2, జనవరి 2022, ఆదివారం

ద్వాదశి వ్రతం

 అంబరీష చక్రవర్తి ఒక సంవత్సరము ద్వాదశి వ్రతం మొదలుపెడతాడు. కార్తీక శుద్ద ఏకాదశినాడు ఉపవాసముండి ద్వాదశినాడు మహావిష్ణు పూజ ముగించి అనేకమందికి అన్నదానము చేసి తాను భోజనానికి ఉపక్రమిస్తాడు. ఇంతలో దూర్వాస మహామునియు తన శిష్యులతో వస్తాడు. అంబరీషుడు దూర్వాసునకు అర్గ్య పాదులు ఇచ్చి భోజనానికి ఆహ్వానిస్తాడు . దూర్వాస మహామునియు స్నానం చేసి వస్తానని నదికి వెళ్లి ఎంతసేపటికి రాడు . ఇంకా ద్వాదసి కాలం ఒక ఘడియ మాత్రమే ఉంది. ఈ లోపున భుజింకపోతే వ్రతం కాస్తా వృధా అయిపొతుంది . బ్రాహ్మణోత్తముల సలహాతో తులసి తీర్ధమ్ పానముగా స్వీకరించి దుర్వాసముని రాకకై ఎదురుచూస్తుంటాడు. దూర్వాస మహాముని రానే వచ్చాడు, సంగతి గ్రహించాడు. తనని ఎదురుచూడకుండా ముందుగా పానము చేసినందుకు ఆగ్రహించి , కృత్స అనే స్త్రీని అప్ప్పటికప్పుడు సృష్టించి అంబరీషుని హతం చేయమని ఆజ్ఞఇస్తాడు. కానీ అంబరీషుని భక్తివల్ల మహావిష్ణువు ఆయుధం విష్ణుచక్రము అతనిని సదా కాపాడుతుంటుంది. వెంటనే విష్ణు చక్రము కృత్యని వధించి, దుర్వాసుని వెంటపడుతుంది. దుర్వాసుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి రక్షించమనంటాడు. బ్రహ్మదేవుడు తాము అంతా మహవిష్ణువు అధీనములో ఉంటామని చెప్పి తాను ఏమీ చేయలేనని అంటాడు. మహేశ్వరుడు కూడా ఆ విధముగానే సమాధానము ఇస్తాడు. ఇంకా చేసేదేమిలేక మహావిష్ణువుని ఆశ్రయిస్తాడు.మహావిష్ణువు కూడా తాను భక్తులకు ఆశ్రయుడనని తానేమిచేయలేనని, మళ్ళి అంబరీషునినే వేడుకోమని సలహా ఇచ్చి పంపించి వేస్తాడు.. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ముఖ్యమైన విషయము చెప్తాడు. " సద్భ్రాహ్మణులకను విద్య, తపస్సు సదా కాపాడుతూ ముక్తిని కలిగిస్తాయి. అదే విద్య, తపస్సు దుర్జనులైన బ్రాహ్మణులకు కీడు చేయకుండా ఉండలేవు సుమా. సాధువులలో ఉండే తేజము వారిని సదా కాపాడుతుంటుంది. వారిని హింసించే వ్యక్తులను ఆ తేజమే భయబ్రాంతులకు గురిచేస్తుంది.". తదుపరి దుర్వాసుడు తప్పు తెలుసుకొని అంబరీషుని వేడుకొని , అంబరీషుని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు.

గుడికి ఒక్కో ప్రత్యేకత.

 ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత.

మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు.

పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.

అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది.

ఉదాహరణకు కొన్ని చూద్దాం.

1.ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.

2.కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది.

ఒక స్తంభము నుంచి చూస్తె వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది ,కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది.ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలిసుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.

3.ధర్మపురి(తమిళనాడు)

మల్లికార్జునస్వామీ కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభముల మంటపం అన్నమాట.ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .

4.కరూర్(కోయంబత్తూర్)

సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో 

కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.

5.గరుడుడు నాలుగుకరములతో( చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దెవాలయంలోమాత్రమే.

6.కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది.అక్కడ గరుడవాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు వుంటుంది.

కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది 

మరి స్వామీగుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒకవిచిత్రమే.

7.చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు

పంచలోహవిగ్రహము కాదు కేవలం 

కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది.

ఆశ్చర్యం కదా.

8.తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి దేవాలయంలో ఒకబిల్వచెట్టు స్థలవృక్షం గా వుంది.ఆ చెట్టులో కాచే బిల్వకాయలు లింగాకారంలో వుంటాయి.

9.కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.

10.విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.

11.ఆంధ్రప్రదేశ్ 

సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది.దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని పాదములు ఒకే ఎత్తులో వుండడం.

12.వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒకస్థంభములో అర్ధచంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు,ఆరునుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది .

పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.

గడియారం చూసుకొఖ్ఖర లేదు.

13.చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.

14,ధర్మపురి(తమిళనాడు)పక్కన పదుహారు అంటే పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.

ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి.

****ఈ క్రింది చిత్రంలో కనిపిస్తున్న దేవాలయం మురుడేశ్వర దేవాలయం, కర్నాటక.

జై శ్రీరామ్, జై భారత మాత. 🚩

అమావాస్య పూజ

 🌸🌸🌸🌸🌸🌸🌸

🌷అమావాస్య పూజ🌷


పౌర్ణమి కి వెన్నెల పారాయణ చేస్తున్నారు బాగుంది, మరి అమావాస్య రోజు ఎలా చేయాలి అని అడిగారు కదా... ఏమీ చేయాలో ఎలా చేస్తే మంచిసో చూద్దాం...


అమావాస్య రోజు ముజ్యంగా లక్ష్మీ దేవిని, భైరవుడిని, కాళీ మాతను, దుర్గా దేవిని, విశేషంగా పూజించే రోజు అలాగే పరిహార మంత్రాలు జపం చేస్తున్న వాళ్ళు ఉద్ది గారెలు బెల్లం పానకం నైవేద్యం పెట్టి అధికంగా అమావాస్య రోజు జపము చేసి విశేషంగా జపం చేస్తున్న దేవతను పూజించాలి.. అది ఏ ఉపాసనా దేవత అయినా అవే నైవేద్యంగా పెట్టి ఆ  ప్రసాదాన్ని ఒక రెండు వడలు అయినా కుక్కకు పెట్టాలి మీరు తీసుకోవాలి..


1.అమావాస్య రోజు లక్ష్మీ దేవిని పూజించాలి అనుకునే వారు.. మీకు నేను ఇచ్చిన కమలాత్మిక హైమావతి సంపుటికరణ చేసి ఇచ్చిన అష్టోత్తరం తో అర్చన చేసి కమలాత్మిక స్త్రోత్రం చేసి కమలాత్మిక ఖడ్గమాల చదివి.. మీ శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించి మీ గృహస్థులు కానీ వారికి ఎవరికైనా కాస్త ప్రసాదాన్ని పంచి తర్వాత ఆ అర్చన కుంకుమ ఇంటిల్లి పాది ధరించాలి ధనం ఇంట్లో నిలుస్తుంది , రావాల్సిన ధనం కి ఆటంకాలు పోతుంది, వృత్తిలో, వ్యాపారం లో అధిక లాభాలు వస్తుంది.. కొత్త అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విజ్ఞాలు తొలగుతుంది.. భార్య స్త్రోత్రం చదువుతూ భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్య అవసరాలకు లోటు ఉండదు..ఈ శ్లోకాలు అన్ని గ్రూవ్ లో ఉన్నాయి గమనించండి..


2.  అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషం కుటుంబ కలహాలు, ఆస్తి గోడవలు, శత్రు బాధలు, అనుమానాలు, ఇంటి  మీకు వృత్తి వ్యాపారాలకు ఉన్న నరధిష్ఠి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడు ఆరాధన ద్వారా తొలగి పోతుంది... భైరవుడు ఎన్నో జప మంత్రాలు శ్లోకాలు గ్రూవ్ లో పెట్టాను అవి చేయవచ్చు.. ముఖ్యంగా సాయంత్రం చేయాలి సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి బైరావుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి , తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి తరచుగా కిందపడటం దెబ్బలు దిష్టి దోషాలు పోతుంది.. బైరావుడిని తీపి పదార్ధంలో లడ్డు అంటే ఇష్టం అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయండి శత్రు బాధలు మిమల్ని భయపెడుతున్న బాధలు తొలగి పోతుంది..


3. కాళీ మాతకు విశేషం మైన రోజు ఆ తల్లికి అరటిపండ్లు నైవేద్యం పెట్టి స్త్రోత్రం చేసి హారతి ఇవ్వాలి.. వయసు అయిన పెద్ద ముత్తైదువులకు  ఆ అరటిపండు తాంబులం ఇవ్వాలి ఆమె స్వయంగా స్వీకరిస్తుంది .


4. దుర్గా మాత నా తల్లి విశేషంగా పూజించాల్సిన రోజు ఎప్పుడూ లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గా రూపం విశేషం ఏంటి తల్లి అంటే ఆ శివుడికి కూడా కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం అంత శక్తి రూపం దుర్గ రూపం నా ఆరాధ్య దైవం , ఆ రోజు పసుపు నీళ్లతో  అభిషేకం చేయాలి వేప మండలు అలంకారం చేయాలి అంబలి (అన్నంలో రాగిపిండి కలిపి ఉడికించి చల్లార్చి మజ్జిగ కలపడం) నైవేద్యం పెట్టి  దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరం, మహిషాసుర మర్దిని స్త్రోత్రం ఇలా ఎన్ని స్తోత్రాలతో అయినా పూజ కుంకుమ అర్చన చేసి హారతి ఇచ్చి ఆ నైవేద్యం పంచుకుని తాగాలి.. అన్ని రకాల విజ్ఞాలు ,ఆపదలు తొలగిస్తుంది కుటుంబానికి రక్షణ కవచం లా కాపాడుతుంది.. ముఖ్యంగా మిరియాలు పొడి కలిపిన గారెలు చేసి నైవేద్యం పెట్టాలి అది పూజ తర్వాత కుక్కకు పెట్టి తర్వాత తీసుకుంటే మీకు ఉన్న జాతక దోష ప్రభావం తగ్గుతుంది.


అన్ని బాగానే ఉంది అన్ని చేయాలి అనిపిస్తుంది కదా అన్ని చేసిన గంట సమయం కన్నా పట్టదు అన్ని స్త్రోత్రలు ఇదే గ్రూప్ లో ఉన్నాయి లేదా మీదగ్గరే బుక్స్ ఉంటుంది చూసి చేయండి.. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు ధూపం అందరూ ఇంట్లో వేసుకోవచ్చు పూజ చేయకపోయినా... ఇవన్నీ సాయంత్రం చేసే పూజలు ఉపవాసం అవసరం లేదు..

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌿🌿🌿🌿🌿🌿🌿🌿


👉అద్దె ఇంటిలో ఉండే వారు అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ కడితే చాలు అది కుళ్ళిన తర్వాత మార్చాలి, అదే సొంత ఇల్లు అయితే గుమ్మానికి కట్టిన గుమ్మడికాయతోనే దిష్టితీసి పగలగొట్టి కొత్త గుమ్మడి కాయ గుమ్మానికి కట్టాలి. ఇలా తరచుగా చేస్తే ఇంటికి యజమానికి క్షేమం..


వ్యాపారస్థలంలో అయితే సొంతం అయినా అద్దె అయినా ప్రతి అమావాస్య కి గుమ్మడికాయ కొట్టాలసిందే, వ్యాపార స్థలంలో మంగళవారం నాడు గుమ్మం ముందు నిమ్మకాయ రెండుగా కోసి కుంకుమ అద్ది ప్రవేశద్వారం వద్ద గడపకు అటూఇటూ ఉంచి మరుసటి రోజు తీసి పడేయాలి.


👉గుమ్మడికాయ లో అధికశాతం మెగ్నీషియం ఉంటుంది కనుక తరచుగా తింటే ఎముకలు గట్టి పడతాయి


ఇంటి యజమాని నిదిరించే గదిలో నైరుతి ములలో రాళ్లఉప్పు ఒక కప్ బౌల్ లో ఉంచాలి అలా మూడు రోజులు ఉంచాక దాన్ని తీసి దూరంగా ఎక్కడైనా మురికి గుంటలో కానీ పారె నీటిలో కానీ పడేసి రావాలి.. తరచుగా వచ్చే తగాదాలు తగ్గుతుంది. దిష్టి పోతుంది..ధనం నిలుస్తుంది. 


👉 కొందరు ఆడవాళ్లకు తల చిక్కు తీసిన వెంట్రుకలు ఇంట్లో దాచే అలవాటు ఉంటుంది అది అన్ని రకాల దరిద్రాలకు ఆహ్వానం చెప్తుంది.. ఇది వరకు కాలంలో ఇంటిబయట సపారులో గూటిలో వెంట్రుకలు దాచి సవరం కట్టుకుని వారు కానీ ధాన్యం ధనం నిలువ ఉండే గృహంలోపల పెట్టేవారు కాదు.

🌷శ్రీ మాత్రే నమః🌷