరరచన చేశారు *మా ఘంటశాల*. ఇలాంటి పాట వింటూ నాలాంటి పామరుడే పులకించిపోతుంటే.. 

   *“కావ్యాలాప వినోదిని”వి,* 

  *“రసజ్ఞ”వు.* *“కావ్యకాళా”* రూపిణివి అయిన నీవెంత మురిసిపోతుంటావో కదా! 

ఆయనే వ్రాసిన *“శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా”* పాట కూడా మరో మేలిమి ముత్యం! 

   *“జగముల చిరునగవుల పరిపాలించే జననీ*

    *అనయము మము కనికరమున కాపాడే జననీ”* అంటూ.. 

*“అనేకకోటిబ్రహ్మాండజనని”* వైన నిన్ను కీర్తిస్తూ.. 

*“మనసే నీ వశమై స్మరణే జీవనమై*

*మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి”* అంటూ మా అందరి తరపునా ఆయనే ప్రార్థించేశారు.


ఇక *సముద్రాలగారి* *“జననీ శివకామినీ..”*, *పింగళిగారి *“శివశంకరీ..”* పాటలు కూడా మమ్మల్ని ఆనందడోలికల్లో మునకలేయించేవే.


మా *వేటూరి* గారి సంగతైతే చెప్పనక్కరనే లేదు. 

*“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి*

 *పాలయమాం గౌరీ*  *పరిపాలయమాం గౌరీ”* అంటూ మొదలయ్యే ఆ పాట, కాళిదాసు కవిత్వంలా సొగసుగా పరుగులు తీస్తుంది.

*“శుభగాత్రి గిరిరాజపుత్రి*  

 *అభినేత్రి శర్వార్ధ గాత్రి* 

 *సర్వార్థ సంధాత్రి* 

 *జగదేక జనయిత్రి”* ఇలా అద్భుతంతా సాగిపోతుందా పాట. 

మీ ఆయన అయిన శర్వునిలో నీవు సగభాగం కాబట్టి *శర్వార్ధ గాత్రి* అన్నారు. గాత్రము అంటే శరీరం అనే అర్థం ఉంది కదా!  అలానే *సర్వ కార్యసిద్ధిని ఇచ్చుదానవు కనుక *సర్వార్థ సంధాత్రి* అన్నారు. 


అసలు *శర్వార్థ, సర్వార్థ అనే పదాలు వినడానికి కొంచెం ఒకేలా ఉన్నా, ఎంతటి భేదం ఉందో కదా వాటి మధ్య*. అదీ మరి మా వేటూరంటే! 

అదీ నీ కరుణ ప్రసరించిన వారి కవిత్వమంటే. ఈరోజు  నీతో ఇలా ఏవోవో చెప్పేస్తున్నాను.

 

అప్పట్లో శివరాత్రికి మీ ఆయనకోసం, శ్రీరామనవమికి మీ అన్నయ్యకోసం రెండుత్తరాలు వ్రాశాను. 

వాళ్ళకు వ్రాసి, మీ అందరికీ తల్లినైన నాకు మాత్రం వ్రాయవా అంటావమోనని ఈ మాటలన్నీ అరచి మరీ చెబుతున్నాను. వింటున్నావు కదా! 

ఇక్కడ వంటింట్లో పని చేసుకుంటున్న మా అమ్మకు ఏదో ఒకటి చెబుతూ, మధ్య మధ్యలో “ఇదిగో అమ్మా, వింటున్నావా? ఓ అమ్మా!!” అని అరుస్తుంటాను. 

మా అమ్మేమో, ఊ! చెప్పరా” అంటుంది తన పని తాను చేసుకుంటూనే. కాకపోతే ఆవిడకు ఇక్కడ ఒకింటి పనే కాబట్టి ఇబ్బంది లేదు. 


కానీ నీ సంగతి అలా కాదు కదా! 

అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే తల్లివి. 

లోకాలన్నీ తన బొజ్జలో దాచుకున్న ఆ పరమశివుని భార్యవు. *“సదా శివ కుటుంబిని”వి.* 

అందుకే, కోట్లాదిమంది పిలుపులలో నా పిలుపెక్కడ వినబడదో అన్న భయం చేత, ఇంకాస్త గట్టిగా అరచి చెబుతున్నాను.  *ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు! నేనూ..* 

          *స్వస్తి!*


చాలా బాగుంది కదా! 

*సద్గురు దేవదత్త*

🕉️🍁🍀🍁🍀🕉️

మొగలిచెర్ల

 *సాయి..స్వామి..*


"మేము శ్రీ సాయిబాబా భక్తులమండీ..తరచూ శిరిడీ వెళ్లి, ఆ సాయినాథుణ్ణి దర్శించుకొని వస్తూ వుంటామండీ..రెండు మూడు సార్లు గాణుగాపురం, పిఠాపురం కూడా వెళ్ళొచ్చాము..ఎందుకనో తెలీదండీ గత సంవత్సరకాలంగా ఏ క్షేత్రానికి వెళ్లినా..అక్కడ దైవం మీద మనసు లగ్నం కావడం లేదు..ఏదో అశాంతి..మా ఇద్దరికీ ఆర్ధికంగా ఇబ్బందులేవీ లేవు..మా ఇద్దరికీ వచ్చే పెన్షన్ తోటి మాకు హాయిగా జరిగిపోతున్నది..ఒకరికి పెట్టగలిగే స్థితిలోనే ఉన్నాము..పిల్లలు కూడా స్థిరపడ్డారు..అమ్మాయి అల్లుడు కెనడాలో వుంటారు..కొడుకూ కోడలు అమెరికా లో వున్నారు..ఇక్కడ ఒక అవధూత సిద్ధిపొందారు అని తెలుసుకున్నాము..ఆ తరువాత ఈ స్వామివారి చరిత్ర చదివాము..దత్తక్షేత్రం దర్శించుకోవాలి అని అనిపించింది..బయలుదేరి వచ్చాము..గురువారం నాడు గురుదర్శనం చేసుకుంటే మంచిదనే అభిప్రాయం తో ఈరోజు ఇక్కడికి వచ్చాము..తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ క్షేత్రం లో పల్లకీసేవ శనివారం విశేషంగా జరుగుతుందని..రేపుదయాన్నే తిరిగి వెళ్లాలనే సంకల్పంతో వచ్చాము..పల్లకీసేవ లో పాల్గొనలేకపోతున్నామే అనే అసంతృప్తి ఉన్నది..చెప్పాను కదా..ఏదో ఒక కొరవ..ఏదో ఒక అశాంతి.." అన్నారా దంపతులు..


ఆ దంపతుల జీవనానికి ఏ కొరవా లేదు..కానీ వాళ్లకు మనోశాంతి లేదు..ఇంకా ఏదో ఉన్నది..అది మనకు అందలేదే అనే ఒక బాధ తప్ప..నా వరకూ వాళ్ళ మాటలు విన్నప్పుడు.."అన్నీ వుండి కూడా అసంతృప్తితో బాధ పడుతున్నారు.." అని అనిపించింది.."ముందు మీరిద్దరూ స్నానాదికాలు ముగించుకొని రండి..స్వామివారి సమాధిని దర్శనం చేసుకుని..ఆపై మాట్లాడుకుందాము.." అని చెప్పాను..ఇద్దరూ వెళ్లారు..మరో గంట తరువాత ఆ దంపతులు ఇద్దరూ మందిరం లోకి వచ్చారు..మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసి వస్తామని చెప్పి వెళ్లారు..మొదటి ప్రదక్షిన చేస్తూ..స్వామివారి గర్భాలయం కు నైరుతి మూల ఉన్న శ్రీ సాయిబాబా మందిరం వద్దకు వచ్చి..అలాగే నిలబడిపోయారు..ఆ దంపతులిద్దరిలో..ఆవిడ ఒక్కసారిగా "సాయిబాబా..తండ్రీ..సాయినాథా..ఇక్కడ కూడా ఉన్నావా..?"అని బిగ్గరగా కేక పెట్టింది..శ్రీ సాయిబాబా విగ్రహం వద్దకు వెళ్లి రెండు చేతులతో సాయిబాబా పాదాలు పట్టుకొని..తల ఆనించి..రెండు మూడు నిమిషాలు అలానే వుండిపోయింది..ఆ తరువాత ఇవతలికి వచ్చి..మళ్లీ సాయిబాబా విగ్రహానికి నమస్కారం చేసుకొని..ప్రదక్షిణ పూర్తి చేశారు..మందిరం లోకి వచ్చి..స్వామివారి సమాధి వద్దకు వెళ్లారు..గర్భాలయం లో స్వామివారి సమాధి ప్రక్కన పడమర గోడలో అమర్చిన స్వామివారి పాలరాతి విగ్రహం వద్దకు వెళ్లి నమస్కారం చేసుకుని..స్వామివారి పాదుకులకు కూడా నమస్కారం చేసుకొని..అక్కడే నిలబడ్డారు..దాదాపు ఐదు నిమిషాలపాటు కళ్ళుమూసుకుని నిలబడిపోయారు..పూజారి గారు వాళ్ళను ఇవతలికి వచ్చేయమని చెప్పారు..ఇవతలికి వచ్చి..స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద హారతి తీసుకొని..ఆ మంటపం లోనే ఒక ప్రక్కగా ఇద్దరూ ధ్యానం చేసుకుంటూ సుమారు ఒక అరగంట ఉండిపోయారు..


ఆరోజు సాయంత్రం స్వామివారి మందిరం తలుపులు మూసివేసిన తరువాత.."ప్రసాద్ గారూ..మేమిద్దరం శనివారం నాటి పల్లకీసేవ లో పాల్గొనాలి అని అనుకున్నాము..ఈరాత్రికి, రేపు రాత్రికి కూడా ఇక్కడే మంటపం లో పడుకుంటాము..మా ఆవిడకు ఇక్కడే వుండి పల్లకీసేవ లో పాల్గొనండి అని సాయిబాబా ఆదేశం ఇచ్చినట్లు అనిపిస్తోందట..బాబా మాట మీరలేము కదా..అందుకని పల్లకీసేవ లో పాల్గొంటాము.." అన్నారు.."మీ ఇష్టం..అలాగే వుండండి.." అన్నాను..ఆరెండు రోజులూ ఆ దంపతులు స్వామివారి మంటపం లోనే వున్నారు..శనివారం నాడు సాయంత్రం స్వామివారి పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆదివారం ఉదయం వాళ్ళ ఊరు వెళ్లిపోతూ.."ప్రసాద్ గారూ ఏదో తెలీని అసంతృప్తి తో వచ్చాము..కొండంత తృప్తి తో వెళుతున్నాము..సాయినాథుని ఆదేశం వల్ల ఈ స్వామివారి పల్లకీసేవ లో పాల్గొన్నాము..ఆ తరువాత మనసంతా ప్రశాంతంగా ఉంది..మళ్లీ మళ్లీ ఇక్కడకు రావాలని అనిపించింది..ఆ సాయినాథుడే..మాలో ఉన్న అశాంతి దూరం చేయడానికి మాకు ఈ క్షేత్రాన్ని దర్శించే ఏర్పాటు చేసాడేమో అనిపిస్తోంది.." అని చెప్పి.."ఈ మారుమూల ప్రదేశం లో వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేస్తున్నారు..అన్నదాన సత్రం బాగు చేస్తున్నారు..వసతి కొఱకు  కూడా మీరు ఏర్పాట్లు చేస్తున్నారని విన్నాము..మేమూ మా వంతుగా సహకరిస్తాము..ఈ క్షేత్రం ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉన్నది..మేము ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు శిరిడీ వెళతామని చెప్పాము కదా..ఈరోజు నుంచి..శిరిడీ తో పాటు ఇక్కడికి తరచూ వస్తాము..మావరకూ..ఆ సాయినాథుడు..ఈ స్వామివారు ఇద్దరూ రెండు కళ్ళ లాంటి వారు.." అని ఉద్వేగంతో చెప్పారు..


ఆ శిరిడీ సాయినాథుడు మార్గం చూపితే..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు తమ మనసు లోని అశాంతి ని దూరం చేశాడని ఆ దంపతులు విశ్వసించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

మంత్ర పుష్పం

 మంత్ర పుష్పం ఏమి తెలియజేయుచున్నది వక పరిశీలన. సృష్టి పరిణామ క్రమం ఏవిధంగా జరిగినది పరమాత్మ తత్వం ఏమి. దీనిని  సూత్రబధ్దంగా ఎలా వర్ణన. వర్ణన అనగా కల్పిత మని చాలామంది ఊహ. కాని సూత్ర మనగా వక క్రమం . వేదము కూడా వక క్రమంగా అక్షర శక్తిని తెలియు విధానమే. క్రమంగా అనగా వక పద్దతిగా శక్తని తెలియుట. ప్రదీశశ్చ తస్రః  ప్రదీతశ్చ  తస్రః అని వివరించింది. ప్ర అనగా జీవ  మూల లక్షణమని ఈశశ్చ అనగా ఈ శ అనే చైతన్య లక్షణమని జీవ లక్షణమని. సూక్ష్మంగా మనకు వున్న ఙ్ఞానం తో అక్షర శక్తిని గమనించుట.అది పదార్ధ మూలమైన ప్ర అనే విశిష్టమైన జీవ చైతన్య మైన నీటి శక్తి. దీనికి మూలం అగ్నియే. ప్రదీశ నిన్ను నీవు తెలియుట ప్రవిద్వాన్ యని తెలియుతున్నది. దీని మూల తత్వం అహం బ్రహ్మాస్మి.మంత్ర పుష్పం ఋగ్వేద మంత్ర అక్షర మిశ్రమ శక్తి సంకేత మని. అదేదో విశిష్ట మని మనకెందుకులే యని వదలి పర భాషలపై ఆధారపడిన సమస్త విన్నాను సూవన్యమగును. పరభాషలమూలం కూడా చిన్న చిన్న మార్పులతో పలకుబడిలో శక్తి పరిణామ సూచనలే తప్ప వేరేమీగాదు. అన్నింటికీ మూలం సంస్కృతమని దానిఅక్షర శక్తి తెలుగు భాషలో అంతర్లీనమైయున్నదని మనకు దీని వివరణ సులువుగా విశ్లేషణకు మూల సూత్ర మనగా యున్నది. పంచభూతాత్మకమైన జీవ దేహ నవివరణయే మంత్ర పుష్పం వివరణ. శక్తి సమస్త వ్యాప్తమై పరమేశ్వర పరమేశ్వరీ స్వరూపం. అమ్మ అనుగ్రహం వుంటే సమస్తం అధీనమే. అనగా కోరికలకు కాదు. ఙ్ఞానమునకు. ఙ్ఞానియే అగ్రగణ్యం.పూర్ణాను స్వర రూపమే శక్తి. అను స్వరూపము అనగా అణుశక్తియే యని తెలియ వలెను. దీనికి నక్షత్ర శక్తియే మూలం. క్షతముగాని త్రిగుణాత్మకమైన శక్తి నక్షత్రమని అది ఎల్లప్పుడు వకే కాంతి శక్తని భూమిని ప్రభావితం చేయునని తెలియును.

మన మహర్షులు - 34

 మన మహర్షులు - 34


రైభ్య మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


రైభ్యుడు చిన్నతనం నుంచే వేదాధ్యయనం ప్రారంభించాడు. ఇతనికి గురుభక్తి చాలా ఎక్కువ. గురువుగారి కంటే ముందుగా నిద్రలేచి ఆయన పడుకొనే వరకు ఆయనకు కావల్సినవన్నీ చేస్తూ చదువుకునేవాడు.


గురువుగారు కూడా అతని గురుభక్తికి సంతోషించి అన్ని వేద శాస్త్రాలు అతనికి బాగా వచ్చేటట్లు నేర్పించాడు. మొత్తం అన్నీ నేర్చుకున్నాక గురువుగారి ఆజ్ఞ తీసుకుని బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు


రైభ్యుడు తనకి సందేహాలు కలిగినప్పుడు బృహస్పతినడిగి తెలుసుకునే వాడు. 


ఒకసారి వసు మహారాజుని తీసుకుని బృహస్పతి దగ్గరకి వెళ్ళి దేవా! మోక్షం కర్మలు చెయ్యడం వల్ల వస్తుందా? జ్ఞానాన్ని సంపాదించడం వల్ల వస్తుందా? అనడిగాడు.


మునీంద్రా! తామరాకు మీద నీరు ఎట్లాయితే అంటుకోదో అట్లాగే చేసిన కర్మల్ని పరమేశ్వరార్పణమస్తు అని భగవంతుడికి అర్పిస్తే మనల్ని ఏ కర్మా అంటదు. 


దీనికి ఒక కథ చెప్తాను వినమన్నాడు బృహస్పతి.


            పూర్వం సంయముడనే మహారాజు భగీరథీ తీరంలో తిరుగుతుండగా ఒక బోయవాడు లేళ్ళ గుంపుని కొట్టబోతే సంయముడు ఆపి పాపం! అవేం చేశాయి? వాటిని చంపకు అన్నాడు.


బోయవాడు చంపడానికి మానడానికి నేనెవర్ని? అంతా ఈశ్వరేచ్ఛ అన్నాడు.


 సంయముడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్! అన్నాడు.


 బోయివాడు వీపు మీదున్న ఇనప వల క్రిందపడేసి దీంట్లోంచి అగ్ని పుట్టించమన్నాడు సంయముడిని. 


అతడి వల్ల కాలేదు.

బోయవాడు మంటల్ని పుట్టించి ఆర్పేసి ఇలా అన్నాడు. ..ఈ మంటలు ఎల్లా అయితే వెలిగి ఆరిపోతున్నాయో, అలాగే భగవంతుడు ప్రకృతి స్థితుడైనప్పుడు జీవులు నశించి, వికృతడై మళ్లీ పుట్టిస్తాడు.


ఇంక శరీర ధర్మాలకొస్తే ఎవరికేదిష్టమో అది చేసి పరమాత్మకి అర్పించాలి. 

అంటే మనం ఏదేనా తింటున్నా త్రాగుతున్నా, ఎవరికేనా ఏమన్నా ఇస్తున్నా ఏపని చేస్తున్నా 'పరమేశ్వరార్పణం' అంటే అది భగవంతుడికే చెందుతుందని చెప్పగానే దేవతలు బోయవాడి మీద పుష్పవర్షం కురిపించారు.


తర్వాత దేవతలు విమానంలో బోయవాణ్ణి సంయముడు చూస్తూండగానే తీసుకుపోయారు. 


బృహస్పతి చెప్పింది విని రైభ్యవసువులు ఆనందంగా వెళ్ళారు.


  రైభ్యునికి అర్వావసువు, పరావసువు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. పిల్లద్దరికి వేద విద్యలు నేర్పించి వాళ్ళతోపాటు రైభ్యుడు చదువుతుంటే మిగిలిన మహర్షులు ఆనందంగా చూసి ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు.


 రైభ్య మహర్షి కొడుకులు అర్వావసువు, పరావసువుల్ని చూసి భరద్వాజుడి కొడుకు అవక్రీతుడు అసూయపడేవాడు. 


రైభ్యుడు, భరద్వాజుడు మాత్రం అన్నదమ్ముల్లా కలిసి

మెలిసి వుంటూ తప్పస్సు చేసుకుంటూ వుండేవాళ్ళు.


 అన్నీ వేదాలు రావాలని అవక్రీతుడు ఇంద్రుడి గురించి తపస్సు చేశాడు. వేదాలు

గురువు ద్వారా నేర్చుకోవాలి గానీ తపస్సు ద్వారా కాదన్నాడు ఇంద్రుడు.


 అవక్రీతుడు వినకపోతే ఇంద్రుడు సరే తీసుకో వరమయితే ఇస్తానుగాని అలా

వచ్చిన వేదాలు నీకు ఎంతవరకు ఉపయోగ పడతాయో మాత్రం చెప్పలేనన్నాడు. 


అవక్రీతుడుకి వేదాలు నేర్చుకున్నానన్న గర్వం పెరిగిపోయింది. 

బృహస్పతి గర్వం

మంచిదికాదని ఎంత చెప్పినా వినలేదు .


ఒకరోజు రైభ్యుడి కోడల్ని అవమానించాడు అవక్రీతుడు. రైభ్యుడు ఒక రాక్షసిని, ఒక రాక్షసుడ్ని పుట్టించి అవహేతుడ్ని చంపించాడు.


భరద్వాజుడు కొడుకుకి జరిగినది న్యాయమే అని దహనక్రియ జరిపించి పుత్రశోకం భరించలేక శరీర త్యాగం చేశాడు.


ఒకనాడు రైభ్యుడి కొడుకు రాత్రి యింటికి వస్తుండగా ఒక మృగం మీదపడింది. దాన్ని కొట్టడానికి కర్రవిసిర్తే అది అక్కడే నిద్రపోతున్న తండ్రి రైభ్యుడికి తగిలి మరణించాడు. రైభ్యుడి కొడుకు అర్వావసువు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అతని తపస్సుకి మెచ్చుకుని దేవతలు వరాలు కోరుకోమన్నారు. రైభ్య భరద్వాజ అవక్రీతుల్ని బ్రతికించమన్నాడు అర్వావసువు. 


అప్పటి నుండి అవక్రీతుడు గర్వం వదిలి అందరితో కలిసిమెలిసి వున్నాడు.


రైభ్యుడు తీర్థ యాత్రలు చేస్తూ అనంతశాయిని, రంగధాముణ్ణి, కంచి వరదరాజుని వెంకటేశ్వరస్వామిని, అహోబలేంద్రుణ్ణి సింహాచల నాయకుణ్ణి, శ్రీకూర్మపతిని, పురుషోత్తముడ్డి అందర్నీ దర్శించి ప్రయాగ వెళ్ళి గయలో పితృదేవతలికి పిండ ప్రదానం చేసి ఒకచోట తపస్సు చేసుకుంటూ వుండిపోయాడు.


అలా తపస్సు చేస్తూవుండగా సనత్కుమారుడు రైభ్యుడి దగ్గరికి వచ్చి అతని తపోదీక్షని పొగిడాడు.


 రైభ్య మహర్షి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి కనిపించి ఏం కావాలనడిగాడు. సనకాదులుండే చోటికి నన్ను కూడ పంపమని మోక్ష సామ్రాజ్యాన్ని పొందాడు రైభ్య మహర్షి.


ఇదీ  రైభ్యమహర్షి కథ...


విద్య గురువు ద్వారా నేర్చుకోవాలనీ, ఏ పని చేసినా భగవంతుడి మీద భారం వెయ్యాలనీ ఈ కథ ద్వారా నేర్చుకొన్నాము కదా...


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కులశేఖర ఆళ్వారు

 ✍️...నేటి చిట్టికధ


కులశేఖర ఆళ్వారు  తిరునక్షత్రం సందర్భం గా...

  

     ఆళ్వార్లలో ఐదవ వాడు కులశేఖర ఆళ్వార్‌.  కొల్లినగర్ (తిరువన్జిక్కళమ్) అను రాజ్యములో క్షత్రియ వంశములో శ్రీకౌస్తుభం అంశతో జన్మించాడు. ఇతడిని కొల్లికావలన్, కొజియర్ కోన్, కూడల్ నాయకన్ మొదలగు నామములతో కూడా వ్యవహరిస్తారు.


        తనియన్ లో వివరించినట్లుగా ‘మాఱ్ఱలరై  వీరంగెడుత్త శెంగోల్ కొల్లి కావలన్ విల్లవర్ కోన్  శేరన్ కులశేఖరన్ ముడివేందర్ శిఖామణియే’


        ఆళ్వారు చేరరాజ్యమునకు రాజుగా, శత్రువులను నిర్మూలించే గొప్ప సైన్యము కలిగి రథములు, గుఱ్ఱములు, ఏనుగులతో చతురంగ బలగాలు  కలిగి ఉన్నాడు. 


        రాజైన ఆళ్వార్ ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ, శ్రీరాముడి లాగా ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ,  సరైన నిర్ణయములతో రాజ్యమును తమ ఆధీనంలో ఉంచుకొనేవాడు.     


        శ్రీమన్నారాయణుడు మాత్రమే పరమ పదమునకు మరియు సంసారమునకు సర్వాధికారి అని నమ్మేవాడు. వారి  నిర్హేతుక కృపచే, అపారమైన దైవిక విషయములందు పరిఙ్ఞానమును కలిగి,  రజో/తమో గుణములు నిర్మూలించుకొని పూర్తిగా సత్వగుణముచే భగవంతుడి దివ్యస్వరూపమునే ఆరాధిస్తూ , కులశేఖరాళ్వార్ తమ రాజ్యముతో ఎటువంటి సంభదము పెట్టుకోకుండ  శ్రీవిభీషణాళ్వాన్ వలే తమ సంపదను శ్రీ రాముని పాదాల వద్ద ఉంచి శరణువేడాడు.


        అధిక సమయమును శ్రీవైష్ణవులైన సాధువులతో  గడిపెడివాడు. ‘అన్నియరంగన్ తిరుముట్రత్తు అడియార్’ అంటే అధికముగా తమ దినచర్యను శ్రీరంగనాధుడి  ఆలయం లోనే గడిపేవాడు. 


        కులశేఖరాళ్వార్  ప్రతిరోజు దినచర్యగా శ్రీరామాయణాన్ని శ్రవణం చేస్తూ  ప్రవచిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి  శ్రీరామాయణ శ్రవణంలో  తన్మయత్వంగా  మునిగి తనను తాను మరచిపోతుండేవాడు.


        ఒకానొకసారి పురాణ శ్రవణంలో ఒక ప్రవచకుడు రామాయణంలోని ఖరదూషణ ఆదిగాగల పదనాల్గువేలమంది రాక్షసులతో శ్రీరాముడు  యుద్ధానికి సిద్ధమయ్యే సన్నివేశం చెబుతున్నాడు.


         శ్రీరాముడు ఒక గుహలో సీతాదేవిని ఇళయపెరుమాళ్ (లక్ష్మణుని) సంరక్షణలో ఉంచి, తానొక్కడే పదనాల్గువేల మంది రాక్షసులను ఒంటి చేత్తో ఎదుర్కొనుచుండగా,   ఋషులందరు భయముతో చూస్తుండే ఘట్టం ప్రవచిస్తున్నారు. 


        అది విన్న ఆళ్వార్ వళ్లు తెలియని భావోద్వేగముతో శ్రీరాముడికి యుద్ధంలో సహాయం చేయాలనే తలంపుతో, తన సేనలను  యుద్ధరంగం వైపు  వెళ్ళడానికి సిద్ధం కావల్సినదని ఆఙ్ఞాపించాడు.  


        ఇది చూసిన మంత్రులు ఆశ్చర్యపోయి రాజును ఆ భ్రమనుండి మళ్లించడం కోసం కొందరు ప్రముఖులను దండయాత్రకు బయలుదేరిన రాజుగారికి ఎదురు వచ్చేలా చేసారు. వారు రాజుగారితో...


        “మహారాజా శ్రీరాముడు యుద్ధములో విజయాన్ని వరించాడు, సీతాదేవి అతని గాయాలకు ఉపశమన చర్యలు చేస్తున్నది కావున మీరిక వెళ్ళవలసిన పనిలేదు” అని చెప్పారు. 


        దానితో కులశేఖర ఆళ్వార్ సంతృప్తి చెంది తన రాజ్యానికి వెనుదిరిగాడు. మంత్రులంతా ఆళ్వార్ వింతప్రవర్తన గురించి ఆలోచించి శ్రీవైష్ణవుల అనుభంధ వ్యామోహము నుండి విడదీయాలని నిర్ణయించుకొన్నారు. 


       అందుకోసం వారొక  యుక్తిని పన్నారు. వారు ఆళ్వార్ తిరువారాధన గది నుండి ఒక వజ్రాలనగను దొంగిలించి ఆ దొంగతనాన్ని అత్యంత సన్నిహితులైన శ్రీవైష్ణవులపై మోపారు.  ఇది విన్న ఆళ్వార్ విషనాగుతో ఉన్న ఒక కుండను తెప్పించి దానిలో  తన చేతిని పెడుతూ 


        “శ్రీవైష్ణవులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే  పాము నన్ను కాటువేయును గాక”  అనగా, వారి నిజాయితికి ఆ పాము కాటువేయలేదు. 


        దీనిని చూసిన మంత్రులు సిగ్గుపడుతూ ఆ నగను తిరిగి ఆళ్వార్ కు ఇచ్చి,  ఆ శ్రీవైష్ణవులను క్షమాపణ అడిగారు.


        గొప్ప రామభక్తుడైన అతడిని పెరుమాళ్‌  (అతి గొప్పవాడు) అనికూడా పిలిచేవారు.  ఇది సాక్షాత్తూ శ్రీవెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు. 


        అతడి భక్తి ఎంత గొప్పదంటే స్వామి భక్తులను సైతం స్వామిని పూజించినట్లు పూజించే వాడు. అతడు శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామికి సేవచేస్తుండేవాడు.


       క్రమంగా, ఆళ్వార్  ఈ సంసారుల మధ్యన ఉండటానికి ఇష్టపడక, ‘శౌనక సంహిత’ లో చెప్పిన విధంగా ‘భగవంతుడిని కీర్తించని  సంసారుల మధ్య నివసించుట ఒక అగ్నిగోళం మధ్యన ఉండుట లాటింది’ అని ఆలోచించి...


        ఆళ్వార్ తన రాజ్యభారాన్ని, బాధ్యతలను తన కుమారుడి చేతిలో ఉంచి, పట్టాభిషేకం చేసి ఇలా నిర్ణయించుకొన్నాడు ‘ఆనాద శెల్వతత్తు అరంబైయర్గళ్ తార్చుజ వానాళుం శెళ్వముం మన్నాన్నరశుం యాన్ వేన్నాదెన్’  అంటే సేవకులచే పరివేష్టించబడి ఉండే వినోదాలను మరియు  సంపదను ఇక కోరను అని.


        ఆళ్వార్  తన సన్నిహితులైన శ్రీవైష్ణవులతో  రాజ్యాన్ని వదిలి శ్రీరంగమును చేరి,  బంగారపు పళ్ళెములో వజ్రమువలె ఉన్న(ఆదిశేషునిపై పవళించి ఉన్న) శ్రీరంగనాధున్ని మంగళాశాసనము చేసాడు.  తన భావ సంతృప్తి ఫలముకై ప్రతి క్షణమును ఎంపెరుమాన్ కీర్తిస్తు, ‘పెరుమాళ్ తిరుమొజి’ రచించి అందరి ఉన్నతికై ఆశీర్వదించాడు.


తర్వాత కాలంలో స్వామి పుష్కరిణితో కూడిన తిరువేంగడంపై (తిరుమల) అధిక వ్యామోహం పెంచుకున్నాడు. స్వామి పుష్కరిణి గంగాయమునాది నదులకన్నా విశేషమైనదని కీర్తించబడింది. 


        ఆండాళ్ కూడ  ‘వేంకటత్తైప్ పతియాగ వాళ్వీర్గాళ్’  అంది. అంటే సదా మనసా వాచా తిరువేంకటముపై నివాసము చేయాలి అని. అక్కడ గొప్పఋషులు  మరియు మహాత్ములు నిత్యవాసము చేస్తారు కారణం వారు కూడా అదేవిధమైన కోరికని కలిగిఉన్నారు కనుక.  


        పెరుమాళ్  రచించిన తిరుమొజి 4 వ పదిగంలో  తిరుమల దివ్యదేశములో పక్షిలా, చెట్టులా, రాయిలా, నదిలా ఉండాలనే ఆళ్వార్ కోరిక మనకు కనపడుతుంది. ఇది కాకుండా  దివ్యదేశములలోని అర్చావతార భగవానుడిని  వారి భక్తులను సేవించాలనే కోరికను కలిగి ఉండేవాడు.


        అతడొకరోజు వేంకటేశ్వరస్వామితో  “స్వామీ నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమివ్వండి” అని అడిగాడు. దానికి స్వామి “తదాస్థు !” అన్నాడు. 


        అందుకే తిరుమలలో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు.


        ముకు౦ద మాలలో శ్రీకృష్ణుడు దేవదేవుడుగా గీతాచార్యుడిగా కూడా కనిపిస్తాడు. పెరుమాళ్ తిరుమెళి అనే ప్రబ౦ధ౦లో తానే దశరధుడిగా శ్రీరాముని మీద ప్రేమని, శ్రీరాముని యొక్క సౌ౦దర్యాన్ని, గుణస౦పదని పొగడట౦ కనిపిస్తు౦ది.

   

        ‘శ్రీరామ, శ్రీకృష్ణ అనే ఏ నామన్ని ఉచ్చరి౦చినా అది మ౦త్రమే ! అజ్ఞానమనే వ్యాధిని పోగొడుతు౦ది. మహర్షులకు భగవద్దర్శన౦ కలిగి౦చి౦ది రాక్షసులకి బాధ కలిగి౦చి౦ది కూడా ఆ నామమే. 


        మూడు లోకాలకి జీవమిచ్చేది ,  భక్తులకు మ౦చిని కలుగ చేసేది, పాప భయము పోగొట్టేది, మోక్షాన్నిచ్చేది వైష్ణవ శక్తి.  భగావన్నామ౦ దివ్యౌషధ౦ వ౦టిది. దీన్ని సేవి౦చి తరి౦చ౦డి’ అని బోధి౦చాడు. 


        బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసము అనేటటువ౦టి చతురాశ్రమాలను నియమబద్ధ౦గా లోక కళ్యాణార్థ౦ గడిపిన పుణ్య పూర్ణజీవి కులశేఖరాళ్వారు.


        కొంతకాలము ఈ సంసారములోజీవించి చివరకు దివ్యమైన పరమపదమునకు వేంచేసి పెరుమాళ్ కి నిత్య కైంకర్యమును చేసారు.


🙏🏻🙏🏻🌸🌸🌸🙏🏻🙏🏻

నాస్తికునికి, #ఆస్తికునికి మద్య

 #నాస్తికునికి, #ఆస్తికునికి మద్య సంభాషణ:*


నేను జాతకాలు నమ్మను.

--- అవును అది మీ జాతకంలోనే ఉంది.


నేను దేవుడిని నమ్మను.

---- తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.


నాకు దేవుడిని చూపించగలరా?

---- ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా.


ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేం?

----- మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.


మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?

---- అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా?


దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?

----- ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమేగా


దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?

---- నీకు నిగ్రహం తక్కువ కదా. దాన్ని నిలపటానికి.


దేవుడిని తలచుకోకపోతే జరగదా?

--- ఏమో! నువే చెప్పాలి. క్షణం వదలకుండా తలచుకుంటున్నావుగా....


ఇంకేముంది గోగినేని తలవంచుకుంటు వెనుదిరిగారు.....

neurological test:

 *Only for senior citizens*


Here is a little neurological test:

Only use your eyes!

1- Find the C in the table below!

OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOCOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO


2- If you have already found the C,


Then find the 6 in the table below.


999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999969999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999


3- Now find the N in the table below.

Attention, it's a little more difficult!


MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMNMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM


If you pass these three tests without problem:


- you can cancel your annual visit to the neurologist.


- your brain is in perfect shape!


- you are far from having any relationship with Alzheimer's.


So, share this with your over-60 friends, it can reassure them.



🙏🌹🙏🌹🤝🤝🌹🙏🌹🙏

24, ఫిబ్రవరి 2021, బుధవారం

మాఘ పురాణం*_🚩 🚩 _*14 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*14 వ అధ్యాయము*_🚩


       *గురువారం*

*ఫిబ్రవరి 25, 2021*


🕉🌞🕉🌞🕉🌞🕉🌞


_*విప్రుని పుత్రప్రాప్తి*_


🕉️☘️☘️☘️☘️☘️☘️🕉️


గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను.

మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే, మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని యడుగగ, జహ్నమహర్షి యిట్లనెను. "జహ్నమునీ! వినుము. మాఘమాస వ్రతము నాచరించుటచే, ప్రాణికి యిహలోక సుఖములు, పరలోక సుఖములు, కలుగును. వారి కష్టములు తీరును, అందుచే సంతుష్టుడైన మానవుడింకను, హరి ప్రీతికరములగు వ్రతముల నాచరించి, జ్ఞానియై, సత్కర్మల నాచరించి, ముక్తినందును. అట్టి కథనొక దానిని చెప్పెదను వినుము" అని యిట్లు పలికెను.


పూర్వము గంగా తీరమున, బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదవేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతిదయజ్ఞానము, యింద్రియ జయము కలిగినవాడు. అతని భార్యయునుత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప, మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడొకనాడు, భార్యతో, "గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు, మనకును, సద్గతులు కలుగునాయని విచారపడెను". అప్పుడామె, "నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదనుకొందును"అని సమాధానము ఇచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడు," ప్రియా కష్టతరమైన తపము నాచరించి అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదను. పుత్ర వరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి, నిశ్చలమైన తపముచేసి, మృకండు మహామునివలె, ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరిl.


బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు, శ్రీహరిని, మనసులో నిలుపుకొని, తీవ్రమైన తపము ఆచరించెను. కొంత కాలమునకు, శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును, శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యులకాంతితో

 నుండెను. శాంత భూషితమై ప్రసన్నతకల శ్రీహరి ముఖము, మకరమండలముల కాంతితో, మరింత శోభాయమానముగ నుండెను. నారదమహర్షి స్తుతించుచుండగా, అప్సరకాంతలు పాటలు పాడుచుండగా, లక్ష్మీసమేతుడై, గరుత్మంతుని పైనెక్కి, ఆ బ్రాహ్మణునకు, వరమీయవచ్చెను.


తనను గమనింపక, తీవ్రమైన తపమున నిమగ్నుడై యున్న బ్రాహ్మణుని చూసి, చిరునవ్వు నవ్వుచు, "విప్రా! నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునుమెచ్చితిని" అని పలికెను. శ్రీహరి యిట్లు పలికినను, ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై, బాహ్యజ్ఞానము లేని స్థితిలోనుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి, నిశ్చల చిత్తముతో నతడు చేయుతపము, భగవంతుడగు శ్రీహరికి, మరింత ప్రీతి కలిగించెను. అతనికెట్టి వరమునైన, యీయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు, బాహ్యప్రపంచమునకు, మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా, నా బ్రాహ్మణుడు, కారణమేమని, కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే యెదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనందపరవశుడైన అతడు, శ్రీమన్నారాయణ మూర్తినిట్లు స్తుతించెను.


_*విప్రకృత విష్ణుస్తుతి*_


నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |

నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||

గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |

కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||

లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |

అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||

యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |

జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||

సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |

కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||

నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |

విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||

సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |

హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||

పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |

ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||

జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |

వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||

జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |

ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||

నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |

గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||

కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |

కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||

సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |

భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||

నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |

నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||

(శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు, భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము, అందరు చదువుట శ్రేయస్కరము)


జహ్నుమునీ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి, ఆనంద పరవశుడై, నమస్కరించుచు నిలిచియుండెను, భగవంతుడు వరమును కోరుకొమ్మనెను శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు ''స్వామీ! నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము, ఇహలోకమున, పరలోకమున, సద్గతికి కారణమైన, పుత్రసంతానమునిచ్చి, నాకు ముక్తినొసగుమ"ని కోరెను. శ్రీహరి, నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు చెప్పిన 

యీ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి, నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదునని పలికి, యంతర్థానము నుందెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కి లాభము నందినవానివలె సంతసింసించు, తన యింటికి చేరెను. కొంతకాలమునకు, వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.


కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి, వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య, బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని, వానిని,  నిమురుచు, కన్నీరు కార్చుచు, నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనముతో, ఆహారమును తీసికొనక, విచారించుచుండెను. "నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి, వరముగా, నీ పుత్రుని పొందితివి. చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు, పండ్రెండు సంవత్సరములు జీవించి, విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్రశోకము నెట్లు సహింపగలను?" అని భర్తతో పలికెనుl.


ఆ విప్రుడును, భార్య మాటలను విని, బాధపడుచు, నామెనోదార్చ నిశ్చయించెను. ఆమె నూరడించుచు, యిట్లనెను. "ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది. అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయెట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా? నీకు, నాకును, యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు, మనము మరిణించిన తరువాతనైన, మరణింపక తప్పదు కదా! మరి యీ ముందు వెనుకలు, వయస్సులకు కలదు కాని, మృత్యువునకు లేదు. కావున నీవును శోకింపకుము. జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో, నీకు విచారమేల? నీవు దుఃఖించినను, కానున్నది కాక మానదు. అనగా, నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతిప్రాణియు, తాను చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపకుము" అని, యామెనూరడించెను, "మరియు నిరర్థకమైన దుఃఖమును విడుపుము. శ్రీహరిని పూజించి, పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ నుండుము" అని పలికి, మరల గంగాతీరమున చేరి, నియమనిష్టలతో శ్రీహరిని, సర్వోపచారములతో, పూజించుచుండెను. శ్రీహరి, అష్టాక్షరీ మంత్రమును, జపించెను. శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది, ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు, శ్రీమన్నారాయణునకు, సాష్టాంగ నమస్కారము చేసి, నిలిచియుండెను.


*పదునాల్గవ అధ్యాయము*  

             *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మాఘ పురాణం*_🚩 🚩 _*13 వ అధ్యాయము*_🚩

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*13 వ అధ్యాయము*_🚩


      *బుధవారం*

*ఫిబ్రవరి 24, 2021*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 *సుశీలుని కథ*


🕉️☘☘☘☘☘☘🕉️


రాజా ! మాఘమాసస్నానము వలన వైకుంఠప్రాప్తిని యెట్టి వానికైనను కలిగించును. దీనిని తెలుపు మరి యొక కథను వినుము. పూర్వము గోదావరీ తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేదపండితుడు కలదు. అతనొకనాడు ప్రయాణము చేయుచు త్రోవ దప్పి భయంకరారణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోను , ఉన్నతములగు వృక్షములతోను , పులి మొదలగు భయంకర జంతువులతోను కూడియుండెను. అతడా అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదుకుచు అటు నిటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్రచెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగియుండెను. అచటి కొమ్మలు ముళ్లు గాలికి కదలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదలునట్టి అవకాశములేదు. ఆహారపానీయాదులను తీసికొను అవకాశములేదు. ఇట్టి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదువనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను.


కొంత సేపటికి సుశీలుడు స్తిమితపడెను. ఓయీ ! నీవెవరవు ? నీకీ పరిస్థితియేమి ? చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు మహాత్మా ! నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నియు పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగనుంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడెడి వాడను , ఎవనికిని యేపనియు చేసెడి వాడనుకాను. అసత్యములు పలికెడివాడను పరులసొమ్ము నపహరించుచుండువాడను. ఎంతయో ధనమును కూడబెట్టితిని. ఎవరికిని యేమియు నీయలేదు. స్నాన , దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవపూజయన నేమోయెరుగను. ఇట్లందరిని బాదించుచు చివరకు మరణించితిని. నరకములో చిరకాలముంటిని తరువాత కుక్క , గాడిద మున్నగు నీచ జంతువుల జన్మలందితిని. ప్రస్తుతము నా పాదములు చండ్రచెట్టుగా దాని ముళ్ల కొమ్మలు భాధింపగా ఎచటికి కదలలేని యీ జన్మలోనుంటిని. నీవంటి పుణ్యాత్ముని చూచుట వలన , నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు యీ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలయును అని సుశీలుని బహువిధములుగ ప్రార్థించెను.


సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచెను. ఓయీ ! యిచట సమీపమున నీరున్నదాయని అడిగెను. పన్నెండు యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదాయని సుశీలుడడిగెను. అప్పుడా రాక్షసుడు అయ్యా ! నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటివారే , వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగ నున్నాడని చెప్పెను. సుశీలుడు ఓయీ ధైర్యముగ నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని భాష్కలుడను వానిని వెదకుచుపోయెను.


సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమున నున్న నా పూర్వీకునకు రాక్షసరూపము పోవలెనున్న యేమి చేయవలయునో చెప్పునని అడిగెను. అప్పుడు ఓయీ ! నీవు మాఘమాసమున నదీస్నాన చేయుము. శివునిగాని , కేశవునికాని నీ యిష్టదైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీని వలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక , పూర్వులైన నీ పితృదేవతలును పాపక్షయము నొంది పుణ్యలోకముల నందుదురు. 


స్నానము యేడు విధములు. అవి ,


*మంత్రములను చదువుచు చేయు స్నానము , మంత్రస్నానము.*


*మట్టిని రాచుకొని చేయు స్నానము , మృత్తికాస్నానము.*


*భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము , ఆగ్నేయస్నానము.*


*గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము , వాయవ్యస్నానము.*


*నదులు , చెరువులు మున్నగువానిలో చేయు స్నానము , వరుణ స్నానము.*


*ఎండగనున్నప్పుడు వానలో చేయు స్నానము , దివ్యస్నానము.*


*మనస్సులో శ్రీహరిని స్మరించుచు చేయు స్నానము , మానసస్నానము.*


*ప్రాతః కాలమున స్నానము చేయలేని అశక్తులు , వృద్ధులు , రోగిష్ఠివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయ వచ్చును , జుట్టుముడి వేసికొని స్నానము చేయవలెను.*


*స్నానము చేయునప్పుడు కౌపీనము(గోచి)ఉండవలయును. తుమ్ము , ఉమ్ము , ఆవలింత , మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరీయినచో ఆచమనము చేయవలయును. భగవంతుని స్మరించుచు కుడిచెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానముత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడిన జలమున స్నానము చేయుట పవిత్రస్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని , పసుపు , కుంకుమ , ఫలములు , పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా యిష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో నుంచవలయును. బొడ్డులోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట , జపతర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి , ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున నుంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలెను , ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను , నదీ స్నానము చేసిన పిమ్మట తడివస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును , పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము నిచ్చును.*


స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు యిష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయును. సూర్యుని , గంగను , దేవతలను తలచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా , యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్థమి , ఏకాదశి , శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడ తలచుకొని నమస్కరింపవలయును. అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను , దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘస్నానమును , పూజాదులను నిర్వహించెను. స్నానాంతమున రాక్షసరూపము నన్ను పూర్వుని ఉద్ధేశించి తర్పణము కూడ చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను.


*పదమూడవ అధ్యాయము*  

            *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మహమ్మారి మళ్లీ వస్తోంది!*

 *మహమ్మారి మళ్లీ వస్తోంది!*


*కొవిడ్‌పై రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిన కేంద్రం*


*ఆస్పత్రులు, పరికరాలు సిద్ధంచేస్తున్న ఆరోగ్య శాఖ*


*ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని కలెక్టర్లకు ఆదేశాలు*


*కొవిడ్‌-19 నిపుణుల కమిటీ అత్యవసర సమావేశం*


*ఎపిడిమాలజీ కమిటీతోనూ ఆరోగ్య శాఖ చర్చలు*


*సెకండ్‌ వేవ్‌ వచ్చే చాన్స్‌ ఉందని సభ్యుల సూచన*


*మార్చి మొదటి వారం నుంచే కేసులు పెరిగే అవకాశం*


*మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని సూచన*


మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ మొదలైంది. ముంబైలో అయితే మాస్కులు లేకుండా తిరిగేవాళ్లకు జరిమానాలు కూడా విధిస్తున్నారు. కేరళ, కర్ణాటకలో కొత్త కేసులు భయపెడుతున్నాయి. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అంటే దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైందా..? సెకండ్‌ వేవ్‌తోపాటు కొత్త స్ట్రెయిన్‌ కూడా కలిసొస్తే.. పరిస్థితి ఏమిటి? మళ్లీ లాక్‌డౌన్‌.. కఠిన ఆంక్షలు.. అమ్మో తలచుకుంటేనే భయంగా ఉంది కదూ! అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాదిలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతుండడంతో.. దక్షిణాది రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. కాబట్టి రాష్ట్రంలో మళ్లీ కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యాయి. కరోనా పర్యవేక్షణ కోసం నియమించిన కొవిడ్‌-19 నిపుణుల కమిటీ శుక్రవారం అత్యవసరంగా భేటీ అయింది. ఆరోగ్యశాఖ అధికారులు ఎపిడిమాలజీ నిపుణులతో కూడా చర్చించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో కరోనా పరిస్థితి, ఏపీలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులపై చర్చించారు. 


కరోనాపై అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఆస్పత్రులను, రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. కలెక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించొద్దన్న సంకేతాలిస్తున్నారు. వాస్తవానికి నిపుణుల కమిటీ సభ్యులు గతంలోనే జనవరి 15 నుంచి మార్చి 15 వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిసెంబరు తర్వాత  కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే సెకండ్‌ వేవ్‌ను తట్టుకోవడం కష్టమని హెచ్చరించారు. కానీ ప్రభుత్వం ఆ సూచలను పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు చేయడంలేదు. దీంతో సెకండ్‌ వేవ్‌ ప్రమాదం తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రస్తుతం రోజుకు వంద లోపు కేసులు నమోదవుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వీటి సంఖ్య వేలల్లో ఉంటుంది. కొన్ని ల్యాబ్‌లు, ఆస్పత్రులు పాజిటివ్‌ వచ్చినా సమాచారం ఇవ్వడం లేదు. ప్రముఖ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరిగిపోతున్నాయి. ఇవేవీ ఆరోగ్యశాఖ లెక్కల్లోకి రావడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా బులెటిన్‌లో తక్కువ కేసులు చూపిస్తూ.. ఏపీలో కరోనా తీవ్రత లేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


*మూడు నెలల వ్యత్యాసంతో మళ్లీ..*


తొలి విడతలో ఉత్తర భారతంలో మొదలైన కరోనా వైరస్‌ దక్షిణ భారతానికి వ్యాపించడానికి 3-4 నెలల సమయం పట్టింది. సెకండ్‌ వేవ్‌ కూడా ఇదే తరహాలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి రావాలంటే మూడు నెలల సమయం పడుతుందని నిపుణుల కమిటీ గతంలోనే అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాలు దాదాపు నిజం కాబోతున్నాయి. ఏపీలో నవంబరు చివరి వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయి. నిపుణుల కమిటీ అంచనా వేసినట్టే.. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఆ ప్రకారం చూస్తే మార్చి నెలలో ఏపీలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. 


 *కొత్త స్ట్రెయిన్‌ వస్తే మరిన్నికష్టాలు* 


ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైర్‌సను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే.. సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్‌ పనిచేస్తుందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిపుణుల కమిటీ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఒకవేళ సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ కూడా బయటపడితే మాత్రం ప్రభుత్వానికి భారం తప్పదు. వైరస్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌ తలకు మించిన భారంగా మారుతుంది. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ ద్వారా కరోనాను గుర్తిస్తున్నారు. కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించాలంటే ఈ టెస్టు సరిపోదు. దానికోసం శాంపిల్స్‌ను హైదరాబాద్‌, పుణెకు పంపించాల్సిందే. లేదంటే కొత్త స్ట్రెయిన్‌ గుర్తించే కిట్లు కొనుగోలు చేయాలి. ఇప్పటికే కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణ, మందుల కొనుగోళ్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసిన ప్రభుత్వానికి ఇది తలకుమించిన భారమే. కొవిడ్‌కు సంబంధించిన బిల్లులే ఇంతవరకు చెల్లించకుండా రూ.400 కోట్లు బకాయిలు పెట్టుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో సెకండ్‌ వేవ్‌ వస్తే మాత్రం మళ్లీ ఆర్థిక కష్టాలు తప్పవని ఆరోగ్యశాఖ అధికారులే చెబుతున్నారు.

🤷🏻‍♂️