28, సెప్టెంబర్ 2022, బుధవారం

మధుమేహ రోగులలో

మధుమేహ రోగులలో   కంటి చూపు తగ్గడం , నరాల బలహీనతకోరకు - రెడ్డివారి నానుబాలు .


      మధుమేహంతో బలహీనం అయ్యి , నేత్ర రోగాలతో కంటి చూపు మందగించి , నరాల జబ్బులతో రోజురోజుకి కృశించి పోయే వారికి ఇది అమృత వర్షిని లా పనిచేస్తుంది . 







                  ఈ మొక్కలను సమూలంగా వేరుతో సహా తెచ్చి కడిగి ముక్కలు చేసి నీడలో ఆరబెట్టి జల్లించి ఆ పొడిని నిలువ చేసుకోవాలి . రోజు ఆహారానికి అరగంట ముందు అరచెంచా పొడిని అరగ్లాస్ నీటితో సేవిస్తూ ఉంటే మదుమేహం అదుపులోకి రావడమే కాకుండా నేత్రాలకు వెలుగు వస్తుంది. నరాలకు బలం కలుగుతుంది. 


               పుచ్చిన గోరు మీద దీని పాలు వేస్తున్నచో కొత్తగోరు వస్తుంది. 


      మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

మహాభారత పుస్తకములు 62 అన్నీ ఒకే దగ్గ

 TTD వారు ప్రచురించిన మహాభారత పుస్తకములు 62 అన్నీ ఒకే దగ్గర.... ఉచిత డౌన్ లోడ్...

ఈ లింక్ లో  TTD వారు ప్రచురించిన 18పర్వముల పుస్తకముల తో పాటు మహాభారతము కు సంభందించిన అనేక పుస్తకాలు ... మహాభారతము మరింత అర్థం చేసుకొనేందుకు వ్రాసిన వ్యాఖ్యానాలు...దాదాపు 60 పై న ఒకే దగ్గర ఉంచాము... లింక్ పై క్లిక్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు పుస్తకాల పేర్లు కనపడతాయి.... మీకు ఇష్టమైన పుస్తకం పేరుపై క్లిక్ చేసి pdf ను మీ gmail అకౌంట్ తో ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి....

👇👇👇

https://tinyurl.com/mynht85r

🙏🙏🙏

మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి.. అవి చాలా మందికి ఉపయోగపడాలి...

గాయత్రీమాత స్తుతి

 గాయత్రీమాత స్తుతి


ముక్తా విద్రుమ హేమ నీలధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్ష ణైః

యుక్తాం ఇన్దునిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ ౹

గాయత్రీం వరదాభ యాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం

శంఖం చక్ర  మదారవింద యుగళం హస్తైః  ర్వహంతీం భజే ౹


సీ.  విమలముక్తా హేమ  విద్రుమ సిత నీల 

               పంచముఖంబులు పరిఢవిల్ల,

     శిఖ యందు విధురేఖ చెలువార గల్గియు

               ఘనరత్నమకుటంబు కాంతులీన,

     తత్త్వార్థ వర్ణముల్ , త్రయలోచనంబులున్

               ఘనవిశిష్టత తోడ కల్గియుండ,

     వరదాభయమ్ములౌ నురుదివ్య ఘనముద్ర ,

               లరవింద యుగళంబు, నంకుశంబు, 

తే. శంఖ, చక్ర , కశా, గదా, సహిత యగుచు 

     శుభ్రమైన కపాల, సంశోభ నున్న 

     మాత 'గాయత్రి' నెన్నుచు మదిని నేను

     భక్తి భజియింతు నవ్యయ ముక్తి గోరి

కావలిసిన పుస్తకాలు

 ఈ మెసేజ్ save చేసి ఉంచుకోండి... ఎన్ని లక్షలు వెచ్చించినా ఇలాంటి సమాచారం మీకు లభించక పోవచ్చు...

ఇది అత్యంత విలువైన పుస్తక భాండాగారం... 

ఇందులో రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, అష్టాదశపురాణాలు, పిల్లల నీతి చంద్రికలు, పంచతంత్రం, బాలానందం, పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, అందరికీ ఆయుర్వేదం....

లాంటి ఎన్నో ఉపయోగ కర  పుస్తకాలు ఉన్నాయి... ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఎంత సమయం వెచ్చించినా ఇంత విలువైన సమగ్రమైన సమాచారాన్ని ఒకే క్లిక్తో పొందలేరు...  

 భగవద్గీత... https://tinyurl.com/yrw54twr

మహా భారతము .. https://tinyurl.com/mynht85r

రామాయణము... https://tinyurl.com/cb8h94ss

భాగవతము ... https://tinyurl.com/r8uxjhbb

వేదములు ... https://tinyurl.com/y2haxbad

అష్టాదశ పురాణములు... https://tinyurl.com/4a69k9tk

పిల్లల నీతి కథలు... https://tinyurl.com/482ed93y

అందరికీ ఆయుర్వేదం... https://tinyurl.com/nnybunhe

🙏🙏🙏🙏

ఒకసారి చూడండి మీకు నచ్చిన పుస్తకాలు మీ మిత్రులతో తప్పనిసరిగా షేర్ చేసుకోండి.... 

కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏

మూడు జన్మల ముష్టివాడు*

 *శాస్త్రం చెపుతోంది:*


_*మానవులు, ఎందుకు బిచ్చగాళ్ల లాగా అవుతారు !!?*_  


ఒక గ్రామంలో ఒక  బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్లి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. ఒక రోజు ఒక ఇంటి వద్ద  *భవతీ భిక్షాం దేహి, మాతా! అన్నపూర్ణేశ్వరీ* అని అడిగాడు. 


ఆ ఇంటి యజమాని పండితుడు. అతను అరుగు మీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఇల్లాలికి వినిపించలేదేమో!! అని బిచ్చగాడు గట్టిగా మళ్లీ *"భవతీ భిక్షాం దేహి, మాతా! అన్నపూర్ణేశ్వరి"* అని అన్నాడు. 


*పండితుడికి కోపం వచ్చింది*.  నేనిక్కడ ఉంటుండగా నాతో మాట్లాడకుండా, నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే! ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా ?? వీడికి తగిన శాస్తి చేస్తాను !! 


అని అనుకుని, వెంటనే ఏమేవ్!! *మూడు జన్మల ముష్టివాడు* వచ్చాడు బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు. ఆ గొంతు పోల్చుకున్న ఆమె, భర్తకి కోపం వచ్చిందని గ్రహించి, వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలకు వెళ్లిపోయింది. 


కానీ బిచ్చగాడు మాత్రం కదల్లేదు. అతని చేతిలో కర్ర కూడా ఉంది. 


అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది. 


అకారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ కలిగించాయి.  వీడిపుడు ఏం చేస్తాడు !!?తిడతాడా!! లేదా !! ఇంకా ఏమన్నా చేస్తాడా ?! అని లోలోపల బాధ పడుతూ చూస్తున్నాడు. 


ఇంతలో బిచ్చగాడు ఏమండీ అని పిల్చాడు. 


ఆ !! అంటూ, చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు.  


ఏం లేదు, మీరు నన్ను మూడు జన్మలు ముష్టివాడన్నారు. అది ఎలాగా !? అన్నాడు. 


అదా !! దానికేం ఉంది !! తెలుసుకోవాలనుకుంటున్నావా ?!  అయితే, ఇలా కూచో అన్నాడు. 


ఫరవాలేదు, చెప్పండి !! నిలబడతాను అన్నాడు.


*శ్లోకం:*


*అదత్త దానాచ్చ భవేత్ దరిద్రః*

*దరిద్ర దానాచ్చ కరోతి పాపం*। 

*పాప ప్రభావాత్ పునర్దరిద్రః*

*పునర్దరిద్రః పునరేవ పాపీ*॥


అని శ్లోకం చదివాడు. 


వెంటనే బిచ్చగాడు, అయ్యా !! మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు. నాకు అర్ధమయ్యేటట్లు మాటల్లో చెప్పండి అన్నాడు.  


నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. అంటే రెండు కారణాలు: 


ఒకటి, నీకు లేకపోయి వుండొచ్చు. లేదా, ఉండి కూడా దానం చేయకపోయుండచ్చు. 


లేకపోతే, గతజన్మలో నువ్వు ముష్టి వాడివి. కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టి వాడుగా అయిపోయావు. 


అంటే రెండు జన్మలు ముష్టివాడివి అయ్యావు. 


అర్థమైంది !! మరీ చెప్పొద్దన్నాడు బిచ్చగాడు. 


ఎందుకు అన్నాడు పండితుడు? 


ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా !! అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. 


మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి, అయ్యా, ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా !!? నేనిలాగే జన్మజన్మలకు బిచ్చగాడి గానే ఉండిపోవాలా? అని అడిగాడు. 


*జ్ఞానం, సమయం, వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు* ఇలా కూచో అన్నాడు. 


పెద్దవారు మీ దగ్గర నేను కూర్చోవడం !! అన్నాడు. 


ఫర్వాలేదు కూచో *జిజ్ఞాసా పరులకు శాస్త్రం చెప్పొచ్చు, అలాగే చెప్పాలి* కూడా !! అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు. 


కూర్చున్నాడు బిచ్చగాడు. 


ఇప్పుటికైనా దానం చేయడం మొదలు పెట్టాలి అన్నాడు పండితుడు. 


నేను దానం ఎలా చేస్తాను !!?  నా దగ్గర ఏముంది గనుక ??


అన్నీ ఉన్నాయి. లేకపోవడమనేది లేదు. నీలో దాన గుణం ఉంటే చాలు. నీ దగ్గర ఉన్నదే దానం చెయ్. ఈ రోజు నుంచి నీ కడుపుకి ఎంత కావాలో -- అంత మాత్రమే బిచ్చమెత్తుకుని, అందులో సగం దానం చేస్తుండు. *తనకు అవసరమున్నాసరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమే దానం తాలూకు ముఖ్యోద్దేశ్యం* _(తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు)_. 


బిచ్చగాడికి విషయం అర్థమైంది. వెంటనే ఇక ఆ రోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు. 


*తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని, అందులోంచి సగం దానం చేయాలి.*


_మరి ఇది ఎలా తెలుస్తుంది !!?_ 


దాని కోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకుని, అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ, అందులో  సగం దానం చేస్తూ, సగం మాత్రమే తిన్నాడు. దాంతో ఈ బిచ్చగాడికి, బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. అలాగే తిరగడం శ్రమ, కాలం కూడా తగ్గిపోయింది. అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు !! ఇతను మన ఇంటికొస్తే ఈ రోజు బాగుణ్ణు !! అనేటటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి. అంతేకాదు మొన్న వాళ్ళింటి కెళ్ళాడు. నిన్న వీళ్ళింటికి వచ్చాడు.  ఇవ్వాళ మనింటికి తప్పకుండా వస్తాడని వాళ్లు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు. అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది. సాత్వికంగా ఉండేది. మంచి ఆహారం లభించేది. పుచ్చుకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు. అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్లు చుట్టూ చేరి నువ్వే మా గురువన్నారు. ఇతడికది అంగీకారం లేదు. 


ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు  కాశీ వెళిపోకూడదు !!? అని అనిపించింది. 


వెంటనే బయలుదేరాడు. వెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులోనున్న సగం దానం చేయడం. మిగిలినదే తినడం *అంటే అర్థాకలి* తన *ఆకలి కడుపుని* భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు. మొత్తం మీద  *కాశీ పట్టణాన్ని చేరాడు*. 


అతను ఇదే నియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టు కింది ఎక్కువసేపు కూచునేవాడు.  ఆతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్లిపోవడం ప్రసక్తి లేదు. లేదా సాయం-ధర్మం చేయండి, దానం చేయడం వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు. ఎప్పుడూ, ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు. అతని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా అతను వెళ్లాక ఎవరో తీసుకునే వాళ్లే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద పదిమంది దృష్టి పడింది. 


*అతనొక సాధకుడని, కారణజన్ముడనీ*  అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు. ఆ సత్రం పేరు *కరపాత్ర సత్రము.* 


అతని పేరును *కరపాత్ర స్వామీజీ* అని ప్రజలే ఆ పేరు పెట్టారు. కరమే(చెయ్యి) పాత్రగా కలిగినటువంటివాడు అని అర్థం. ఇలాగ వేదవిదులు వేదాభ్యాసం చేస్తున్నారు. పిల్లలకు వేదం, శాస్త్రం, పురాణం, ఇతిహాసాలు చెప్తున్నారు. సత్రాల్లో బస చేస్తున్నారు, వచ్చే-పోయే వాళ్లు కూడా భోజనం చేస్తున్నారు. కానీ ఇతనికీవిషయాలు ఏవీ తెలియవు. ఇతడు మాత్రం రోజు నదికి వెళ్లి స్నానం చేసి ధ్యానం చేయడం, మధ్యాహ్నం బిచ్చమెత్తుకోవడం, తనకు వచ్చిన దాంట్లో సగం దానం చేస్తుండడం యథాతథంగా జరుగుతోంది. కొన్నాళ్లయింతర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్లు, నిలబడే వాళ్ళు, చూసేవాళ్ళు, దండం పెట్టుకునే వాళ్లు పెరిగారు. వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించడం, పందిళ్లు వేయడం మొదలుపెట్టారు. పెద్ద తీర్థ యాత్రగా మారిపోయింది. 


ఇంకొన్నాళ్లయినాక  ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభా బాధ్యత అంతా వాళ్లే భరిస్తూ *కరపాత్ర స్వామీజీని* పిలిచారు. అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకు ఈయన 15 ఏళ్లుగా తెలుసు. వీరిని చూసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చిందని, అంతేకాదు కొన్ని కుటుంబాల వాళ్లయితే మేమీయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్లయిందన్నవారు, మాకు ఉన్న అప్పులన్నీ తీరాయి, కష్టాలు తీరాయి అన్నవాళ్లు, మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి, పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో !! అంత పుణ్యమూ, వీరిని దర్శిస్తే నాకు ఇలా జరిగింది ! అని అనేక రకాలుగా చెబుతున్నారు. కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది, ఈయనే గురువు నాకు. మా గురువు గారు కాశీ వెళ్లమని చెప్పారు. అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను. ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు.


మన *కరపాత్ర స్వామీజీకి* అర్థం కాని విషయాలు రెండు. ఇంతకీ, 


1) *కరపాత్ర స్వామిజీ* ఎవరు.!!? *ఇన్నాళ్లు కాశీలో వుండి వారిని దర్శించుకోలేక పోయాను* ఎంత దౌర్భాగ్యుణ్ణి !! 

2) *నాకు గురువు ఎవరు* !? 


ఈ రెండు ప్రశ్నలను ఆయనను బాధిస్తున్నా అక్కడికొచ్చే వారికి ఏమి చెప్పాలో తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి, నాకు భిక్షా సమయమయింది !! నేను వెళ్లాలి అన్నాడు. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు. అతడు సరాసరి భిక్ష ఐన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరు ఆలోచించు కున్నాడు. ప్రశ్నించుకుంటూ ఉంటే, తనకొక విషయం తట్టింది. 


*తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు* అని నిర్ణయించుకున్నాడు.


అంతే, వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట బిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గూర్చి విచారించుకొని బయలుదేరాడు.  దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్లు, కలసి-చూసి వచ్చిన వాళ్లు అక్కడ వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో భోంచేసిన వాళ్లు అందరూ ప్రతి గ్రామంలోని వారు గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం, అయనకేదో ఇవ్వడం, అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చుపెట్టమని చెప్పి పెద్దలకు  ఇచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం ఈయన ఖ్యాతి  ఆనోట-ఇనోట ప్రతి గ్రామానికి చేరింది. అందరూ ఇతని కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో *కరపాత్ర స్వామిజీ* వారు వచ్చారు అని చెప్పి అక్కడికి ఆ గ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు. ఆయన కూడా వెంటనే అంగీకరించాడు. *పండితుడు వెళుతూనే పాద నమస్కారం చేసాడు* ఆయనని మంత్ర పూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు. ఆయన గురించి, నేను చూశానంటే, నేను చూశాను! నేనక్కడ సత్రంలో పనిచేశాను! అక్కడ వేద పండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అని నేర్చుకుంటారు! నేనక్కడున్నాను! వీరిని మళ్లీ ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది. ఇలా చాలా మంది మాట్లాడారు. స్వామీజీ కూడా మాట్లాడటం ఐపోయిన తరువాత నాకు *భిక్షా సమయం* అయింది నేను వెళ్లిపోతానని చెప్పాడు. *పండితుల వారు మా ఇంటికి భిక్షకి దయచేయండి* అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించాడు. వాళ్ళింటికి వెళ్ళాడు. ఇద్దరు లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే ఎరిగిన *ఆ తల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది.* ఆవిడ ఆ భిక్ష పెడుతున్నప్పుడు ఆమెకు ఏదో మాతృత్వం తొణికిసలాడింది. ఇదేం గమనించని స్వామీజీ భిక్ష కోసం దోసిలి చాపాడు. 


ఆవిడకు ఎందుకో అనుమానం వచ్చింది. చూస్తున్నప్పుడే కొంత అనుమానము, ఇలా అడిగేసరికి ఇంకా అనుమానం వచ్చింది. సరే అని ఆయన నియమాన్ని భంగపరచకూడదని కరతలంలో  భిక్ష పెట్టింది. 


అమ్మా, నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా !! అని అడిగాడు స్వామిజీ. అయ్యో ! అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే *పండితుడు*: *స్వామీజీ ఆ  భాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి పట్టాడు*. స్వామిజీ ఇచ్చేశాడు. 


ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహ యజమాని ఐన పండితుడు, అతిథి ఐన స్వామీజీ ఇద్దరు కూడా భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామిజీ అడిగాడు, పండితులవారు *నన్ను గుర్తు పట్టారా* అని ? అబ్బే నేనెప్పుడూ కాశీ మహానగరం రాలేదండీ.. నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు. 


సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు పండితుడు. వద్దండీ *శాస్త్ర ప్రకారమూ ఏరుల (నదుల), శూరుల, మహనీయుల మహాత్ముల జన్మరహస్యం అడగకూడదు*. సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి. *నా గురుదేవులు మీరు*. అన్నాడు స్వామి. అబ్బే నేను పండితుడను. అంత వరకే అన్నాడు. 


అయ్యా ముందు వినండి. *నేను ఎవరో కాదు  మీ మూడు జన్మల ముష్టివాణ్ణి* అని చెప్పాడు. పండితుడు ఒక్కసారిగా  భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి *పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది*. 


అంత మాటలొద్దు అమ్మా. ధర్మం చెప్పేవాడు *నిష్కర్షగా* చెప్పాలి. 

ఆనాటికే కాదు ఈనాటికీ నేను సామాన్యుడినే. కానీ *ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా* చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. నేను ఈనాడు ఈ స్థితికి వచ్చే వాణ్ణి కాదు. అంచేత మీరే *నా గురువు అంటూ నమస్కరించారు స్వామీజీ*. లేదు లేదు.. మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను *మహా అహంకారిని, పండితుడని గర్వం ఉండేది* నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. అహంకారాలు పోయాయి గనక 

ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. ఇద్దరూ హాయిగా పరమానందానుభూతిని పొందారు. 


*బెనారస్ యూనివర్శిటీ (కాశీ విశ్వవిద్యాలయం) లో ఇప్పటికీ ఈ కరపాత్ర స్వామీజీ పేరుతో అవార్డ్ ఇస్తున్నారు*.

వృద్దురాలు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

,*బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు*( ఒక వాస్తవ గాథ )

అది రాత్రి సమయం . 'దేవ్ గడ్' కి వెళ్లే ఆఖరు బస్సు సమయం మించి పోయినా, ఇంకా కదలటం లేదు. బస్సు స్టాండు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ముగ్గురు నలుగురు ప్రయాణికులు మాత్రమే అక్కడక్కడ తిరుగాడుతున్నారు. బస్సులోని పది పన్నెండుగురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఇంకా ఎందుకు కదలటం లేదని

తబ్బిబ్బులు పడుతున్నారు. ఇంతట్లో ఒకతను బస్సు టైయర్ పంచర్ అయిందని కబురు తెచ్చాడు.

పంచర్ పని కాగానే బస్సు కదులుతుందట. సరిగ్గా పది గంటలకు బస్సు కదిలింది.

ప్రయాణికులందరూ దేవ్గడ్ కు వెళ్లేవాళ్ళే. ఒక చేతిన

పెద్ద మూటను పట్టుకొని కూర్చున్న వృద్ధురాలును టికెట్టు తీసుకోమని కండక్టర్ అడుగగా ఆమె బస్సు బాటలో ఉన్న 'కాత్వన్ 'ఊరి గేటు వరకు టికెట్టు ఇవ్వమని అడిగింది - ఆ ఊరి గేటు నుండి ఒక కిలో మీటరు దూరాన తన ఊరు ఉందని కూడా అంది. బస్సు కండక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఈ వృద్ధురాలు

వయసు ముదిరింది. ఒక్కతే దిగనుంది . వానకాలపు దట్టమైన మబ్బులో ఆమె తన ఇంటిని ఎలా చేరుకుంటుందో....?

అతడు ఆ వృద్ధురాలిని కొద్దిగా మందలించాడు- "నీవు ఒంటరిగా ఉన్నావు, నీకు కళ్లు కనపడటం లేదు, సరిగా నడవటం కూడా రాదేమో ?, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? వెలుతురు ఉండగానే ఇంటికి చేరు కోవాలి కదా ? "ముసలామెకు సరిగా వినపడటం కూడా లేదు. గొణుగుతూ ఏదో జవాబు ఇచ్చింది!

కండక్టర్ ఆమె ఊరికి టికెట్టు ఇచ్చి తన స్థలం వద్దకు వచ్చి కూర్చున్నాడు.

బస్సులోని ఇతర ప్రయాణికులు నిద్ర కూనుకులు తీస్తున్నారు. డ్రైవర్ బస్సు లోని లైట్లు తీశాడు. కండక్టర్ వృద్ధురాలి గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆ ముసలవ్వను ఆ ఊరి గేటు దగ్గర దింపుతే ఆమె కిలో మీటరు దూరం లో ఉన్నా తన ఇంటిని ఈ వాన మబ్బులో ఎలా చేరుకుంటుంది ? ఆమె కు నడవటానికే రాదు. కంటి చూపు సరిగా లేదు. ఆమె ఊరి బాటలో వాగులు వంపులు గుంతలు ఉంటే ఎలా దాటి పోగలదు....?

ఒంటరిగా ఉన్నా ఆమె పై ఏదైనా అడవి మృగం దాడి చేస్తే....?

ఇంతలో ముసలామె దిగు ఊరి గేటు వచ్చింది. కండక్టర్ బెల్ కొట్టాడు. డ్రైవర్ బస్సు ఆపాడు .

కండక్టర్ లేచి ముసలవ్వ మూటను ఒక చేత్తో పట్టుకొని రెండవ చేత్తో అవ్వ చేతిని పట్టుకొని ఆమెను బస్సు దింపాడు. కొద్దిగా శ్రమ అని పించింది.

బయట చిట్ట చీకటి. ఏమీ కనపడుట లేదు. కండక్టర్

అవ్వ మూటను తలపైకి ఎత్తుకొని అవ్వ భూజాన్ని చేత్తో పట్టుకొని ఆమె ఊరి బాట పట్టాడు. అవ్వను ఒంటరిగా వదలక ఏదో విధంగా ఆమెను ఇంటికి సురక్షితంగా చేర్చాలని

కండక్టర్ గట్టి  పట్టు పట్టాడు.

అవ్వకు ఆశ్చర్యమేసింది! ఆమె తన శక్తి మేర కండక్టర్ అడుగుల్లో  అడుగులు వేస్తూ బిరబిరా  నడవ సాగింది.

"పది పదిహేను నిమిషాలు గడిచినా కండక్టర్ ఎక్కడి వెళ్ళాడు? " అని ఇటు ప్రయాణికులు అటు డ్రైవర్ల ల కావ్ కావ్ లు మొదలయ్యాయి. డ్రైవర్ బస్సు దిగి బండి చుట్టూ తిరిగాడు. అతడు లఘు శంక లేదా దీర్ఘ శంకకు వెళ్లి ఎక్కడైనా పడిపోయాడేమో నని గాలించాడు. కూతవేశాడు . అయినా, జాడ లేదు. అతడు ముసలవ్వ ను వదలటానికి ఆమె ఇంటికి వెళ్లి ఉంటాడని

అనుకున్నాడు. మనసులో విసుక్కున్నాడు. ఇంత రాత్రిన నిర్జన స్థలంలో బస్సు ను వదిలి వెళ్లిన కండక్టర్ని ప్రయాణికులు కూడా కస్సుబుస్సుమని కరిచారు.. "కండక్టర్ ఎక్కడున్నా ఉండనీయండి ! బస్సును నడపండి! " అని కొందరు ప్రయాణికులు డ్రైవర్ కి

ఆదేశాలు ఇచ్చారు.

"నాయనా! నీ పేరేంటి ?" అని కండక్టర్ని అడిగింది ముసలామె .

"అవ్వా! నా పేరుతో నీకేమి పని?..... నా   పేరు మహాదూ వేంగుర్లే కర్ ."

"ఏ డిపో లో పని చేస్తున్న వయ్యా? "

" మాల్‌ వన్ ." అన్నాడు కండక్టర్ .

" నీకు సంతానం ఎంత మంది ?"

" ఇద్దరు " అన్నాడు కండక్టర్ .

ఇంతట్లో ముసలవ్వ ఇంటిని (పూరి గుడిసె ను ) చేరుకున్నారు.. రెండు మూడు కుక్కలు ఆరుస్తూ అక్కడి నుండి పారిపోయినవి. ముసలవ్వ కండక్టర్ కు తన ఇంటి తాళం చెవి ఇచ్చింది. అతడు ఆమె ఇంటి తాళం తెరిచి ఆమె చేతికిచ్చి పరుగు పరుగున బస్సు దారి పట్టాడు.

ఆ ముసలవ్వ ఆ ఊరి కొన భాగంలో ఒంటరిగా  ఉంటుంది . ఆమెకు దగ్గరి బంధువులు అనువాళ్ళే లేరు! ఆమెను ప్రేమించే వాళ్లు లేదా ఆమె బాగోగులు అడిగే వాళ్లే లేరు!!

ఆమె ఎప్పుడూ ఎవరి వద్దకు వెళ్లేదే కాదు. ఎవరైనా ఆమె దగ్గరకు వస్తే వాళ్ళు స్వార్ధ పరులని సందేహించేది . అలా వచ్చే వాళ్ళు తన సంపద పైన కన్ను వేసే వచ్చారని అనుమానిస్తుంది! ఆ వయసులో అలా అనుమానం  స్వాభావికం మరియు వాస్తవం కూడా ! ఊరు శివార్లో ఆమె పేరట రెండు ఎకరాల  భూమి ఉంది. అట్టి భూమిని ఊరి వారికి కౌలుకు ఇచ్చి  వచ్చిన డబ్బుతో పొట్ట పోషించు కుంటుంది.

ఒక రోజు ముసలవ్వ ఎందుకో చాలా జబ్బు పడింది. అట్టి స్థితిలో ఆమె తన ఊరి సర్పంచ్ మరియు కార్యదర్శిని రమ్మని

పిలుపునిచ్చింది. అది విని వాళ్ళు ముందుగా కొద్దిగా అనుమాన పడ్డారు. అయినా,వాళ్లు ఆమె ఇంటికి వచ్చారు. ముసలవ్వ లేచి కూర్చుంది. వచ్చిన వారితో  "గ్రామ పెద్దళ్లారా! ఇక నా ఆరోగ్యం చాలా క్షీణించింది. నేను ఎక్కువ రోజులు బ్రతకను .

కావున నా దగ్గర ఉన్న ఈ రెండున్నర  తులాల బంగారం, నా భూమి మరియు నా ఇల్లును 'మాల్‌ వన్‌ 'బస్సు డిపో లోని కండక్టర్ మహాదూ వేంగుర్లే కర్ పేరట నా వీలునామా వ్రాయండి. ఇదిగో నా దగ్గర పొదుపు చేసిన ఈ ఇరవై వేల

రూపాయలు తీసుకొండి. ఇందులోంచి నేను గతించిన తరువాత నా క్రియ ఖర్మల

కోసం వాడుకోండి . నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకను ." అని

అంది. సర్పంచ్ మరియు కార్యదర్శి ముసలవ్వ మాటలు విని ముందుగా ఆవాకయ్యారు.

ఇదేంటి సమస్య? ఈ మహాదు

వేంగుర్లే కర్ ఎవరు ? ఈ పేరు ముందు ఎప్పుడూ విన లేదే? అతడి పేరట ఈ ముసలామె ఎందుకు తన సంపదను వ్రాస్తుంది? ఏదో సంబంధం ఉండి ఉంటుందనుకొని ముసలవ్వ తో సెలవు తీసుకొని

వెళ్లి పోయారు.                 రెండు మూడు రోజుల తరువాత ముసలవ్వ

కన్నుమూసింది.

ముసలవ్వ కోరిక మేరకు సర్పంచ్ మరియు కార్యదర్శి అన్నీ క్రియ కర్మలు జరిపించారు. అన్నీ పనులు పూర్తి చేసి వాళ్లు 'మాల్‌ వన్ ' బస్సు డిపో కి వెళ్లి మహాదూ వేంగుర్లే కర్,కండక్టర్ ని కలిసి ముసలవ్వ వివరాలు వివరించారు.

ఒక ఏడాది క్రిందటనే జరిగిన సంఘటన కావున కండక్టర్ కి అన్నీ విషయాలు జ్ఞాప్తికి వచ్చాయి. ముసలవ్వ తన 

పేరట వీలునామా వ్రాసిన 

విషయాలు తెలిసిన తరువాత కండక్టర్ కళ్ళు కన్నీళ్ళతో నిండాయి. అతడు ఆ రోజు రాత్రి జరిగిన ఘటన వాళ్ళకు వివరించాడు. అది వినిన సర్పంచ్ మరియు కార్యదర్శి లకు చాలా ఆశ్చర్యమేసింది. వాళ్లు తాము నిర్ధారించిన తారీఖున కండక్టర్ ని తమ ఊరికి రమ్మని పిలుపునిచ్చారు.

మహాదూ వేంగుర్లే కర్ పిలిచిన తారీఖున ఊరును చేరుకున్నాడు. వందలాది గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. సర్పంచ్ గారు కండక్టర్ మెడలో ఒక పూలమాల వేశాడు. బాజా బజంత్రీలతో అతడిని గ్రామ పంచాయితీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

అందరూ సభగా కూడిన తరువాత సర్పంచ్ గారు ముసలవ్వ తన పొలం మరియు ఇల్లు కండక్టర్ పేరట వ్రాసిన పత్రాలు మరియు రెండున్నర తులాల బంగారు కండక్టర్ చేతుల్లో ఉంచారు. అవి అందుకొని కండక్టర్ తన     దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు.

ముసలవ్వ కు తాను చేసిన చిన్నపాటి సహాయం తో ఆమె ఇంత విలువైన సంపదను తన

పేరట వ్రాయటం అతడికి మతి

పోయినట్లు అయింది.!

అక్కడ సమీపం లో పిల్లల గోల

వినపడింది. "ఇక్కడ ప్రక్కన బడి ఉందా? " అని అడిగాడు

కండక్టర్.

"ఔను, ఈ బడి కోసం స్వంత స్థలం లేదు మరియు భవనం కూడా లేదు. అందుకే మా

 కాత్వాన్ గ్రామ పంచాయితీ అధీనంలో ఉన్న ఈ స్థలం లో సరిపోని ఇరుకు గదుల్లో మా

హైస్కూల్ నడుస్తుంది. " అని

చెప్పాడు సర్పంచ్ . 

" ఏం..? దగ్గర్లో బంజరు భూమి లేదా? ఊర్లో ఎవరో ఒకరు బడి

నిమిత్తం తమ భూమి లోని కొంత భూమి బడి కోసం దానం యిచ్చే వాళ్లు లేరా?" అని మళ్ళీ అడిగాడు కండక్టర్.

" ఊర్లో బంజరు భూమి లేదు. బడి కోసం తమ పొలం ఇవ్వటానికి ఊర్లో ఎవరూ

ముందుకు రావటం లేదు." అని

జవాబిచ్చాడు సర్పంచ్ .

వెంటనే కండక్టర్ తన కుర్చీ లోంచి లేచి నిలబడ్డాడు. టేబల్ పైన ఉంచిన ముసలామె కాగితాలు సర్పంచ్ కు అందిస్తూ -" ఇదిగో సర్పంచ్ గారు పాఠశాల నిర్మాణానికి ముసలవ్వ పొలం మరియు ఇంటి కాగితాలు తీసుకొండి. ఈ పొలం మరియు ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో పాఠశాల నిర్మాణ పనులు మొదలు పెట్టండి. ఇదిగో అవ్వ ఇచ్చిన

బంగారం తీసుకొండి . దీన్ని అమ్మి వచ్చిన డబ్బుతో అవ్వ పేరట బడికి ఒక భవ్యమైన ప్రవేశద్వారం నిర్మించండి మరియు దాని పైన అవ్వగారి పేరు అందమైన అక్షరాలతో లిఖించండి. " గ్రామస్తుల చప్పట్లతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. సర్పంచ్ మరియు ఊరు జనం భావుకులయ్యారు. "పాఠశాల  కు అవ్వ పేరు పెట్టుకుందాం!!" అని అందరూ మురిసి పోయారు.

కండక్టర్ మహాదూ వేంగుర్లేకర్ అందరికి ధన్యవాదాలు చెప్పి వెళ్లటానికి సెలవు పుచ్చుకుని నడవసాగాడు. ఊరి జనం అతడిని కొంత దూరం వెంబడించింది.

చినిగిన సంచి భుజాన ఉన్నా, కండక్టర్ ఊరి సంపదను అదే

ఊరికి ఇచ్చి వెళ్లి పోయాడు. మరో ప్రక్కన అవ్వ పేరును శాశ్వతంగా నిలబెట్టి పోయాడు.

మనం జీవితం లో ఒకరికి చేసిన

చిన్న పెద్ద సహాయం ఎప్పుడూ వృధా కాదు. ముందటి వ్యక్తి  కృతఘ్నుడైనా, మనం మన పరోపకార బుద్ధిని వదల కూడదు.

మనిషి మనిషి కి మధ్య మన మానవత్వం ఎల్లప్పుడూ బతకాలని ఈ పోస్టు ఒకరికొకరం పంపుకుందాం!!👍🙏


A.V. రామారావు గారి వాట్సాప్ పోస్ట్

చిట్టికథ

 *✍️...నేటి చిట్టికథ*


తనని నమ్మిన భక్తులని కాచి రక్షించెందుకు ఆ పరమేశ్వరి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది..


అలా ఎన్నో సంఘటనలు జరిగాయి వాటిలో ఇదొకటి...


తిరుకడైవూర్ క్షేత్రంలొ "అభిరామి అమ్మవారు" సాత్విక రూపంలో వెలిసి ఉన్నారు అదే క్షేత్ర పరిధిలో అభిరామ భట్టు అనే భక్తుడు కూడా ఉండేవాడు ఈయన ప్రతి రోజు అమ్మవారి ఆలయంలొ ధ్యానంలోనే ఎక్కువ సమయం ఉండేవాడు.


ఆయన ధ్యానస్థితిలో ఉండగా అమ్మవారు ఆయనకి తరచూ దర్శనం ఇచ్చేది.


ఒకనాడు ఆలయంలొ ఆయన ధ్యానం చేసే సమయంలో తంజావూరు చక్రవర్తి అయిన తుందిరా మహారాజు అమ్మవారి దర్శనానికి వచ్చాడు.


అందరు లేచి నిలబడి స్వాగతం పలికారు ఒక్క అభిరామ భట్టు తప్ప, అయన మౌనంగా లోపలకి వెళ్లిపోయాడు.


పూజా కార్యక్రమం ముగించుకొని బయటకు వస్తూ ఉండగా మళ్ళీ అందరు లేచి నిలబడ్డారు ఈయన తప్ప దాంతో మహారాజుకి కోపం వచ్చి ఎవరితను అనగా ఆలయ అర్చకులు పరుగు పరుగున వచ్చి ఈయనొక ఉన్మాది ప్రభూ.. మధిరా పానం వల్ల బాహ్య సృహ లేదు అన్నారు కానీ రాజుకి అనుమానం వచ్చింది.. కారణం ఆయన మొహంలో అమ్మవారి దర్శనం తాలూకా ఆనందం కళ రూపంలో మొహం వెలిగి పోతోంది వెంటనే ఆయన్ని లేపమని చెప్పాడు తుందిరా మహారాజు... భటుడు వెళ్లి కదపగా ధ్యానం నుండి బయటకి వచ్చాడు అభిరామ భట్టు.


వెంటనే మహారాజు ఆయన్ని ఇవాళ తిధి ఏంటి అన్నాడు దానికి అభిరామ భట్టు తడుముకోకుండా పౌర్ణమి అన్నాడు కారణం ఇప్పటి వరకు తను ధ్యానంలొ చంద్రబింబం లాంటి అమ్మవారి మోము చూడటమే చుట్టుపక్కల అందరు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు ఎందుకంటే ఆ రోజు అమావాస్య.. మహారాజు వెంటనే సరే నేను సాయంత్రం వస్తా నాకు చంద్ర దర్శనం చేయిస్తావా అన్నాడు దానికి ఒప్పుకున్నాడు అభిరాముడు.. ఒకవేళ సాయంత్రం చంద్ర దర్శనం నాకు కలుగక పోతే నిన్ను శిక్షిస్తాను అన్నాడు మహారాజు.


సాయంత్రం అయ్యింది అభిరామ భట్టు స్నానాధి కార్యక్రమాలు ముగించుకుని ఆలయంలోకి వచ్చి అమ్మవారికి అంతాది రూపక ప్రార్ధన చేయటం మొదలెట్టాడు (అంటే ఒక శ్లోకం ఏ పదంతో ముగుస్తుందో తర్వాత శ్లోకం ఆ పదంతో మొదలెట్టడం అలా ఆయన ఎన్నో శ్లోకాలు రాసాడు వాటిని అభిరామ అంతాది అంటారు)


అలా శ్లోకాలు చెప్తూ ఉండగా చీకటి పడింది మహారాజు వచ్చాడు నాకు చంద్ర దర్శనం చేయించు అన్నాడు అభిరామ భట్టుతో.. అభిరామ భట్టు శ్లోకం చెప్పడం ఆపలేదు. రాజు మరొక్కసారి అడిగాడు కానీ అభిరామ భట్టు అలాగే చెప్పుకుంటూ పోతున్నాడు..


మహారాజుకి కోపం వచ్చి ఈ దూర్తుడిని శిక్షించండి అనబోతు ఉండగా ఆశ్చర్యంగా ఆకాశంలొ ఒక అద్భుతం జరిగింది అప్పటి వరకు చిమ్మ చీకటిగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా వెలుగులు సంతరించుకుంది.


అక్కడ నిండు చందమామ రూపంలొ అమ్మవారి చెవి తాటంకం ఉంది దాన్ని దర్శించిన తుందిరా మహారాజు, ప్రజలు ఒక్కసారిగా అభిరామ భట్టుకు.. అభిరామి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసారు.


అందుకే అనేది సర్వ సృష్టికి తల్లి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే దేనికి కొదవ ఉండదు అని🙏


శ్రీమాత్రేనమః🙏🏻


🔹🔸🔹🔸🔹🔸🔹

దేవతల కోసమే తెరవాలి

 పరమహంస యోగనంద గారు తమ  గ్రంధంలో జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే విధానాలను విపులంగా వివరించారు  ఇలా

   మానవుని శక్తులలో జ్ఞాపకశక్తి ముఖ్యమైనది. జ్ఞాపకశక్తి  లేకపోతే మనం చిన్నపిల్లల్లా ఉండిపోతాము. Remember (జ్ఞాపకం )అనేపదం re అంటే 'తిరిగి ' మరియు memorari అంటే గుర్తుచేసుకోవడం అనే మాటలనుండి వచ్చింది.జ్ఞాపకం అంటే ప్రతి ఆలోచన, పని లేక  అనుభవం మొదటిసారి జరిగినపుడుదా ని మౌలికమైన మానసిక జ్ఞాపకార్ధ లేఖనం, ప్రతి జ్ఞాపకం మెదడులో ఒక ప్రత్యేక భావ నమూనా లాగ నమోదు అవుతుంది. లెక్కలేనన్ని ఈ నమూనాలలో దేనినయినా చైతన్యపు జాగరూ కత లోనికి గుర్తు తెచ్చుకోవడమే జ్ఞాపకం.

     మనిషి స్మృతిలో అతడు రూపొందించు కున్న మంచి చెడు అలవాట్లు ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. అతడువాటిని గుర్తుంచుకున్నా లేకపోయినా అవన్నీ అతడి మెదడులో  ఉన్నాయి.మీరెవరికైనా మంచి చేసినా , హాని చేసినా ప్రతిసారి, ఆ స్మృతి మీ మెదడులో నిక్షిప్త మౌతుంది. అలాగే మీరెవరికన్నా హాని చేసిన ప్రతీసారి, ఈ జ్ఞాపకం మీ మానసిక కోశాగారంలో భద్రపారాచబడుతుంది. మంచి గాని, చెడు గాని ఇతరులకి బుద్ధి పూర్వకంగా చేసిన దేదైనా గుర్తు పెట్టుకోబడుతుంది. మీ ప్రస్తుత చర్యలు మీకు తెలియకుండానే ఈ పాత చర్యల మూలంగా ప్రభావితం మౌతాయి. గత జన్మనుంచి మంచి అలవాట్లున్న ఒక మంచి వ్యక్తి మంచి పని చేసినప్పుడు, గతంలోని మంచి యొక్క ప్రభావం వెంటనే ఆ క్రియను మంచి అలవాటుగా మారుస్తుంది. అలాగే ఒక చెడ్డ మనిషి తప్పు పని చేసినప్పుడు, అతని పాత చెడు అలవాట్లు కారణంగా పటిష్ట పరచబడిన దాని ప్రభావం ఆ పనిని వెంటనే చెడ్డలవాటుగా మారుస్తుంది. గత జన్మలనుండి వచ్చిన ఈ జన్మలో ఏర్పడిన చెడు ప్రవృత్తులను వదిలిపెట్టాలని గట్టిగ తీర్మానించుకోండి. మీ మంచి పనులనీగుర్తుంచుకోండి. అప్పుడే మీకు మనఃశాంతి లభిస్తుంది.కొద్దిపాటి మంచి తనమైన ఏ జన్మలోదయినా మీ రెన్నాడూ కోల్పోరు. ఆ మంచి జ్ఞాపకాలను మీ ప్రస్తుత చర్యలను ప్రభావితం చేసేలా ఉపయోగించండి. ఇతరులకు కూడా వారి లోని మంచి చేయగల సామర్ధ్యాన్ని గుర్తు చేయండి. మంచిని పెంపొందించే వాహకులుగా మనం నిరంతరం  అందరం కృషి చేస్తుంటేనే చెడుని సమూలంగా నాశనం చేయగలుగుతాము. పాశ్చాత్య దేశా లు క్రమశిక్షణ తో వరవలంబించే  మౌలికసూత్రమిదే. మనలో కొరవడిందీ ఇదే..

    భగవంతుడు ఇచ్చిన జ్ఞాపక శక్తికి  ప్రయోజనం ప్రతికూల విషయాలు ఆలోచించడం, పదే పదే తలచుకొని బాధ పడడంకాదు. అది ఆరోగ్యాన్ని దెబ్బతీసి మనల్ని మానసికంగా కూడా క్రుంగ దీస్తుంది. మంచిని, అనుకూల విషయాలను తలచుకుని దీనినే అభ్యసించాలి. అందువల్ల మనము ప్రశాంతంగా మానసిక దృఢాత్త్వంతో జీవించా గలుగుతాము. మనసు బంధించిన పాశా లను జ్ఞానమనే ఖడ్గంతో చేదించడం లేక బందీ గానే ఉండిపోవడం అనేది మన మీదే ఆధారపడి ఉంది.

జ్ఞాపకాన్ని పెంపొందించుకునే margalu---

1. ఆహారం.: తాజా పాలు, పెరుగు మంచి జ్ఞాపకానికి సహాయపడతాయి. ఏమితంగా తింటే దుష్ప్రభావము చూపుతుంది. కొవ్వు పదార్ధాలు అధికంగా తింటే జీర్ణక్రియ మందగించి చివరకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. వేపుళ్ళు, కొవ్వు పదార్ధాలు మితంగా తినాలి. పంది మాంసం పూర్తిగా విడిచిపెట్టాలి. అది జ్ఞాపకాశక్తిని న సింపజేస్తుంది.

2, చల్లని నీటి లో స్నానం జ్ఞాపక శక్తికీ నాడు లకూ మంచిది. నరాలను చల్ల బరిస్తే మానసిక ప్రశాంతత వృద్ధి చెందు . తుంది..

3. భోగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆత్మనిగ్రహం  ఉన్నవారు మహాత్తర మైన జ్ఞాపక శక్తిని, అద్భుతమైన మనోబలాన్ని సాధించగలరు..

4. గతస్మృతులను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవడం వలనకూడా జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతుంది. మానసికంగా వ్యాయామంతో కూడికలు, తీసివేతలు లాంటి చిన్న కసరాత్తులతో జ్ఞాపకాశక్తిని పెంపొందించుకోవచ్చు.

5.జ్ఞాపకశక్తి పేంపొందించుకునే ఇంకొక పద్ధతి తలమీద నెమ్మదిగా చేతివేళ్ల కణు పులతో కొట్టుకోవడం.

6. చేసేప్రతిపనీ గాధమైన శ్రద్ధ తో ఏ కాగ్రత తో  చెయ్యాలి.చాదస్తాన్ని వదులుకోవాలి.

7. సాహిత్యము, చిత్రాలేఖనము వంటి లలిత కళల అభ్యాసంతో కూడా జ్ఞాపకాశక్తిని పెబచుకోవచ్చు.

8. చివరగా మానసిక అనుభూతుల్ని మరచిపోకుండా గుర్తుము తెచ్చుకోవాలి. అవికూడా మంచివిషయాలే అయి ఉండాలి.

మీ మనో మందిరాన్ని భగవంతుడి స్మరణతో నిత్యం పవిత్రంగా ఉంచుకోవాలి. దుష్ట జ్ఞాపాకాలనే దోపిడీ దొంగలుణితరిమికొట్టాలి. ఆ మందిరాన్ని మంచి తనమనే దేవతల కోసమే తెరవాలి.


⬆️ Vissapragada Ramalingeswara Rao:9490195+91 94901 95303

విద్యయొక్క పరమార్థాన్ని

 శ్లోకం:☝️

*జ్ఞానవిద్యా విహీనస్య*

   *విద్యాజాల నిరర్థకం |*

*కణ్ఠసూత్రం వినా నారీ*

   *అనేకాభరణైర్యుతా ||*


భావం: విద్య నేర్వగానే సరికాదు. ఆ విద్యయొక్క పరమార్థాన్ని గ్రహించడమే కాక అందలి జ్ఞానాన్ని తెలుసుకోవలెయును. జ్ఞానం పొందకుండా విద్యలెన్ని నేర్చినను ప్రయోజనంలేదు. స్త్రీకి మంగళసూత్రమే సతీత్వము నిచ్చును గానీ మిగిలిన ఆభరణములేవీ ఇవ్వవు కదా?

అందుకే మాయాబజార్ లో ఘటోత్కచుడంటాడు " _చిన్నమయ! పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం. వెయ్యండి వీడికి వీరతాడు._ "


విద్య లెన్ని నేర్చి విద్వాంసు డైనను

వృథగ నుండు 'జ్ఞానవిద్య' లేక 

కంఠసూత్ర మొకటి కలికికి లేకుండి

భూష లెన్ని యున్న భూతి లేదు


గోపాలుని మధుసూదనరావు

          భాగ్యనగరము

        9959536545


చదువది యంత నేర్చినను సారపుజ్ఞానము లేకయున్న యా

చదువు నిరర్థకంబగును,సాధ్వికి నెన్నియు భూషలుండినన్

పదిలముగూర్చునిండయిన బంగరుమంగళ సూత్రముండినన్

సదమలశోభ చేర్చునది, సాటికిరావు మరెన్ని భూషలున్