13, డిసెంబర్ 2025, శనివారం

హిందూ ధర్మం

  🌹హిందూ ధర్మం 🌹


క్రియతే అనేన ఇతి కర్మ - చేయబడేది ఏదైనా కర్మయే. కర్మ అనేది సంస్కృత పదం. అది 'కృ' అనే ధాతువు నుంచి వచ్చింది. కర్మ అంటే మానసికంగా కానీ, శారీరికంగా కాని చేసినది. పూర్తయిన పనిని కర్మ అని, జరుగుతున్న పనిని క్రియ అని అంటారు.

అలాగే వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుందంటే కర్మకు సంబంధించిన విషయంలో మూడు విభాగాలు ఉంటాయి. కర్త, కర్మ, క్రియ. కర్త అంటే చేయువాడు, క్రియ అంటే చేయబడుతున్న కార్యం, కర్మ అంటే చేయబడిన కర్మ యొక్క ఫలం. కర్త, క్రియ లేకపోతే కర్మ ఉండదు. నేను చేస్తున్నాను అనే భావనతో, ఆథ్యాత్మ నిష్ఠగా ఇంద్రియాల చేత, అంటే శబ్ద (వినడం), స్పర్శ (తాకడం), రూప (చూడటం), రస (రుచి చూడతం), గంధాలతో (వాసన చూడటం) చేసే వ్యాపరమే కర్మ. మనస్సు కూడా ఒక ఇంద్రియమే కనుక మనస్సుతో చేసేది కూడా కర్మయే అవుతుంది.

అలాగే కర్మలను మూడు రకాలు చేస్తుంటాము. కాయిక (శరీరంతో చేసేవి), వాచిక (మాటల ద్వారా), మానసిక (మనస్సుతో) చేసే కర్మలు. ఈ మనస్సు, వాక్కు, కాయాలనే త్రికరణములు అంటారు. 

త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకం కూడా మెచ్చుతుంది.

కర్మకు కులమతాలు, ప్రాంత, లింగ భేదాలు లేవు. ఈ లోకంలో అందరు కర్మలు చేస్తారు, ఫలం అనుభవిస్తారు. ఇది మన కళ్లకు కనిపిస్తూనే ఉంది.

అలాగే కర్మలో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి చేయడం. ఇది బాహ్య స్వరూపం లేదా దృశ్య స్వరూపం. రెండు దాచడం. ఇది అంతర్గత స్వరూపం లేదా అదృశ్య స్వరూపం. మూడు సరైన సమయంలో దానికి సరైన ఫలితాన్ని ఇవ్వడం. ఇది కర్మ ఫలానుభవం అంటే చేసిన కర్మకు ఫలితాన్ని అనుభ వించటం

ఈ ప్రపంచంలోని ఏ మనిషి కూడా ఏ కాలంలోనైనా క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. దీనిలో ఎలాంటి సందేహంలేదు. ఎందుకంటే మనుష్యులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకు లోబడి కర్మలను చేయాల్సి ఉంటుంది అంటారు కృష్ణ పరమాత్మ.

కర్మ అంటే పని లేదా కార్యము లేదా క్రియ అని చెప్పేది సులభమైన అర్ధం. కానీ కార్యకారణ నియతితో నడిచే ఈ విశ్వగతికి కూడా కర్మ అనే పదం అన్వయమవుతుంది. కార్యం అంటే ఫలము/ ప్రయోజనము (Effect). కారణమంటే ఆ ఫలానికి గల హేతువు/ కారణము (Cause). విశ్వచైతన్యం ఈ విశ్వాన్ని ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగానే నడిపిస్తుంది.


పాపకార్యమైనా, పుణ్యకార్యమైనా దాన్ని కర్మ అనే అంటారు. సత్ఫలితాన్నిచ్చే కర్మను సత్కర్మ అని, దుష్ఫలితాన్ని (చెడు ఫలాన్ని) ఇచ్చే కర్మను దుష్కర్మ అని అంటారు.


అవశ్యమను భోక్తవ్యం కృతాకర్మ శుభాశుభమ్ ......

చేసిన పని మంచిదైనా, చెడ్డదైనా, దాని ఫలితాన్ని అవశ్యం అనుభవించి తీరాలని శాస్త్రవాక్కు. చేసిన కర్మకు ఫలితం అనుభవించకుండా తప్పించుకోనుట అసాధ్యం. అది భగవంతుడు ఏర్పరిచిన నియమం. అయితే ఒక కర్మ (పని) చేసినప్పుడు, అవి ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి కర్మలను 3 రకాలుగా విభజించారు. అవి 1) ఆగామి కర్మలు, 2) సంచిత కర్మలు, 3)ప్రారబ్ధ కర్మలు 


అంటే ఒక విత్తనం వేసినప్పుడు, అది మొక్కయై, చెట్టు గా మారి, మొగ్గ వేసి, పువ్వు పూసి, పిందే గా మారి, కాయ (పచ్చి) గా రూపాంతరం చెంది, అనుభవించేందుకు సిద్ధం అవుతుంది, అంటే పక్వానికి వస్తుంది, పండుతుంది. అలా మనం చేసిన కర్మ పక్వానికి (కర్మ పండడానికి) పట్టే సమయం బట్టి వాటిని పై మూడింటిగా విభాగం చేశారు.


1- ఆగామి కర్మ - మనం చేసే కొన్ని పనులకు వెంటనే, ఇప్పటికిప్పుడే ఫలం లభిస్తుంది. వాటిని ఆగామి కర్మలు అంటాము. ఉదాహరణకు దాహం వేస్తే, నీరు త్రాగుతాం. నీరు త్రాగడం కర్మ అయితే, దాహం తీరడం ఆ కర్మ యొక్క ఫలం. అలాగే ఆకలి తీరుచుకోవడానికి భోజనం చేస్తాము. భోజనం అనే కర్మ, ఆకలిని తీర్చి, అనగా తగిన ఫలాన్ని వెంటనే ఇచ్చి, అక్కడితో శాంతిస్తోంది. ఇది ఆగామి కర్మ.

ఆవేశాలు అదుపు తప్పినప్పుడు, ఒకరిపై చేయి చేసుకుంటాము, నాలుగు తిడతాము. అవతలి వాడు సమర్ధుడైతే తిరిగి నాలుగు తంతాడు, బాగా వాయించి వదిలిపెడతాడు. అది అగామి కర్మ.

ఆగమి కర్మలు అంటే ఈ జన్మలో చేసిన కర్మకు ఫలాన్ని ఈ జన్మలోనే అనుభవించడమన్నమాట.

2- సంచిత కర్మ - కొన్ని కర్మలు (పనులు) వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు చేస్తే, ఇంకెప్పుడో ఫలం అనుభవిస్తాము. అంటే ఫలం అనుభవించే వరకు అవి మనలని వెంటాడుతూనే ఉంటాయి. అంటే అవి కూడబెట్టబడి (సంచితం) చేయబడి ఉంటాయి. వాటిని సంచిత కర్మలు అంటారు. అంటే సమయం వచ్చే వరకు అవి సంచీలో భద్రంగా ఉంటాయన్నమాట.

ఇందాకటి ఉదాహరణనే తీసుకుంటే, మనం ఒకరిపై చేయి చేసుకున్నా, లేక నాలుగు తిట్టినా, అవతలి వ్యక్తి వెంటనే ప్రతిచర్యకు దిగకపోవచ్చు. కానీ అది మనస్సులోనే పెట్టుకునే, తగిన సమయం కోసం వేచి చూస్తాడు. సమయం వచ్చినప్పుడు, ఇంతకంటే గట్టి దెబ్బ కొడతాడు. అది ఎప్పుడనేది తెలియదు. అది సంచిత కర్మ. 

ఇంకో ఉదాహరణ చెప్పుకుంటే, మనం ఈ రోజు ఒక విత్తనం వేసి, నీరు పోస్తే, అది ఒకనాటిగా చెట్టు అయ్యి, పండ్లు కాసి, మనకు అందిస్తుంది. అక్కడ విత్తనం వేయగానే పండు (ఫలం) రావట్లేదు. దానికి కొంత సమయం పడుతున్నది. అది సంచిత కర్మ.

ఈ సంచిత కర్మలకు ఫలాలన్నీ ఈ జన్మలోనే లభిస్తాయని లేదు. అది కాలచక్రంలో ఏ జన్మ లోనో లభించవచ్చు. 

అంటే ఇంతకముందు లేదా ఈ జన్మలో చేసి- తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వడానికి కూడబెట్టిన కర్మలలో నుండి, ఆ జనంలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి శాంతించిన కర్మలు పోను, మిగిలిన కూడబెట్టబడిన కర్మలను, అదే విధంగా, ఇంతకముందు అనేక జన్మలలో జీవుడు చేసిన కర్మల నుండి ఖర్చైనవి మినహా, ఒక జన్మ నుంచి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంచిత కర్మలు అంటారు. నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం అంటారే, అలా నిజంగా అవి వెనకేసుకుంటామో లేదో గానీ, కర్మ అనే సంచీలో అనేక జన్మల కర్మలను పోగు చేసుకుని, జీవుడు జన్మల పరంపరను పొందుతుంటాడు. వాటిని సంచిత కర్మలు అంటారు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినా, ఈ సంచిత కర్మలు మాత్రం జీవుడిని విడిచి వెళ్ళకుండా అతడితోనే ప్రయాణిస్తుంటాయి. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి.

  వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి. 

నిత్యం మనం అనేకచోట్ల దేవి దేవతల పేర్లతో వ్యాపారసంస్థలు ఉండటం చూస్తున్నాము. వ్యాపారవేత్తలకు భక్తి ఉంటే అది వారి దేముడి గది మటుకు ఉంచుకొని బయటకు రాకుండా చూసుకుంటే మన దేముళ్ళ పవిత్రత, పరిశుద్ధత, విలువలను కాపాడినవాళ్లు అవుతారు.  కానీ వారి మనస్సులో కల్మషం ఉన్నా  లేకపోయినా కానీ దేముళ్ళను వారి వారి వ్యాపారాల వరకు తీసుకొని వస్తే అది మన ధర్మానికి అవాంతరంగా మారే ప్రమాదం వున్నది. అది ఎట్లానో చూద్దాం. 

కొంతమంది సారా వ్యాపారాలు చేసే వారు వారి షాపులమీద " ధనలక్ష్మి వైన్స్" శంకర బ్రాందీ షాపు, వెంకటేశ్వర డ్రింక్స్, ఇలా అనేక దేముళ్ళ పేరులమీద ఈ రోజుల్లో వ్యాపారాల షాపుల మీద అమ్మవార్ల బొమ్మలతో సహా పేర్లు ఉండటం మనం అక్కడక్కడ చూస్తున్నాము. అటువంటివి చూసినప్పుడు ఏదో తెలియని మనసులో బాధకలుగుతుంది. ఈ విధంగా మనలో చాలామంది బాధపడి వున్నవార్లు వుంటారు. 

అదే విధంగా అనేక షాపులు కిరాణా షాపులు, ఫాన్సీషాపులు, ఇతర షాపులు, హోటళ్లవాళ్లు కూడా అనేక దేముళ్ళ పేర్లు, ఉపయోగించి వ్యాపారాలు చేస్తున్నారు. 

ఇక లారీ సంస్థలు కూడా భగవంతుని పేర్లతో వ్యాపారాలు చేస్తున్నారు. వీరాంజనేయ లారీ సర్వీస్, వెంకటేశ్వర ట్రాన్స్పోర్టు , కనకదుర్గ లారీ సర్వీసు. ఇలా అనేక పేర్లతో లారీలమీద వ్రాస్తున్నారు. అంతే కాక కార్లు, మినీ బస్సులు అద్దెకు ఇచ్చే వార్లు కూడా దేముళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. 

పూజా సామానులు.  

అష్టలక్ష్మి దూప్ స్టిక్లు, అంబికా దర్బారుబత్తి ఉదుబత్తులు , ఇలా అనేక వస్తువులమీద దేవి దేవతల పేర్లు  కాకుండా దేవుళ్ళ బొమ్మలు  ముద్రిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఆలా వున్న అట్ట డబ్బాలను మనం చెత్తలో పారేయగలమా మీరే చెప్పండి. ఈ పోస్టుద్వారా అందరికి నేను తెలియచేసేది ఏమిటంటే సాధ్యమైనంతవరకు మన హిందూ దేవుళ్ళ పేర్లను, చిత్రాలను మీ మీ వ్యాపారాలకు ఉపోయోగించకండి. దాని బదులు మీకు నచ్చిన  వస్తువో  జంతువునో మీ వ్యాపారానికి వాడుకోండి. అది ఎట్లానో మీకు ఒక ఉదాహరణ తో చెపుతాను. మనలో చాలామందికి గతంలో హెచ్ యమ్ వి అనే గ్రామఫోను రికార్డులు ఉండేవి వాటి మీద ఒక కుక్క బొమ్మ ఉండేది. అదే విధంగా మనం అనేక జంతువులను, వస్తువులను వ్యాపారానికి పేర్లుగా చిహ్నాలుగా వాడుకోవచ్చు. 

మీకు ఈ పోస్ట్లు నచ్చితే అందరికి పంపి మన హిందూ ధర్మాన్ని కాపాడటం లో మీ వంతు  కృషి  చేయగలరు. 

కాశి ఆలయ చరిత్ర*

  *కాశి ఆలయ చరిత్ర*


👉 *కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.* 


👉 *కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.*


👉 *క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం*


👉 *క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన*


👉 *క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం*


👉 *క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన గుజరాతి వర్తకులు*


👉 *క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి*


👉 *క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్*


👉 *క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం*


👉 *క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు*


👉 *శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి*


👉 *క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు*


👉 *క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం*


👉 *క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం*


👉 *క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించినారు*


👉 *క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్*


👉 *కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం*


👉 *ప్రతిరోజు జ్యోతిర్లింగ దర్శనం కి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్నచిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు*


👉 *కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం*


👉 *184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన.* 


👉 *12 ఎకరాల లో నూతన కారిడార్ నిర్మాణం.*


👉 *కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను ఒక్క కోర్టు కేసు లేకుండా తొలగింపు.*


👉 *మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం.*


👉 *కారిడార్ అవతలివైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్.*


👉 *విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలు.*


👉 *ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య మరియు అహల్యాబాయి విగ్రహాల ఏర్పాటు.*


👉 *ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.*


👉 *2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి యుగపురుషుడు హిందువులందరికీ ఆరాధ్య మైనవాడు శ్రీ శ్రీ శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేసినారు.*


🙏 *ఈ మెసేజ్ చదివి ఊరుకోవడం కాకుండా మీకు వీలైనంత వరకు తప్పకుండా ఫార్వర్డ్ చేయగలరు.*🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ ।

కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ ।। 21 ।।


ప్రతిపదార్థ: 


వేద — తెలుసుకున్న; అవినాశినం — నాశము కానిది; నిత్యం — నిత్యమైనది; యః — ఎవరైతే; ఏనమ్ — ఇది; అజమ్ — జన్మ లేనిది; అవ్యయమ్ — మార్పుచెందనిది; కథం — ఎట్లా; సః — అది; పురుషః — వ్యక్తి; పార్థః — పార్థా; కం — ఎవరిని; ఘాతయతి — చంపే కారణం; హంతి — చంపును; కమ్ — ఎవరిని.


తాత్పర్యము :


ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుక లేనిది, ఎన్నటికీ మార్పుచెందనిది అని తెలిసిన వ్యక్తి, ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు?


 వివరణ:


ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ, మనచే చేయబడే కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణచి వేస్తుంది. ఆ స్థితిలో, మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చెయ్యదు అని గమనించవచ్చు. అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు, అన్నీ పనులు చేస్తూనే వున్నా, వాటి వల్ల కళంకితులు కారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకుని, తనను తాను అకర్తగా భావించుకొని, అహంకార రహితముగా, బాధ్యతను విస్మరించక తన విధిని నిర్వర్తించమని, అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు.

తిరుమల ఆలయంలో

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

           *శుభ ధనుర్మాసం….*


*తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై.*🙏


శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.


*1. ఆండాళ్ అని ఎవరికి పేరు?    

     = గోదాదేవి.


2. తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


3. ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

= ‘భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే’ మంచిరోజు.


4. గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

   = శ్రీ విష్ణు చిత్తులు.(పెరియాళ్వార్)


5. ఆళ్వారులు ఎంతమంది?

      = 12మంది.


6. గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

     = భూదేవి.


7. గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

   = తమిళ భాష.


8. తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

  = నాలాయిర్ దివ్యప్రబంధము.


9. శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

      = 108.


10. గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

    = శ్రీవిల్లిపుత్తూరు.


11. దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

   = దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


12. శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

    = 196 అడుగులు.


13. ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

= మూడవ పాశురం.


14. శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

= తిరుసాదము.


15. శ్రీవిష్ణుచిత్తులు వారు తనకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

= కోదై (గోదా)


16. పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

= గరుడాంశము.


17. తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

= శ్రీవ్రతము.


18. మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

= పరమాత్మ చేతిలోని శంఖమువలే.


19. శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

= మన్మధుని


20. తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

= సింహం పిల్లవలె.


21. తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

= ధృడమైన కోరిక, పట్టుదల.


22. కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

= మొదటి పాశురం.


23. శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

= దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


24. ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

= రెండవ పాశురం.


25. తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

= వామన అవతారం.


26. ఆళ్వార్లకు మరో పేరేమిటి?

= వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


27. నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

= మూడు.


28. మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

= పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


29. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమిటి?

= ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


30. ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

= యమునా నది.


31. మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

= దానగుణం.


32. లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

= వర్షానికి.


33. పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

= పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


34. విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

= ఐదవ పాశురం.


35. విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= నమ్మళ్వారు.


36. తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= బుద్ధివ్రతం.


37. గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

= పిళ్ళాయ్ (పిల్లా).


38. తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

= ఆళ్వార్లతో.


39. గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వారు.


*40. తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

= శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


*41. కీచుకీచుమని అరిచే ‘ఏ’ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

= భరద్వాజ (చాతక) పక్షులు.


*42. తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


*43. మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?

= పక్షులు.


*44. ఎనిమిదవ పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?

= నమ్మళ్వారు.


*45. పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?

= శిరువీడు.


*46. భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


*47. అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?

= కుంభకోణం.


*48. పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= ప్రీతి వ్రతం.


*49. కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వార్.


*50. పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?

= శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.


*51. పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?

= బకాసుర వధ.

 

*52. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?

= త్యాగం.


*53. శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుప్పాణి.


*54. తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?

= భగవద్రామానుజులు.


*55. తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?

= నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు!’


*56. శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?

= అహంకారమును హతమార్చుట.


*57. పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?

= దాస్య వ్రతము.


*58. గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?

= నందగోపుని (భగవానుని అందించారు కనుక)


*59. కోయిల్ అనగా ఏమి?

= కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.


*60. నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?

= దాన గుణము.


*61. గోపికలు ‘ఎంబెరుమాన్’(మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?

= నందుడు.


*62. భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమంగై యాళ్వారు. 


*63. గోపికలు తమ వంశమునకు .!మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?

= యశోద.


*64. ‘శెంపొర్కజలడి’ -ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?

= బలరాముడు. 


*65. నీళాదేవి ఎవరు?

= కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.


*66. యశోద తమ్ముడు ఎవరు?

= కుంభుడు.


*67. భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?

= పేయాళ్వారు.


*68. ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?

= ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.


*69. భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?

= 18 వ పాశురం.


*70. లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?

= 18వ పాశురం.


*71. శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?

= కువలయాపీడము.


*72. అశ్వినీ దేవతలు ఎవరు?

= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.


*73. గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?

= అద్దము, విసనకఱ్ఱ.


*74. తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?

= కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.


*75. ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?

= మృగరాజగు సింహము.


*76. ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?

= అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.


*77. పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?

= సర్వగంథః -సర్వవిధ పరిమళములు.


*78. పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?

= సింహ గర్జన.


*79. కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?

= మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.


*80. కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?

= వెలగ చెట్టు.


*81. ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= భోగవ్రతము.


*82. ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?

= శ్రీవిల్లిపుత్తూరు.


*83. పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?

= పాంచజన్యము.


*84. ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన ‘కూడార్’ ఎవరు?

= సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.


*85. ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?

= కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)


*86. భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?

= గోవింద.


*87. భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమొళిశై యాళ్వారు.


*88. కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?

= సూర్యునికి, కాంతికి గల సంబంధము.


*89. గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?

= ఆవుల వెనుక.


*90. ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?

= 27 వ పాశురం.


*91. పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?

= శ్రీకృష్ణునివి.


*92. భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?

= దాసుని లక్షణములు.


*93. ‘అజాయమానః’ (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?

= ‘బహుధా విజాయతే’(అనేక విధములుగా పుట్టుచున్నాడు)


*94. సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

= విష్ణుపోతము(విష్ణువనే ఓడ)


*95. పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

= ఆయన దాసులే గొప్ప.


*96. ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

= ఎన్ని జన్మలకైనా అని అర్థము.


*97. ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

= అయోధ్య.


*98. వజ్గం అంటే ఏమిటి?

= ఓడ.


*99. ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

= అమృత కలశం.


*100. ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

= ‘తిజ్గళ్ తిరుముగత్తు’- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


*101. గోపికల దివ్యాభరణములేవి?

= కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


*102. శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

‘అణి పుదువై’ ఈ జగత్తుకే మణివంటిది.


*103. శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

= పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


*104. గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).

 

*105. తిరుప్పావై ఎటువంటి మాల?

= ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


*106. శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎ🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

           *శుభ ధనుర్మాసం….*


*తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై.*🙏


శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.


*1. ఆండాళ్ అని ఎవరికి పేరు?    

     = గోదాదేవి.


2. తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


3. ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

= ‘భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే’ మంచిరోజు.


4. గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

   = శ్రీ విష్ణు చిత్తులు.(పెరియాళ్వార్)


5. ఆళ్వారులు ఎంతమంది?

      = 12మంది.


6. గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

     = భూదేవి.


7. గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

   = తమిళ భాష.


8. తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

  = నాలాయిర్ దివ్యప్రబంధము.


9. శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

      = 108.


10. గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

    = శ్రీవిల్లిపుత్తూరు.


11. దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

   = దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


12. శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

    = 196 అడుగులు.


13. ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

= మూడవ పాశురం.


14. శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

= తిరుసాదము.


15. శ్రీవిష్ణుచిత్తులు వారు తనకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

= కోదై (గోదా)


16. పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

= గరుడాంశము.


17. తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

= శ్రీవ్రతము.


18. మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

= పరమాత్మ చేతిలోని శంఖమువలే.


19. శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

= మన్మధుని


20. తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

= సింహం పిల్లవలె.


21. తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

= ధృడమైన కోరిక, పట్టుదల.


22. కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

= మొదటి పాశురం.


23. శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

= దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


24. ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

= రెండవ పాశురం.


25. తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

= వామన అవతారం.


26. ఆళ్వార్లకు మరో పేరేమిటి?

= వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


27. నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

= మూడు.


28. మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

= పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


29. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమిటి?

= ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


30. ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

= యమునా నది.


31. మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

= దానగుణం.


32. లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

= వర్షానికి.


33. పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

= పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


34. విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

= ఐదవ పాశురం.


35. విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= నమ్మళ్వారు.


36. తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= బుద్ధివ్రతం.


37. గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

= పిళ్ళాయ్ (పిల్లా).


38. తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

= ఆళ్వార్లతో.


39. గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వారు.


*40. తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

= శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


*41. కీచుకీచుమని అరిచే ‘ఏ’ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

= భరద్వాజ (చాతక) పక్షులు.


*42. తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


*43. మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?

= పక్షులు.


*44. ఎనిమిదవ పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?

= నమ్మళ్వారు.


*45. పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?

= శిరువీడు.


*46. భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


*47. అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?

= కుంభకోణం.


*48. పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= ప్రీతి వ్రతం.


*49. కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వార్.


*50. పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?

= శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.


*51. పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?

= బకాసుర వధ.

 

*52. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?

= త్యాగం.


*53. శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుప్పాణి.


*54. తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?

= భగవద్రామానుజులు.


*55. తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?

= నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు!’


*56. శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?

= అహంకారమును హతమార్చుట.


*57. పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?

= దాస్య వ్రతము.


*58. గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?

= నందగోపుని (భగవానుని అందించారు కనుక)


*59. కోయిల్ అనగా ఏమి?

= కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.


*60. నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?

= దాన గుణము.


*61. గోపికలు ‘ఎంబెరుమాన్’(మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?

= నందుడు.


*62. భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమంగై యాళ్వారు. 


*63. గోపికలు తమ వంశమునకు .!మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?

= యశోద.


*64. ‘శెంపొర్కజలడి’ -ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?

= బలరాముడు. 


*65. నీళాదేవి ఎవరు?

= కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.


*66. యశోద తమ్ముడు ఎవరు?

= కుంభుడు.


*67. భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?

= పేయాళ్వారు.


*68. ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?

= ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.


*69. భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?

= 18 వ పాశురం.


*70. లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?

= 18వ పాశురం.


*71. శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?

= కువలయాపీడము.


*72. అశ్వినీ దేవతలు ఎవరు?

= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.


*73. గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?

= అద్దము, విసనకఱ్ఱ.


*74. తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?

= కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.


*75. ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?

= మృగరాజగు సింహము.


*76. ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?

= అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.


*77. పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?

= సర్వగంథః -సర్వవిధ పరిమళములు.


*78. పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?

= సింహ గర్జన.


*79. కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?

= మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.


*80. కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?

= వెలగ చెట్టు.


*81. ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= భోగవ్రతము.


*82. ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?

= శ్రీవిల్లిపుత్తూరు.


*83. పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?

= పాంచజన్యము.


*84. ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన ‘కూడార్’ ఎవరు?

= సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.


*85. ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?

= కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)


*86. భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?

= గోవింద.


*87. భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమొళిశై యాళ్వారు.


*88. కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?

= సూర్యునికి, కాంతికి గల సంబంధము.


*89. గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?

= ఆవుల వెనుక.


*90. ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?

= 27 వ పాశురం.


*91. పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?

= శ్రీకృష్ణునివి.


*92. భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?

= దాసుని లక్షణములు.


*93. ‘అజాయమానః’ (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?

= ‘బహుధా విజాయతే’(అనేక విధములుగా పుట్టుచున్నాడు)


*94. సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

= విష్ణుపోతము(విష్ణువనే ఓడ)


*95. పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

= ఆయన దాసులే గొప్ప.


*96. ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

= ఎన్ని జన్మలకైనా అని అర్థము.


*97. ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

= అయోధ్య.


*98. వజ్గం అంటే ఏమిటి?

= ఓడ.


*99. ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

= అమృత కలశం.


*100. ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

= ‘తిజ్గళ్ తిరుముగత్తు’- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


*101. గోపికల దివ్యాభరణములేవి?

= కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


*102. శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

‘అణి పుదువై’ ఈ జగత్తుకే మణివంటిది.


*103. శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

= పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


*104. గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).

 

*105. తిరుప్పావై ఎటువంటి మాల?

= ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


*106. శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.


*107. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


*108. భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= తొండరపడిప్పొడి యాళ్వార్.


ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణమ్🙏


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!వరి పేరు?

= గోదాదేవి.


*107. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


*108. భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= తొండరపడిప్పొడి యాళ్వార్.


ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణమ్🙏


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!

మనగురించి ఇతరుల ముందు

  పరోక్షే కార్యహన్తారం ప్రత్యక్షే ప్రియవాదినమ్ | 

వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖమ్ || 

 

మనగురించి ఇతరుల ముందు బాగా మాట్లాడి రహస్యంగా ఇబ్బంది పెట్టే స్నేహితుడు, లోపల విషంతో నిండి ఉన్న పాలకుండలా నమ్మదగనివాడు కాదు. అటువంటి స్నేహితులతో స్నేహం విడిచి పెట్టవలెను.

ఓం జపిస్తే

  *🌹 రోజూ ఓం జపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిత్య ఓం జప ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు 🌹*


*ఓం అనేది కేవలం పదం, శబ్ధం మాత్రమే కాదు అంటున్నారు పండితులు. ఇది విశ్వం యొక్క కంపనం, ఇది ప్రతి దానికీ ఆధారమైన నాడీ. ఓం అని జపించినప్పుడు ఓ.. ఊ.. మ్.. (ఏ, యూ, ఎమ్) అనే మూడు శబ్ధాలను ఉచ్చరించడం వలన మీ మనస్సు తేలిక అవుతుంది.*


*అందుకే చాలా మంది ప్రతి రోజూ ఓం అని జపిస్తుంటారు. అయితే ఇలా రోజూ ఓం అని జపించడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాగా, ఓం జపించడం వలన ఇది ఎలాంటి ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.*


*ఓం అనే పదాన్ని జపించడం వలన ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శ్వాస నెమ్మదిస్తుంది. దీని వలన నాడి వ్యవస్థ చల్లబడి, మీరు ఒత్తిడి నుంచి బయటపడి, ఉద్రిక్తత అనేది మీ లోనుంచి బయటకు వెళ్లిపోతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు.*

 

*ఓం అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వలన ఇది మీ భావోద్వేగ స్థితిని తిరిగి పునరుద్ధరిస్తుంది. అలాగే క్రమం తప్పకుండా జపించడం వలన మీ భావోద్వేగాలు సమతుల్యం అవుతాయి, మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. అలాగే, ఇది మీ దృష్టిని మెరుగు పరచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.*


*ఓం అనే జపం చేయడం వలన ఇది మీ ఉచ్ఛ్వాసాన్ని బయటకు వదులుతుంది. దీని వలన ఊపిరితిత్తులు బలంగా మారుతాయి. ఆక్సిజన్ బాగా ప్రవహించి, శరీరం లోతైన స్థాయిలో విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తుంది. మీ మనసు తేలిక పడుతుంది. దీని వలన మీ శ్వాస మెరుగు పడుతుంది.*


*ఇది మనసుకు, చాలా హాయినిస్తుంది. అదే విధంగా మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. అయితే దీనిని జపించడం ఎలా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కానీ దీని కోసం ఎలాంటి శిక్షణ లేకుండా, కేవలం నిశ్శబ్ద వాతావరణంలో సౌకర్యంగా, నిటారుగా కూర్చొని, జపించాలి అని నిపుణులు చెబుతారు.*

🌹 🌹 🌹 🌹 🌹

*

ఇతరుల ఆస్తిని

  పరవిత్తజిహీర్షయా ప్రవృత్త: 

పిశనస్తు స్వయమేవ నాశమేతి |   

సులభ: శలభస్య కిం న వాహ:  

పృథుదీపగ్రసనాయ జృంభితస్య ||


ఇతరుల ఆస్తిని దొంగిలించాలనుకునే అపవాది స్వయంగా నాశనం అవుతాడు. ప్రపంచ దీపాన్ని మింగడానికి బయలుదేరిన చిమ్మట (మిడత) కాలిపోక ఉండగలదా


....విశ్వగుణాదర్శమ్

అద్భుతమైన కథ

 ఒక అద్భుతమైన కథ


' అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు'...


                     🔸🔸🔸🔸🔸


ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని *[ Ego ]* నింపాయి...


ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి 'మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!" అని చెప్పాడు.


శిల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా.... అనిపించే శిల్పాలు సృష్టిస్తాను*... కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు* 


అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి, మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు...


మృత్యుదేవత ఆ గది లోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు. శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో... శిల్పమేదో... కనుక్కోలేక పోయింది'... 


ఇక తనవల్ల కాదని వచ్చినదారినే వెళ్ళి పోవాలనుకొని వెనుతిరిగింది. శిల్పి ఆనందనాకి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి "ఈ శిల్పి" ఎవరోకానీ, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు! అంది...


 'అంతే '...


 'మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ! ఈ దేవత... అనుకున్నాడు. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో ' ... ఏది ? ఎక్కడుంది తప్పు... చూపించు? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు' అనేసాడు...


అపుడు మృత్యుదేవత నవ్వుతూ.... నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు! ' ప్రాణాధార మైన నీ శ్వాసను కూడా నియంత్రించ గలిగావు కానీ, నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించ లేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది'..అని ఆయన్ను తీసుకెళ్ళి పోయింది' ...


'మనం పెంచుకొనే అహంభావం *[ Ego ]* 

అంత ప్రమాదకరమైనది...


'అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు, మనం అనుకొన్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి ''నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు'' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం, దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం' ...


'మీరు గమనించారా ?'

''అహంభావం' అనే పదం లోంచి 'అహం ' తీసేస్తే మిగిలేది ' భావం ' అంటే ' అర్థం' అర్థమైతే అనర్థం జరగదు" ...


సేకరణ ... మంచిగా రాశారు...

ఇంత బాగా రాసినవారికి 

🙏🙏🙏🙏

యెనుముల

🙏🙏🙏🙏

13.12.2025, శనివారం

  జై శ్రీమన్నారాయణ 

13.12.2025, శనివారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

మార్గశిర మాసం - బహుళ పక్షం

తిథి:నవమి రా7.27 వరకు

వారం:స్థిరవాసరే (శనివారం)

నక్షత్రం:ఉత్తర ఉ9.32 వరకు

యోగం:ఆయుష్మాన్ మ3.14 వరకు

కరణం:తైతుల ఉ7.09 వరకు

తదుపరి గరజి రా7.27 వరకు

వర్జ్యం:సా6.26 - 8.08

దుర్ముహూర్తము:ఉ6.25 - 7.52

అమృతకాలం:తె4.37 - 6.19

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం: 6.25

సూర్యాస్తమయం:5.24  


*


*ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ధనుర్మాసం*

*ఇంకా మూడు రోజుల్లో..*


*మనం ఏర్పర్చుకున్న కర్మ బంధం అనేది ఒక దీపానికి పట్టిన మసి వలే మన యొక్క అసలు స్థితిని గుర్తించవీలులేనట్టుగా అంటి ఉంది. మనకంటూ ఒక ఆనంద స్థితి ఉందని మరచిపోయాం. దాని వల్లే ఎన్నో క్లేషాలు పొందుతూ ఉన్నాం. భగవంతుడు మనల్ని తనంత ఆనంద స్థితికి చేర్చాలని అనుకుంటాడు. మనల్ని ఉద్ధరించడానికై భగవంతుడు ఎన్నోసార్లు అవతరించాడు. మనం ఉన్న ఈ కలియుగానికి భుజం భుజం రాసుకొనేంత చేరువలో ఉన్న ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడిగా వచ్చాడు. రామావతారంలో మాదిరిగాకాక తను కేవలం మానవుడిని అనే హద్దు అనేది లేకుండా దేవుడిగానే వచ్చాడు శ్రీకృష్ణావతారంలో. ఎన్నో లీలలు ప్రదర్శించాడు, ఎన్నో ఉపదేశాలు చేసాడు. మనల్ని బాగు చేద్దాం అని కొండంత ఆశతో వచ్చాడు, కానీ మనం మనమే తప్ప మనలో మార్పు అనేది లేదు. ఎండకు ఎండం. వానకు తడవం. గాలికి చెదరం. అట్లాంటి మన ప్రవృత్తికి విసిగి ఉన్న పరమాత్మని మనల్ని ఒక చోటికి చేర్చింది అమ్మ గోదాదేవి. సమస్త వేదాల సారం అని పిలవబడే తిరుప్పావైని భగవంతుణ్ణి చేరే మెట్ల మాదిరిగా అందించింది. ముప్పైపాటల తిరుప్పావైని ధనుర్మాస వ్రతంగా మనకు అందించింది. ఆమె పాడిన పాటల్లో తను ఉన్నాడు. ఆమె పాటలకు శ్రీరంగనాథుడే చలించి గోదాదేవిని తనవద్దకు రప్పించుకొని వివాహమాడాడు. మనకోసం తనను తానే సమర్పించుకుంది అమ్మ గోదాదేవి. ఆమెను స్వీకరించాడు అంటే, ఆమె మాటలని ఒప్పుకున్నట్లే కదా! ఆమె పాడిన పాటల్ని మనం పాడగలిగితే చాలు...*

జపం

 జపం చేసేటప్పుడు మాలకు నమస్కరించి ఈ 2 శ్లోకాలు చదవడం వల్ల మాల శుద్ధి అవడమే కాకుండా జపానికి విఘ్నాలు రాకుండా ఉంటాయి.


మాలే మాలే మహామాలే సర్వతత్త్వ స్వరూపిణి చతుర్వర్గస్త్వయి న్యస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ త్వం మాలే సర్వ దేవానాం ప్రీతిదా శుభదా భవ, శివం కురుష్వ మే భద్రే యశో వీర్యం చ సర్వదా.

_డిసెంబరు 13, 2025_* 🌝

  🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

🌞 *_డిసెంబరు 13, 2025_* 🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*హేమంత ఋతువు*

*మార్గశిర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *నవమి* రా7.27

వారం: *స్థిరవాసరే*

(శనివారం)

నక్షత్రం: *ఉత్తర* ఉ9.32

యోగం: *ఆయుష్మాన్* మ3.14

కరణం: *తైతుల* ఉ7.09

&

*గరజి* రా7.27

వర్జ్యం: *సా6.26-8.08*

దుర్ముహూర్తము: *ఉ6.25-7.52*

అమృతకాలం: మర్నాడు

*తె4.37-6.19*

రాహుకాలం: *ఉ9.00-10.30*

యమగండం: *మ1.30-3.00*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *కన్య*

సూర్యోదయం: *6.25*

సూర్యాస్తమయం: *5.24*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

   ☘️🇮🇳🚩🙏🚩🇮🇳☘️

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

సూక్తి

 *నేటి సూక్తి*


*జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన ఆలోచనలు ఇంతకుముందు కంటే తెలివిగా పనిచేస్తాయి.*

 *క్రాంతి కిరణాలు* 


*జీవిత మందున కష్టము* 

*నే విధముగ వచ్చి చేరు నెవరికి తెలుసున్*

*కావించెడు పనులన్నియు*

 *నా వేళను చేయుచుండు నత్యద్భుతమే*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *ఏకోఽరీన్ శమయేద్వీరః బహవో న తు భీరవః* |

         *దీప ఏకస్తమో హన్తి ఖద్యోతాః న పరశ్శతాః* ||


తా𝕝𝕝 *లోకంలో ధీరుడైనవాడు ఒక్కడున్నా అతడు శతృవులను అణచివేయగలడు.... భయపడేవారు ఎంతమంది ఉన్ననూ ప్రయోజనం ఉండదు.... దీపం ఒక్కటి చీకటిని పారద్రోలును.... వందలకొద్దీ మిణుగురు పురుగులున్ననూ చీకటి తొలగించబడదుగదా!!*


 ✍️💐🌹🌸🙏

నేటి సూక్తి*

  *నేటి సూక్తి*


*మీ జీవితం సాఫీగా సాగాలంటే మాట, డబ్బు, ఆలోచన మరియు ప్రవర్తన మీ ఆధీనంలో ఉంచుకోవాలి.*


*క్రాంతి కిరణాలు*


*మన నోటి మాట , నడవడి* 

*మన యాలోచన ఘనముగ మారక నున్నన్*

*ధనముల నాశించనిచో*

*మన జీవిత కాలమంత మంచిగ నడచున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

భాగవత మధురిమలు*

  *శ్రీ పోతన భాగవత మధురిమలు*


(2-244-క)

తప మనఁగ మత్స్వరూపము

తపమను తరువునకు ఫలవితానము నే నా

తపముననే జననస్థి

త్యుపసంహరణము లొనర్చుచుండుదుఁ దనయా!


*భావము:-* పుత్రా! బ్రహ్మదేవ! తపస్సు అంటేనే నా స్వరూపం. తపస్సు అనే వృక్షానికి ఫలాన్ని నేనే. ఆ తపస్సు చేతనే సృష్టి స్థితి లయాలు సర్వం నిర్వహిస్తుంటాను. అంటు బ్రహ్మదేవునికి తపస్సు యొక్క రహస్యాన్ని నారాయణుడు వెలిబుచ్చాడు.


*శ్రీ కసాపురం ఆంజనేయ స్వామిని* స్తుతిస్తూ శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

సమాజ చైతన్యానికి

  SSV SANSKRIT NEWS CHANNEL


సమాజ చైతన్యానికి పిలుపు — భారత గురుశిష్య పరంపరను రక్షిద్దాం


ఈరోజుల్లో మనం ఏ దిశగా వెళ్తున్నామో ఒకసారి మన హృదయం ప్రశ్నించుకోవాలి.

కాఫీలకి, చాయీలకి, ప్యాకెట్ పాలకి, మద్యం, సిగరెట్లు, గుట్కా, రెస్టారెంట్లు, క్లబ్బులు, సినిమాలు, మాదకద్రవ్యాలు, అశ్లీల పాటలు, అశ్లీల నృత్యాలు, అశ్లీల చిత్రాలు—ఇవి అన్నీ సమాజంలో అదుపు తప్పిన అలవాట్లుగా పెరుగుతున్నాయి.

ఇవి కేవలం రూపాయల వృథానే కాదు…

మన భారతీయ గురుశిష్యులు మానసికంగా బానిసలు అవుతున్నాయన్నది అత్యంత బాధాకరం.


మనసులోని వెలుగు క్రమంగా చీకటిలో కలిసిపోతోంది. విలువలు క్షీణిస్తున్నాయి. నాగరికత కదులుతోంది. సంస్కృతి పతనం అంచులపై నిలబడి ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు కాదు…

మనమందరం మొత్తం చైతన్యం కలిగి నిలబడాల్సిన సమయం ఇది.


విద్యాలయాలు — మన భవిష్యత్తు పునాది


విద్యాలయాలు చిన్నారుల, యువత యొక్క మానసిక నిర్మాణానికి ఆలయాలు.

ఇక్కడి నుంచే భవిష్యత్తు భారత దేశం తీర్చిదిద్దబడుతుంది.


కానీ ఈ పవిత్ర ప్రాంగణాల్లో కూడా అనవసర ప్రభావాలు చొరబడుతున్నాయి.

అందుకే విద్యాసంస్థల్లో కొన్ని అత్యవసరమైన మార్పులు వెంటనే రావాలి.


1. యోగ – ధ్యానం తప్పనిసరి చేయాలి


యోగం, ప్రాణాయామం, ధ్యానం — ఇవి శరీరానికి ఆరోగ్యం, మానసికానికి ప్రశాంతత, మనస్సుకు ఏకాగ్రతనిస్తాయి.

వీటిని చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో అలవాటు చేయడం అత్యవసరం.


యోగం తెలుసుకున్న పిల్లాడు వ్యసనాలకు, అశ్లీలతకు, వ్యర్థ జీవనశైలులకు దూరంగా ఉంటుంది.


2. సద్గురువుల ఉపన్యాసాలు – మంచి సాహిత్య పరిచయం


రోజుకు కొద్దినిమిషాలైనా విద్యార్థులకు సద్గురు వాక్యాలు, నైతిక విలువలు, మంచి పుస్తకాల ప్రాముఖ్యత వినిపించాలి.

పాఠశాలలు ‘అధ్యాత్మిక–సాంస్కృతిక బోధన’ అనే ప్రత్యేక క్లాస్‌ను ప్రవేశపెట్టాలి.


పిల్లలకు ఏది మంచిది? ఏది చెడు?

ఏదిని అనుసరించాలి? ఏదిని దూరం పెట్టాలి?

ఈ విచక్షణా జ్ఞానం తప్పనిసరిగా నేర్పాలి.


3. శ్లోకపారాయణం — మనసుని పరిశుద్ధం చేసే మార్గం


భగవద్గీత, రామాయణం, ఆదిత్యహృదయం వంటి శ్లోకాల పారాయణం

పిల్లల్లో ధైర్యాన్ని, నీతిని, శాంతిని, చురుకుదనాన్ని పెంపొందిస్తుంది.

ప్రతి రోజు ప్రార్థన తరువాత 5 నిమిషాల శ్లోకపఠనం చేయడం విద్యాసంస్థల్లో తప్పనిసరి చేయాలి.


4. సంస్కృతం – ఆంగ్ల భాషలా తప్పనిసరి చేయాలి


సంస్కృతం అనేది మానవుడు మెరుగైన మనిషిగా మారేందుకు దోహదపడే భాష.

ఈ భాషను కేవలం బోధించటం కాదు… అనివార్యంగా నేర్పాలి.


ప్రతి పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయులు ఉండాలి.


Speaking Sanskrit (సంభాషణ సంస్కృతం) ను తప్పనిసరి చేయాలి.


ఇంట్లో సంస్కృతం మాట్లాడే శిష్యులను తయారు చేయాలి.


సంస్కృతాన్ని వ్యవహారిక భాషగా మార్చుకోవాలి.



ఇలానే మన కుటుంబాలు, పాఠశాలలు, సమాజం ఒకే శబ్దంతో మాట్లాడే రోజులు దగ్గరపడతాయి.


5. సంస్కృత మాధ్యమ పాఠశాలలు – దేశ అభివృద్ధికి నూతన దిశ


భారతదేశంలో సంస్కృత మాధ్యమ పాఠశాలలు ఏర్పాటు చేయడం అత్యవసరం.

ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు:


ఉద్యోగ అవకాశాలు


సంస్కృత బోధనలో కొత్త మార్గాలు


పరిశోధనా వ్యవస్థలు


సంభాషణ సంస్కృతం ప్రచారం


అన్నింటికీ ద్వారాలు తెరవబడతాయి.


సంస్కృత మాధ్యమం భారతదేశ భవిష్యత్తును మరింత వెలుగులోకి తెస్తుంది.

ఈ దేశం సాంప్రదాయ సౌందర్యానికి, వేదజ్ఞాన వైభవానికి పునరుజ్జీవనం లభిస్తుంది.


ముగింపు – ఇది కేవలం వ్యాసం కాదు, సమాజానికి హెచ్చరిక


ఈరోజు మనం పిల్లలను కోల్పోతున్నాం కాదు…

పిల్లలద్వారా మన భవిష్యత్తును కోల్పోతున్నాం.


విలువలు, నీతి, ధర్మం, సంస్కృతి, వినయం — ఇవన్నీ తిరిగి విద్యాలయాల్లోకి రావాలి.

సంస్కృతం, శ్లోకాలు, యోగం, మంచి సాహిత్యం — ఇవే యువతను రక్షించగల శక్తులు.


ఇది SSV SANSKRISSV SANSKRIT NEWS CHANNEL 


డాక్టర్ రాజేన్ద్రప్రసాదః 


సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవలసిన అత్యవసర అవసరం


తెలంగాణ ముఖ్యమంత్రిగారికి వినమ్ర వినతి


గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు.


మన భారతదేశ సంస్కృతి అనేది వేలాది ఏళ్ల చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అమూల్యమైన వారసత్వం. ఈ పరంపరలో యగ్నయాగాలు, వేదపఠనం, శ్లోకాల ఉచ్చారణ, సాంప్రదాయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, హరికథ–బుర్రకథలు వంటి అనేక కళారూపాలు నిర్మించబడ్డాయి.


శిశువయసు నుంచే పిల్లల్లో భక్తి, దేశభక్తి, వినయం, విలువలు, నీతిని పెంపొందించేవి.


పూర్వం ప్రతి సంస్థ, ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలో ‘యాన్యువల్ డే’ వంటి వేడుకలు జరిగేటప్పుడు పెద్దలు–చిన్నలు కలిసి యజ్ఞయాగాలు చేసి, తరువాత దేశభక్తి గీతాలు, దైవభక్తి పాటలు, సాంప్రదాయ సాహిత్యాలు వినిపించేవారు.

పిల్లలు ఆ వాతావరణంలో పెరిగి మానవత్వం, భక్తి, శిల్పం, శాస్త్రం, శాంతి, స్వయం నియంత్రణ వంటి లక్షణాలను సంపాదించేవారు.


పెద్దలు మంచి మాటలు చెప్పి, జీవితంలో నిలిచిపోయే మార్గదర్శకత్వం అందించేవారు.


అదే విధంగా కూచిపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ, రామాయణ–మహాభారతాల ఆధారిత నాటికలు పిల్లల్లో ఆధ్యాత్మికతను, నైతికతను, చరిత్రజ్ఞానాన్ని పెంపొందించేవి.


ప్రస్తుత పరిస్థితి – ఆందోళనకర దృశ్యం


కాలం మారుతున్న కొద్దీ పాఠశాల–కాలేజ్ స్థాయి వేడుకల రూపం పూర్తిగా మారిపోయింది.

ఈ రోజుల్లో ‘ఫ్రెషర్స్ పార్టీ’, ‘యాన్యువల్ డే’ పేరుతో కొన్ని సంస్థల్లో అశ్లీల పదాలతో నిండిన పాటలు, 


అనుచిత నృత్యాలు, భయంకరమైన అశ్లీల ప్రదర్శనలు నిర్వహించడం కొంతమంది నిర్వాహకుల అలవాటైపోయింది.


ఇది చూస్తూ పిల్లలు నైతిక విలువలను మరచిపోతున్నారు.


మన హిందూ సంస్కృతి, భారతీయ విలువలు, కుటుంబ ధర్మాలు, సాంప్రదాయ సౌందర్యాలు మెల్లిగా నశిస్తున్నాయి.


పాఠశాల అనేది పిల్లల్లో సంస్కారం నింపే ఆలయం కావాలి. కానీ ఈ విధమైన అశ్లీల ప్రదర్శనలు ఆ విద్యాలయాల పవిత్రతను చెడగొడుతున్నాయి.


కావున ప్రభుత్వం తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు


1. పాఠశాలల్లో అశ్లీల సినిమా పాటలు, డాన్స్‌లపై తక్షణ నిషేధం


పిల్లల ఎదుగుదల, మానసిక వికాసం, నైతిక విలువల పరిరక్షణ కోసం

అశ్లీల పాటలు, అసభ్య నృత్యాలకు పాఠశాల–కాలేజీలలో పూర్తిస్థాయి నిషేధం విధించాలి.


ఈ విషయంపై మీరు వెంటనే ప్రత్యేక జి.ఓ. విడుదల చేసి, అన్ని విద్యాసంస్థలకు కఠినమైన సర్కులర్ ఇవ్వడం అత్యవసరం.


2. స్వచ్ఛమైన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రభుత్వ ప్రోత్సాహం


ప్రతి పాఠశాలలో క్రింది అంశాలను తప్పనిసరి చేయాలని మన వినతి:


దేశభక్తి గీతాలు


దైవభక్తి పాటలు


గురుభక్తి – మాతృభక్తిని పెంపొందించే కార్యక్రమాలు


కూచిపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ వంటి సాంప్రదాయ కళారూపాలు


రామాయణం, మహాభారతం ఆధారిత నృత్యనాటికలు


యజ్ఞయాగాది పూజల ప్రదర్శనలు వినిపించాలి చూపించాలి


సద్గురువులు, పండితులు ఇచ్చే సత్ప్రవచనాలు వినిపించాలి


ఇవి పిల్లల నైతిక వికాసానికి అమూల్యమైనవి.


3. సంస్కృత భాషను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలి


సంస్కృతం భారతీయ సంస్కృతికి మూలాధారం. అందువల్ల:


పాఠశాలల్లో సంస్కృతాన్ని ఆంగ్లం లాగానే అనువాద ఆధారిత పద్ధతిలో సులభంగా నేర్పాలి.


ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సంభాషణ–సంస్కృతం బోధించే గురువులను నియమించాలి.


పిల్లలకు శ్లోకాలు మంత్రాలు స్తోత్రాలు సూత్రాలు అనేవారంగా నేర్పించాలి. పిల్లలను గొప్ప భక్తులను కవులను పండితులను ఋషులను చేయాలి


తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతాన్ని రాజ్యాధికార భాషగా చేయాలనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలి.


దీర్ఘకాల దృష్టిలో భారతదేశ స్థాయిలో సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి మీ ప్రతిపాదనగా పంపించాలని అభ్యర్థించుకుంటున్నాము.


ముగింపు


మన మూలసంస్కృతి, మానవ విలువలు, భారతీయ ఆత్మీయతను కాపాడుకోవడం ప్రతి ప్రభుత్వ ప్రాధమిక బాధ్యత.

పిల్లలు దేశభక్తి, ధర్మభక్తి, మానవత్వం, క్రమశిక్షణతో ఎదగాలంటే విద్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాలు శుభ్రమైనవిగా, శాస్త్రీయ–సాంస్కృతిక పరిరక్షణకు దోహదపడేవిగా ఉండాలి.


కావున, పైన పేర్కొన్న సూచనలపై గౌరవ ముఖ్యమంత్రిగారు దృఢ నిర్ణయం తీసుకొని జి.ఓ. విడుదల చేస్తారని మనసారా ఆశిస్తూ నిర్వహించుచున్న వినమ్ర అభ్యర్థన ఇది.


మంచినే చూపెట్టాలి మంచినే వినిపించాలి మంచి మాటలనే పలికించాలి మంచి చేష్టలనే చూపించాలి


పిల్లలతో అయ్యప్ప మాలలు శివ మాలలు నరసింహస్వామి మాలలు హనుమంతుని మాలలు వేయించి భజనలు చేయించాలి పూజలు నేర్పించాలి


ఇట్లు

డాక్టర్ రాజేంSSV SANSKRIT NEWS CHANNEL 


డాక్టర్ రాజేన్ద్రప్రసాదః 


సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవలసిన అత్యవసర అవసరం


తెలంగాణ ముఖ్యమంత్రిగారికి వినమ్ర వినతి


గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు.


మన భారతదేశ సంస్కృతి అనేది వేలాది ఏళ్ల చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అమూల్యమైన వారసత్వం. ఈ పరంపరలో యగ్నయాగాలు, వేదపఠనం, శ్లోకాల ఉచ్చారణ, సాంప్రదాయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, హరికథ–బుర్రకథలు వంటి అనేక కళారూపాలు నిర్మించబడ్డాయి.


శిశువయసు నుంచే పిల్లల్లో భక్తి, దేశభక్తి, వినయం, విలువలు, నీతిని పెంపొందించేవి.


పూర్వం ప్రతి సంస్థ, ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలో ‘యాన్యువల్ డే’ వంటి వేడుకలు జరిగేటప్పుడు పెద్దలు–చిన్నలు కలిసి యజ్ఞయాగాలు చేసి, తరువాత దేశభక్తి గీతాలు, దైవభక్తి పాటలు, సాంప్రదాయ సాహిత్యాలు వినిపించేవారు.

పిల్లలు ఆ వాతావరణంలో పెరిగి మానవత్వం, భక్తి, శిల్పం, శాస్త్రం, శాంతి, స్వయం నియంత్రణ వంటి లక్షణాలను సంపాదించేవారు.


పెద్దలు మంచి మాటలు చెప్పి, జీవితంలో నిలిచిపోయే మార్గదర్శకత్వం అందించేవారు.


అదే విధంగా కూచిపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ, రామాయణ–మహాభారతాల ఆధారిత నాటికలు పిల్లల్లో ఆధ్యాత్మికతను, నైతికతను, చరిత్రజ్ఞానాన్ని పెంపొందించేవి.


ప్రస్తుత పరిస్థితి – ఆందోళనకర దృశ్యం


కాలం మారుతున్న కొద్దీ పాఠశాల–కాలేజ్ స్థాయి వేడుకల రూపం పూర్తిగా మారిపోయింది.

ఈ రోజుల్లో ‘ఫ్రెషర్స్ పార్టీ’, ‘యాన్యువల్ డే’ పేరుతో కొన్ని సంస్థల్లో అశ్లీల పదాలతో నిండిన పాటలు, 


అనుచిత నృత్యాలు, భయంకరమైన అశ్లీల ప్రదర్శనలు నిర్వహించడం కొంతమంది నిర్వాహకుల అలవాటైపోయింది.


ఇది చూస్తూ పిల్లలు నైతిక విలువలను మరచిపోతున్నారు.


మన హిందూ సంస్కృతి, భారతీయ విలువలు, కుటుంబ ధర్మాలు, సాంప్రదాయ సౌందర్యాలు మెల్లిగా నశిస్తున్నాయి.


పాఠశాల అనేది పిల్లల్లో సంస్కారం నింపే ఆలయం కావాలి. కానీ ఈ విధమైన అశ్లీల ప్రదర్శనలు ఆ విద్యాలయాల పవిత్రతను చెడగొడుతున్నాయి.


కావున ప్రభుత్వం తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు


1. పాఠశాలల్లో అశ్లీల సినిమా పాటలు, డాన్స్‌లపై తక్షణ నిషేధం


పిల్లల ఎదుగుదల, మానసిక వికాసం, నైతిక విలువల పరిరక్షణ కోసం

అశ్లీల పాటలు, అసభ్య నృత్యాలకు పాఠశాల–కాలేజీలలో పూర్తిస్థాయి నిషేధం విధించాలి.


ఈ విషయంపై మీరు వెంటనే ప్రత్యేక జి.ఓ. విడుదల చేసి, అన్ని విద్యాసంస్థలకు కఠినమైన సర్కులర్ ఇవ్వడం అత్యవసరం.


2. స్వచ్ఛమైన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రభుత్వ ప్రోత్సాహం


ప్రతి పాఠశాలలో క్రింది అంశాలను తప్పనిసరి చేయాలని మన వినతి:


దేశభక్తి గీతాలు


దైవభక్తి పాటలు


గురుభక్తి – మాతృభక్తిని పెంపొందించే కార్యక్రమాలు


కూచిపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ వంటి సాంప్రదాయ కళారూపాలు


రామాయణం, మహాభారతం ఆధారిత నృత్యనాటికలు


యజ్ఞయాగాది పూజల ప్రదర్శనలు వినిపించాలి చూపించాలి


సద్గురువులు, పండితులు ఇచ్చే సత్ప్రవచనాలు వినిపించాలి


ఇవి పిల్లల నైతిక వికాసానికి అమూల్యమైనవి.


3. సంస్కృత భాషను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలి


సంస్కృతం భారతీయ సంస్కృతికి మూలాధారం. అందువల్ల:


పాఠశాలల్లో సంస్కృతాన్ని ఆంగ్లం లాగానే అనువాద ఆధారిత పద్ధతిలో సులభంగా నేర్పాలి.


ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సంభాషణ–సంస్కృతం బోధించే గురువులను నియమించాలి.


పిల్లలకు శ్లోకాలు మంత్రాలు స్తోత్రాలు సూత్రాలు అనేవారంగా నేర్పించాలి. పిల్లలను గొప్ప భక్తులను కవులను పండితులను ఋషులను చేయాలి


తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతాన్ని రాజ్యాధికార భాషగా చేయాలనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలి.


దీర్ఘకాల దృష్టిలో భారతదేశ స్థాయిలో సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి మీ ప్రతిపాదనగా పంపించాలని అభ్యర్థించుకుంటున్నాము.


ముగింపు


మన మూలసంస్కృతి, మానవ విలువలు, భారతీయ ఆత్మీయతను కాపాడుకోవడం ప్రతి ప్రభుత్వ ప్రాధమిక బాధ్యత.

పిల్లలు దేశభక్తి, ధర్మభక్తి, మానవత్వం, క్రమశిక్షణతో ఎదగాలంటే విద్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాలు శుభ్రమైనవిగా, శాస్త్రీయ–సాంస్కృతిక పరిరక్షణకు దోహదపడేవిగా ఉండాలి.


కావున, పైన పేర్కొన్న సూచనలపై గౌరవ ముఖ్యమంత్రిగారు దృఢ నిర్ణయం తీసుకొని జి.ఓ. విడుదల చేస్తారని మనసారా ఆశిస్తూ నిర్వహించుచున్న వినమ్ర అభ్యర్థన ఇది.


మంచినే చూపెట్టాలి మంచినే వినిపించాలి మంచి మాటలనే పలికించాలి మంచి చేష్టలనే చూపించాలి


పిల్లలతో అయ్యప్ప మాలలు శివ మాలలు నరసింహస్వామి మాలలు హనుమంతుని మాలలు వేయించి భజనలు చేయించాలి పూజలు నేర్పించాలి


ఇట్లు

డాక్టర్ రాజేంద్రప్రసాదః

సంస్కృతభాషా గురుశిష్య సంఘః (రాజ్యరాష్ట్ర అధ్యక్షః)

SSV Sanskrit News Channelద్రప్రసాదః

సంస్కృతభాషా గురుశిష్య సంఘః (రాజ్యరాష్ట్ర అధ్యక్షః)

SSV Sanskrit News ChannelT NEWS CHANNEL తరఫున

సమాజ పునరుజ్జీవనానికి, ధర్మ కాపాడటానికి చేసిన వినయపూర్వక పిలుపు.

ముకుందమాల

  ముకుందమాల-. సౌందర్యమాల 

••••••••••••••••••••••

        సామాన్యముగా గ్రంథవ్యాప్తికిగ్రంథమందలి విషయముసార్వజనీన 

ముగా నుండుట ముఖ్య కారణము. విషయ వైశద్యమునకు దోడు సరసమైన శైలియు గూడిన ఇక చెప్పవలసిన పనియులేదు. బంగారానికి సువాసన అబ్బినట్లే ద్రాక్షాపాకమునబడిన వాల్మీకి వ్యాసకాళిదాసాది కృతులు సర్వ వ్యాపకమగుటయు , నారికేళ పాకమువంటి బిరుసు పాకమున బడిన భారవి శ్రీహర్షాదుల గ్రంథాలుకేవలంవిద్వాల్లోక వ్యాప్తం. ఇది విద్వాoసులు ఎరిగిన విషయమే. వేమన , పద్యాలు , సుమతి , కృష్ణ , దాశరథి శతకాలు తెలుగునాట బహుళ వ్యాప్తి చెందినవి. కానీ నూర్లకొద్ది నున్నశతకాలు వీటిలా ఎన్నివ్యాప్తి చెందినాయి ? నిజముగాఁజూచిన అర్థాలంకార వస్తుధ్వని భూషితములే గాక యవికొన్ని చిత్రాలంకార విచిత్రములై యున్నవే. మరి ! వ్యాప్తిలేకుండుటకు ఏమి కారణము ? వాని శైలి సర్వజనాకర్షకముగా ఉండకుండుటయే. చెప్పవలసిన విషయమును సూటిగా పాఠకుని హృదయమున హత్తుకొనునట్లు చెప్పలేకపోవుటయే. పోతనభాగవతమునకుగల ప్రచారము తక్కిన గ్రంథ రాజములకు లేకపోవడమే ప్రధాన కారణము. " ముకుందమాల విశ్వభారతమున వ్యాపించి తావులు గుబాళించుటకు మూలకారణము దాని సారళ్యమే. కాశ్మీరములో జనించిన కుంకుమపూవువలె కాశీలో ప్రవహించు గంగవలె కేరళలో ఉదయించిన ఈ ముకుందమాలయు సర్వభక్త సేవ్యమైనది. అకృత్రిమముగా , అప్రయత్నముగా భక్తాగ్రేసరుడగు శ్రీ కులశేఖరుని పరిపక్వ హృదయమునుండి వెల్లి విరిసి ముకుందుని కంఠ సీమ వనమాలయై మెరిసినది ఈ కుందమాల. పుష్పపరిమళమును గ్రహించుటకు పండిత పామర లొక్కతీరున సమర్థులైనట్లు లలితములైన ముకుందమాలను ఆ బాలగోపాలము ధరించి ఆనందింపగలిగిరి.

శ్రీల ప్రభుపాద ఉవాచ!

  శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷

ఈ శ్లోకంలో "ఎల్లప్పుడూ మేల్కొని మరియు అజ్ఞానం నుండి విముక్తి" అనే అర్థం వచ్చే అనిద్రం అనే పదం చాలా ముఖ్యమైనది. 

భగవద్గీత (15.15)లో చెప్పబడినట్లుగా, మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ: భగవంతుడు అందరికీ తెలివిని ఇచ్చేవాడు మరియు అందరినీ మరచిపోయేలా చేస్తాడు కూడా. 


లక్షలాది మరియు కోట్లాది జీవులు ఉన్నాయి, మరియు భగవంతుడు వారికి దిశలను ఇస్తాడు. 

అందువల్ల అతనికి నిద్రించడానికి సమయం లేదు, మరియు అతను మన కార్యకలాపాల గురించి ఎప్పుడూ అజ్ఞానంలో ఉండడు. 

ప్రభువు ప్రతిదానికీ సాక్షి; 

ప్రతి క్షణం మనం ఏమి చేస్తున్నామో అతను చూస్తాడు. 


భగవంతుడు కర్మల వలన ఏర్పడే శరీరంచే కప్పబడడు. 

మన శరీరాలు మన గత కర్మల (కర్మణ దైవ-నేత్రేణ) ఫలితంగా ఏర్పడతాయి, కానీ దేవాడిదేవుడైన భగవంతునికి భౌతిక శరీరం లేదు, అందువల్ల ఆయనకు అవిద్య, అజ్ఞానం లేదు. 

అతను నిద్రపోడు, కానీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా మరియు మెలకువగా ఉంటాడు.


(శ్రీమద్ భాగవతం, స్కందము.8

అధ్యాయం.5, వచనం.27)


హరే కృష్ణ 

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

కరుణించు సర్వవేళల

  *జై శ్రీమన్నారాయణ*


*1. కం . కరుణించు సర్వవేళల*

*కరుణించును సర్వజనుల కాంచుచు నుండున్*

*కరుణాకరుడగు విష్ణువు*

*పరమాత్మగ నమ్ముకొనుము వదలక నెపుడున్*


 *2. కం.దామోదరుడగు విష్ణువు*

*నామంబును మరవకుండ నాలుక పైనన్*

*నే మాత్రము విడవకెపుడు*

*ధీమాగా బ్రతకవచ్చు తెలివిగ నెపుడున్*



*3. కం.నీవే గతి యని నమ్మితి*

*నీవున్నను నాకు చాలు నిలుపుట కొరకై*

*నీవే నా రక్ష యనుచు*

*జీవితకాలంబు నంత సేవలు చేయన్*


 *4. కం. జీవాత్మల రక్షించెడు*

*దైవానివి నీవు మాకు దారిని చూపన్*

*సేవింతు సర్వకాలము* 

 *దేవాలయము చేరినాను దీనుడ నగుచున్*


*5 

కం. భగవంతుని నామంబును* 

*నగణితముగ జపము చేసి యాచారముతో*

*పగలను ద్వేషము వీడిన* 

*సుగమం బౌద్ధ పరమ పదము చొప్పున దొరుకున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

ఆపుకోగలడా

 🙏మంద వారే 👃Happy Saturday 🙏 *

🌹ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చూసుకోగలడా, పోనీ బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా.. తెలివిగలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా.. పోనీ వైద్యుడు తన వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలడా లేదు కదా... ఈ మూడునాళ్ళ ముచ్చట కోసం పగలూ, ప్రతీకారాలు, ఈర్ష్యాద్వేషాలు వీడి... జీవించినంత కాలం స్వార్థాన్ని వీడి అందరితో సంతోషాలు పంచుకుంటూ ఆనందంగా గడుపుదాం మంచి మనుషులుగా జీవిద్దాం..!*🌹

అవహేళన- పశ్చాతాపం

  🌹అవహేళన- పశ్చాతాపం🌹


ఒక 30 సంవత్సరాల యువకుడు తన వృద్దుడైన తండ్రీ 

తో రైలు ప్రయాణం చేస్తున్నాడు. రైలు కిటికీ ప్రక్కన చోటు దక్కడంతో చాలా ఆనందపడుతున్నాడు


ఆ పక్కనే కూర్చున్న ప్రయాణికులు ఈ యువకుడినే చూస్తున్నారు.


రైలు స్టేషన్ నుండి బైలుదేరింది. 


ఇంతలో ఆ యువకుడు నాన్న నాన్న చూడు చూడు. ప్లాట్ఫాం పై ఉన్న వాళ్ళందరూ వెనక్కి నడుస్తున్నారు అని గట్టిగా కేరింతలు నవ్వుతున్నాడు. పక్కన ఉన్న ప్రయాణికులు ఈ యువకుడినే చూస్తూ ఆసక్తిగా గమనిస్తు నవ్వుకుంటున్నారు.


ఇంతలో ఆ రైలు స్టేషన్ దాటి పక్కనే ఉన్న పల్లెప్రాంతం వైపుగా వెళ్తుంది. మళ్ళి ఈ యువకుడు గట్టిగా "నాన్న నాన్న చూడు చెట్లు, కొండలు, రాళ్ళు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి" అని కేరింతలు మొదలు పెట్టాడు. 


 యువకుడి తండ్రి హాయిగా నవ్వుతూనే "సరే" అంటు కొడుకు వైపు చూస్తూ ఆనందగా ఉన్నాడు ..,


మళ్ళి ఈ యువకుడు గట్టిగా "నాన్నా నాన్నా చూడు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నా మేఘాలు మాత్రం మనతోనే వస్తున్నాయి" అంటూ కేరింతలు మొదలు పెట్టాడు.  


ఇంతలో చిన్న చిరు జల్లులతో కూడిన వర్షం మొదలైంది. ఆ కిటికీ కడ్డీలకి జాలువారుతున్న చుక్కలని చూసి. ఆ చుక్కల్లోనుండి పచ్చని ప్రకృతిని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవ్వుతున్న యువకుడిని చూసి కొంతమంది ప్రయాణికులు " మీ అబ్బాయి మాటలు మాకు గోలగా ఉంది. మీ అబ్బాయిని ఏదైనా మానసిక ఆసుపత్రి లో చూపించండి. ఎందుకైనా మంచిది" అని ఎగతాళిగా మాట్లాడుతూ అన్నారు.


ఈ యువకుడి తండ్రి "ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాం బాబు","పుట్టుకతో అంధుడైన మా అబ్బాయికి కళ్ళు తెప్పించలేక ఇన్నాళ్ళు ఆగాము. ఇతని తల్లి రెండు వారాల క్రితం మరణించింది. డాక్టర్లు ఆమె కళ్ళు తీసి మా అబ్బాయికి పెట్టారు. పుట్టుకతో కళ్ళు లేకపోవడం వల్ల మేఘాలు వర్షం నీరు అన్ని మొదటి సారిగా చూస్తున్నాడు. మా అబ్బాయి మీ ఏకాగ్రతను భంగం కలిగించినందుకు క్షమించండి 

 ఇప్పుడే లోకాన్ని చూస్తున్నాడు." అని ఆనందంగా తండ్రి వెల్లడించాడు. 


అసలు విషయం తెలుసుకోకుండా ఆ అబ్బాయిని ఎగతాళి చేసి తామెంత తప్పుగా ప్రవర్తించామో అని వారంతా సిగ్గుతో తల దించుకున్నారు.


"ఒకరిని ఏదైనా అనే ముందు వారి పరిస్తితి ఏమిటి అని ఆలోచించడం ముఖ్యం..

ఎదుటి వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావడం లేదా ఇతరుల గురించి తీర్పులు చెప్పడం మంచి పద్ధతి కాదు.

ప్ర'పంచ' దంపతులు

 *🍀ప్ర'పంచ' దంపతులు*🍀

ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా 

వాళ్ళంతా 5 విధాలు

గానే ఉంటారు.


*మొదటిది* *లక్ష్మీనారాయణులు* విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట


*రెండవది*

 *గౌరీశంకరులు* అర్థనారీశ్వరరూపం,

తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,ఆలోచనలకు తల,కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం, 

కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.


*మూడవది*

*బ్రహ్మ సరస్వతుల జంట*

బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా 

ఏ మాట మాట్లాడినా, 

ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.


*నాల్గవది*

*ఛాయా సూర్యులు* సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు, 

అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.

తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు.అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.

ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా ,పట్టుదలతో ఉంటాడో. 

ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.


*ఐదవది*

*రోహిణీ చంద్రులు*

రోహిణీ కార్తెలో 

రోళ్ళు కూడా పగులుతాయనే 

సామెత ఉంది, 

చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, 

ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ, 

ఏ జంట భర్త మెత్తగా ఉండి,లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోనుఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.

*చదివారు కదా*

ఇంతకీ ఈ 5 జంటలలో *మీరు ఏ జంట అయ్యారో* చెప్పండి.



సేకరణ

గురుకుల్‌లో చదువు కోసం

 ఉచితం


ఎవరైనా హిందూ సోదరుడు తన కొడుకును హరిద్వార్ గురుకుల్‌లో చదువు కోసం చేర్చాలనుకుంటే, మార్చి 15, 2026 నుండి జూలై 15, 2026 వరకు హరిద్వార్‌లోని ఆచార్య పాణిగ్రహి చతుర్వేద సంస్కృత వేదపాఠశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.


"ఆ పిల్లవాడు 6వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి."


గురుకులంలో వసతి, ఆహారం మరియు అన్ని ఇతర సౌకర్యాలు పూర్తిగా ఉచితం. అదనంగా, నెలకు ₹8,000 స్కాలర్‌షిప్ అందించబడుతుంది. పిల్లవాడు నాలుగు వేదాలు, వ్యాకరణం, సాహిత్యం, ఇంగ్లీష్ మరియు ఇతర ఆధునిక విషయాలలో విద్యను పొందుతాడు. గురుకుల్ వేదాలలో నిపుణుడిగా మారడానికి మరియు M.A వరకు ఉన్నత చదువులకు మార్గదర్శకత్వం అందించడానికి కూడా సహాయపడుతుంది.


ఈ సందేశాన్ని మీ అన్ని హిందూ సమూహాలలో పోస్ట్ చేయండి.

మీ మతం యొక్క గొప్ప విద్యా సంప్రదాయానికి మద్దతు ఇవ్వడానికి వీలైనంత ఎక్కువ మంది హిందువులకు ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించండి.


వెంటనే సంప్రదించండి!

హీరాలాల్ జీ – 9654009263


(ఈ సందేశం హిందువుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు అందరు హిందువులకు చేరాలి.)


✊ జై! హిందూ!!🚩

ప్రభుపాద ఉవాచ!

  శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷

భగవద్గీతలో (7.14) శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు:


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।

మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ।। 


"భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన నా యొక్క ఈ దివ్యశక్తిని 'మాయ', అధిగమించడం చాలా కష్టం. కానీ, నాకు శరణాగతి పొందినవారు దానిని సునాయాసముగా దాటిపోగలరు." 


ఇది నిజానికి హరిదాస ఠకురా ప్రవర్తన ద్వారా నిరూపించబడింది. 

మాయ ప్రపంచం మొత్తాన్ని మంత్రముగ్ధులను చేస్తుంది. 

నిజానికి, భౌతిక ప్రపంచం యొక్క అద్భుతమైన ఆకర్షణల కారణంగా ప్రజలు జీవితపు అంతిమ లక్ష్యాన్ని మరచిపోయారు. 


కానీ ఈ మిరుమిట్లు గొలిపే ఆకర్షణ, ముఖ్యంగా స్త్రీ యొక్క ఆకర్షణీయమైన అందం, పరమాత్మునికి శరణాగతి పొందని వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది. 


భగవంతుడు చెప్తున్నాడు, మామ్ ఏవ యే ప్రపద్యంతే మాయం ఏతాం తరంతి తే: [Bg. 

7.14] "నాకు శరణాగతి పొందిన వ్యక్తిని భ్రమాత్మక శక్తి జయించలేడు." 

హరిదాస ఠాకురాను పరీక్షించడానికి వ్యక్తిగతంగా స్వయాన భ్రమ కలిగించే మాయా శక్తి వచ్చింది, కానీ ఇక్కడ ఆమె తన ఓటమిని అంగీకరించింది, ఎందుకంటే ఆమె అతనిని ఆకర్షించలేకపోయింది. 

ఇది ఎలా సాధ్యం?


ఎందుకంటే హరిదాస ఠాకురా, కృష్ణుడి పాద పద్మాలకు పూర్తిగా శరణాగతుడైయ్యాడు, భగవంతుని పవిత్ర నామాలను ప్రతిరోజు 3,00,000 సార్లు జపించడం ద్వారా ఎల్లప్పుడూ కృష్ణుని ఆలోచనలలో మునిగిపోయాడు.


(చైతన్య-చరితామృత అంత్య-లీల

అధ్యాయం.3, వచనం.250)


హరే కృష్ణ 

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

అష్టాదశ పురాణాలు

  అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - శివ తాండవ కథనం - నూట నలభై నాలుగవ భాగం

______________________________________________________


శౌనకాది మునులు సూత మహర్షిని "మహర్షీ! శివుడు శివతాండవః ఎప్పుడు ఎందుకు ప్రారంభించాడో తెలియచేయండి" అని అడిగారు.


సూత మహర్షి "మునులారా! శ్రీ లింగ మహాపురాణంలో చెప్పినది వివరిస్తాను. వినండి.


పూర్వం దారుకుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి "స్త్రీ నుంచి పురుషుని ద్వారా సృష్టించబడిన స్త్రీ వలనే మరణం పొందే" వరం పొందాడు. తరువాత ముల్లోకముల పైకి దాడి చేసి దేవతలను, మునులను హింసించి చంపసాగాడు. యజ్ఞయాగాదులు చేయకుండా అడ్డుపడ్డాడు.


దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి దారుకుని నుంచి రక్షించమని కోరగా బ్రహ్మ " ఆ ఆసురుడు స్త్రీ ద్వారా పురుషుడి నుంచి సృష్టించబడిన స్త్రీ చేతిలో మరణిస్తాడు" అని చెప్పాడు. అలాంటి స్త్రీ జననం కోసం ఏం చేయాలి అని అడగగా బ్రహ్మ "మనమందరం మహాదేవుడు, మహాదేవి వద్దకు వెళ్లి ప్రార్ధించుదాం. వారే దారి చూపుతారు " అని వారిని తీసుకుని కైలాసం వెళ్ళాడు.


శివపార్వతులను అనేక విధాలుగా స్తుతించి దర్శనం ఇమ్మని ప్రార్థించారు. ఉమాదేవితో కలసి పరమేశ్వరుడు దర్శనమిచ్చి రాకకు కారణం అడిగాడు. బ్రహ్మ నమస్కరించి "పరమేశ్వరా! దారుకుడు అనే రాక్షసుడు తపస్సు చేసి స్త్రీ ద్వారా పురుషుని వలన సృష్టించబడిన స్త్రీ వలనే మరణం పొందే వరం పొందాడు. తరువాత దేవతల స్వర్గం పై దాడి చేసి తరిమి కొట్టాడు. భూమి పై మునులు, బ్రాహ్మణుల పై దాడి చేసి బాధపెడుతూ, చంపుతూ యజ్ఞయాగాదులు మొదలైనవి అన్ని ఆపివేశాడు. తమరే ఆ స్త్రీని సృష్టించి దారుకుని చంపి మమ్మల్ని రక్షించండి" అని ప్రార్ధించాడు.


పరమేశ్వరుడు పార్వతీదేవి వంక చూసి "ముల్లోకాల రక్షణ కోరకు రాక్షస సంహారానికై తగిన స్త్రీ శక్తిని సృష్టించడానికి నాకు సహాయం చేయాలి " అని కోరాడు. పార్వతీదేవి సరేనని తన అంశ రూపాన్ని శివునిలో ప్రవేశపెట్టింది. చూస్తున్న దేవతలకు మాత్రం ఒకరి వంక ఒకరు చూస్తూ పక్క పక్కన కూర్చుని చిరునవ్వు నవ్వుతున్న శివ పార్వతులు కనిపిస్తున్నారు.


పరమేశ్వరునిలో ప్రవేశించిన పార్వతి అంశ రూపము శివుని కంఠంలోకి చేరింది. కంఠంలో గల విషమును పార్వతి తన అంశరూపంతో కలిపి నీలవర్ణముతో విషపూరితంగా చేసింది.

పరమేశ్వరుడు ఆ నీల స్త్రీ శక్తి రూపాన్ని తన మూడవ నేత్రము తెరచి బయటకు తెచ్చి కాళికాదేవిని సృష్టించాడు. త్రినేత్ర అయిన కాళికాదేవి నల్లని కంఠంతో అగ్ని జ్వాలలు చిమ్ముతూ భీకరంగా కనిపిస్తుండటంతో ఇంద్రాది దేవతలు భయపడి దూరంగా పారిపోయారు.


కాళికాదేవి లలాటము పై మూడో నేత్రము, శిరస్సు పై చంద్రవంక కలిగి త్రిశూలము ధరించి జగన్మాత పార్వతి వంక చూసింది. దారుకుని సంహరించ వలసిందిగా పార్వతీదేవి ఆదేశం ఇచ్చింది. పార్వతి ఆదేశం పాటించి కాళికదేవి దారుకుని నగరానికి వెళ్లింది. ఆమె వెంట భూత పిశాచ గణాలు వెళ్లాయి.


దారుకునితో పోరాడి భయంకరంగా దారుకుని సంహరించింది. రాక్షసుడి సంహారం తరువాత కూడా కాళికదేవి ఉగ్రరూపం శాంతించ లేదు. అడ్డు వచ్చి వారిని సంహరిస్తూ, రక్త పానం చేస్తున్న కాళికకు భయపడి దేవతలు మునులు శివుని శరణు వేడారు. శివుడు బాలకుని రూపం దాల్చి కాళికదేవికి ఎదురు వెళ్లాడు.


శ్మశానంలో భీకరంగా గర్జిస్తూ తిరుగుతున్న కాళికాదేవి ఎదురుగా వచ్చిన చిన్న బాలుని చూసి ఆగిపోయింది. శివమాయ చేత బాలునిపై మాతృ ప్రేమ కలిగి ఎత్తుకుని శిరస్సును ముద్దాడి తన వక్షస్థలానికి హత్తుకుంది. పసిబాలుడైన శివుడు ఆమె పాలతో పాటు క్రోధాగ్నిని త్రాగి వేసి అదృశ్యమయ్యాడు. 


శాంతురాలైన కాళికదేవి శశ్మానంలో కూర్చుండి మౌనంగా ఉండిపోయింది. సంధ్యా కాలము అయ్యింది. కాళికదేవిని ప్రసన్నం చేయడానికి శివుడు భూత ప్రేత గణాలతో అక్కడకు వచ్చి మొదటిసారి శివ తాండవ నృత్యము చేశాడు. కాళీకాదేవి కూడా ప్రసన్నురాలై తన యోగిని గణాలతో కూడి శివునికి కలిసి తాండవ నృత్యం చేసింది.


శివ కాళికాదేవిల తాండవ నృత్యం చూసిన బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలు, మునులు కాళికదేవిని అనేక విధాలుగా స్తుతించారు. కాళికదేవి ప్రసన్నురాలై అదృశ్యమయ్యింది. శివ పార్వతులు ప్రత్యక్షమైనారు. బ్రహ్మాది దేవతలు వారిని స్తుతించి తమను దారుకుని నుంచి రక్షించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


ఇది మొదటి సారి శివుడు చేసిన తాండవ నృత్య కథ. కొందరు శివతాండవం యోగకారణము చేత కలిగిన ఆనందము వలన చేసింది అని అంటారు" అని సూత మహర్షి ఆ రోజుకి భాషణం ముగించాడు.


తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ.


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - నవమి - హస్త -‌‌ స్థిర వాసరే* (13.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఎగ్జిమాయె యైన నెల్లర్జి దురదైన

  ఎగ్జిమాయె యైన నెల్లర్జి దురదైన

సొరియసిస్సు గాని శోభి గాని

తామరైన నిజము తగ్గించు హోమియో

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: చర్మవ్యాధులు కనిపించగానే అందరూ మేధావుల్లా డాక్టర్ల అవతారమెత్తేసి, ఇంగ్లీష్ మందుల షాపు నుంచి సిట్రాజెన్, ఏంటీబయోటిక్ టాబ్లెట్లు, ఏంటీబయోటిక్ ఆయింట్మెంట్లూ కొని తెచ్చేసుకుని వాడేస్తూ, దానిని కట్టడిలో పెట్టేసిన వీరుల్లా ఫీలైపోతారు! ఆనక అది తొండ ముదిరి ఊసరవెల్లిగా మారి, చుక్కలు చూపించినప్పటికి తమ వల్ల కాదనుకుని ఇంగ్లీషు స్కిన్ స్పెషలిస్టులందరి తెలివితేటలను కూడా చర్మంపై ప్రయోగిస్తూ, జీవితకాలం పాటు దానితో రాజీపడి గోక్కుంటూ, మా బ్రతుకింతేనని సరిపెట్టుకుని, మచ్చలు, దురదలు, దద్దుర్లు, పొలుసులు, పగుళ్ళు, రక్తాలు, చీము కంపులతో గతిలేక గోక్కుంటూ బ్రతికేస్తారు! నిజానికి వీళ్ళంతా తెలుసుకోవలసిన నగ్న సత్యం ఒకటుంది! అదేమిటంటే "ఇంగ్లీషు వైద్యంలోని ఏ మందులూ, ఆయింట్మెంట్లూ, ఏ చర్మవ్యాధినీ నయం చేయకుండా, లోలోపల అణచిపెట్టి (సప్రెస్ చేసి), ముదరబెట్టి, మరింత మొండి వ్యాధిగా మార్చి, ఎప్పటికీ మీరు వాళ్ళ చుట్టూ తిరిగే కుక్కలుగా మార్చుకుంటారు! అదే ఆంగ్లేయుల శైలి, ఆంగ్ల వైద్య శైలీ! సమస్య లేనివాడు వాళ్ళను పట్టించుకోడు! కాబట్టి అర్జంటుగా రిలీఫ్ కనిపించాలి, ఆహా! భలే వైద్యమని అనిపించాలి, ఆ ఒక్క రోగానికి వేసుకునే మందులే వీళ్ళకు తెలియకుండా వంద రోగాలను పుట్టించి, వీడు అందరు స్పెషలిస్టులకూ ఆహారమవ్వాలి! ఇది కదా ఇంగ్లీషు స్ట్రేటజీ! ఇదే నచ్చుతుంది అందరికీ! ఎందుకంటే అందరూ దాని మాయలో ఏనాడో జాంబీలుగా మారిపోయారు కాబట్టి! నిజానికి ఎలర్జీలు గానీ, దురదలు, చర్మవ్యాధులు ఏమైనా కనిపించిన తొలి రోజుల్లో దానిపై కేవలం కొబ్బరి నూనె రాసుకుని పడుకోవాలే తప్ప, ఏ మాత్రలూ, ఆయింట్మెంట్లూ వాడకూడదు! దానిని ఏమీ గెలక్కుండా వదిలేస్తే, మన ఆటోఇమ్యూన్ వ్వవస్థే దానిని నయం చేసేస్తుంది! కానీ అర్జంటుగా రిలీఫ్ వచ్చెయ్యాలని రాసే ఆయింట్మెంట్లు దానిని చర్మం దగ్గర అడ్డుకుని, రివర్స్ లో రక్తంలోకి పోయేలా చేస్తాయి! అలా రక్తంలోకి పోయినది రక్తమంతా తిరుగుతూ, అన్ని చోట్లకూ విస్తరిస్తుంది! ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ బయటపడటానికి ప్రయత్నిస్తుంది, అక్కడ కూడా ఆయింట్మెంట్లు రాస్తే, ఇంకొక కొత్త ప్లేస్ చూసుకుంటూ, చర్మానికి, అంతర్గత అవయవాలకూ దాని ప్రభావాన్ని విస్తరిస్తూ, ఆస్తమా, కేన్సర్, గుండె జబ్బులు, మైగ్రేన్ తలనొప్పులు, ఫిట్స్, బ్రెయిన్ ట్యూమర్లు, మానసిక జబ్బులు, షుగర్, బీపీ, థైరాయిడ్, కీళ్ళు, కిడ్నీ, లివర్ జబ్బులు, ఇలా ఎన్నో జబ్బుల సృష్టికి బీజాలు వేస్తుంది! పైకి రాసేది పసరైనా, ఆయింట్మెంట్ అయినా, వేసేది ఇంగ్లీషులో ఏ మందైనా, ఏ ఇంజక్షనైనా సప్రెషన్ క్రిందకే వస్తుంది! పిల్లి అయినా తలుపులు మూసి కొడితే తిరగబడుతుంది, అణచివేతకు గురైన వాడు ఎవ్వడైనా ఎప్పుడో ఒకప్పుడు మన మీద పడి, మన పీక నొక్కి, ప్రాణం తీయక మానడు! అదే సృష్టి ధర్మం! మందులే వాడుదాం అనుకుంటే హోమియో వాడండి, ఇది మాత్రమే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి నివారణ చేస్తుంది! లేదంటే అసలు ఏ మందులూ వాడకుండా, యోగా, ప్రాణాయామం, ధ్యానం, ప్రకృతి ఆహారంతో కొన్నాళ్లు గడపండి! సకల రోగాలూ సరైపోతాయి! ముఖ్యంగా చెప్పొచ్చేదేంటంటే ఎలర్జీలు, శోభి, దురద, ఎగ్జిమా, తామర, సొరియాసిస్ ఇలా ప్రతీ చర్మ వ్యాధినీ హోమియోతో సమర్థవంతంగా నయం చేయవచ్చు! ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమ్ పడుతుంది, కాబట్టి ఓర్పు, ఓపికతో నిలబడి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోండి! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

వంటిల్లు గ్రూప్......

 శర్మాస్ & శాస్త్రిస్ వారి వంటిల్లు గ్రూప్......


     అందరికీ నమస్కారము..

దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న రైల్వే ప్రయాణికులకు చక్కటి బ్రాహ్మణ భోజనము, ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా అందజేస్తాము.

మీరు చేయవలసినదల్లా ఒక్కరోజు ముందుగా మాకు తప్పక తెలియచేయవలెను. మీ భోగి వద్దకు మీరు కోరిన విధంగా టిఫిన్స్,భోజనం,పులిహార,దద్దోజనం, పొంగల్, చంటి పిల్లలకు పాలు, టీ, ఫిల్టర్ కాఫీ (ప్లాస్క్కు తెచ్చుకోవలెను, లేనిచో సిల్వర్ పౌచ్ కవర్లో ఇస్తాము) మందులు, మీ ప్రయాణంలో ఇంకా ఏ రకమైన సహాయము కావాలన్నా తగిన రుసుము తీసుకొని అందజేస్తాము,


01. Rajahmundry : 6304049434, 

02. Vijayawada: 9346021045

03. Secunderabad: 9346747694

04. Kottayam : 9567583429

05. Ramagundam : 9849259500

06. Anantapur: 8374392377

07. Cudappah : 9866261232

08. Kadiri : 90326 90554

09. Vizag: 62810 23114

10. Guntur: 6300070049

11. Shiridi: 9511111585

12. Tirupati: 9133160580

13. Renigunta : 9441218771

14. Varanasi : 8985667737

15. Bangalore : 9448605879

16. Kurnool : 9885777077

17. Nellore : 7658990739

18. Nellore : 80745 96345

19. Badrachalam : 80969 19125

20. Varanasi: 7318366814

21. New delhi : 9650873730

22. Housur (Tamil Nadu), Mallur (Karnataka) border : 9944799931

23. Coimbatore : 7448408447

24. Nagpur: 94033 02715

25. Arunachalam : 8682683536

26. Chennai : 7395932954

27. Ujjain : 98899 84688

28. Kerala : 9447136023

29. Madurai : 9842191826

30. Mumbai : 74484 08447


నలుగురికి ఉపయోగపడే పోస్ట్. దయచేసి అందరికీ షేర్ చేయండి.🙏