8, ఫిబ్రవరి 2023, బుధవారం

వేదాంతసారము

 *ఇది శంకరులు రచించిన "ఏకశ్లోకీ" వేదాంతసారము!*


కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం

స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యోతిరాఖ్యాహి మేl

చక్షుః తస్య నిమీలినాదిసమయే కిం ధియో దర్శనే

కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభోll


నీవు సమస్తజగత్తుని దేని సాయమున చూస్తున్నావు?

పగలు సూర్యుని, రాత్రి చంద్రనక్షత్రదీపకాంతులచే! ఆ సూర్యుడినీ, దీపాదులను దేనితో తెలుసుకుంటున్నావు?

నేత్రములచే!

నేత్రములు మూసుకున్నప్పుడో?

బుద్దిచేత!

ఆ బుద్ధి దేనిచే విశ్లేషించుదువు?

నాచేత!

నాచేత అనగా,

ఆత్మచేత, కావుననే ఆ అత్మయే సర్వ ప్రకాశముగదా! అదియే నీవు అని తెలుసుకొనుము. అట్లు తెలుసుకొనుటయే మోక్షము.

*సేకరణ*

పచ్చని పాల సముద్రం

 పచ్చని పాల సముద్రం


పరమాచార్య స్వామివారిని ప్రముఖ గీత రచయిత కన్నదాసన్ కలిశాడు. ఎప్పటిలాగే వారు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకున్నారు. ఇతఃపూర్వం కన్నదాసన్ నాస్తికుడుగా ఉండి మన మతం గురించి హేళనగా రాసేవాడు. మహాస్వామివారి ప్రభావం వల్ల మెల్లిగా మారిపోయాడు. స్వామివారే అతణ్ణి పనికిమాలిన హేతువాదం నుండి బయటకు తెచ్చారు. కాని విమర్శించడం అనే సామాన్య గుణం మాత్రం అతణ్ణి వదలలేదు.


“పాలు తెల్లగా ఉంటాయి కదా? మరి పాలకడలి ఎందుకు మేఘవర్ణంగా చూపబడుతుంది? మహావిష్ణువు రంగు పాలసముద్రంలో కలిసిపోయిందా?” అని అడిగాడు స్వామివారిని.


స్వామివారు ఒక చిరునవ్వు నవ్వి, “ఆనందంగా ఉండు. మధ్యాహ్నానికి నీకు సమాధానం దొరుకుతుంది” అని చెప్పారు.


కన్నదాసన్ కలవరపడ్డాడు. ఇక ఏమీ మాట్లాడడానికి సాహసం చెయ్యలేదు. ఆ మాధ్యాహ్నం శ్రీమఠానికి వుమ్మిడి బంగారు చెట్టి వచ్చాడు. కన్నదాసన్, వుమ్మిడి ఇద్దరూ చెట్టియార్ కులానికి చెందినవారు. వాళ్ళ పద్దతిలో వారు నమస్కరించుకున్నారు. తరువాత వుమ్మిడి బంగారు చెట్టి పెద్ద పచ్చని మరకతాన్ని స్వామివారు స్వీకరించాలని పాదాల వద్ద సమర్పించాడు. మహాస్వామి వారికి రత్నాలకు రాళ్ళకు భేదం లేదు.


వెంటనే స్వామివారు మఠం పరిచారకులని పిలిచి ఒక పాత్రలో పాలను తెమ్మని చెప్పారు. పాలు తెచ్చిన తరువాత ఆ మరకతాన్ని పాలపాత్రలో ఉంచమని వుమ్మిడికి చెప్పారు. ఇది వుమ్మిడికి పిడుగులాంటి మాట. సాధారంగా మరకతాన్ని పరీక్షించడానికి ఇలా చెయ్యడం తనకు వ్యాపారంలో అనుభవం.


కంచి శ్రీచరణులు నా ఆలోచనల్ని, ఈ రత్నాన్ని శంకిస్తున్నారా? అని అనుకుని మౌనంగా ఆ పనిచేశాడు. వెంటనే ఆచరులు కన్నదాసన్ ను పిలిచారు చూడమని. అది చూసి కన్నదాసన్ ఆశ్చర్యపోయాడు. పలు మొత్తం లేత పచ్చ రంగులోనికి మారిపోయి, పాలలో మునిగిన మరకతం నుండి ఒక చిన్న కాంతిరేఖ కనపడుతోంది.


కన్నదాసన్ కు నోట మాట రావడంలేదు. ఇది ఎలా జరిగింది? ఆచార్యులవారు అలా జరగడానికి గల కారణాన్ని శాస్త్రీయంగా వివరించి, ఇలాగే పాలసముద్రం విషయంలో కూడా, “పరమాత్మ పాల సముద్రంలో పడుకున్నప్పుడు, ఆయన నుండి కూడా ఇటువంటి తేజస్సు వస్తుంది. అందుకే అది మేఘవర్ణంగా ఉంటుంది” అని తెలిపారు.


వెంటనే కన్నదాసన్ కళ్ళు వర్షించగా, అప్పటికప్పుడే “తిరుప్పార్కడలిల్ పళ్ళికొండాయే శ్రీమన్నారాయణా . . .” (ఈ పాటను 1975లో వచ్చిన స్వామి అయ్యప్పన్ అన్న తమిళ సినిమాలో కే. జే. ఏసుదాస్ గారు అద్భుతంగా పాడారు) అన్న అద్భుత గీతాన్ని వ్రాశారు. 


వుమ్మిడియార్ కి, ఆచార్య స్వామివారు ఆశీస్సులు అందించి, ఆ మరకతాన్ని వరదరాజస్వామి దేవాలయానికి తీసుకునివెళ్ళి, దానితో స్వామివారికి మకుటాన్ని చేయించమని ఆదేశించారు. 


కన్నదాసన్ తో పాటు అతను కూడా కళ్ళనీరు పెట్టుకున్నారు. స్వామివారు మరకతాన్ని పాలలో ముంచమని చెప్పినప్పుడు అవమానపడ్డాను అనుకున్నాడు. కాని అది రత్నాన్ని పరీక్షించడానికి చెయ్యమన్నది కాదని తెలిసి పశ్చాతాప్పడ్డాడు.


ఇలాంటి ఎన్నో సంఘటనలతో జనుల అజ్ఞానాన్ని, అహంకారాన్ని పోగొట్టే జ్ఞాన గురువులు మన స్వామివారు.


జయ జయ శంకర, హర హర శంకర  


కే. జే. ఏసుదాస్ గారి అద్భుత గళంలో ఆ పాటను ఇక్కడ వినవచ్చు.

www.youtube.com/watch?v=npqGilN-7Os


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

స్వయంగా ఈశ్వరుడే

 స్వామి వారు కోరితే స్వయంగా ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు.....

ఒకసారి పరమాచార్య వారి దర్శనానికి టి. ఎన్. రమణి అనే వారు వచ్చారు. వారు సమీపంలోకి రాగానే స్వామి "వేద పాఠశాల విద్యార్థులకు పండ్లు కోనివ్వగలవా "అని అడిగారు.

రమణి సంతోషం తో "తప్పకుండ."అన్నాడు.

ఇంతలో గది వెలుపల మరాఠి లో  మాట్లాడుతున్నట్లు వినిపించింది. స్వామి వారు శిష్యునితో

"వారిని లోనికి తీసుకునిరా " అన్నారు.

వచ్చిన వ్యక్తి స్వామి కి ప్రణమిల్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు.

ఆయన కాశ్మీ ర్ రాజు ఆస్థానం లో చాలా కాలం పనిచేసి, పదవి విరమణ తరువాత ప్రస్తుతం సతారా లో నివసిస్తున్నానని తెలియ చేసుకొన్నాడు.

"స్వామీ! మా రాజు గారు తమ భక్తులు. దర్శనానికి వెళ్తున్నానని తెలిసి 10చెక్క పెట్టెలలో నాణ్యమైన ఆపిల్ పండ్లు పంపారు. తమకు సమర్పించమని ఆదేశించారు."అని ఆ పెట్టెలను స్వామి స్వామి ముందు ఉంచారు.

స్వామి నవ్వుతూ రమణి వైపు చూస్తూ

"ఈశ్వరుడు నీకు ఖర్చు తప్పించాడు. రెండు, మూడు బుట్టల పండ్లు వేద పాఠశాల విద్యార్థులకు వెళ్లి పంచు. ఒక బుట్ట పండ్లు నువ్వు తీసికో."అన్నారు.

స్వామి వారి చేతి మీదుగా ప్రసాదం గా ఒక్క పండు అయినా పొందాలని వందల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. వారు బుట్ట పండ్లను అనుగ్రహించటమే వారి అనంత కారుణ్యానికి నిదర్శనం.

***ఇలాంటి సంఘటనలు శ్రీ రమణుల చరిత్రలో కూడ మనకు కనిపిస్తాయి. ఉడతల కు పెట్టడానికి జీడిపప్పు పంపటానికి వంటవారు నస పెడితే భగవాన్ "జీడిపప్పు లేవంటున్నారు. మీకేమో(ఉడతలకు )వేరుశెనగ పప్పు పోసగదు."అన్నారు. ఎక్కడో నిద్రిస్తున్న రమణ భక్తునికి కలలో ఇవే మాటలు వినిపించి దర్శనానికి వస్తూ జీడిపప్పు తెచ్చి ఇచ్చారు. (చూ. రమణాశ్రమ లేఖలు)

**శ్రీ లలితా దేవి జయంతి*

 **శ్రీ లలితా దేవి జయంతి*


*లలిత దేవి జయంతి యొక్క ప్రాముఖ్యత*


ప్రతి సంవత్సరం , మాఘ మాసం పూర్ణిమలో లలిత జయంతి ఉపవాసం పాటిస్తారు.  లలితాదేవికి భక్తి ఆరాధన చేసేవాడు , శాంతి , శ్రేయస్సు మరియు మోక్షం వైపు అడుగులు వేస్తాడు. వీటితో పాటు , ఈ ఉపవాసం అన్ని రకాల సిద్ధిలను సాధించడంలో సహాయపడుతుంది. ఈ రోజున కొన్ని ప్రదేశాలలో చాలా గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు. దేవాలయాలలో , భక్తులు శ్రీ లలితదేవి ఆశీర్వాదం పొందడానికి క్యూలలో వేచి ఉంటారు. లలితాదేవితో పాటు , స్కందమాత మరియు శంకరుల లను గౌరవించే సంప్రదాయం కూడా ఈ రోజునే అనుసరించబడింది.  లలితా మాతను రాజేశ్వరి , షోడాషి , త్రిపుర సుందరి పేర్లతో పిలుస్తారు. లలితాదేవి పార్వతి అవతారం కాబట్టి , ఆమెను తాంత్రిక పార్వతి అని కూడా పిలుస్తారు.    


ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత , పంచదశాక్షరీ మంత్రాధిదేవత. భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమినాడు శ్రీ లలితా దేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి.


‘మఘము’ అంటే యజ్ఞం. యజ్ఞ , యాగాలూ , పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘ మాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు. అలాంటి మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే *‘మహా మాఘి’* అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర , నదీ స్నానాలు , పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. *లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత.* లలితా దేవి ఆవిర్భావ గాథ దేవీ పురాణంలో ప్రస్తావితమై ఉంది. భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతని తపో నిష్టకు మెచ్చి , ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా తనతో యుద్ధం చేస్తే... ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలనీ , శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హానీ కలగకూడదనీ భండాసురుడు వరం కోరుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. వర గర్వంతో విజృంభించిన భండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలనూ పీడించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే బాధలను భరించలేక... నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు. మహా యాగం చేశారు. ఆ హోమ గుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి , శ్రీచక్రాన్ని అధిష్ఠించి , భండాసురుణ్ణి సంహరించింది.


ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపజేయడానికి దేవతలు , మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే *‘శ్రీ లలితా సహస్రనామం’గా* ప్రాచుర్యం పొందాయి. కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది. సకల సృష్టినీ నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి. 


సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా *‘లలితా సహస్రనామా’* న్ని పఠిస్తారు. అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ , పాశాన్నీ , అంకుశాన్నీ , పుష్పబాణాలనూ , ధనస్సునూ నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది. శ్రీ లలితా దేవిని భయాన్ని పోగొట్టి , శాంతిని ప్రసాదించే తల్లిగా  కొలుస్తారు. దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి , లలితాసహస్రనామ పారాయణ చేస్తే... కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందనీ , కళల్లో ప్రావీణ్యాన్నీ , కుటుంబ సౌఖ్యాన్నీ , ప్రశాంతతనూ ,  సంపదనూ ప్రసాదిస్తుందనీ భక్తుల నమ్మిక. ప్రత్యేకించి , శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున... పవిత్ర స్నానాలు చేసి , లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందనీ , అలాగే *‘ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం...’* అంటూ ప్రారంభమయ్యే *‘శ్రీలలితా పంచ రత్న స్తోత్ర’* పారాయణ కూడా విశేష ఫలప్రదమనీ పెద్దల మాట.


సర్వశక్తులకూ మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు. అందుకే... అమ్మవారిని ఏ రూపంలో పూజించినా *‘లలితా సహస్రనామా’* న్ని పఠిస్తారు.


మాఘ మాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి. దీన్నే *‘మహా మాఘి’* అని కూడా అంటారు. ఈ రోజున చేసే సముద్ర , నదీ స్నానాలు , పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం. లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత.

సన్యాసాశ్రమం

 శాస్త్రం విధించిన సన్యాసాశ్రమం


మన దేశంలో నానావిధాలవారు సన్యాసులెందరో వున్నారు. వీరెవ్వరూ ఫలప్రదం, లాభకరం అయినపని ఏదీ చేయరు. గృహస్తులు పెట్టే భిక్షవల్లజీవిస్తూ వుంటారు. ఈ భిక్షసన్యాసులందరు పరోపజీవనులనీ, వీరివల్ల దేశానికేమీ లాభించదనీ మనపరిపాలకులలోనే కొందరు అభిప్రాయపడుతూ వుంటారు. ఈ సన్యాసి జనసమూహాన్ని కూడగట్టి ప్రజోపయోగకరమైనపని చేయిస్తే మంచిదను తలంపుతో “అఖిల భారత సాధు సంఘమ”నే సమాజాన్ని ఇటీవల నెలకొల్పారు. వీరిలో కొందరిని సంచార ప్రచారకులుగా నియమించి వారికి కొంత ప్రతిఫలం ముట్టచెప్పుతూ ప్రజాహితం సాధించాలని ఆలోచించారు. 


అవును, దేశంలో ఈ సన్యాసిమూక ఎక్కువగా నున్నమాటనిజమే. వీరు పరోపజీవనం చేస్తున్నమాట నిజమే. అలావుండటం మంచిది కానిమాట సత్యమే. కాని సన్యాసులు పరోపజీవనం చేయకూడదనే అభిప్రాయాన్నీ, సన్యాసులు భిక్షాటనవల్లనే జీవించాలనే శాస్త్రవిధిని- ఈరెంటినీ సమన్వయించడం ఎలాగూ అనేదే ప్రశ్న. 


నాలుగాశ్రమాలవారిలో సన్యాసులకు, బ్రహ్మచారులకూ మాత్రమే భిక్షాజీవనం అర్హమనీ, విహితమనీ శాస్త్రం చెప్పుతున్నది. బ్రహ్మచారులు గురుకులవాసం చేసేటప్పుడు చాలా కొలది గృహములందు 'భవతిభిక్షాందేహి' అని ఇల్లాండ్రనడిగి, తమకోసం గురువుకోసం అన్నమును తెచ్చుకోవాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నవి. విద్యార్థి తన చదువుకోసం వినియోగించుకోడానికి ఎంతో కాలమూ, శక్తి దీనివల్ల కలిసివస్తవనేది ఒకటి; రెండోది విద్యార్జనకవసరమైన వినయమూ, చిత్తశుద్ధీ దీనివల్ల అలవడుతవనేది. గురుకుల వాసమందు ఈ భిక్షాటనం రాచబిడ్డలకూ విధింపబడింది. బ్రహ్మచారులిలా తెచ్చిన భిక్షాన్నమును గురువుకర్పిస్తే దానిని గురువు అందరికీ పంచిపెడతాడు. విద్యార్థులు గురువులకు జీతాలివ్వడమనేది ఆనాడులేదు. విద్య పూర్తి చెందిన పిమ్మట శిష్యుడు గురువునకు శక్తి కొలది దక్షిణ సమర్పిస్తాడు. దేశంలో ఉన్న రాజులవల్ల, సంపన్నులవల్ల శిష్యులు ఈ దక్షిణను సంపాదించి భక్తిపూర్వకంగా గురువులకు అర్పించేవారు. 


సన్యాసి గూడా ఇలా భిక్షాన్నంవల్ల జీవించవలసిందే. చిత్తవృత్తులను విషయజాలమునుండి మరలించి పరమాత్మ ధ్యానమందు నిరంతరంగా లగ్నం చేసివుంచడమే అతనికి విహిత కృత్యం, సన్యాసులు జీవనార్థం ఏదో వృత్తి నవలంబించి అందరివలె లాభకరమైన పనులుచేస్తూ ఉంటే, వారికి విహితమైన బ్రహ్మనిష్ఠకు భంగం కలిగితీరుతుంది. సన్యాసి సప్తభిక్ష చేసి జీవించాలని శాస్త్రం విధించింది. సప్తభిక్ష అంటే ఏడు ఇండ్లయందు మాత్రమే భిక్షనర్థించాలి. ఆ అర్థించడం గూడా ఇంటి ముందు నిలిచి అడగాలి. ఆ నిలవడం గూడా గోదోహనకాలమాత్రం నిలవాలి అంటే, ఆవును పాలుపిదుకుట కెంతకాలము పట్టునో అంతసేపే నిలవాలి. ఈ విధంగా లభించిన భిక్షాన్నముచే అతడు జీవించాలి భిక్ష దొరకనినాడు ఉపవసించాలి. సన్యాసి అల్పాహారముతో బ్రతకాలని, కష్టించి విద్యార్జనం చేయవలసిన బ్రహ్మచారి కడుపునిండా తినవలెనని కూడా దీనివల్ల ఏర్పడుతున్నదని మనం గ్రహించాలి. 


''యతిశ్చ బ్రహ్మచారీ చ పక్వాన్నస్వామినా వుభౌ||'' 


అనే శాస్త్రం యతులకు, బ్రహ్మచారులకు పక్వాన్న జీవనం విధిస్తున్నది. కనుక వారికి అన్నం పెట్టే బాధ్యతను గృహస్థులకు కూడా విధిస్తున్నదన్నమాట. ఇలాభిక్షాన్నముచే జీవించే ఈ ఉభయుల వల్లా సంఘానికి కలిగే హాని ఏమీ లేకపోగా, ఎంతో మేలు కలుగుతున్న విషయం మనం గమనించాలి భిక్షాటనంచేస్తూ చదువుకొన్న విద్యార్థి వినీతుడగుటేకాక, అట్లు సంపాదించిన విద్యావినయములచే సద్గృహస్థుడై సంఘానికి మిక్కిలి ఉపయోగిస్తాడు. ఇక సన్యాసుల మాట అడుగుతారా? సంసారభారం మోయలేక భిక్ష వల్ల అనాయాస జీవనం జరుగుతుందికదా అని కావులుగట్టిన వారందరు సన్యాసులు కారు. అట్టివారు భిక్షార్హులు కారు. ఐహికాముష్మిక ఫ భోగవిరాగియై ఆలుబిడ్డలను, ఇల్లూవాకిలిని, సౌఖ్యములను విడనాడి, యధావిధిగా ఆశ్రమస్వీకారం చేసినవారే నిక్కపు సన్యాసులు. అట్టిసన్యాసం అందరికి సుకరంగాదు. అట్టియతులే భిక్షార్హులు. బ్రహ్మనిష్ఠతో కాలంగడిపే అట్టి మహనీయులు ఉత్తమగతులకు మార్గం చూపెట్టుతూ వుంటారు. కనుక వారి వల్ల లోకాలకి మేలే కలుగుతుంది. అట్టి యతులు అరుదుగా ఉంటారు. వారిని భరించడం సంఘాని కొక కష్టంలోదికాదు. 


లోకంలో మనకు కన్పించే సన్యాసులందరు అట్టి మహనీయులు కారు. బౌధ్ధమతాన్ని అవలంబించినకొన్ని దేశాలలో ప్రజలందరు నియమనిగ్రహముల కోసం కొన్నాళ్ళు భిక్షుక వృత్తి స్వీకరించాలనే నియమం ఉన్నది. వ్రతపరిసమాప్తియైన పిమ్మట కొందరు గృహస్థాశ్రమం స్వీకరిస్తారు. తక్కినవారు భిక్షులుగానే ఉండిపోతారు. అట్టి యథార్ధభిక్షులనుచూచి, పనిపాటులొల్లని సోమరులు గూడా కొందరాదేశాలలో కావులుగట్టి భిక్షాటనం వల్ల ఆశ్రమజీవనం చేస్తూ ఉండడం కద్దు. 


ఆట్లే మన దక్షణ దేశంలో కొందరు పరదేశులమనీ, ఉత్తరదేశంలో సాధులమనీ బయలుదేరి భిక్షాటనముచే సుఖంగాజీవిస్తూ ఉంటారు. సన్యాసులకువిహితమైన వ్రతపాలనంకానీ, నియమనిష్ఠలుకాని, సంప్రదాయంకాని, ఆశ్రమస్వీకారంగాని వీరికక్కరలేదు. పొట్టకోసం దేవులాటేతప్ప వీరికి బ్రహ్మనిష్ఠతో పనిలేదు. పరోపజీవనం చేసే ఈ సోమరులను పరిహరించవలసిందే. మేము కాదనము. కానీ ఈ కలుపు మొక్కలను ఊడబెరికేయత్నంలో పైరు మొక్కలనుగూడా పీకివేయవలదనే మేము చెప్పేది. లోకసంగ్రహార్థం ఆశ్రమస్వీకారం చేసిన యధార్థ యతులను సోమరులని తెగనాడదగదు. దండ కమండులు ధారణంవల్ల, వైరాగ్యవర్తనంవల్ల గుర్తింపదగిన యదార్థసన్యాసులు ఒకానొక అచ్చమైన సంప్రదాయంలో వారై ఉంటారని కూడా మనం గ్రహించాలి. 


సన్యాసులకొక సంఘమంటూ అక్కరలేదు. ఏకాంతవాసం చేయుటేతప్ప సంఘాలుగాకూడటం సన్యాసుల లక్షణంకాదు. సంఘములుగగూడిన సన్యాసులు ఆశ్రమధర్మభ్రష్ఠులై తామూ లోకసామాన్యంలో చేరిపోతారు. 


కాబట్టి సన్యాసులకు, బ్రహ్మచారులకేతప్ప ఇతరులకు భిక్షాజీవనం పనికిరాదు. పనిపాటులొల్లక భిక్షాటనంచేసే సోమరితనాన్ని మాన్పుటకు రెండు ఉపాయములు కన్పిస్తున్నవి (1) బహుజనులకు విరివిగా పనికల్పించటం (2) సంపన్నల భోగానుభవాలకు నిరుపేద కష్టజీవనానికి వుండే వ్యత్యాసాన్ని తగ్గించడం వీనిలో మొదటిపని ప్రభుత్వానిది, రెండవది ప్రజలది జీవనపుటంతస్తు (స్టాండర్డు ఆఫ్ లివింగ్) పెరుగవలెనంటూ నేడుపఠించే మంత్రాలకు ఫలితమేమిటంటే, భోగసక్తి పెరగడమే భోగాలను విడనాడి, గ్రాసవాసోదైన్యం లేకుండా, మితంగా, సౌమ్యంగా బ్రతకడమే నిజమైన సోషలిజమనిపించుకుంటుంది. శీతావాతాతపముల నుండి రక్షించే సముచిత వస్త్రధారణం, జిహ్వచాపల్యం కోసం కాక శరీరధారణం కోసం భుక్తి. ఇదే సోషలిజపు లక్షణము దేహధారణ మాత్రమైన భుక్తియే అపరిగ్రహమనిపించుకొంటుంది. దేశసంపదను విజ్ఞానాభివృద్ధికి, దేశరక్షణకు వినియోగించాలేకాని భోగానుభవాలకై వెచ్చించకూడదు. జీవనవ్యయాన్ని సరళజీవనానికిసరిపడేటట్లుతగ్గించాలిగాని పెంచకూడదు. అలాచేస్తే ప్రజలందరకు సరిపడ్డ కూడు గుడ్డలు, నివాసమూ లభిస్తవి. 


నేడు అదనపు సంపదగల దేశాలు, పురుషులు ఆ సంపదను రాజకీయంగా తమతో ఏకీభవించే దేశాలకు, యుధ్ధంలో తమకు తోడ్పడే దేశాలకు పంచిపెట్టడం జరుగుతూ ఉంది. ఇది కూడనిపని. అదనపుసంపదను పేదదేశాలకు, ప్రజలకు ఇవ్వడం న్యాయం. ఏ దేశానికాదేశం తమకున్న సంపదతో తృప్తి పడటం నేర్చుకుంటే, జీవనపుటంతస్థుననుభవించే దేశాలు ఆ యంతస్తును కాపాడుకోవడాని కెప్పటికప్పుడు విదేశ విపణులను ఆక్రమించుకొంటూ వుండటం, ఆ కృత్రిమపు వాపు ఎప్పుడు బుస్సున తీసిపోతుందో అని భయపడతూ వుండడం తప్పదు. మింటిఎత్తు పెరిగినవానికి పడిపోతానేమో అనే భీతి వెంటాడుతూనే వుంటుంది. ఇతర దేశాలను అనుకరిస్తే, ఎప్పటికైనా మనకూ ఈ దురవస్థ పట్టుతుంది. 


ఇంతకూ సన్యాసానికి, సంఘటనకు చుక్కెదురనేది ప్రస్తుతం. సన్యాసులను పోషించే భారాన్ని సంఘం వహించక తప్పదు. పొట్టకోసం భిక్షాటనం చేసేవారికి పనిపాటులు చూపించాలి. యధావిధిగా ఆశ్రమ స్వీకారం చేసిన సన్యాసులను, పరోపజీవనం చేసే సోమరులను నిందింపరాదు. సన్యాసులను సంఘటితపరచి, ప్రభుత్వం చేయవలసిన పనులను వారిచే చేయింప బూనడం కూడా యుక్తంగాదు.                        


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- “జగద్గురు బోధలు” నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఉద్యోగం పురుషలక్షణమ్!!*

 *సుభాషితమ్* 

*అశ్వస్య లక్షణం వేగం*

*మదో మాతంగ లక్షణమ్!*

*చాతుర్యం లక్షణం స్త్రీణాం*

*ఉద్యోగం పురుషలక్షణమ్!!*


గుఱ్ఱము యొక్క లక్షణం పరుగెత్తడం. ఏనుగు లక్షణం మదము కలిగిఉండడం. చతురతతో మాట్లాడుట స్త్రీల లక్షణము. అలాగే, ఉద్యోగము చేయడం పురుషుల లక్షణం. 

రెండు కోతులు

 🙏🙏🏻 ఓం నమో వెంకటేశాయ🙏🏻🙏


         🔸రెండు కోతులు🔸


🔹నదీ తీరాన వున్న ఆ గ్రామంలో ఒక  మఠం

వున్నది. ఆ మఠంలో  కొంతమంది  సాధువులు నివసిస్తున్నారు. ఆ గ్రామంలోని ఒక వ్యక్తకి ఆ సాధువులంటే  ఏహ్యభావం.

'ఏ పనీ లేకుండా వూరికే కాలక్షేపం చేస్తున్నారని విమర్శిస్తూ వుండేవాడు.


🔸ఒక నాడు సాధువులు ఆ మఠంలో ఏం చేస్తున్నారో చూడాలని అనిపించింది ఆ వ్యక్తి కి. వెంటనే బయలుదేరి వెళ్ళేడు. 

🔷మఠానికి బయట ఒక సాధువు నిలబడి వున్నాడు.  గ్రామంలోని వ్యక్తి ఆ సాధువుని '

ఇక్కడ వూరకనే నిలబడి ఏం చేస్తున్నారు?

అని అడిగాడు.  ' నేను ఊరికే నిలబడలేదు. 

🔶రెండు గ్రద్దలు, రెండు కోతులు, రెండు కుందేళ్ళు, ఒక విష సర్పాన్ని కాపలా

కాస్తున్నాను అన్నాడు ఆ సాధువు.


♦️ఆ గ్రామస్థుడు చుట్టు ప్రక్కల చూశాడు.

అక్కడ కోతులుగాని, కుందేళ్ళు గాని, 

గ్రద్ద, సర్పం ఏవీ కనిపించలేదు. 


' ఊరికినే అంటున్నారు. ఇక్కడ అవేమి కనిపించడం లేదే'' అని అన్నాడు.


💠వెంటనే ఆ సాధువు నవ్వుతూ ఆ గ్రామస్థునికి

వివరించాడు. ...

🌐"నా రెండు కళ్ళు రెండు గ్రద్దలు.  

పనికిరానివాటినన్నిటిని చురుగ్గా

చూస్తూవుంటాయి. వాటిని చూసి

బుధ్ధిని పాడుచేస్తాయి. 

నా రెండు చేతులు రెండు కోతులు. 

వేటిని పట్టుకుందాం  అనవసరమైన పనులు చేయాలి అని తురు తురుమంటూ వుంటాయి. నా రెండు

కాళ్ళు రెండు కుందేళ్ళు .

🌀ఒక గమ్యం లక్ష్యం లేకుండా గెంతుతూ పరుగెత్తాలని చూస్తూ వుంటాయి.

నా నాలుక వుంది చూశావూ...అది

విష నాగము.  ఎవరిని కరుద్దామని

సిధ్ధంగా వుంటుంది.  వీటిని వాటి ఇష్టానికి

వదలి వేశామంటే  ఆపదలు కలుగుతాయి.

అందుకే జాగ్రత్తగా వాటికి కావలిగా వుంటాను. అని అన్నాడు సాధువు.


🔅గ్రామస్థునికి  సత్యం బోధ పడినది. 

భౌతిక సుఖాలను అణుచుకోవడం యొక్క

అవసరం ,మనలని మనం ఆత్మ పరిశీలన

చేసుకోవడం  ముఖ్యమైన పని

అని అర్ధమైనది.


🎋🎋🌷👌🏻🌷🌺🌷👌🏻🌷🎋🎋

అష్టస్థాన పరీక్ష

: అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 1 . 


     ఆయుర్వేదం నందు వ్యాధుల గురించి తెలుసుకొనుటకు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఈ రకమైన పద్ధతులు ద్వారా వ్యాధినిర్ధారణ చేయుటకు అనుభవం కూడా ప్రధానమైంది . ముందు అసలు ఆయా పద్దతుల గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను . సమస్త వ్యాధుల గురించి తెలుసుకోవడానికి 8 స్థానాలను మొదట పరీక్షించవలెను . అవి 


 * నాడి .


 * స్పర్శ . ( తాకుట ) . 


 * రూపము . 


 * శబ్దము . 


 * నేత్రములు . 


 * పురీషము . 


 * మూత్రము . 


 * జిహ్వ ( నాలుక ) . 


       ఈ 8 రకాల స్థానాలను ముందుగా పరీక్షించిన తరువాత మాత్రమే రోగనిర్ధారణ చేయవలెను . ఇప్పుడు మీకు ఒక్కొక్కదాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


 * నాడి - 


      దీనిని ఆంగ్లము నందు Pulse అని పిలిచెదరు . చరక , సుశ్రుతాది గ్రంథముల యందు ఎక్కడ కూడా నాడీవిషయము చెప్పబడలేదు . అయినాకూడా రోగములను గుర్తించుటకు కాని , వాటికి చికిత్స చేయుటకు గాని ఈ నాడీపరిక్షే ప్రథమస్థానం ఆక్రమించుచున్నది . మనిషి యొక్క ఒక ఉచ్చ్వాస నిశ్వాసమునకు ( Respiration ) 4 సార్లు నాడి స్పందనము ( Beating of the pulse ) కలుగును . 


  వయస్సును అనుసరించి నాడీ స్పందన - 


 గర్భములో పిండము - నిమిషానికి - 150 - 130 . 


 పుట్టగానే - నిమిషానికి - 140 - 130 .


 1 సంవత్సరం లోపు - నిమిషానికి - 130 - 115 . 


 2 సంవత్సరాల లోపు - నిమిషానికి - 115 - 100 


 3 సంవత్సరాల లోపు - నిమిషానికి - 100 - 90 . 


 7 - 14 సంవత్సరాల వరకు - " - 90 - 75 . 


 14 - 20 సంవత్సరాల వరకు - " - 85 - 75 . 


 21 - 60 సంవత్సరాల వరకు - " - 75 - 65 . 


 60 సంవత్సరాల పైన - " - 85 - 75 . 


      జీర్ణజ్వరము , రక్తక్షీణము , దౌర్బల్యము , భోజనానంతరం , మలవిసర్జన అనంతరం నాడి క్షీణించును . ఎంతవ్యాధి యున్నను వయస్సులో ఉండువానికి 120 కంటే నాడీస్పందన మించరాదు . నాడీస్పందన 150 సంఖ్య సమీపించిన అపాయము . 


       ఈ నాడీ పరీక్ష శరీరంలో 8 ప్రదేశాలలో చేయవలెను . తరవాతి పోస్టు నందు వాటి గురించి తెలియచేస్తాను . 


       మరింత వివరణాత్మక సంపూర్ణ సమచారం మరియు అత్యంత అరుదైన మరియు రహస్య మూలికల ఉపయోగాల గురించి నా గ్రంథాల నందు వివరించడం జరిగింది. నా గ్రంథములు చదివిన సంపూర్ణ సమాచారం అవగతం కాగలదు   


 

  గమనిక -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

: అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 . 


    ఆయుర్వేద శాస్త్రము అనుసరించి నాడిని 8 చోట్ల పరీక్షించవలెను . అవి 


  * హస్తము . 


  * పాదము . 


  * కంఠము . 


  * నాస 2 వైపులా . 


  * 2 చేతుల మణి బంధనముల యందు . 


  * 2 పాదముల చీలమండల యందు . 


  * ముక్కు రెండుప్రక్కల యందును కంఠము నందలి ఉండకు రెండు వైపులా నాడీపరీక్ష తెలుసుకొనవలెను . 


  హస్తనాడి - 


      శరీరము అంతయు వ్యాపించి ఉండు ఈ నాడి వాత,పిత్త , కఫములను , రసరక్తములకు సంబంధించి ఉండును . ఇది బ్రొటనవేలి మూలము నందు 3 వ్రేళ్లు పట్టుచోట ధాన్యపుగింజ పరిమితిన చరించుచుండును . దీని ద్వారా ఉచ్చ్వాస , నిశ్వాసముల గమనము బాగుగా తెలియును . 


         ఇది జీవసాక్షిలా శరీరము యొక్క ఆరోగ్య అనారోగ్యములను తెలుపుచుండును . ఉచ్ఛ్వాస నిశ్వాసములు నాసిక ద్వారా శరీరమంతయు వ్యాపించుచుండెను . అలా వ్యాపించునప్పుడు ఎటువంటి ఆటంకము లేకుండా సరిగా వ్యాపించుచుండిన యెడల ఈ నాడి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమముగా ఉండును . అలా జరగకుండా ఈ ఉచ్చ్వాస నిశ్వాసముల వ్యాప్తి చెందుతున్నప్పుడు త్రిదోషముల ( వాత పిత్త కఫ ) లలో ఏదైనా దోషము అడ్డువచ్చిన యెడల ఉచ్ఛ్వాసనిశ్వాసములు కంగారుపడి జలగ , పాము మున్నగు వాటి నడక ఎలా ఉండునో అలా కష్టముగా లేక నెమ్మదిగా లేక త్వరత్వరగా ఎగురుచున్నట్లు నాడి యొక్క గమనంలో తేడా వచ్చును . 

  

       హస్తనాడి వలన అజీర్ణము , ఆమదోషము , జ్వరము రాబోవు సంగతి , ఆకలిగొనుటను , చెడిపోయిన వాత , పిత్త , కఫముల గురించి తెలియచేయును . వైద్యులు ప్రధానముగా దీనినే 

పరీక్షించెదరు .


  పాదనాడి - 


        పాదనాడి వలన ఎంతకాలము జీవించునది , శరీరము బరువు లేక తేలికగా ఉండుటయు , జ్వరము తగ్గిన సంగతి తెలియును . ఆరోగ్యవంతునికే ఇది చూడవలెను  


  కంఠనాడి -  


        గాయములు , భయము మున్నగు బాహ్య కారణముల మూలముగా వచ్చు జ్వరము , తృష్ణ , ఆయాసము , స్త్రీసంగమము , అలయిక , దుఖఃము , కోపము అనువాటి గురించి కంఠనాడి తెలుపును . దీనిని నాడీపరీక్ష యందు నిపుణులు మాత్రమే ఈ నాడిని ప్రత్యేకముగా పరీక్షించి ఫలితాలు తెలుసుకోగలరు . 


  నాసా నాడి - 


       చనిపోవుటయు , జీవించిఉండుటయు , కామము , నేత్రవ్యాధులను , తలనొప్పిని , కర్ణముఖరోగములు ముక్కునందలి నాడి తెలియచేయును . 


  నాడిని పరీక్షించు విధానము - 


     వైద్యుడు నాడిని ఉదయము పూట పరగడుపున పరీక్షించవలెను . ముందు రోగి యొక్క మోచేతి భాగము పట్టుకొని పిసికి తన కుడిచేతి 3 బ్రొటనవ్రేళ్ళతో బ్రొటనవేలి మొదటి భాగమున నాడిని చక్కగా పరీక్షించవలెను . 


  స్త్రీపురుషుల నాడి బేధము - 


       పురుషులకు కుడిచేతి యందు కనిపించు నాడి , స్త్రీలకు ఎడమచేతి యందు కనిపించును . కారణమేమన పురుషులకు నాభి కూర్మ అధోముఖముగా ఉండును . స్త్రీలకు నాభి కూర్మ ఊర్ధ్వముఖముగా ఉండును . ఈ భేదము చేతనే స్త్రీ పురుషుల హస్తనాడులు భేదించుచున్నవి . 


         అనుభవమును బట్టి శాస్త్రము నందు చెప్పబడిన చేతి యొక్క నాడిని పరీక్షించి అనంతరము రెండోవ చేతి యందలి నాడిని కూడా పరీక్షించుట మంచిది . 


 మరింత వివరణాత్మక సంపూర్ణ సమచారం మరియు అత్యంత అరుదైన మరియు రహస్య మూలికల ఉపయోగాల గురించి నా గ్రంథాల నందు వివరించడం జరిగింది. నా గ్రంథములు చదివిన సంపూర్ణ సమాచారం అవగతం కాగలదు   


 

  గమనిక -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

Siva Pujaku - Song


 

అష్టస్థాన పరీక్ష

 అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 . 


    ఆయుర్వేద శాస్త్రము అనుసరించి నాడిని 8 చోట్ల పరీక్షించవలెను . అవి 


  * హస్తము . 


  *  పాదము . 


  *  కంఠము . 


  *  నాస  2 వైపులా . 


  *  2 చేతుల మణి బంధనముల యందు . 


  *  2 పాదముల చీలమండల యందు . 


  *  ముక్కు రెండుప్రక్కల యందును కంఠము నందలి ఉండకు రెండు వైపులా నాడీపరీక్ష తెలుసుకొనవలెను . 


  హస్తనాడి - 


      శరీరము అంతయు వ్యాపించి ఉండు ఈ నాడి వాత,పిత్త , కఫములను , రసరక్తములకు సంబంధించి ఉండును . ఇది బ్రొటనవేలి మూలము నందు 3 వ్రేళ్లు పట్టుచోట ధాన్యపుగింజ పరిమితిన చరించుచుండును . దీని ద్వారా ఉచ్చ్వాస , నిశ్వాసముల గమనము బాగుగా తెలియును . 


         ఇది జీవసాక్షిలా శరీరము యొక్క ఆరోగ్య అనారోగ్యములను తెలుపుచుండును . ఉచ్ఛ్వాస నిశ్వాసములు నాసిక ద్వారా శరీరమంతయు వ్యాపించుచుండెను . అలా వ్యాపించునప్పుడు ఎటువంటి ఆటంకము లేకుండా సరిగా వ్యాపించుచుండిన యెడల ఈ నాడి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమముగా ఉండును . అలా జరగకుండా ఈ ఉచ్చ్వాస నిశ్వాసముల వ్యాప్తి చెందుతున్నప్పుడు త్రిదోషముల ( వాత పిత్త కఫ ) లలో ఏదైనా దోషము అడ్డువచ్చిన యెడల ఉచ్ఛ్వాసనిశ్వాసములు కంగారుపడి జలగ , పాము మున్నగు వాటి నడక ఎలా ఉండునో అలా కష్టముగా లేక నెమ్మదిగా లేక త్వరత్వరగా ఎగురుచున్నట్లు నాడి యొక్క గమనంలో తేడా వచ్చును . 

  

       హస్తనాడి వలన అజీర్ణము , ఆమదోషము , జ్వరము రాబోవు సంగతి , ఆకలిగొనుటను , చెడిపోయిన వాత , పిత్త , కఫముల గురించి తెలియచేయును . వైద్యులు ప్రధానముగా దీనినే 

పరీక్షించెదరు .


  పాదనాడి  - 


        పాదనాడి వలన ఎంతకాలము జీవించునది , శరీరము బరువు లేక తేలికగా ఉండుటయు , జ్వరము తగ్గిన సంగతి తెలియును . ఆరోగ్యవంతునికే ఇది చూడవలెను  


  కంఠనాడి  -  


        గాయములు , భయము మున్నగు బాహ్య కారణముల మూలముగా వచ్చు జ్వరము , తృష్ణ , ఆయాసము , స్త్రీసంగమము , అలయిక , దుఖఃము , కోపము అనువాటి గురించి కంఠనాడి తెలుపును . దీనిని నాడీపరీక్ష యందు నిపుణులు మాత్రమే ఈ నాడిని ప్రత్యేకముగా పరీక్షించి ఫలితాలు తెలుసుకోగలరు . 


  నాసా నాడి  - 


       చనిపోవుటయు , జీవించిఉండుటయు , కామము , నేత్రవ్యాధులను , తలనొప్పిని , కర్ణముఖరోగములు ముక్కునందలి నాడి తెలియచేయును . 


  నాడిని పరీక్షించు విధానము  - 


     వైద్యుడు నాడిని ఉదయము పూట పరగడుపున పరీక్షించవలెను . ముందు రోగి యొక్క మోచేతి భాగము పట్టుకొని పిసికి తన కుడిచేతి 3 బ్రొటనవ్రేళ్ళతో బ్రొటనవేలి మొదటి భాగమున నాడిని చక్కగా పరీక్షించవలెను . 


  స్త్రీపురుషుల నాడి బేధము  - 


       పురుషులకు కుడిచేతి యందు కనిపించు నాడి , స్త్రీలకు ఎడమచేతి యందు కనిపించును . కారణమేమన పురుషులకు నాభి కూర్మ అధోముఖముగా ఉండును . స్త్రీలకు నాభి కూర్మ ఊర్ధ్వముఖముగా ఉండును . ఈ భేదము చేతనే స్త్రీ పురుషుల హస్తనాడులు భేదించుచున్నవి . 


         అనుభవమును బట్టి శాస్త్రము నందు చెప్పబడిన చేతి యొక్క నాడిని పరీక్షించి అనంతరము రెండోవ చేతి యందలి నాడిని కూడా పరీక్షించుట మంచిది . 


 మరింత వివరణాత్మక సంపూర్ణ సమచారం మరియు అత్యంత అరుదైన మరియు రహస్య మూలికల ఉపయోగాల గురించి నా గ్రంథాల నందు వివరించడం జరిగింది. నా గ్రంథములు చదివిన సంపూర్ణ సమాచారం అవగతం కాగలదు   


 

  గమనిక  -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .