8, ఫిబ్రవరి 2023, బుధవారం

స్వయంగా ఈశ్వరుడే

 స్వామి వారు కోరితే స్వయంగా ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు.....

ఒకసారి పరమాచార్య వారి దర్శనానికి టి. ఎన్. రమణి అనే వారు వచ్చారు. వారు సమీపంలోకి రాగానే స్వామి "వేద పాఠశాల విద్యార్థులకు పండ్లు కోనివ్వగలవా "అని అడిగారు.

రమణి సంతోషం తో "తప్పకుండ."అన్నాడు.

ఇంతలో గది వెలుపల మరాఠి లో  మాట్లాడుతున్నట్లు వినిపించింది. స్వామి వారు శిష్యునితో

"వారిని లోనికి తీసుకునిరా " అన్నారు.

వచ్చిన వ్యక్తి స్వామి కి ప్రణమిల్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు.

ఆయన కాశ్మీ ర్ రాజు ఆస్థానం లో చాలా కాలం పనిచేసి, పదవి విరమణ తరువాత ప్రస్తుతం సతారా లో నివసిస్తున్నానని తెలియ చేసుకొన్నాడు.

"స్వామీ! మా రాజు గారు తమ భక్తులు. దర్శనానికి వెళ్తున్నానని తెలిసి 10చెక్క పెట్టెలలో నాణ్యమైన ఆపిల్ పండ్లు పంపారు. తమకు సమర్పించమని ఆదేశించారు."అని ఆ పెట్టెలను స్వామి స్వామి ముందు ఉంచారు.

స్వామి నవ్వుతూ రమణి వైపు చూస్తూ

"ఈశ్వరుడు నీకు ఖర్చు తప్పించాడు. రెండు, మూడు బుట్టల పండ్లు వేద పాఠశాల విద్యార్థులకు వెళ్లి పంచు. ఒక బుట్ట పండ్లు నువ్వు తీసికో."అన్నారు.

స్వామి వారి చేతి మీదుగా ప్రసాదం గా ఒక్క పండు అయినా పొందాలని వందల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. వారు బుట్ట పండ్లను అనుగ్రహించటమే వారి అనంత కారుణ్యానికి నిదర్శనం.

***ఇలాంటి సంఘటనలు శ్రీ రమణుల చరిత్రలో కూడ మనకు కనిపిస్తాయి. ఉడతల కు పెట్టడానికి జీడిపప్పు పంపటానికి వంటవారు నస పెడితే భగవాన్ "జీడిపప్పు లేవంటున్నారు. మీకేమో(ఉడతలకు )వేరుశెనగ పప్పు పోసగదు."అన్నారు. ఎక్కడో నిద్రిస్తున్న రమణ భక్తునికి కలలో ఇవే మాటలు వినిపించి దర్శనానికి వస్తూ జీడిపప్పు తెచ్చి ఇచ్చారు. (చూ. రమణాశ్రమ లేఖలు)

కామెంట్‌లు లేవు: