4, ఆగస్టు 2021, బుధవారం

బృహద్రథుడు ప్రదక్షిణ_ఫలితమే

 పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక #చక్రవాకపక్షి ఉండేది.


అది ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశమార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ #కాశీ నగరానికి వచ్చి చేరేది.


అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని #అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది.


ఆ ఆకలి తీర్చుకోవటం కోసం #అన్నపూర్ణాదేవి_మందిరం_చుట్టూ_పడిఉన్న_మెతుకులను_ఏరుకొని_తింటూ_పొట్ట_నింపుకొనేది.


ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది #గుడి_చుట్టూ_ప్రదక్షిణ చేసేది.


 అలా చాలాకాలం గడిచింది.


కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి #మరణించింది.


ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా #స్వర్గానికి చేరుకుంది.


 రెండు కల్పాలపాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది.


 ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట #మగశిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది.


పెద్దలు ఆ శిశువుకు #బృహద్రథుడు అని పేరు పెట్టారు.


పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు.


బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది.


🌺భూత,

🌺భవిష్యత్తు,

🌺వర్తమానాలు ఆయన కళ్లెదుట ఎప్పుడూ కనిపిస్తుండేవి.


బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకొన్నాడు.


#యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు.


 వీటన్నిటితోపాటు బృహద్రథుడికి #పూర్వజన్మ_జ్ఞాపకాలు_ఉండేవి.


అతడి #త్రికాలజ్ఞత,

పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆనోటా ఆనోటా ప్రజల అందరికీ చేరాయి.


గొప్ప గొప్ప #మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటిశక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుండేవారు.


 అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒక రోజు రాజు దగ్గరకు బయలుదేరారు.


 మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకారభావాన్ని కొంచమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్లి

🌸నమస్కరించి,

🌸పూజించి,

🌸అతిథి సత్కారాలను చేసి,

🌸ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు.


యోగక్షేమపరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత,


పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు.


#ప్రదక్షిణ_ఫలితమే

అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా,


అందులో పెద్ద రహస్యమేమీ లేదని,

తాను ఆ శక్తుల సాధనకోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు, క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు.


ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది.


వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్లీ చెప్పసాగాడు.


 గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు.


ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి రెండు కల్పాలపాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో #మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు.


తనకు లభించిన శక్తులు,

భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని,


జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మాహాత్మ్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు.


#కాశీ_అన్నపూర్ణావిశ్వేశ్వర_స్వామి_ఆలయ_దర్శనం,


#ప్రదక్షిణ_నమస్కారాలు_ఎంతో_విలువైనవి.


కాశి నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది.


కాశీ వెళ్లినప్పుడు తప్పకుండా #విశ్వనాథ_అన్నపూర్ణ_మందిర_ప్రదక్షిణం_చేయండి.


💮కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. 💮కాశీలో మరణించిన కుక్క కూడా స్వర్గానికే

💮వెళుతుందన్నది నమ్మకం.


 కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగుబంగారం లాంటివారు

సనాతన ధర్మం - వర్ణాలు*

 *సనాతన ధర్మం - వర్ణాలు*

----------------------------------------


జన్మనా జాయతే శూద్రః

కర్మణా జాయతే ద్విజః

వేద జ్ఞానేషు విప్రాణాం

బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః


(ఋగ్వేదం - ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు) 


భావం: పుట్టగానే అందరూ శుద్రులే (అనగా శిశువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం)..

కర్మ చేత మనిషి ద్విజుడవుతాడు..

వేదం నేర్చిన వారే విప్రులు..

బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు.


అదేవిధంగా., "వేద విధులతో సంచరించక, దేవతలను పూజించక, వివేకములు లేక, కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో

పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు. శూద్రులే అగుదురు.


----------------------------------------


వర్ణాశ్రమా అపి గుణకర్మాచరతో హిభవంతి.అత్రాహ మనుః

శూద్రే బ్రాహ్మణ తామేతి బ్రాహ్మణ శ్చైతి శూద్రతాం

క్షత్రియాజ్ఞాత మేవం తు, విద్యాత్ వైశ్యాత్తథైవచ"


(మను ధర్మ శాస్త్రం 10-65)


భావం: బ్రాహ్మణ గుణాలు కలిగిన శూద్రుడు బ్రాహ్మణుడే యగును.

శూద్రగుణాలు కలిగిన బ్రాహ్మణుడు శూద్రుడగును. అదేవిధంగా క్షత్రియజాతి, వైశ్యజాతి

కూడా కేవలం పుట్టుక వలనే కాక వారి వారి గుణ, కర్మాచరణల వలన యేర్పడును.


----------------------------------------

అతిరథ మహారథులు..

 అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!

(సేకరణ )

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం.

అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం

మనకు అర్థమవుతుంది.

అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు.

మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు.

ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..


రథి,

అతిరథి,

మహారథి,

అతి మహారథి,

మహామహారథి.


1) రథి..💐

ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.

సోమదత్తుడు,

సుదక్షిణ,

శకుని,

శిశుపాల,

ఉత్తర,

కౌరవుల్లో 96మంది,

శిఖండి,

ఉత్తమౌజులు,

ద్రౌపది కొడుకులు -

వీరంతా..రథులు.


2) అతి రథి (రథికి 12రెట్లు)..💐

60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

లవకుశులు,

కృతవర్మ,

శల్య,

కృపాచార్య,

భూరిశ్రవ,

ద్రుపద,

యుయుత్సు,

విరాట,

అకంపన,

సాత్యకి,

దృష్టద్యుమ్న,

కుంతిభోజ,

ఘటోత్కచ,

ప్రహస్త,

అంగద,

దుర్యోధన,

జయద్రథ,

దుశ్శాసన,

వికర్ణ,

విరాట,

యుధిష్ఠిర,

నకుల,

సహదేవ,

ప్రద్యుమ్నులు

వీరంతా..అతిరథులు.


3) మహారథి (అతిరథికి 12రెట్లు).💐

7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

రాముడు,

కృష్ణుడు,

అభిమన్యుడు,

వాలి,

అంగద,

అశ్వత్థామ,

అతికాయ,

భీమ,

కర్ణ,

అర్జున,

భీష్మ,

ద్రోణ,

కుంభకర్ణ,

సుగ్రీవ,

జాంబవంత,

రావణ,

భగదత్త,

నరకాసుర,

లక్ష్మణ,

బలరామ,

జరాసంధులు

వీరంతా..మహారథులు.

4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).💐

86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.

ఇంద్రజిత్తు,

పరశురాముడు,

ఆంజనేయుడు,

వీరభద్రుడు,

భైరవుడు -

వీరు..అతి మహారథులు.

రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు,

అటు ఇంద్రజిత్తు -

ఇటు ఆంజనేయుడు.

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.


5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .💐

ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,

దుర్గా దేవి,

గణపతి మరియు

సుబ్రహ్మణ్య స్వామి,

వీరంతా..మహామహారథులు.

మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం

హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు.

అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు