29, ఏప్రిల్ 2022, శుక్రవారం

భగవద్గీత

 🌹భగవద్గీత🌹


పదమూడవ అధ్యాయము

క్షేత్ర - క్షేత్రజ్ఞవిభాగయోగము 

నుంచి 32వ శ్లోకము


యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే ౹

సర్వత్రావస్థితో దేహే తథాత్మా     నోపలిప్యతే ౹(32)


యథా , సర్వగతమ్ , సౌక్ష్మ్యాత్ ,

ఆకాశమ్ , న , ఉపలిప్యతే ౹

సర్వత్రా , అవస్థితః , దేహే , తథా ,

ఆత్మా , న , ఉపలిప్యతే ౹౹(32)


యథా = ఏవిధముగా 

సర్వగతమ్ = సర్వత్ర వ్యాపించిన 

ఆకాశమ్ = ఆకాశము 

సౌక్ష్మ్యాత్ = సూక్ష్మమగుటవలన 

న , ఉపలిప్యతే = గుణదోషములచే లిప్తము కాదో 

తథా = అట్లే 

దేహే = దేహమునందు 

సర్వత్ర , అవస్థితః = అంతటను వ్యాపించియున్నను 

ఆత్మా = ఆత్మ (నిర్గుణమగుటచే) 

న , ఉపలిప్యతే = దేహముయొక్క గుణములతో లిప్తము కాదు


తాత్పర్యము:- సర్వత్ర (ఇతరమహాభూతములయందు) వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుటవలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకలప్రాణుల దేహముయందు స్థితమైయున్నను ఆత్మనిర్గుణమగుటవలన వాటిగుణదోషములు దాని కంటవు. (32)

   

         ఆత్మీయులందరికి శుభ శుభోదయం

                Yours Welwisher

   Yennapusa Bhagya Lakshmi Reddy

*భోజనం చేయటం ఎలా*

 మీరందరూ బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహా రావు గారి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మరియు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రసంగాలు వినేవుంటారు. 


ఇప్పుడు మీకందరికి ఓ చిన్ని ప్రశ్న. 


*భోజనం చేయటం ఎలా* అన్న విషయం పై ప్రసంగించటానికి పై ముగ్గురు పండితుల్ని పిలిచారనుకోండి.


వారి ప్రసంగ శైలి ఇలా కొనసాగిందనుకోండి. ఈ ప్రసంగాలను బట్టి వాళ్ళలో ఎవరెవరు ఇలా ఉపన్యసించగలరో గుర్తించండి. 


*"అన్నం పరబ్రహ్మస్వరూపం. అసలీ శరీరమే అన్నం. అందుకే దీనిని అన్నమయకోశం అన్నారు. అన్నమే అన్నాన్ని తింటున్నది. అన్నం చ బ్రహ్మ. అహం చ బ్రహ్మా. భోక్తాచ బ్రహ్మా అని చెప్పుకుంటాం. ఇలా భోజనం చేసినా, ఇతరులకి పెట్టినా బ్రహ్మభావనతో, యజ్ఞభావనతో ఉండాలి. తైత్తిరీయోపనిషత్ లో ఒక మంత్రం. అహ మన్న, మహ మన్న, మహ మన్నం..."*


*"అసలు భోజనం చేసేటప్పుడు భక్తిగా, శ్రద్ధగా నేలపై పీట వేసుకొని, దానిపై బాసింపీట వేసుకొని కూర్చోవాలండీ! టేబుల్ మీల్స్ మన సంప్రదాయం కాదు సుమండీ! మంచి నీళ్ల గ్లాసు విస్తరికి కుడివైపున ఉంచుకోవాలి. అభికరించి ఆపోశనం పట్టాలి. భోజనం ప్రారంభించామంటే యజ్ఞం ప్రారంభించినట్టే. కనుక మధ్యలో లేవ కూడదు. ఈ మధ్యన బఫేలు మొదలయ్యాయి. అన్నం తింటూ ఆ ఎంగిలి ప్లేటు పట్టుకుని కూర కోసం ఒకసారి, సాంబారు కోసం ఒకసారి పోయి లైన్లో నిలబడే దౌర్భాగ్యపు సంప్రదాయం వచ్చింది. దీన్ని మనం పరిహరించాలి."*


*"శాస్త్రాలు, సంప్రదాయాలు అనేకం ఉంటాయి. అవేవీ అసత్యాలైతే కావు. కానీ కాలానుగుణంగా కొంత సర్దుబాటు తప్పదు. నీ ఇంట్లో నీ ఇష్ట మొచ్చినట్టు భోంచేస్తావ్. కానీ నీ నెత్తి మీద ఆఫీసర్ నిన్ను ఏదో ఫంక్షన్ కి భోజనానికి పిలిచాడు. పోయి వాడి మొహాన ఒక గిఫ్ట్ గిరాటు కొట్టి వాడు ఎలా పెడితే అలా తినక తప్పదు. నువ్వేం చెప్పలేని కాలమిది. ఇహ నువ్వు బఫేలో కాదు, టేబుల్ మీల్స్ కాదు, కింద కూర్చుంటా వడ్డించండి అంటే ఎవడు వింటాడు ? ఒక్కొక్క పెళ్లి ఫంక్షన్ కి వెయ్యి మందిని కూడా పిలుస్తారు. ఈ వెయ్యి మందిలో కింద చతికిలబడి కూర్చునే ఓపిక ఎంత మంది కుంటుంది? సరే కూర్చున్నా రయ్యా! వీళ్లందరికి వంగి వడ్డన చెయ్యాలంటే ఆ వడ్డించే వాళ్లకి నడుములు విరిగిపోవూ? అక్కడికీ వాడేదో సంప్రదాయంగా, తీరుబడిగా వడ్డిద్దా మంటే సాయంత్రానికల్లా వాడు తీసుకున్న ఫంక్షన్ హాల్ ఖాళీ చెయ్యాలయ్యే. కాబట్టి చాదస్తాన్ని పక్కన పెట్టి వాడి గిఫ్ట్ వాడి మొహాన కొట్టి నాలుగు ముద్దలు తినటమే. మనకి ధర్మం ముఖ్యం కానీ ప్రతి దానికీ చాదస్తం పెట్టుకుంటే ఎట్లా?"*

ఇందుకు కారణము.

 ఇప్పుడు ఆహారం ఎందుకు ఖరీదు అయ్యింది?(Costly)?

అంటే ఆలోచిస్తూ ఉంటే కుటుంబ నియంత్రణ పద్ధతులు వచ్చినప్పుడు నుంచి ఆహారం కూడా ఖరీదు ఎక్కువ అయ్యింది.

పంట తక్కువ పండుతోంది.మనుష్యుల సంఖ్య తక్కువ అయితే పంట ఎందుకు ఎక్కువగా పండుతుంది?

కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వలన నే ఈ దశ వచ్చింది.

           ఇప్పుడు మాంసం, చేపలు, గుడ్లు తిను అని ప్రచారం జరుగుతోంది.అయితే ఇంక వానెందుకు?వ్యవసాయమెందుకు?కారణమేమిటంటే --మాంసం తినడం వలన పశువులు ఉండవు.అందుచేత వాటికి గడ్డి అవసరం లేదు.అలాంటప్పుడు‌అనవసరంగా గడ్డి ధాన్యం ఎందుకు ఉత్పత్తి కావాలి?

       మనుష్యులు అధికమై వస్తువులు తక్కువ అయితే ధరల

పెరుగదల జరుగుతుంది.

మనుషులు పనిచేయకుండా సోమరులు అయ్యినప్పుడే వస్తువులు తక్కువ అవుతాయి.

           ప్రస్తుతం ఇదే దశ నడుస్తుంది.జనం తక్కువ పని చేస్తున్నారు.ఖర్చు ఎక్కువ పెడుతున్నారు.ఇందువల్లనే ఇంత దుర్భిక్షం ధరల పెరుగుదల కలుగుతుంది.పని తక్కువ చేస్తే వస్తువులు తక్కువగానే ఉత్పత్తి అవుతాయి.కనుక దుర్భిక్చానికి కారణం జనాభా పెరుగుదల కాదు.మనుష్యులలో సోమరితనం ప్రస్తుత్తత మొదలైన దోషాలు పెరుగుచున్నాయి.ప్రభుత్వవ్యవస్థ కూడా ఇందుకు కారణము.

రామరాజ్యంలో ఓ శునకం కథ.

 *రామరాజ్యంలో ఓ శునకం కథ....!!*


రామరావణ యుద్ధం ముగిసింది. రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తోందన్న కీర్తి ముల్లోకాలకీ వ్యాపించింది. అలాంటి సందర్భంలో ఓ రోజున...


రాముడు తన దర్బారులో కొలువై ఉన్నాడు. అతని చుట్టూ మంత్రులు పరివేష్టించి ఉన్నారు. 


కశ్యపుడు, వశిష్టుని వంటి రుషివర్యులు ఉచితాసనాలని అలంకరించారు. అలాంటి నిండుసభలో రాముల వారు లక్ష్మణుని వంక చూస్తూ ఎవరన్నా పౌరులు కార్యార్థులై, తన సభకు చేరుకున్నారా అని అడిగాడు.


 సుభిక్షమైన రాముని పాలనలో... ప్రత్యేకించి విన్నవించుకునేందుకు ఎవరికీ ఏ సమస్యా, అవసరమూ లేవని బదులిచ్చాడు లక్ష్మణుడు. 


పోనీ రాజద్వారం దగ్గర ఎవరన్నా సమస్యలతో నిలబడి ఉన్నారేమో చూసి రమ్మని పంపాడు రాముడు.


రాముని ఆజ్ఞ మేరకు రాజద్వారాన్ని చేరుకున్న లక్ష్మణుడికి అక్కడ ఓ గాయపడిన కుక్క కనిపించింది. 


‘ఓ శునకమా! నీకేం ఆపద వచ్చింది? ఎలాంటి సంకోచమూ లేకుండా నీకు వచ్చిన సమస్యని చెప్పుకో!’ అంటూ అభయమిచ్చాడు లక్ష్మణుడు. 


దానికి ఆ కుక్క తన సమస్యని రామునికే విన్నవించుకుంటానని పట్టుపట్టింది. దాంతో దానిని రాముని సమక్షానికి తోడుకుపోక తప్పలేదు లక్ష్మణునికి.


తనకి వచ్చిన ఆపదని చెప్పుకోమంటూ రాముడు అభయాన్ని ఒసిగిన వెంటనే ఆ కుక్క – ‘ప్రభూ! రాజన్నవాడు తన పౌరులకి దేవునితో సమానం. 


వారికి సృష్టి, స్థితి, లయకారుడు ఆ రాజే! అందుకనే తన రాజ్యంలోని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత రాజు మీదే ఉంటుంది. 


దానం, కరుణ, సత్పురుషులని ఆదరించడం, మంచి నడవడి వంటి లక్షణాలన్నీ కూడా ఆ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. 


కానీ నీ రాజ్యంలో ఒకరు ధర్మాన్ని తప్పి నా మీద దాడి చేశారు. సర్వదసిద్ధుడనే పరివ్రాజకుడు నన్ను గాయపరిచాడు,’ అంటూ వాపోయింది.


ఆ శునకం మాటలు విన్న రాములవారు వెంటనే సర్వదసిద్ధుని పిలిపించారు. ‘ఆ కుక్కను గాయపరిచిన మాట నిజమే ప్రభూ! 


నేను యాచనకు బయల్దేరిన సమయంలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలిచింది. అసలే ఆకలితో ఉన్న నేను ఆగ్రహాన్ని పట్టలేకపోయాను. 


ఆ ఆగ్రహంతోనే ఈ కుక్కను గాయపరిచాను. నేను చేసిన పని తప్పేనని ఒప్పుకుంటున్నాను. అందుకుగాను మీరు ఎలాంటి శిక్షను విధించినా సంతోషంగా స్వీకరిస్తాను,’ అంటూ వేడుకున్నాడు సర్వదసిద్ధుడు.


సర్వదసిద్ధునికి ఎలాంటి శిక్ష విధించాలా అని దర్బారులో జనమంతా తర్జనభర్జన పడుతుండగా ఆ శునకం- ‘ప్రభూ! తమరేమీ అనుకోనంటే నాది ఒక విన్నపం. 


మీకు నిజంగా నా పట్ల జాలి కలిగితే, నన్ను కరుణించాలన్న తలంపు మీలో ఉంటే నేను చెప్పిన శిక్షను అతనికి విధించండి,’ అని కోరింది.


ఆ మాటలకు రాములవారు అంగీకరించగానే- ‘ఈ బ్రాహ్మణుడిని కులపతిగా నియమించండి. అతడిని కలంజర అనే మఠానికి అధిపతిని చేయండి,’ అని కోరింది.


ఆ మాటలు విన్నంతనే సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు మాత్రం తనకు శిక్షకు బదులుగా పదవి లభించినందుకు సంబరపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 


‘అదేమిటీ, నీకు జరిగిన అన్యాయానికి బదులుగా సర్వదసిద్ధుని కఠినంగా శిక్షించమని కోరతావనుకుంటే... అతనికి కులపతి హోదానీ, మఠాధిపతి పదవినీ కట్టబెట్టించావెందుకనీ,’ అంటూ అడిగారు సభలోని పెద్దలు.


దానికి ఆ శునకం ఇలా బదులిచ్చింది- ‘అయ్యా గత జన్మలో నేను ఆ మఠాధిపతిని. రుషులను ఆదరిస్తూ, దేవతలని పూజిస్తూ, సేవకుల బాగోగులను గమనిస్తూ, అందరికీ పంచగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ చాలా నిష్టగా జీవించాను. 


అయినా కూడా కుక్కగా జన్మించాల్సి వచ్చింది. అంత సత్ప్రవర్తనతో మెలిగిన నేను ఈ స్థితికి చేరుకుంటే... చిన్నపాటి కోపాన్ని కూడా అదుపు చేసుకోలేని ఆ సర్వదసిద్ధుడి గతేమవుతుందో ఆలోచించండి,’ అంటూ నవ్వింది.


అధికారం చేతిలోకి వస్తే మనిషి విచక్షణలో మార్పు వస్తుంది. ఆ మత్తులో అతను తెలిసో తెలియకో చిన్నచిన్న పొరపాట్లు చేయడం ఖాయం. 


మఠాధిపతి హోదాలో అతిపవిత్రంగా ఉండాల్సిన మనిషి ఇంకెంత నిష్టగా ఉండాలో కదా! ఈ విషయాన్ని సున్నితంగా తెలియచేస్తోంది పై కథ.


 ఇందులో ఒక పక్క కుక్క చూపించిన సమయస్ఫూర్తి అబ్బురపరచినా... గురువుగా ఉన్నత స్థానాన్ని అలంకరించేవారు ఎంత పవిత్రంగా ఉండాలో హెచ్చరిస్తోంది....

🙏

మహానుభావురాలు

 ఇటువంటి మహానుభావురాలు...


మన తెలుగింటి ఆడపడుచు అయినందుకు....


ఎంతో గర్వాంగా ఉంది ..


[#ఆంధ్రుల_అన్నపూర్ణమ్మ_డొక్కాసీతమ్మ గారు ... #వర్ధంతి నేడు💐💐💐


తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే - ఆవిడ జీవితములో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు "ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం... అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు" అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మగారు. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి... వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్న దాత ఆవిడ.


ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భార్తగారు "ఎందుకు ఇంకా ఈ అన్నదానం? మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టడమా మానవు! ఇంత అన్నం పప్పైనా పెడతావు..." అన్నారు. దానికి ఆవిడ "నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు? మనకీ వాడే పెడతాడు" అని చెప్పి పెట్టింది. ఇన్నాళ్ళ నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ గారి భర్త ఒక రోజు సాయంకాలం గొయ్యి తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. తీసుకొచ్చి ఇంట్లో బంగారు కాసుల రాశులు పోసి, మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.


ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. దేనికి అంటే "నాకు పట్టాభిషేకము జరిగేటప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రము దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారము పెట్టి అప్పుడు పట్టాభిషేకము చేసుకుంటా" అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలక్టరు గారు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, "నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకలు ఎందుకు, వద్దు" అన్నారు ఆవిడ. "అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు" అని ఆ కలక్టరు గారు చెబితే, "నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి" అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం....


( బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములనుండీ సేకరణ)


ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యై నమః🙏


[#dokkasettamma]

సూర్యగ్రహణము

 _*సూర్యగ్రహణము భారతదేశములో కనిపిస్తుందా?*_ 


ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఈ ఏప్రిల్‌ (April) 30, 2022న ఏర్పడనుంది.

ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం ఎక్కడ..? ఏ సమయంలో ఎలా కనిపించనుందనే వివరాలు.


 ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో మూడు రోజుల్లో ఏర్పడనుంది. ఇది తొలి పాక్షక సూర్యగ్రహణం. దక్షిణ అమెరికాలోని దక్షిణాధి ప్రజలు, అంటార్కికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల వాసులు ఏప్రిల్‌ 30న సూర్యాస్తమయానికి కొద్దిముందు పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. 

ఇక చిలీ, ఉరుగ్వే, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటీనీ, నైరుతి బొలీవియా, ఈశాన్యలోని పెరూ, నైరుతి బ్రెజిల్‌ దేశాలలో అకాశం నిర్మలంగా ఉంటే.. సూర్యాస్తమయం సమయంలో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది.


 అయితే 

*భారతదేశంలో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించదు.* 


దక్షిణ, అమెరికాలోని సౌత్‌ ఈస్టర్న్‌ ప్రాంతాల్లో, దక్షిణ పసిపిక్‌ మహా సముద్ర ప్రాంతాల వాసులకు ఈ సూర్యగ్రహణం కనిపించనుంది.


*గ్రహణం కనిపించని ప్రాంతాలలోని వారు ఎటువంటి నియమాలను పాటించనవసరం లేదు.*

చంద్రుడిపై త్రివర్ణ పతాకం.*

 *బీజేపీ ఇంకొక దశాబ్దం దేశాన్నేలితే, ఏదో ఒక రోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం.*


*కానీ, కాంగ్రెస్ వచ్చిందా!*


*జెండా పై రంజాన్ - చంద్రుడే గతి!*


*ఎప్పటికీ గుర్తుంచుకో!*


*బీబీసీకి చెందిన ప్రఖ్యాత జర్నలిస్ట్ "మార్క్ టుల్లే" ఒక ప్రకటన ఇచ్చారు!*


*‘‘కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విషజంతువులు ఉన్న కాంగ్రెస్ అనే పెద్ద మర్రిచెట్టును మోదీ పెకిలించి వేస్తున్నాడు!*


*దేశంలోని  విషసర్పాలన్నింటికి పొగ పెట్టారు, నరేంద్రమోడీ గారు!*


*అందుకే ఈ పాములు చెట్టు లోంచి, పుట్టల్లోంచి బయటకొచ్చి దేశం మీద పడ్డాయి.*


*అన్ని రకాల పాములను దాచి వుంచిన కాంగ్రెస్, వామపక్షాలు, జిహాదీ మూకలు, నక్సలైట్లు, మిషనరీలు, నరేంద్రమోడీని దించేయడానికి రకరకాల పనికిమాలిన కారణాలను పాటలుగా చేసి స్వరాలు ఊదుతున్నాయి!* 🧐🥺🤬 


*భారతదేశాన్ని నాశనం చేయడానికున్న ఆ దుష్టశక్తులను నాశనం చేయడానికే అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ గారు, ఈ విష సర్పాలను రోడ్డు పాలు చేసి, ప్రజల కంట పడి అప్రమత్తమయ్యేట్టు బట్టబయలు చేయడం 👌🏻☝️ మంచిదయ్యింది.* ☝️👌🏻 


*లేకపోతే ఈ విష సర్పాలు, రాబోయే కాలంలో ఈ భారత భూమిని, హిందువులనూ మింగి వేసేవి.*


✊*భవిష్యత్ తరాల మత మార్పిడులకు, అడ్డుకట్ట వేశారు!*✊  


*నరేంద్రమోడీ గారు, చాలా కష్టపడాలి, కష్టపడతారు కూడా!*


*అయితే ఈ దేశ ప్రజలంతా, ముఖ్యంగా హిందువులు నరేంద్రమోడీ గారికి అండగా నిలవాలి.* 🙏🏼 


*ఎందుకంటే ఆయన ఈ కష్టం తన కోసం పడడంలేదు! దేశప్రజలకోసం, భవిష్యత్ తరాల కోసం మరియు భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం చేస్తున్నారు.*


*దయచేసి దీనిని ఫార్వార్డ్ చేయండి!*


*విదేశాలలోని హిందువులను కూడా మేల్కొల్పండి!!*


*తెలియని ఈ జ్ఞానాన్ని తెలియ పరచండి!!!*


🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

సైకిల్ తొక్కడం

 సైకిల్ తొక్కడం అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థ (GDP) కైనా అత్యంత హానికరం.


ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం ...


*సైక్లిస్ట్* దేశానికి పెద్ద విపత్తు, ఎందుకంటే అతను ...


కారు కొనడు.

అప్పు చేయడు.

కారుకు బీమా చేయడు.

పెట్రోల్ కొనడు.

కారును సర్వీసింగ్ చేయడు.

డబ్బు చెల్లించి కారును పార్క్ చేయడు.

ట్రాఫిక్ ఫైన్ కట్టడు.

అంతే కాకుండా ... అతను లావుగానూ అవ్వడు.


అవును ... అతను ఆరోగ్యవంతుడు అన్నది నిజం


కానీ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు, ఎందుకంటే ... అతను

మందులు కొనడు.

ఆసుపత్రికి మరియు వైద్యుని వద్దకు వెళ్ళడు

ఇది దేశ జిడిపికి అస్సలు తోడ్పడదు.


అదే దీనికి విరుద్ధంగా...., ఒక ఫాస్ట్ ఫుడ్ దుకాణం తేరవడం వల్ల 30 మందికి ఉద్యోగాలు సృష్టించబడతాయి ...


10 మంది గుండె వైద్యులు,

10 మంది దంతవైద్యులు,

10 మంది బరువు తగ్గించేవారు అవసరం..!


 గమనిక: - *నడక* అనేది దీని కంటే ప్రమాదకరమైనది, ఎందుకంటే పాదచారులు సైకిల్ కూడా కొనరు.

ఇలా చేస్తే పిల్లలు మాట వింటారు!★★★

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

★★★ఇలా చేస్తే పిల్లలు మాట వింటారు!★★★


         ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులకు ఒక వేదన కలుగుతుంటుంది. “మా పిల్లలకు మన సంప్రదాయాల మీద గౌరవం లేదు. వినయం, విధేయత.. లాంటివి లేవు. మా మాట వినడం లేదు".

         ఇలా వాపోయే వారెందరో! దానికి తోడు - 'గ్లోబలైజేషన్' పేరుతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో విలువలు తారుమారౌతున్నాయి. మార్పుని తట్టుకోలేని వారి హృదయం కించిత్తు బాధకి గురౌతోంది.

        కాలంలో వస్తున్న సాంకేతిక పరిణామాల ప్రభావం, దూరాలు తగ్గి దేశాలు సైతం గ్రామాలంత దగ్గర కావడం... ఇలాంటి ఎన్నో నేపథ్యాలలో 'వేగం’ పెరుగుతోంది. ఇది వరకు పాతికేళ్ళు పట్టే మార్పుకి, ఈ రోజు రెండు రోజులు చాలు.

         మార్పుని ఆహ్వానించడం మంచిదే. కానీ ఆ మార్పులు తరతరాల సంస్కృతి విలువలను ధ్వంసం చేసేటంతగా జరగడం ఆహ్వానించదగినది కాదు. ఆధునీకరణను 'పాశ్చాత్యీకరణ'గా భ్రమిస్తున్న యువత మనదైన ఘనతను తెలుసుకోకపోవడం విచారకరమైతే, దానిని తృణీకరిచడం మరీ దౌర్భాగ్యం.

         మానవ సంబంధాలు, తరతరాల నుండి సంక్రమిస్తున్న కొన్ని ముఖ్యమైన విలువలు - వీటిని పదిలపరచుకుంటూనే, ఆధునికంగా కూడా ఎంతో ఎదగవచ్చు. అయితే వీటిపై అవగాహన, గౌరవం కలిగించాల్సిన బాధ్యత మాత్రం పెద్దలదే.

         దీనికి రెండు పద్ధతులున్నాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ మన సంస్కృతి పట్ల గౌరవం కలిగించే అంశాలను తెలియజేయాలి. ఒక పాఠ్యాంశాల బోధనలా కాకుండా, వారికి పరిసరాలలో కలిసిపోయేలా పరిచయానికి రావాలి. సంస్కృతితో కలిసి జీవింపజేయాలి.

         ఈ రోజుల్లో పాఠశాలల ద్వారా సంస్కృతి బోధన జరుగుతుందని ఆశించడం పొరపాటే. కేవలం ర్యాంకుల లక్ష్యంగా సాగే పోటీ చదువుల పోరులో ఈ విలువల పరిరక్షణను విద్యాసంస్థల నుండి ఆశించడం పొరపాటు. పౌష్టికాహారాన్నిచ్చి పోషించే బాధ్యతతోపాటు, సంస్కృతి - నాగరికతల వివేక సంస్కారాలను అలవరచడం కూడా తల్లిదండ్రుల కర్తవ్యమే.

         ముఖ్యంగా - తల్లిదండ్రులు కూడా గౌరవంగా వాటిని పాటిస్తుండాలి. వివిధ సంస్కృతి సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో పిల్లలతో పాటు తాము పాల్గొనడం చేయాలి. వారి ముందు కనిపిస్తుంటే అనుకరించడం పిల్లల సహజం.

         ముందు పెద్దలే పెద్దలపట్ల వినయ విధేయతల్నీ, సంస్కారాన్నీ కనబరుచుతుంటే పిల్లలకీ అది అవగతమవుతుంది.

         ప్రధానంగా ‘గౌరవం' కలిగించడం అత్యావశ్యకం. పరిజ్ఞానం కన్నా ముందు 'గౌరవం’ కావాలి. ‘అన్నీ తెలిస్తేనే గాని చేయను' అని మొండికేస్తే నష్టపోయేది వారే. ముందు పాటిస్తూ ఉంటే క్రమేణ అవగాహన మరింత చక్కని అభ్యాసం సిద్ధిస్తాయి.

          'మహాభారతం'లో యుద్ధానంతరం 'అంపశయ్య’ మీద ఉన్న భీష్ముని వద్దకు ధర్మరాజాదులను తీసుకువచ్చి, ఆ పితామహుని ద్వారా వివేక విజ్ఞాన విషయాలు చెప్పమని భీష్ముని ప్రబోధించారు పార్థసారథి. నిజానికి తాను చెప్పలేక కాదు - 'ఒక తరం తరువాతి తరానికి ఆస్తినే కాదు, తమదైన ప్రాచీన విలువల్నీ, విద్యలనీ అందించాలి' అనే బాధ్యతను స్ఫురింపజేయడం కోసం వ్యాసదేవుని ఏర్పాటు అది. ఈ ఏర్పాటు ద్వారా యుధిష్ఠిరాదులు బాధ్యతను స్ఫురింపజేయడం కోసం వాసుదేవుని ధర్మ విషయాలు, విజ్ఞాన పరంపరను గ్రహించారు.

          జీవితానికి పనికొచ్చే భౌతిక విద్యలను నేర్చుకోవడంతో పాటు, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రాచీన ధర్మవిద్యలు మొదటి నుండీ నేర్పాలి.

          సెలవు రోజుల్లో తీరిక వేళల్లో సంబంధంలేని ఏవో విదేశీభాషల కోసమో, కొత్త కోర్సుల కోసమో పిల్లల్ని పంపిస్తుంటారు. మనదైన ఉత్తమ విలువల్నీ, ప్రాచీన కళల్నీ, విద్యల్నీ కూడా నేర్పించగలగాలి.

          సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ధ్యానం, యోగాభ్యాసం, ప్రవర్తనా సరళి పూర్వ గ్రంథాలలోని విలువలు, విశేషాలు, వాటి కథలు, బోధలు, నైతికత... ఇలాంటి అభ్యాసాలను బాల్యం నుండి తాము అందించే ప్రయత్నం పెద్దలు చేపట్టాలి. అటువంటి పరిసరాలలో సంచరించేలా చేయాలి. పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది కదా!

          ప్రహ్లాదుడు మాతృగర్భంలో ఉండగానే, ఆ నిండు నెలల సమయంలో నారదముని ఆశ్రమంలో ఉన్న కారణంగా సత్ప్రభావాన్ని పొందాడు. ఇంట్లో తల్లిదండ్రులలో సంస్కారం లేకున్నా, అటువంటి చక్కని ప్రభావవంతమైన వ్యక్తుల సాంగత్యమైనా లభించాలి - ప్రహ్లాదునకు, ధ్రువనకువలెనే.

           తల్లిదండ్రుల ప్రభావంతో బాల్యం నుండి సత్సంస్కారాన్ని అలవరచుకొని జీవితంలో రాణించిన మార్కండేయుడు, ఉపమన్యువు వంటి మహాత్ములు ఉండనే ఉన్నారు.

           విలువల్నీ, ధర్మాన్ని బోధించడం చేత ఆరోగ్యవంతమైన, సత్సంస్కారం కలిగిన ఉత్తమ పౌరులు ఏర్పడతారు. అవినీతి, బాధ్యతా రాహిత్యం వంటివి సమాజంలో తగ్గాలంటే నాటి సంస్కారాలని, నైతికతని బాల్యం నుండే అందించాల్సిన అవసరముంది.

           ముందుగా పెద్దలే వాటి పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ, పిల్లల ముందు పాటిస్తూ, పాటిస్తున్నట్లు కన్పిస్తూ, వాటిపై గౌరవం కలిగిన కుటుంబాల స్నేహసంబంధాలను పిల్లలతో కొనసాగింపజేస్తూ జాగ్రత్తపడడం బాధ్యత.

           మనదైన ఘనచరిత్ర, కట్టడాలు, పవిత్ర స్థలాలు వాటి పురాణ నేపథ్యం, చారిత్రక ఔన్నత్యం - ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ బోధించాలి. అదే వారికి వినోదంతో కూడిన విజ్ఞానాన్నీ, విజ్ఞానంతో కూడిన దేశభక్తినీ, సంస్కారాన్నీ ప్రసాదిస్తుంది.


[సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర, శివతత్త్వసుధానిధి, పూజ్య గురువులు “బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ శర్మ గారు” రచించిన వ్యాసం.]


ఏప్రిల్ 2011 “ఆంధ్రప్రదేశ్” పత్రికలో ప్రచురితం

సుభాషితమ్

 *ॐ卐 _-||-సుభాషితమ్||-_ ॐ卐* 



శ్లో𝕝𝕝 కృషితో నాస్తి దుర్భిక్షం

జపతో నాస్తి పాతకః|

మౌనినః కలహో నాస్తి

న భయం చాస్తి జాగ్రతః||


తా𝕝𝕝 కృషి చేసేవారికి కరవు ఉండదు....జపం చేసేవారికి పాతకం ఉండదు.... మౌనంగా ఉండేవారికి కలహం ఉండదు. జాగ్రతలో ఉండేవారికి, మేలుకుని ఉండేవారికి, భయం ఉండదు....

ఇవి పాటించిన వారికి సర్వత్ర విజయమే!!!


 🚩🙏✍👉||

స్వభావో నోపదేసేన శక్యతే కర్తృమాన్యథా|

సుతప్తమపి పానీయం పునర్గచ్ఛతి శీతతాం||


ఎవ్వరును ఎవరి స్వభావమునూ మార్చలేరు.... బాగుగా కాగబెట్టిన నీరు కొంతసేపటికి తిరిగి చల్లబడును కదా?!! 


            --పంచతంత్రం (1-280)

బ్రాహ్మణ సమాజానికి

 బ్రాహ్మణ సమాజానికి నమస్కారములతో.


చలో  విజయవాడ. మే 1.ఆదివారం.

బ్రాహ్మణ మేధోమదన సదస్సు.

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య.209/1984.


★స్వాతంత్రోద్యమ సమయంలో భారతీయుల ఆత్మగౌరవం కోసం దన,మాన ప్రాణాలను పణంగా పెట్టిన, కోల్పోయిన జాతి... బ్రాహ్మణ జాతి.


★భారత రాజ్యాంగ నిర్మాణంలోని  సభ్యులలో  కీలక పాత్ర పోషించిన మహనీయులు బ్రాహ్మణలే.భారత రాజ్యాంగం డ్రాఫ్ట్ కాపీ దాదాపు 60 దేశాలు తిరిగి స్వయంగా తయారు చేసిన శ్రీ బెంగాలు నరసింగరావు కూడా బ్రాహ్మణుడే.


★ఆర్ధిక సంస్కరణలు యోధుడు పివి గారు బ్రాహ్మణుడే..


★నిరుపేద దళిత జాతి అభివృద్ధి కోసం  ఎటువంటి అధికారం లేకుండా అగ్రవర్ణ భూస్వాముల వద్ద భూములను దానంగా స్వీకరించి దేశ వ్యాప్తంగా భూదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టింది కూడా బ్రాహ్మణుడే ...వినోభా భావే.


★దళితులను అంటరాని వారుగా గుర్తించి,దేవాలయాలకు రానివ్వని సందర్భంలో,దళితులకు దేవాలయ ప్రవేశం చేయించిన భారత రత్న అవార్డు గ్రహీత మదన్ మోహన్ మాలవ్యా కూడా బ్రాహ్మణుడే .


★బ్రిటిష్ తుపాలకులకు ఎదురొడ్డి నిలిచి, రాష్ట్ర రాజకీయాలలో మొదటగా దళితుడైన దామోదరం సంజీవయ్య ను ముఖ్యమంత్రి చేసింది బ్రాహ్మణుడే....ఆంద్ర కేసరి.టంగుటూరి ప్రకాశం పంతులు గారు.

ఎన్నో ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్న బ్రాహ్మణ జాతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  అండగా ఉండాల్సిన  పరిస్థితులలో  మనువాదపు ముద్ర తోటి మన బతుకులు అనగతొక్కి రాజకీయక్రిడలో పావులుగా మార్చుతున్న ఈ వ్యవస్థను ప్రశ్నించేందుకు...సామాజిక న్యాయం లో దక్కని వాటాను నిలదీసి ఆడిగేందుకు కులమే బలమైన నేటి ప్రజాస్వామ్య క్షేత్రంలో  బ్రాహ్మణ సత్తాను చాటి బ్రాహ్మణ జాతి పూర్వ వైభవాన్ని జన హితమే లక్ష్యంగా.. జాతి ప్రగతి ద్యేయంగా  త్వరలో జరగబోవు బ్రహ్మ గర్జన సభను విజయవంతం చేయుటకు నిర్వహిస్తున్న బ్రాహ్మణ మేధోమదన సదస్సు (రౌండ్ టేబుల్ ) సమావేశంను బ్రాహ్మణ జాతి అభ్యుదయాన్ని,శ్రేయస్సును కోరుకునే ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాము.

మే 1 వ తేదీ ఆదివారం హోటల్ ఐలాపురం  విజయవాడ 


నమస్కారములతో.

మాచిరాజు రవికుమార్

సత్యవాడ దుర్గాప్రసాద్.

కోనూరు సతీష్ శర్మ.

H. k మనోహర్ రావు.

దేవుడు మెచ్చే దీక్ష

 దేవుడు మెచ్చే దీక్ష••••




“నాకు ఒక రూపం లేదు. నన్ను ఎవరు ఏ రూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తాను’’ అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత నాలుగో అధ్యాయం పదకొండో శ్లోకంలో చెప్పాడు.


యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః!


‘‘పార్థా! నీకు ఒక దైవరూపం, ఒక దేవుడి పేరు అంటే ఇష్టం కాబట్టి అందరినీ అందులోకి మళ్లించే ప్రయత్నం చేయవద్దు. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తున్నారో, పూజిస్తున్నారో వారిని అదే విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. మనుషులందరూ నా మార్గాన్నే అనుసరిస్తున్నారు’’ అని శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు. 


కాబట్టి దేవుణ్ణి పూజించడానికి రూపం ప్రధానం కాదు.


 దానికి ఉదాహరణ ఈ కథ. 


పూర్వం ఒక వర్తకుడు ఉండేవాడు. రోజూ శివుణ్ణి ఆరాధించేవాడు. నాలుగైదు తరాలుగా శివుడు వారి ఇంటి దైవం.


 ఒకసారి ఆ వర్తకుడికి వ్యాపారంలో నష్టం వచ్చింది. దాంతో దిగాలుపడిపోయాడు. 


‘శివుణ్ణి ఆరాధిస్తున్నా వ్యాపారంలో నష్టం వచ్చింది’ అనుకున్నాడు. 


ఇంటి అరుగు మీద దిగాలుగా కూర్చున్నాడు.  అతని దూరపు బంధువు ఒకరు ఆ దారివెంట వెళుతూ వర్తకుణ్ణి పలకరించాడు.  ‘ఎందుకు దిగాలుగా ఉన్నావ’ని అడిగితే వ్యాపారంలో నష్టం గురించి చెప్పాడు వర్తకుడు. 


అప్పుడా వ్యక్తి ‘‘అయ్యప్ప మాల ఽధరించు, నీ  కష్టాలన్నీ తీరుతా‘’యన్నాడు. బలహీనమైన మనస్సుతో ఉన్న వర్తకుడు సరేనన్నాడు. వెంటనే ఇంట్లోనే తరతరాలుగా ఆరాధిస్తున్న నటరాజ విగ్రహాన్ని ఓ మూలకు నెట్టేసి, అయ్యప్ప విగ్రహాన్ని పెట్టి పూజించడం మొదలుపెట్టాడు. రోజూ ధూప, దీప, నైవేద్యాలతో పూజలు చేయసాగాడు. అనుకోకుండా వ్యాపారంలో మళ్లీ లాభం వచ్చింది. ‘అయ్యప్ప పూజ ఫలించింది’ అనుకున్నాడు.



ఒక రోజు ఇంట్లో పూజలో ఉండగా అయ్యప్ప ముందు వెలిగించిన ధూపం పొగ నటరాజ విగ్రహం దగ్గరకు వెళుతూండడం చూశాడు. గాలి మూలంగా పొగ అటువైపు వెళుతోంది. ‘అయ్యప్ప కోసం ధూపం వెలిగిస్తే, శివుడికి ఎందుకు? ఎంత ఆరాధించినా శివుడు నన్ను పట్టించుకోలేదు’ అని మనసులో అనుకుంటూ శివుడి వైపు ధూపం పొగ వెళ్ళకుండా చేయి అడ్డంపెట్టాడు.


 ఆ చేతి కింది నుంచి పొగ వెళ్ళసాగింది. దాంతో తనే అడ్డంగా నిలుచున్నాడు. అతని పక్కనుంచి పొగ వెళ్ళింది. నిజానికి గాలి మూలంగా పొగ అటువైపు వెళుతోంది. ‘అడ్డంగా నిలుచున్నా శివుడి వైపు ధూపం వెళుతోంది’ అని  ఒక వస్త్రం తీసుకువచ్చి, శివుడు ధూపం పొగ పీల్చుకోకుండా ఆ నటరాజ స్వామి విగ్రహం ముక్కుల్లో పెట్టాడు.



వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. వర్తకుడు ఆ అర్ధనారీశ్వరుడి కాళ్ళమీద పడి క్షమించమని వేడుకున్నాడు.


 ‘‘తరతరాలుగా ఆరాధిస్తున్నా ఎప్పుడూ కలగని భాగ్యం ఈ రోజు కలిగింది. నాపై ఎందుకు కరుణ చూపించావయ్యా!’’ అని శివుణ్ణి అడిగాడు. 


అప్పుడు శివుడు ‘‘నువ్వు ఎప్పుడు పూజ చేసినా నన్ను రాతి విగ్రహంగానే భావించావు. ధూపం పొగ ఎటుపోయినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నన్ను రాతి విగ్రహం అనుకోలేదు. నేను పొగ పీలుస్తున్నానని నమ్మావు. నాపైన సంపూర్ణ విశ్వాసం చూపావు. భక్తితో ఉన్నా, వైరభావంతో ఉన్నా నాకు కావలసింది నమ్మకం’’ అన్నాడు.


ఇప్పుడు చెప్పండి... శివుడు వేరు... అయ్యప్ప వేరా? నమ్మకం ప్రధానం కాదా? అంత నమ్మకం అప్పుడే శివుడిపై ఉంటే కాపాడే వాడు కాదా? అదే శ్రీకృష్ణుడు ఇక్కడా చెప్పాడు. 

కాబట్టి ఒక దీక్షలో ఉన్న వారిని మరో దీక్షలోకి మార్చకండి. కావలసింది సత్య దీక్ష! అదే భగవంతుడు మెచ్చే దీక్ష.


‘‘ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తున్నారో, పూజిస్తున్నారో వారిని అదే విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. మనుషులందరూ నా మార్గాన్నే అనుసరిస్తున్నారు’’ అన్నాడు. శ్రీకృష్ణపరమాత్మ.


 కాబట్టి దేవుణ్ణి పూజించడానికి రూపం ప్రధానం కాదు.


- గరికిపాటి నరసింహారావు


🌳🪴🌳🪴🌳🪴🌳🪴🌳

చిత్రగుప్తుని ఆలయం

 🔔చిత్రగుప్తుని ఆలయం🔱

            🚩 పరమశివుడు ఈ భూలోకంలో దుష్టశిక్షణగావించి   ధర్మ  స్ధాపన చేయదలిచాడు. పాపాలు చేసినవారిని కఠినంగా శిక్షించి నీతి నియమాలను కాపాడే భాధ్యతను యమధర్మరాజుకు అప్పగించాడు. కానీ ఈ లోకంలోని పాపుల సంఖ్య పెచ్చు పెరిగి విధి నిర్వహణ అసాధ్యంకాగా యమ ధర్మరాజు తనకొక సహాయకుని ఏర్పాటు చేయమని మొరపెట్టుకున్నాడు.  అప్పుడు పరమేశ్వరుడు ఒక బంగారు పళ్ళెంలో ఒక రూపాన్ని చిత్రీకరించాడు. ఆవిధంగా చిత్రం నుండి ఆవిర్భవించినవాడే చిత్రగుప్తుడు. పరమశివుడు చిత్రగుప్తుని కి మానవుల పాప పుణ్యాలు లెక్క కట్టి

యమ ధర్మరాజు వద్దకి తీసుకుని వెళ్ళే బాధ్యతను అప్పజెప్పేడు.

చిత్రగుప్తుని పాప పుణ్యాల లెక్క ప్రకారం యమధర్మరాజు శిక్షలు విధించి వాటిని సక్రమంగా అమలుపర్చి ధర్మాన్ని పరిరక్షిస్తూంటాడు.

అటువంటి ఒక గొప్ప భాధ్యతాయుతమైన విధిని నిర్వహించే చిత్రగుప్తుడు హిమాలయా పర్వతాలలో సుదీర్ఘకాలం తపస్సు చేసి అనేక శక్తులు  సంపాదించాడు.


అటువంటి చిత్రగుప్తునికి ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదిగా ప్రసిధ్ధి పొందిన  కాంచీపురంలో ఒక దేవాలయం  (నెల్లుక్కారర్ వీధిలో) నిర్మించబడి వున్నది. 9 వ శతాబ్దానికి చెందిన చోళరాజులు ఈ అపూర్వ ఆలయాన్ని నిర్మించారు.   కాంచీపురం ఒక్క చోటనే  చిత్రగుప్తుని కి ప్రత్యేక  ఆలయం వున్నది. మూడు అంతస్తుల రాజగోపురం గల ఈ ఆలయంలో చిత్రగుప్తుడు కుడిచేత ఘంటం,ఎడమచేత  తాళపత్రాలు ధరించి ఆశీనముద్రలో దక్షిణాభిముఖంగా  దర్శనమిస్తాడు.


ఇక్కడ చైత్రమాసంలో చిత్రగుప్తునికి ఉత్సవాలు చేస్తారు. చైత్ర పౌర్ణమికి ముందు రోజు చతుర్దశినాడు చిత్రగుప్తునికి

కర్ణకిదేవితో వివాహోత్సవం జరిపి  పౌర్ణమినాడు బ్రహ్మాండమైన ఊరేగింపు జరుపుతారు. 

ఈ ఆలయం కాంచీపురం బస్ స్టాండ్ కి సమీపమున రాజవీధిలో వున్నది. 


 వివాహాది శుభకార్యాల విషయంలో అడ్డంకులున్నవారు   యీ ఆలయానికి వచ్చి పూజలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. 

అలాగే ఈ ఆలయంలోని చిత్రగుప్తుని పూజించినవారికి 

మోక్షం  లభిస్తుందని  భక్తులు ధృఢంగా నమ్ముతారు.

ఎందఱో ఋషులకు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

           🙏🙏🙏🙏

*భారత(ప్ర)దేశం ప్రపంచంలోనే మతం అన్నది లేని ఒక భవ్యమైన భూభాగంగా ఉండేది. ఇది ఎందఱో ఋషులకు నెలవు. వేలకొద్దీ ఋషులు ఈ దివ్యభూమిపైపుట్టారు. వారు మతం ప్రసక్తిలేకుండా, హింస లేకుండా ప్రజాహితార్థం పనిచేశారు. వారిలో కొద్ది మంది పేర్లు మాత్రమే మనకు తెలుసు.* The LEGENDS of Bharath.

*500కు పైగా పురుష,స్త్రీ ఋషుల*

*నామధేయములు:*🙏

👇

1 అంగాయన Angaayana

2 అంబరీష Ambareesha

3 అకృతవ్రణ Akritavrana

4 అక్షిల Akshila

5 అగస్త్య Agastya

6 అగ్నవేశ్య AgnaveShya

7 అగ్నిమాఠర Agnimaathara

8 అగ్నిసౌచీక

(కశ్యప) Agni sowcheeka 

(kasyapa)

9 అఘమన్య Aghamanya

10 అఘమర్షణ Aghamarshana

11 అఘోర Aghora

12 అజ Aja

13 అజామీఢ Ajaameedha

14 అతిథి Atithi

15 అత్రిబౌమ Atribowma

16 అనుహైవ Anuhaiva

17 అనూప Anoopa

18 అనోవేన (మూలాచారి) Anovena (Moolaachaari)

19 అపాండవ Apaandava

20 అప్నవాన Apnavaana

21 అభద్వసు Abhadvasu

22 అభరద్వాసు Abharadvaasu

23 అర్చనాన Archanaana

24 అవత్సార Avatsaara

25 అశ్ని Asni

26 అశ్వల Asvala

27 అశ్వలాయన Asvalaayana

28 అష్టాదంష్ట్ర Ashtaadamshtra

29 అష్టావక్ర Ashtaavakra

30 అసిత Asita

31 అసిత Asita

32 అహరి Ahari

33 ఆకుత్స Aakutsa

34 ఆజమీడ Ajameedha

35 ఆత్మభువ Aatmabhuva

36 ఆత్రేయ Aatraeya

37 ఆత్రేయ 

(సతంభర) Aatreya 

(Satambhara)

38 ఆప Aapa

39 ఆపరి (స్త్రీ) Aapari ( Lady)

40 ఆపస్తంభ Aapastambha

41 ఆయశ్య AayaSya

42 ఆయాస్క Aayaaska

43 ఆవటి Aaavati

44 ఆవత్సార Aavatsaara

45 ఆవాస్య Aavaasya

46 ఆష్ఠల కఠ Aashtalakatha

47 ఆస్మరథ్య Aasmarathya

48 ఆహ్వారక Aahvaaraka

49 ఆహ్వారక Aahvaaraka

50 ఆహ్వారక Ahvaaraka

51 ఇంద్రకౌశిక Indrakausika

52 ఇంద్రప్రమతి Imdrapramati

53 ఇంద్రప్రమద Indrapramada

54 ఇఠింబిఠి Ithimbithi

55 ఇద్మవాహ Idmavaaha

56 ఉఖ Ukha

57 ఉగ్రశ్రవన Ugrasravana

58 ఉచథ్య Uchathya

59 ఉత్కీల Utkeela

60 ఉదంకు Udanku

61 ఉదవేణు Udavenu

62 ఉద్దాలక Uddaalaka

63 ఉల్బణ 

(వశిష్ఠుడి కొడుకు) Ulbana 

(son of Vasishta)

64 ఉవట Uvata

65 ఉశన Usana

66 ఉశన (స్త్రీ) Usana (Lady)

67 ఋచీక Rucheeka

68 ఋజిస్వ Rujisva

69 ఋణవ Runava

70 ఋషభ Rushabha

71 ఋష్యశృంగ Rushyasringa

72 ఔఖేయ Aukheya

73 ఔచత్య auchatya

74 ఔచద్య Auchadya

75 ఔటాక్య Autaakya

76 ఔడుంబర Audumbara

77 ఔడులోమి Audulomi

78 ఔతధ్య Autadhya

79 ఔత్తమోజ Auttamoja

80 ఔదల Audala

81 ఔధ Owdha

82 ఔపక్షయ Aupakshaya

83 ఔపమన్య Aupamanya

84 ఔర్వ Aurva

85 ఔర్వవైదల Aurvavaidala

86 ఔసన Ausana

87 ఔసమర్కట Ausamarkata

88 ఔసిజ Ausija

89 కంకాతి Kankaati

90 కందర్ప Kandarpa

91 కకథ్య Kakathya

92 కక్షక Kakshaka

93 కక్షీవంత Kaksheevanta

94 కఠ Katha

95 కఠ Katha

96 కణాద Kanaada

97 కణ్వ Kanva

98 కపి Kapi

99 కపిల Kapila

100 కపిష్ఠలకఠ Kapishtlakatha

101 కపోతరేత Kapotareta

102 కబంధ Kabandha

103 కరద్విష Karadvisha

104 కరేణుపాల Karenupaala

105 కర్షణాజిని Karshanaajini

106 కలేయ Kaleya

107 కవషు Kavashu

108 కవి 

(భార్గవ) Kavi 

(Bhaargava)

109 కవిభువ Kavibhuva

110 కవిభూతి Kavibhooti

111 కాంచన Kaanchana

112 కాక్షీవత Kaaksheevata

113 కాఠక Kaathaka

114 కాత్యాయన Kaatyaayana

115 కాత్యాయన 

(పునర్వసు) Kaatyaayana 

(punarvasu)

116 కాధక Kaadhaka

117 కాపిభువ Kaapibhuva

118 కాపేయ Kaapeya

119 కాపోల Kaapola

120 కామకాయన Kaamakaayana

121 కాలబవి Kaalabavi

122 కాశకృత్స్న Kaasakritsna

123 కాశ్యప Kaasyapa

124 కుథుమ Kuthuma

125 కురుసుతి Kurusuti

126 కుసీది Kuseedi

127 కుసీది  కుసీది Kuseedi

128 కృష్ణ 

(అంగీరస) Krishna 

(Angeerasa)

129 కేశి Kesi

130 కౌండిన్య Kaundinya

131 కౌత్స Kautsa

132 కౌమ Kauma

133 కౌమండ్య Kaumandya

134 కౌశిక 

(విశ్వామిత్ర) Kausika 

(Visvaamitra)

135 కౌశీతకి Kowseetaki

136 కౌషీతకి Kowsheetaki

137 క్రధక Kradhaka

138 ఖాండికేయ Khaandikeya

139 ఖాదిర Khaadira

140 ఖిల Khila

141 గజ Gaja

142 గర్గ Garga

143 గవిష్టిర Gavishtira

144 గాధి (కౌశిక)

Gaadhi (Kowsika)

145 గాధిన్య Gaadhinya

146 గాలవ 

(బాభ్రవ్య) Gaalava 

(Baabhravya)

147 గృత్స్నమద Gritsnamada

148 గోపాద Gopadha

149 గోబిల Gobila

150 గౌతమ Gautama

151 గౌపాయన Gowpaayana

152 గౌరివీతి (స్త్రీ) Gowriveeti (Lady)

153 గౌరువీత Gowruveeta

154 ఘంటాస్థూల Ghantaasthoola

155 ఘృతకౌశిక Ghritakausika

156 చక్రపాణి Chakrapaani

157 చమస Chamasa

158 చాందృసిష్ఠ Chaandrisishtha

159 చారాయణ Chaaraayana

160 చార్మదుఖ్త Chaarmadukhtha

161 చికిత Chikita

162 చిత్రకేతు 

(వశిష్ఠుడి కొడుకు) citraketu 

(son of Vashita)

163 చైలకి (స్త్రీ) Chailaki (Lady)

164 చ్యవన Chyavana

165 ఛాగలేయ Chagaleya

166 జంభాసుధన Jambhaasudhana

167 జమదగ్ని Jamadagni

168 జయ (స్త్రీ) Jaya (Lady)

169 జాతుకర్ణ Jaatukarna

170 జాతూకర్ణ్య Jaatookarnya

171 జాబాలి Jaabaali

172 జాభ్రేయ Jaabhraeya

173 జారత్కార Jaaratkaara

174 జాహ్నవ Jaanhava

175 జీవంతి Jeevanti

176 జైమిని Jaimini

177 తరణి Tarani

178 తాండుసంజ్ఞక Taandusanjnaka

179 తాండ్య Tandya

180 తాండ్య Taandya

181 తాగాషి Taagaashi

182 తాపాయని Taapaayani

183 తారకాత్య Taarakaatya

184 తార్క్ష్య Taarkshya

185 తావిమౌద్గల్య Taavimowdgalya

186 తిత్తిరి Tittiri

187 తుంబురు Tumburu

188 తైత్తారిక Taittaarika

189 త్రాసదస్యవ Traasadasyava

190 త్రిఖార్వ Trikharva

191 త్రిజట Trijata

192 త్రితు Tritu

193 దద్యంగ Dadyanga

194 దర్పణకర Darpanakara

195 దర్భవహ Darbhavaha

196 దార్థ్యచ్యుత Daarthyachyuta

197 దాల్భ్య Daalbhya

198 దుందుభ Dundhubha

199 దూర్వాస Doorvaasa

200 దేవరాత Devaraata

201 దేవల Devala

202 దేవవల్క్య Devavalkya

203 దేవశ్రవ Devasrava

204 దేవాశ్వ Devaasva

205 దైర్ఘతమ Dairghatama

206 దైవతర Daivatara

207 దైవశ్రవ DaivaSrava

208 దైవోదాస Daivodaasa

209 ద్యుమంతు 

(వశిష్ఠుడి కొడుకు) Dyumantu 

(son of Vasishta)

210 ద్వాంత Dvaanta

211 ద్వార్ఘేయ Dvaargheya

212 ద్వార్షేయ Dvaarsheya

213 ధనంజయ Dhananjaya

214 ధాచ్యుత Dhaachyuta

215 నంది Nandi

216 నకైతిపుత్ర Nakaitiputra

217 నజీగర్త Najeegarta

218 నవ్య Navya

219 నారద Naarada

220 నారాయణ Naaraayana

221 నితుండిల Nitundila

222 నిధ్రువ Nidhruva

223 నిమి Nimi

224 నృమేధ Nrimedha

225 నేత్రపాద Netrapaada

226 నైయిక Naiyika

227 నైరూప Nairoopa

228 పరమావటి Paramaavati

229 పరస్కర Paraskara

230 పరాశర ParaaSara

231 పర్ణజంఘ Parnajangha

232 పల్లవ Pallava

233 పవిత్రపాణి Pavitrapaani

234 పాణిక Paanika

235 పారణ Paarana

236 పార్ధివశిష్ఠ Paardhivasishtha

237 పింగల Pingala

238 పుండరీక Pundareeka

239 పురుకుత్స Purukutsa

240 పురోచిషు 

(వశిష్ఠుడి కొడుకు) Purochishu 

(son of Vasishta)

241 పూతిమానస Pootimaanasa

242 పైంగి Pyngi

243 పైంగ్య pyngya

244 పైత్ర Paitra

245 పైనాయక Painaayaka

246 పైప్పలాద Pyppalaada

247 పైలు Pailu

248 పోర్వాతిధ Porvaatidha

249 పౌండ్ర వత్స Powndravatsa

250 పౌత్రిక Powtrika

251 పౌరాణ Powraana

252 పౌరోదశ powrodaSa

253 పౌరోధ Powrodha

254 పౌష్పంజి Powshpanji

255 ప్రజాపతి Prajaapati

256 ప్రతర్థన Pratarthana

257 ప్రధ Pradha

258 ప్రభాత Prabhaata

259 ప్రశ్వదశ్వ Prasvadasva

260 ప్రస్కణ్వ Praskanva

261 ప్రాగాఢ Praagaadha

262 ప్రాచీన Praacheena

263 ప్రాచ్యకఠ Praachyakatha

264 ప్రాణ్బల Praanbala

265 ప్రాదురాక్షి (స్త్రీ) Praaduraakshi (Lady)

266 ప్రౌఢశిల Prowdhasila

267 ప్రౌల్లేఖ Prowllaekha

268 బంధుల Bandhula

269 బధ్యశ్వ Baddhyasva

270 బహ్వృచ Bahvricha

271 బాదరాయణ (వ్యాస) 

(కృష్ణద్వైపాయన) Baadaraayana (Vyaasa) 

(Krishnadvaipaayana)

272 బార్హదుగ్ధ Baarhadugdha

273 బాలేయ Baaleya

274 బాశ్కల Baaskala

275 బాష్కల Baashkala

276 బాహుగుణ Baahuguna

277 బృహదాశ్వ Brihadaasva

278 బృహదుగ్ధ Brihadugdha

279 బృహస్పతి Brihaspati

280 బైదవ Baidava

281 బైమగవ Baimagava

282 బోధాయన Bodhaayana

283 బోధ్య Bodhya

284 బౌద్ధ్య Bowddhya

285 భద్రాణ Bhadraana

286 భరద్వాజ Bharadvaaja

287 భార్గవ Bhaargava

288 భార్మశ్వ Bhaarmasva

289 భూరిశ్రవ Bhoorisrava

290 భృంగి Bhringi

291 భృగు Bhrigu

292 భృగూర్ధ్వ Bhrigoordhva

293 మంకీ Mankee

294 మతంగ Matanga

295 మత్స్య Matsya

296 మధుచ్చందు Madhuchhandu

297 మనువు (వైవస్వత) Manuvu (Vaivasvata)

298 మయోభవ Mayobhava

299 మయోభువ Mayobhuva

300 మహర్షేయ Maharsheya

301 మహేంద్ర Mahendra

302 మాండలేఖ Maandalekha

303 మాండవ్య Maandavya

304 మాండూక Maanduka

305 మాండూకేయ 

(మాండూకుడి కుడుకు) Maamdookeya 

(son of Maanduuka)

306 మాండ్యూక Maandyooka

307 మాంధాత Maandhaata

308 మాతవచ Maatavacha

309 మాతృచ్ఛాంద్ర Maatrichhaandra

310 మాధూచందన Maadhoochandana

311 మాధ్యందిన Maandhyandina

312 మానవ Maanava

313 మానుతంత్వ Maanutantva

314 మామిక Maamika

315 మార్కండేయ Maarkandeya

316 మాషశరావి Mashasaraavi

317 మాహుల Maahula

318 మిత్ర Mitra

319 మిత్ర 

(వశిష్ఠుడి కొడుకు) Mitra 

(son of Vasihta)

320 మిత్రయువ Mitrayuva

321 మిత్రావరుణ Mitraavaruna

322 ముద్గల Mudgala

323 మునిరాజ Muniraaja

324 మేథాతిథి Metheetithti

325 మేథ్య Methya

326 మేధ (స్త్రీ) Medha (Lady)

327 మైతావరుణ MaitaavaruNa

328 మైత్రాయణ Mytraayana

329 మైత్రాయణి Maitraayani

330 మైత్రేయ Maitreya

331 మౌంజాయన Mownjaayana

332 మౌర్య Mowrya

333 యజ్ఞవాహ Yajnavaaha

334 యవనాశ్వ Yavanaasva

335 యాజ్ఞవల్క్య Yaajnavalkya

336 యాస్కీ Yaaskee

337 రధీతర Radheetara

338 రమ్యాక్షి (స్త్రీ) Ramyaakshi (Lady)

339 రాక్షస Raakshasa

340 రాఘవ Raaghava

341 రాణాయన Raanaayana

342 రాణ్వ Raanva

343 రాహుగణ Raahugana

344 రాహుగుణ Raahuguna

345 రుక్ష Ruksha

346 రేధ Redha

347 రేభ Rebha

348 రైభ Raibha

349 రైవ Raiva

350 రైవణ Raivana

351 రోమ హర్షను Romaharshanu

352 రోమశ 

(లోమశ) Romasa 

(Lomasa)

353 రోహిణేయ RohiNeya

354 రోహిత Rohita

355 రౌక్షక Rowkshaka

356 రౌరుకి Rowruki

357 లాంగలి Laangali

358 లోపాముద్ర 

(అగస్త్యుడి భార్య) Lopamudra 

(Agstyaa’s wife)

359 లోహిత Lohita

360 లౌగాక్షి Lowgaakshi

361 లౌగాక్షి (స్త్రీ) Lowgaakshi (Lady)

362 వందన Vandana

363 వందవ Vandava

364 వటుక Vatuka

365 వత్సపి Vatsapi

366 వత్సార Vatsaara

367 వధ్రయశ్వ Vadhrayasva

368 వరతంతు Varatantu

369 వరాఖ్య Varaakhya

370 వరుణ Varuna

371 వసుకృత్తు Vasukrittu

372 వసుభృద్యాను 

(వశిష్ఠుడి కొడుకు) Vasubhridyaanu 

(son of Vasishta)

373 వసుస్రుత Vasusruta

374 వాత్య Vaatya

375 వాత్సాయన Vaatsaayana

376 వాత్స్య Vaatsya

377 వాద్భూతక Vaadbhootaka

378 వాధుల Vaadhula

379 వామదేవ Vaamadeva

380 వామరథ్య Vaamarathya

381 వాయవ్య Vaayavya

382 వారుని (స్త్రీ) Vaaruni (Lady)

383 వార్తాంతర Vaartaamtara

384 వాలఖిల్య Vaalakhilya

385 విఖానస Vikhaanasa

386 విచఖ్యు Vichakhyu

387 విదర్భి (స్త్రీ) Vidarbhi (Lady)

388 విద్యున్నుత Vidyunnuta

389 విభాండక Vibhaandaka

390 విభ్రాట్ Vibhraat

391 విరచు 

(వశిష్ఠుడి కొడుకు) Virachu 

(son of Vasishta)

392 వివస్వత Vivasvata

393 విశ్వనార (స్త్రీ) Vosvanaara (Lady)

394 విశ్వరూప Visvaroopa

395 విష్ణువర్ధన Vishnuvardhana

396 వీతహవ్య Veetahavya

397 వీరసేన Veerasena

398 వృత Vrita

399 వృష (స్త్రీ) Vrisha (Lady)

400 వేణ్య Venya

401 వైణవ vainava

402 వైతహవ్య Vaitahavya

403 వైద Vaida

404 వైన Vaina

405 వైరోహిత్య Vairohitya

406 వైశంపాయన VaiSampaayana

407 వ్యోమ Vyoma

408 శంపాక Sampaaka

409 శంభూక Sambhooka

410 శక్త్య Saktya

411 శక్ల్య Saklya

412 శతపథ Satapatha

413 శతబలాక్ష Satabalaaksha

414 శతమర్షణ Satamarshana

415 శతానంద Sataananda

416 శరద్వత Saradvata

417 శరభాంగ Sarabhaanga

418 శలావత Salaavata

419 శాంఖాయన Saankhaayana

420 శాండిల్య Saandilya

421 శాంభవ్య Saambhavya

422 శాకల 

(వేదమిత్ర) Saakala 

(Vedamitra)

423 శాఠరమోఠక Saatharamothaka

424 శాపేయ Saapeya

425 శాలంకాయన Saalankaayana

426 శాలిద్వాత Saalidvaata

427 శిరింబిక 

(భరద్వాజుడి కూతురు) Sirimbika 

(Bhardvaajaa’s daughter)

428 శివకర్ణ Sivakarna

429 శుక Suka

430 శుక్ల Sukla

431 శునఃశేప Sunahasepa

432 శైన్య Sainya

433 శైలాలయ Sailaalaya

434 శైలాలి Shailali

435 శైశిర Saisira

436 శైశిర Saisira

437 శౌంగ Sownga

438 శౌచేయ Sowcheya

439 శౌద్రేయ Sowdreya

440 శౌనక Sownaka

441 శౌనహోత్ర Sownahotra

442 శ్యావాశ్వు Syaavsvu

443 శ్యావాస్వ Syaavaasva

444 శ్రీధర Sreedhara

445 శ్రీవత్స Sreevatsa

446 శ్రుతకక్ష Srutakaksha

447 శ్రౌమత Srowmata

448 శ్వావాశ్వ SvaavaaSva

449 శ్వేత Sweta

450 షడ్వింశ Shadvimsa

451 సంకృత్య Samkritya

452 సంభవాహ Sambhavaaha

453 సంవర్తక Samvartaka

454 సత్య Satya

455 సత్యధృత Satyadhrita

456 సత్యశ్రవ Satyahityasrava 

457 సత్యశ్రీ Satyasree

458 సత్యస్రవన Satyasravana

459 సత్యహిత Satyahita

460 సత్వలాయన Satvalaayana

461 సనందన Sanandana

462 సనక Sanaka

463 సనత్కుమార Sanatkumaara

464 సప్తవద్రి Saptavadri

465 సర్ప రాజ్ఞి (స్త్రీ) Sarparaajni (Lady)

466 సలపర్ణ Salaparna

467 సలభ  శలభ Salabha

468 సవ్య Savya

469 సాంఖ్యాయన Saankhyaayana

470 సాకేతాయన Saketaayana

471 సాట్యాయన Saatyaayana

472 సాత్యకాయన Saatyakaayana

473 సాత్యముగ్ర Saatyamugra

474 సారంగరద Saarangarada

475 సారవాహ Saaravaaha

476 సాలంకృత Saalankrita

477 సాలావత Saalaavata

478 సాహుల Saahula

479 సుందర Sundara

480 సుకక్ష Sukaksha

481 సుకర్మ 

(జైమిని పుత్రుడు) Sukarma 

(son of Jaimini)

482 సుకాంచన Sukaanchana

483 సుతంబర Sutambara

484 సుతీక్షణ Suteekshana

485 సుతీష్ణ Suteeshna

486 సునామ Sunaama

487 సునీతి(స్త్రీ) Suneeti

488 సుబ్రహ్మణ్య Subrahmanya

489 సుమంగళ Sumangala

490 సుమంత Sumanta

491 సుమన్తు 

(జైమిని పుత్రుడు) Sumantu 

(son ofJaimini)

492 సుమస్త Sumasta

493 సుమేధ Sumedha

494 సువర్ణ Suvarna

495 సువర్ణరేతస Suvarnaretasa

496 సూత Soota

497 సూతపౌరాణిక Sootapowraanika

498 సోమరాజక Somaraajaka

499 సోమవాహ Somavaaha

500 సౌపర్ణ Sowparna

501 సౌభగ Sowbhaga

502 సౌభరి Sowbhari

503 స్కంద Skanda

504 స్వతంత్ర కపి Svatantra kapi

505 హంస Hamsa

506 హయగ్రీవ Hayagreeva

507 హయశ్రీ Hayasree

508 హరిత Harita

509 హరివక్త్ర Harivaktra

510 హరివల్క్య Harivalkya

511 హలేయ Haleya

512 హారీత Haareeta

513 హిరణ్య Hiranya

514 హిరణ్య స్తూప Hirancyastoopa

515 హిరణ్యస్తంభ Hiranyastambha

516 హైమ (స్త్రీ) Haima (Lady)

517 హైమవర్చశ Haimavarchasa

518 హైమోదక Haimodaka

🙏🙏🙏🙏🙏thank you...


 *సేకరణ:* వాట్సాప్ పోస్ట్

 🪔 *ॐ卐 _-||శుభోదయమ్-సుభాషితమ్||-_ ॐ卐*💎


*పఠనైర్ర్గంధ నిర్మాణైః ప్రతిష్ఠాతావదాప్యతే౹*

*ఏవంచ తథ్యవ్యుత్పత్తి రాయుషోన్తే భవేన్నవా॥* 



తా౹౹ *పుస్తకాలను చదవడం వల్లనూ - శిష్యులకు బోధించడం వల్లనూ-,కావ్యాలను వ్రాయడం వల్లనూ-పేరు ప్రతిష్ఠ కలుగవచ్చు*..... కానీ *నిజమైన శాస్త్ర జ్ఞానము* పొందినాడనుటకు వీలులేదు.... అది *ఆయుస్సు తీరేలోగా లభిస్తుందో లేదో సందేహమే*!!!

పరమాచార్య లిలాద్భుతం

 పరమాచార్య లిలాద్భుతం


కంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి నా సోదరుడు గొప్ప భక్తుడు. అప్పుడు మహాస్వామివారు ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం, వారి ఉపదేశములు వినడం కోసం వేలమంది భక్తులు వస్తున్నారు. అప్పుడు చాలా కష్టాల్లో ఉన్న నా సోదరుడు ఒక మూలాన కూర్చుని ఉన్నాడు. స్వామివారి వద్దకు వెళ్లి ఆశీస్సులు పొందాలని కోరిక ఉన్నా ఆ భక్తుల రద్దీలో వెళ్ళలేక నిస్సహాయుడై అలా ఉండిపోయాడు. హఠాత్తుగా స్వామివారు “దుర్గాప్రసాద్, ఇలా రా!” అని పిలిచారు. తన పేరేంటో తనని ఎలా పోల్చుకున్నారో ఆ దేవుడికి, పరమాచార్య స్వామివారికి మాత్రమే తెలుసు. అప్పటికి ఒక్కసారి కూడా స్వామివారిని కలవలేదు నా సోదరుడు. ఆశ్చర్యంతో భక్తులు దారి విడువగా నడుచుకుంటూ వెళ్లి, స్వామికి సాష్టాంగం చేసి కన్నీళ్ళతో స్వామివారి చరన కమలాలను అభిషేకించాడు. స్వామివారు తనని లేవదీసి, ఓదార్చి మంచి రోజులు వస్తాయని, ఒక కుమారుడు కూడా కలుగుటాడని ఆశీర్వదించారు. స్వామివారి మాటలు నిజమై తన పరిస్థితి బాగుపడి ఒక కుమారుడు కూడా కలిగాడు. పరమాచార్య స్వామికి కృతజ్ఞతగా వాడికి చంద్రశేఖరన్ అని పేరు పెట్టుకున్నాడు.


మరొక్క అనుభవం నా జీవితంలో జరిగినదే. పరమాచార్య స్వామి వంటి మహాత్ములను నేను గౌరవిన్చేవాడిని కాని, అక్కడున్న భక్తుల రద్దీకి భయపడి వారి వద్దకు వెళ్ళేవాడిని కాను. ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్లాను. నలభైల్లో నేను ఉన్నత పాఠాశాలలో చదివేవాడిని. కొత్తకొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్త అవ్వాలని నా కోరిక. అలా ఒకసారి మొటిమలతో బాధపడుతున్న నేను, దానికి మందు కనుక్కోవాలని సాలిసిలిక్ ఆసిడ్ ను కర్పూరం, నూనెలతో కలిపి నుదుటన పూసుకున్నాను. దాంతో భరించలేని మంట మొదలయ్యింది. వెంటనే మొహం కడుక్కుని అద్దంలో చూసుకుంటే, దేవుడా! నుదురు పైన చాలా భాగం చర్మం కాలిపోయి, మాంసం కనబడుతోంది. ఏవో కొన్ని లేపనాలు పూసినా చర్మం బాగా కమిలిపోయి, చూడడానికి వికారంగా తయారయ్యింది. మావాళ్ళు భయపడి ఎందఱో వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. అసలు ఏం జరిగిందంటే, సాలిసిలిక్ ద్రావకం(ఫీనాల్ కాంపౌండ్) కర్పూరంతో కలిసి రసాయనిక చర్య జరిగి కణజాలన్ని కాల్చే ఫీనాల్ విడుదలయ్యింది. ఇది నేను తరువాత చేసిన పరిశోధనలో కనుగొన్నాను. ఏమైతేనేమి చాలా నెలలు గడిచిపోయాయి, మచ్చ అలా మిగిలిపోయింది.


ఒకరోజు రాత్రి నాకు ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. మామూలుగా ఉదయం లేవగానే నాకు వచ్చిన కలలను మర్చిపోతుంటాను. కాని అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక ముసలి బ్రాహ్మణుడు, నుదుటన పెద్ద కుంకుమ తిలకంతో నాముందు నిలుచుని, “నాకు తెలుసు. ఈ మచ్చ గురించి నువ్వు బాగా ఆందోళన పడుతున్నావు. ఒక నెలరోజుల పాటు ఉదయాన్నే బావినీళ్ళతో తలస్నానం చెయ్యి. సాయింత్రం పూట నాగేశ్వర స్వామి దేవాలయానికి(మా ఇంటి వద్ద ఉంది) వెళ్ళు. మూడు ప్రదక్షిణలు చేసి, తప్పక శివలింగాన్ని దర్శించు. నెలరోజుల తరువాత నీ రూపు నీకు తిరిగొస్తుంది” అని చెప్పారు.


మొదట నేను ఆ కలకి అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు, కాని ఆయన రూపం పదే పదే కళ్ళముందు మెదలసాగేది. ఎందుకు ఆ సలహా పాటించకూడదు అనుకున్నాను. అదేమీ పెద్ద కష్టం ఏమి కాదుకదా! మరుసటిరోజు సూర్యోదయాత్పూర్వమే లేచి, బావి వద్దకు వెళ్లి గజగజలాడే చలిలో చన్నీళ్ళ స్నానం చేశాను. మంచి వేసవిలో కూడా వేడినీటి స్నానం చేసే అలవాటు నాకు. అందువల్ల ఆలస్యంగా లేచేవాడిని. అలాంటి స్థితిలో నేను తెల్లవారుఝామునే లేచి, నవంబర్ చలిలో బావి నీటితో చన్నీటి స్నానం చెయ్యడం మావాళ్ళని ఆశ్చర్యానికి గురిచేసింది. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాను.


సాధారణంగా నేను నాస్తికుడిని, అంతగా భక్తిభావం లేనివాడిని. కనుక చాలా అరుదుగా దేవాలయాలకు వెళ్ళేవాడిని. కాని ముందుగానే నిర్ణయించుకున్నట్టుగా, సాయంత్రం నాగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి, మూడు ప్రదక్షిణలు చేసి, శివలింగాన్ని దర్శించుకునేవాణ్ణి. ఏవైనా బలమైన కారణాల వల్ల వెళ్ళడం కుదరకపోతే, మరుసటిరోజు వెళ్ళినప్పుడు దేవునికి క్షమాపణ చెప్పి, బాకీపడ్డ ప్రదక్షిణలు కూడా చేసేవాణ్ణి. అలా కలలో బ్రాహ్మణుడు చెప్పినట్టుగా తప్పకుండా చేశాను.


అన్ని రోజులూ మంచం నుండు లేవగానే ఎంతో ఆశతో అద్దంలో చూసుకునేవాణ్ణి. కాని ఈ ముప్పై రోజులూ ఏమి జరగలేదు సరికదా మెరుగవుతున్నట్టు కూడా కనబడలేదు. కాని నన్ను నమ్మండి, ముప్పైఒకటో రోజు మామూలుగా లేచి అద్దంలో చూసుకుంటే, నన్ను ఆశ్చర్యానందాలకు గురిచేస్తూ, మొత్తం మచ్చ వెళ్లిపోయింది.


న ముఖం మునుపటిలా అయ్యింది. ఈ విషయం మావాళ్ళందరికీ తెలిపాను. ఎన్నో దశాబ్దాలు గడిచిపోవడంతో, ఈ విషయం మొత్తం మరచిపోయాను. కాని ఈరోజు (25/9/1993) జరిగిన ఒక అద్భుత విషయం వల్ల నలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఏ సంఘటనని జ్ఞాపకాల పొరలలో నుండి తవ్వి తీయాల్సివచ్చింది. నిన్న నేను ఒక సెమినార్ కోసం మద్రాసుకు వచ్చాను. ‘హిందూ ధర్మ సంఘం’ కార్యదర్శి వి. మీనాక్షిసుందరంని కలవడానికి నాకు ఇది ఒక అవకాశం. వరోటి దాదాపు గంటసేపు చర్చించాను. ఆ సంభాషణలో భాగంగా కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారితో నాకు ఉన్న ఒక అనుభవాన్ని వాళ్ళు ప్రచురించబోయే సావనీర్ కోసం చెప్పమని అడిగారు. నాకు అలాంటి వ్యక్తిగత అనుభవం ఏమీ లేదని తెలిపాను. కాని మరలా వారు ఇదే విషయం అడుగగా, నేను లేదని తెలిపి, నా సోదరునికి ఒక అనుభవం ఉందని మొత్తం విషయం వారికి తెలిపాను. వెంటనే దాన్ని ఒక వ్యాసంగా వ్రాసి వారికి పంపమని అడిగారు. తరువాత వి. మీనాక్షిసుందరం గారింట్లో పరమాచార్య స్వామివారి చిత్రాలు కొన్ని చూశాను.


నా బసకు వెళ్తుండగా నా కళ్ళ ముందు స్వామివారి చిత్రం ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఆ చిత్రాన్ని ఎక్కడో, ఎప్పుడో చూశాను అని అనిపిస్తోంది. కాని ఎక్కడ చూశానో గుర్తురావడం లేదు. నా ఆలోచనలన్నీ ఆ చిత్రం గురించే. గదిలోకి వచ్చి ఆలోచనల్లో పడ్డాను. హఠాత్తుగా నలభైఏళ్ళ క్రితం నా కలలో కనబడిన బ్రాహ్మణ స్వామి ముఖం కళ్ళ ముందు మెదలాడింది. అద్భుతాలకే అద్భుతం! అవును అదే చిత్రం. మీనాక్షిసుందరం ఇంటినుండి వస్తున్నప్పుడు కూడా నా కళ్ళకు కనిపించిన చిత్రం కూడా అదే. నాలుగు దశాబ్దాల తరువాతా కూడా నాకు ఆ బ్రాహ్మణ స్వామి బాగా గుర్తు. నిజానికి ఆ వయస్సులో నాకు మహాస్వామి వారి గురించి ఏమీ తెలియదు. కాని స్వామివారే నా కలలో కనబడి నా ఆర్తిని తీర్చి, బాధను పోగొట్టారు. అందుకే అంటారు దేవుని లీలలు అత్యద్భుతాలు. ఇంతటి కరుణ నేను పొందడానికి ఎవరు కారకులో మరి.


కాకతాళీయమో ఏమో, మా ఇంటిపేరు ‘కంచి’. నా పేరులోని మొదటి అక్షరం ఇదే. మా తాతముత్తాతలు కంచి నుండి వచ్చినవారే. బహుశా ఈ ‘కంచి’ సంబంధమే నన్ను పరమాచార్య స్వామివారి చరణకమలాల వద్దకు తెచ్చిందేమో. ‘నడిచే దేవుడి’ గా ప్రసిద్ధినొందిన కంచి పరమాచార్య స్వామివారి అనుగ్రహాన్ని పొందడం నా అదృష్టం. మనం భగవంతుణ్ణి చూడాలి అనుకుంటే ఆయనే మనపై దయతలచి మన పంచేద్రియాలకు అగుపడే రూపాన్ని ధరించి రావాలి. అలా భక్తుల కోసం వచ్చిన దేవుడే మన పరమాచార్య స్వామివారు.


ఓం సద్గురవే నమః


--- కె. ఆర్. కె మోహన్, “kamakoti.org” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నాభి విజ్ఞానం

 నాభి విజ్ఞానం👨🏻‍⚕️


 మన బొడ్డు బటన్ (NABHI) అనేది మన సృష్టికర్త మనకు అందించిన అద్భుతమైన బహుమతి.  62 ఏళ్ల వ్యక్తికి ఎడమ కంటికి చూపు సరిగా లేదు.  అతను రాత్రిపూట ప్రత్యేకంగా చూడలేడు మరియు అతని కళ్ళు మంచి స్థితిలో ఉన్నాయని కంటి నిపుణులు చెప్పారు, కానీ ఒకే సమస్య ఏమిటంటే అతని కళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే సిరలు ఎండిపోయాయి మరియు అతను మళ్లీ చూడలేడు. 


 సైన్స్ ప్రకారం, గర్భం దాల్చిన తర్వాత సృష్టించబడిన మొదటి భాగం బొడ్డు బటన్.  ఇది సృష్టించబడిన తర్వాత, అది బొడ్డు తీగ ద్వారా తల్లి మావికి కలుస్తుంది.


 మా బొడ్డు బటన్ ఖచ్చితంగా అద్భుతమైన విషయం!  సైన్స్ ప్రకారం, ఒక వ్యక్తి మరణించిన తర్వాత, బొడ్డు బటన్ ఇప్పటికీ 3 గంటల పాటు వెచ్చగా ఉంటుంది, దీనికి కారణం ఒక స్త్రీ బిడ్డను గర్భం దాల్చినప్పుడు, ఆమె బొడ్డు బటన్ పిల్లల బొడ్డు బటన్ ద్వారా బిడ్డకు పోషణను అందిస్తుంది.  మరియు పూర్తిగా ఎదిగిన బిడ్డ 270 రోజులు = 9 నెలల్లో ఏర్పడుతుంది.


 మన సిరలన్నీ మన బొడ్డు బటన్‌తో అనుసంధానించబడి ఉండటం వల్ల ఇది మన శరీరానికి కేంద్ర బిందువుగా మారుతుంది.  బొడ్డు బటన్ అంటే ప్రాణం!


 "PECHOTI" బొడ్డు బటన్ వెనుక ఉంది, దానిపై 72,000 ప్లస్ సిరలు ఉన్నాయి.  మన శరీరంలో ఉన్న రక్త నాళాల మొత్తం భూమి చుట్టుకొలతకు రెండు రెట్లు సమానం.


 బొడ్డు బటన్‌కు నూనెను పూయడం వల్ల కళ్లు పొడిబారడం, కంటి చూపు సరిగా లేకపోవడం, ప్యాంక్రియాస్ పై లేదా కింద పని చేయడం, మడమలు మరియు పెదవులు పగిలిపోవడం, ముఖం మెరిసిపోవడం, మెరిసే జుట్టు, మోకాళ్ల నొప్పులు, వణుకు, నీరసం, కీళ్ల నొప్పులు, పొడి చర్మం వంటి వాటిని నయం చేస్తుంది.


 *కళ్లు పొడిబారడం, కంటి చూపు మందగించడం, గోళ్లలో ఫంగస్, మెరిసే చర్మం, మెరిసే వెంట్రుకలకు నివారణ*


 *రాత్రి పడుకునే ముందు, మీ బొడ్డు బటన్‌లో 3 చుక్కల స్వచ్ఛమైన నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేసి, మీ బొడ్డు చుట్టూ 1 మరియు అర అంగుళం విస్తరించండి.*

 

 *మోకాళ్ల నొప్పులకు*


 రాత్రి పడుకునే ముందు, మీ బొడ్డు బటన్‌లో *3 చుక్కల ఆముదం* వేసి, మీ బొడ్డు చుట్టూ 1 మరియు అర అంగుళం విస్తరించండి.


 *వణుకు మరియు నీరసం కోసం, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం, పొడి చర్మం*


 రాత్రి పడుకునే ముందు, మీ బొడ్డు బటన్‌లో *3 చుక్కల ఆవాల నూనె* వేసి, మీ బొడ్డు చుట్టూ 1 మరియు అర అంగుళం విస్తరించండి.


 *మీ బొడ్డు బటన్‌లో నూనె ఎందుకు వేయాలి?*


 మీ బొడ్డు బటన్ ఏ సిరలు ఎండిపోయాయో గుర్తించి, దానికి ఈ నూనెను పంపుతుంది కాబట్టి వాటిని తెరవండి.


 శిశువుకు కడుపునొప్పి వచ్చినప్పుడు, మేము సాధారణంగా *ఇంగువ (హింగ్)* మరియు నీరు లేదా నూనెను కలిపి, నావల్ చుట్టూ అప్లై చేస్తాము.  నిమిషాల్లో నొప్పి నయమవుతుంది.  చమురు అదే విధంగా పనిచేస్తుంది.


 ప్రయత్నించు.  ప్రయత్నించడం వల్ల నష్టమేమీ లేదు.


 మీరు మీ మంచం పక్కన అవసరమైన నూనెతో ఒక చిన్న డ్రాపర్ బాటిల్‌ను ఉంచవచ్చు మరియు నిద్రపోయే ముందు నాభిపై కొన్ని చుక్కలు వేసి మసాజ్ చేయవచ్చు.  ఇది ప్రమాదవశాత్తు స్పిల్‌ను పోయడం మరియు నివారించడం సౌకర్యంగా ఉంటుంది.


 చాలా మంచి స్నేహితుడి నుండి అందుకున్న ఈ విలువైన మరియు చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని నేను ఫార్వార్డ్ చేస్తున్నాను. ఇది నిజంగా అద్భుతమైనది. స్నేహితుడికి కోటి కృతజ్ఞతలు. స్నేహితులతో పంచుకున్నందుకు సంతోషంగా ఉంది.


 గౌరవంతో


 డా. అజయ్ దూబే

 సహాయ ఆచార్యులు

 MDNIY ఆయుష్ మంత్రిత్వ శాఖ

 ప్రభుత్వ  భారతదేశం.

అగరుబత్తి (పరిమళం)

 అగరుబత్తి (పరిమళం)


     కొత్తగా పెళ్లయిన కూతురు పుట్టింటికి వచ్చి, కొన్ని రోజుల తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లేటపుడు తన తండ్రి కూతురుకు ఒక అగరుబత్తి డబ్బాను కానుకగా ఇచ్చాడు.. 

 

  అది చూసిన తల్లి ముఖం చీదరించుకుని.., మీ నాన్న ఎప్పుడూ ఇంతే, మహా పిసినారి.. అంటూ లోపలికి వెళ్లి మంచి బ్లౌస్ పీసులు రెండు మరియు దానిపైన డబ్బులతో ఉన్న ఒక కవరును పెట్టి కూతురుకు ఇచ్చి అత్తారింటికి పంపించింది.. తను కూడా ఏమి అనకుండా అత్తారింటికి వెళ్లిపోయింది. 


     మరుసటిరోజు అత్తారింట్లో ఉదయమే దేవుని ఇంట్లోకి వెళ్లి దీపం పెట్టి తండ్రి ఇచ్చిన అగరుబత్తిని వెలిగించింది.. 

డబ్బాలో నుండి అగరుబత్తిని తీసేటప్పుడు అందులో నుంచి ఒక కాగితపు చీటి బయటపడింది.. 

అది తీసి చూస్తే తండ్రి చేతిరాతతో రాసిన ఒక సందేశం కనిపించింది. అది చదివి తను ఒక్కసారిగా బిక్కి బిక్కి ఏడవడం మొదలుపెట్టింది.. తను ఏడవటం చూసి ఒక్కసారిగా అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు.. ఏమైందీ.. ఏమైందీ అంటూ అడగసాగారు.. తను తన చేతిలో ఉన్న చీటిని అత్త చేతిలో పెట్టింది.. 


    ఆ చీటిలోని 'సందేశం' ఇలా ఉంది.. 


      అమ్మా.. నీవు పెళ్ళయిన  తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చి.. తిరిగి వెళుతున్నప్పుడు,  నీ తండ్రిగా నీకు ఏమి కానుక ఇవ్వాలని చాలా ఆలోచించాను.. 


     దేవుని దయవలన నీ మనస్సుకు తగిన భర్త , అంతఃకరణం చూపించే అత్తమామలు నీకు లభించారు.. 

ఇప్పుడు నేను నీకు ఒక సుగంధభరితమైన అగరుబత్తి డబ్బాను నీకు కానుకగా ఇస్తున్నాను... ఇదేమిటి అని ఆశ్చర్యం కలిగింది కదూ.. మీ నాన్న బాగా కంజూస్ అనుకుంటున్నావ్ కదా.. 

కాదు.. కాదు.. 


     మీ అమ్మ, పెళ్ళి తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు అందరినీ ఎలా కలుపుకుని పోయి ఏ విధంగా వ్యవహరించిందో.. నువ్వు కూడా అదే రీతిగా అందరినీ కలుపుకుపోవాలి.. 


    ఏ విధంగా ఐతే అగరుబత్తి కాలుతూ, తాను బూడిద ఐనా పరవాలేదు తన సుగంధాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుందో. . అదే విధంగా నువ్వు కూడా అందరి మన్ననలు పొందుతూ , నీ ఇంట్లో మాత్రమే కాదు, చుట్టు పక్కల ఇండ్లలో కూడా మంచి పేరు తీసుకురావాలి.. ఈ నా చిన్న కానుక ఎల్లప్పుడు నీకు గుర్తుండాలి.. నీ జీవితం సాఫీగా సాగాలి...ఇది మీ నాన్న కోరిక.. 


     ఇది చదివి అత్త కళ్ళు చెమ్మగిల్లాయి.. కోడలిని కౌగలించుకుని, ఇటువంటి సంస్కారవంతమైన ఇంటి నుండి మాకు కోడలు రావడం , ఇటువంటి మంచి సంబంధికులను పొందడం.. నిజంగా మేము ధన్యులం... 🙏

ఎందుకు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

ఒక నాస్తికుడికి కరోనా

సోకింది. తీసుకెళ్లి ఆసుపత్రిలో వేశారు!

సిలిండర్ తీసుకొచ్చి

ఆక్సిజన్ పెట్టారు!

ఈ లోపల భార్య గుడికెళ్ళి

భర్త పేరు మీద అర్చన చేయించి ఆసుపత్రికి వచ్చింది.

ఆమె నాస్తికురాలు కాదు!

ఆసుపత్రి కొచ్చి భర్త తో

అన్నది" ఏమండి..

గుళ్లో మీ పేరు మీద

అర్చన చేయించి 

అమ్మ వారి కుంకుమ

తీసుకుని వచ్చినాను..

పెట్టుకోండి.

ఇది పెట్టుకుంటే మీరు

త్వరగా కోలుకుంటారు!

నాస్తికుడు అయిన భర్త

కోపంగా నీకేమైనా పిచ్చా..

నా సంగతి తెల్సుకదా నీకు

సరే..ఒక మాట అడుగుతాను నాకు జవాబు చెప్పు..

మీ దేవుడు సర్వాంతర్యామి కదా

అంతటా వ్యాపించి

ఉంటాడు కదా...

అలాంటప్పుడు

దేవుడికి గుడి ఎందుకు?

భార్య అమాయకంగా

ఇలా అడిగింది.

ఏమో నాకేం తెల్సుండి..

కానీ నాకు మీలాగే

ఒక అనుమానం

దానికి మీరు చెప్పిండి

జవాబు..

అదేంటిటే ఆక్సిజన్ కూడా

అంతటా వ్యాపించి ఉంటుంది కదా..

మరి మీకు ఆక్సిజన్ఇవ్వటానికి సిలిండర్

ఎందుకు?

ఇంకేముంది...

మొగుడు గుడ్లు తేలేసి

గుటకలు మింగాడు 😒

*సేకరణ* :- వాట్సాప్ పోస్ట్.