22, అక్టోబర్ 2022, శనివారం

108 ఉపనిషత్తుల జాబితా

108 ఉపనిషత్తుల జాబితా

 

1.       ఈశావాస్య ఉపనిషత్తు(ఈశావాస్యోపనిషత్తు)

2.       కేనోపనిషత్తు

3.       కఠోపనిషత్తు

4.       ప్రశ్నోపనిషత్తు

5.       ముండకోపనిషత్తు

6.       మాండూక్యోపనిషత్తు

7.       తైత్తిరీయోపనిషత్తు

8.       ఐతరేయోపనిషత్తు

9.       ఛాందోగ్యోపనిషత్తు

10.   బృహదారణ్యకోపనిషత్తు

11.   శ్వేతాశ్వతరోపనిషత్తు

12.   కౌశీతకి ఉపనిషత్తు

13.   మైత్రాయణి ఉపనిషత్తు

14.   బ్రహ్మోపనిషత్తు

15.   కైవల్యోపనిషత్తు

16.   జాబలోపనిషత్తు

17.   హంసోపనిషత్తు

18.   ఆరుణికోపనిషత్తు

19.   గర్భోపనిషత్తు

20.   నారాయణోపనిషత్తు

21.   పరమహంస ఉపనిషత్తు

22.   అమృతబిందు ఉపనిషత్తు

23.   అమృతనాదోపనిషత్తు

24.   అథర్వశిరోపనిషత్తు

25.   అథర్వాశిఖోపనిషత్తు

26.   బృహజ్జాబాలోపనిషత్తు

27.   నృసింహతాపిన్యుపనిషత్తు

28.   కళాగ్నిరుద్రోపనిషత్తు

29.   మైత్రేయోపనిషత్తు

30.   సుబాలోపనిషత్తు

31.   క్షురికోపనిషత్తు

32.   మంత్రికోపనిషత్తు

33.   సర్వసారోపనిషత్తు

34.   నిరలాంబోపనిషత్తు

35.   శుకరహాస్యోపనిషత్తు

36.   వజ్రసూచ్యుపనిషత్తు

37.   తేజోబిందూపనిషత్తు

38.   నృసిందబిందూపనిషత్తు

39.   ధ్యానబిందూపనిషత్తు

40.   బ్రహ్మవిద్యోపనిషత్తు

41.   యోగతత్వోపనిషత్తు

42.   ఆత్మబోధోపనిషత్తు

43.   నారదపరివ్రాజకోపనిషత్తు

44.   త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు

45.   సీతోపనిషత్తు

46.   యోగచూడామణ్యుపనిషత్తు

47.   నిర్వాణోపనిషత్తు

48.   మండల బ్రాహ్మణోపనిషత్తు

49.   దక్షిణామూర్త్యుపనిషత్తు

50.   శరభోపనిషత్తు

51.   స్కందోపనిషత్తు

52.   మహానారాయణోపనిషత్తు

53.   అద్వయతారకోపనిషత్తు

54.   రామరహస్యోపనిషత్తు

55.   రామతాపిన్యుపనిషత్తు

56.   వాసుదేవోపనిషత్తు

57.   ముద్గలోపనిషత్తు

58.   శాండిల్యోపనిషత్తు

59.   పైంగలోపనిషత్తు

60.   భిక్షుకోపనిషత్తు

61.   మహోపనిషత్తు

62.   శారీరకోపనిషత్తు

63.   యోగశిఖోపనిషత్తు

64.   తురియాతీతోపనిషత్తు

65.   సన్యాసోపనిషత్తు

66.   పరమహంస పరివ్రాజకోపనిషత్తు

67.   అక్షమాలికోపనిషత్తు

68.   అవ్యక్తోపనిషత్తు

69.   ఏకాక్షరోపనిషత్తు

70.   అన్నపూర్ణోపనిషత్తు

71.   సూర్యోపనిషత్తు

72.   అక్ష్యుపనిషత్తు

73.   అధ్యాత్మోపనిషత్తు

74.   కుండికోపనిషత్తు

75.   సావిత్ర్యుపనిషత్తు

76.   ఆత్మోపనిషత్తు

77.   పశుపతబ్రహ్మోపనిషత్తు

78.   పరబ్రహ్మోపనిషత్తు

79.   అవధూతోపనిషత్తు

80.   త్రిపురతాపిన్యుపనిషత్తు

81.   శ్రీదేవ్యుపనిషత్తు

82.   త్రిపురోపనిషత్తు

83.   కఠరుద్రోపనిషత్తు

84.   భావనోపనిషత్తు

85.   రుద్రహృదయోపనిషత్తు

86.   యోగకుండల్యుపనిషత్తు

87.   భస్మజాబలోపనిషత్తు

88.   రుద్రాక్షజాబలోపనిషత్తు

89.   గణపత్యుపనిషత్తు

90.   దర్శనోపనిషత్తు

91.   తారాసారోపనిషత్తు

92.   మహావాక్యోపనిషత్తు

93.   పంచబ్రహ్మోపనిషత్తు

94.   ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు

95.   గోపాలతాపిన్యుపనిషత్తు

96.   కృష్ణోపనిషత్తు

97.   యాజ్ఞవల్క్యోపనిషత్తు

98.   వరాహోపనిషత్తు

99.      శాట్యానీయోపనిషత్తు

100.   హయగ్రీవోపనిషత్తు

101.   దత్తాత్రేయోపనిషత్తు

102.   గరుడోపనిషత్తు

103.   కలిసంతారణోపనిషత్తు

104.   బాల్యుపనిషత్తు

105.   సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు

106.   సరస్వతీ రహస్యోపనిషత్తు

107.   భహ్వృచోపనిషత్తు

108.   ముక్తికోపనిషత్తు

 

Mantrallyam


 https://drive.google.com/file/d/141nsEZPe7cbA7Q-lZt6y7skKdZOT3RNU/view?usp=drivesdk

దిగజారుతున్న మానవ విలువలు

 దిగజారుతున్న మానవ విలువలు దేనికి సంకేతం... 


(కొద్దిగా పెద్ద విషయమే, కానీ చాలా ఆలోచింప చేసేది . ఓపిక తో చదివితే) ..


® మొన్న ఒకరోజు ఒక మిత్రుడు క్షీణమౌతున్న కుటుంబ విలువల గూర్చి మాట్లాడుతూ... ఆసక్తికరమైన ఒక మాటన్నాడు. మహాభారతంలో కొన్ని లక్షల మంది కురుక్షేత్రంలో మరణించారు. దానికి కారణం... ఇరువురి ఆధిపత్య దాహంకాదా? నిజానికి మరణించిన వారెవరికీ ఆ యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేదు. ఎదుటివారితో వైరమూలేదు.. అయినా యుద్ధం చేసారు.. అసువులు బాసారు. ఆ యుద్ధానికి నాయకత్వం వహించిన వారు విద్యాహీనులా అంటే కాదు.. యుద్ధం యొక్క పరిణామాలు తెలియని వారా? కాదే.. అందరూ ధర్మాధర్మ విచక్షణ కలిగినవారే. అంతేకాదు, వారికి ఆనాటి ఋషులు, మునులు హితోక్తులతో ధర్మ బోధ చేసారు కూడా. సామాజిక స్పృహ కలిగిన వారెందరో వారి యుద్ధ నివారణకై ప్రయత్నించారు.. అయినా యుద్ధం జరిగింది... జన నష్టం జరిగింది... అర్థికంగా రాజ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఈనాడూ ఎన్నో కుటుంబాలలో ఇది పునరావృతం అవుతూనే ఉన్నది.. దీనిపై చిన్న వ్యాసం వ్రాస్తే బాగుంటుంది కదా... అన్నారాయన.

 నిజానికి కౌరవ పాండవులు ఏ రాజ్యానికై పోరాడారో ఆ రాజ్యం వారిరువురూ సంపాదించినది కాదు. వారి పూర్వికులు సాధించినది.. భీష్ముడు పెంచినది... పాండురాజు రక్షించినది.. అయినా దుర్యోధన, ధర్మరాజ నాయకత్వంలో అనర్ధం జరిగింది. ఇక్కడ ధర్మాధర్మ చర్చకన్నా మానవత్వాన్ని చూడాలి. 

 అది ద్వాపారానికే పరిమితం కాలేదు, త్రేతాయుగంలో రామరావణ యుద్ధంలోనూ జరిగినదదే. లంకానగరం పూర్తిగా ధ్వంసమయింది. ఎన్నో సంవత్సరాలు ఎందరో కార్మికులు చెమటోడ్చి చేసిన శ్రమకు ప్రతిరూపం లంకానగరం. ఎంతో ధనం ఆ నగర నిర్మాణానికి వ్యయమయి ఉంటుంది. ముఖ్యులైన ఎందరో రాక్షస నాయకులు ఆ యుద్ధంలో మరణించారు. తిరిగి అంతటి నైపుణ్యం కలిగిన యోధులు తయారు కావాలంటే.. ఎంతటి శ్రమ కావాలి, ఎంతటి సంపదను వ్యయించాలి. ఇన్ని అనర్ధాలకు కారణం ఒక్క రావణుని కామేఛ్ఛయే కదా.. 

 అదే విధానం ఈనాడూ కలియుగంలోనూ ప్రతిబింబిస్తుంది. ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లండ్ర మధ్య ఆస్తుల కోసమై తగదాలు ఆయా కుంటుంబ సభ్యుల మధ్య ఎన్ని అగాధాలను సృష్టిస్తున్నాయి... ఎందరు అమాయక బాలల మనసులలో విషం నింపుతున్నాయి.. తరతరాలుగా రక్త సంబంధీకుల మధ్య ఆత్మీయ పలకరింపులు కూడా కరువవడం... ఏ సంస్కృతికి నిదర్శనంగా చెప్పుకుంటాము. 

 సాంకేతిక జ్ఞానం పెరుగుతుంది. శాస్త్రీయ అవగాహన పెరుగుతున్నది. దేశాల మధ్య దూరాలు అంతరించిపోతున్నాయి. అంతే వేగంగా ఆత్మీయుల మధ్య అంతర్యం పెరుగుతున్నది. మానవత్వం, సామాజిక బంధాలు తగ్గిపోతున్నాయి.

 సోదరుల మధ్య కనీసం ఫోనులలో పలకరించుకోవడం కూడా తగ్గిపోయింది. కుటుంబ కార్యక్రమాలలో తప్పనిసరిగా కలవాల్సిన సమయంలో కూడా యాంత్రికంగా కలుస్తున్నారే కాని ఆత్మీయ పలకరింపులు లేవు.. ఇరువురు కలిస్తే మూడవ వారిపై వ్యంగాస్త్రాలు సంధించడమే కాని మంచి చెడ్డలు విచారించడం కాని సహాయ సహకారాలు అందించడం కాని జరగడం లేదు. కార్యక్రమం అలా అయిపోగానే బంధువులు వెళ్ళక ముందే ఇంటివారు వెళ్ళడం జరుగుతున్నది. కుటుంబ జీవన విధానం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. 

 అన్నదమ్ముల, అక్కాచెల్లండ్ర పిల్లలు కూడా ఒకరికి ఒకరు తెలియని పరిస్థితి చాలా కుటుంబాలలో కనిపిస్తున్నది. అవసరాలకు మొక్కుబడిగా పలకరింపులు తప్ప మనస్పూర్తిగా ఆహ్వానించడం ఆత్మీయుల మధ్యనే తగ్గిపోతున్నది. ఇది ఆదరణీయమా? విజ్ఞానం అభ్యుదయ మార్గంలో పయనిస్తున్న వేళ ఆత్మీయతలు, అనుబంధాలు, మానవత్వం పాతాళ మార్గాన్ని అన్వేషిస్తున్నది. 

 చిన్న చిన్న మాట పట్టింపులు, సహనం లేక పోవడం, ఆర్థిక అసమానతలు, సంపద ప్రోగు చేసుకోవడంలో అత్యాశ, పోటీ తత్వం, ఎదుటి వారు రక్త సంబంధీకులైనా, వారి ఉన్నతిని జీర్ణించుకోలేకపోవడం.. ఇలా కారణాలు తరచి చూస్తే అనేకం కనిపిస్తున్నాయి. అన్నదమ్ములు, అక్కచెల్లెండ్లు ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం సాధారణమై పోయింది. నిన్నటి మీద ఈనాడు తాను వ్యక్తిత్వపరంగా ఎంత ఎదిగాడనేది అభ్యుదయానికి ప్రాతిపదిక కావాలి కాని నిన్నటి మీద ఈనాడు పరులపై ఎంత ఆధిక్యత సాధించామన్నదే ఉన్నతికి ప్రాతిపదికగా మారింది. 

 ఆర్థిక అభ్యుదయం అంటే.. నిజానికి "మన అవసరాల కన్నా మన వద్ద ఎక్కువ సంపద ఉన్నది అనే భావనయే" కాని మరొకటి కాదు. అయితే ఆ ఎక్కువ అనే పదంయొక్క నిర్వచనం పూర్తిగా మారిపోయింది. వేల కోట్లు సంపాదించినా సంతృప్తి దక్కడం లేదు. ఒకప్పుడు మిత్ర బృందంలో ఎవరికైనా ఆపద వస్తే అందరూ సహకరించే వారు. రాత్రికి రాత్రి ఎంత సొమ్మైనా వారి వద్ద ఉన్నా లేకపోయినా అప్పు చేసయినా సర్దుబాటు చేసేవారు.. కాని ఇప్పుడు డబ్బు ఉన్నా ఆత్మీయులనయినా ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇది తిరోగమన సంస్కృతి అనుకుంటాను. ఇక్కడ డబ్బు అనేది ఒక ఉదాహరణ మాత్రమే.

 మానవత్వం ప్రాతిపదికగా ఆధ్యాత్మికత వెలుగు చూడాలి. కాని సంస్కార హీనమైన వేషభాషలు, పూజాదికాల రూపంలో శ్రద్ధ లేని ఆడంబరాలు, అవగాహన లేని ఆచారాలు, శాస్త్రీయత లేని సంప్రదాయాలు, ఆత్మ వికాసం లేని బోధలు, తమకే విశ్వాసం లేని ఆచార్యకత్వాలు, అనుభూతి లేని ఆచరణలు, వ్యామోహం చావని వైరాగ్యాలు.. అసంగత భావనా ప్రచేతస్కులైన వారి మార్గ దర్శన... పరిణతి లేని పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం... వెరసి ఎటు పోతున్నామో తెలియని మార్గంలో.. ఎందుకు వెళుతున్నామో తెలియని ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణం ఎటు వైపు తీసుకు వెళుతున్నది. ఇది యువతకే పరిమితం కావడం లేదు.. పెద్దలు కూడా ఈ కుసంస్కారంలో భాగస్వాములు అవుతున్నారు. 

 100 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న చాలామంది జీవించి లేరు.. మరో 100 సంవత్సరాల తరువాత ఇప్పుడున్న ఎవరూ ఉండే అవకాశమూ లేదు. కొన్ని లక్షల సంవత్సరాల సృష్టి కాలంలో 100 సంవత్సరాలు చాలా చిన్న కాలం. ఈ కాలంలో ద్వేషాలు, కోపాలు, పగలు ప్రతీకారాలు, అధికార దాహం అవసరమా? అది ఆధిపత్యాన్ని సాధించాలనుకునే వారిలో ఉంటే ఉండవచ్చునేమో కాని సామాన్య జనాలలో కూడా కనిపించడం దేనికి సంకేతం. 

 ఒక కుటుంబంలో నెలకు 2 నుండి మూడు లక్షలు సంపాదించే వ్యక్తి ఉండవచ్చు... అలాగే 10 నుండి 15 వేలు మాత్రమే సంపాదించే వ్యక్తి ఉండవచ్చు. వారి వారి జీవన స్థితిగతులు వేరుగా ఉండవచ్చు కాని ఆత్మీయతలను పంచుకోవడంలో ఆ ఆర్థిక అసమానతలు అవరోధాలు కావడం సామాజిక బంధాలను సడలించవా? తలిదండ్రుల లేదా పూర్వికుల ఆస్తిపాస్తులు పంచుకోవడంలో ఒకరినొకరు మోసం చేసుకోవడం... ఆర్థికంగా అత్యున్నత తరగతిలో ఉన్న వ్యక్తులు కూడా కొద్దిపాటి ఆస్తికై ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.. అసహ్యం వేస్తుంది. ఇది ఆదరణీయం కాదని భావిస్తున్నాను. 

 ఒక సమాజం తన మూలాలను మరిచిపోతే ఆ సమాజం యొక్క స్థితిగతులను మరొక సమాజం ప్రభావితం చేస్తుంది. ఇదే సూత్రం కుటుంబాలకు వర్తిస్తుంది. సమాజంలో జీవించడానికి డబ్బు అవసరం ఎంతైనా ఉన్నది. అది కాదనలేని సత్యం. మనకు సరిపోయాకనే ఇతరులకు దానం చేయడం కూడా సమర్ధనీయమే. కాని స్వంత కుటుంబంలోని వారలను మోసం చేస్తూ ఇతరులది దోచుకోవాలనుకోవడం, దాచుకోవాలనుకోవడం ఏనాటికీ సమర్ధనీయం కాదు.

 నిజానికి ఇతరులు మన తప్పులు ఎత్తి చూపినపుడు లేదా మనలను విమర్శించినప్పుడు ఆవేశానికి లోను గాకుండా వారి మాటలను వినడం వల్ల మన వ్యక్తిత్వ పరిణతి వికసిస్తుంది.. అదే మన వివేకానికి, పాండిత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. నిజానికి ఇతరుల పట్ల ఈర్ష్యాసూయలు ప్రదర్శిస్తున్నాము అంటే మనపై మనకు ఆత్మ విశ్వాసం సన్నగిల్లినట్లుగా భావించాలి. మానసికంగా మనం బలహీనులమయినట్లుగా భావించాలి. ఇతరుల పట్ల మన అనుభూతులు మన జీవితంపై ప్రభావాన్ని చూపుతాయి. యాంత్రికంగా నటనగా చూపే భావాలు బంధాలను నిలుపలేవు.. హృదయపూర్వకంగా అందించే భావనా స్పందనలు తిరిగి వాటినే మనకు చేరుస్తాయి. ఎదుటి వారి భావనలు మనం ఉపేక్షిస్తే అవి అక్కడే నిర్జీవమౌతాయి. వాటిని గౌరవిస్తేనే ఆ గౌరవాన్ని మనకు అందిస్తాయి. సమాజం వ్యష్టిగా నిలవలేదు.. వ్యష్టి సమష్టిగా పరివర్తన చెందాలి. నిండు మనస్సుతో మనకు చాతనైనంత మేరకు ఇతరులకు మంచిని చేయడము మరియు చేసిన దానికి ప్రతిగా ఎదుటివారి నుండి ఏమీ కోరక పోవడమే వ్యష్టి సమష్టిగా పరివర్తన చెందేందుకు మార్గం చూపుతుంది. 

 పుట్టిన ప్రతి జీవికి వయసుపెరగడం, శరీరం క్షీణించడం, నశించిపోవడం సహజమైనది. అయితే పుట్టిన నాటి నుండి మరణించేవరకు మన జీవితం రెండు విధాలుగా ఉంటుంది.. అవి బ్రతకడం లేదా జీవించడం. వయసును పెంచుకుంటూ మరణం వరకు ప్రయోజనరహితంగా ఉండడం బ్రతుకు... లేదా ప్రతిక్షణం ఆనందంగా రసాత్మకంగా, ప్రయోజనభరితంగా గడపడం జీవించడం.. జీవించడంలో వ్యక్తి పరిణతి చెందుతాడు. "నేనే" అనే భావన ఎల్లప్పుడూ ప్రత్యేకతను కోరుకుంటుంది. కుటుంబంలో ఎవరైనా ఆ భావనను ప్రదర్శిస్తే ఆ కుటుంబంలో చీకాకులు ఏర్పడతాయి. "నేనూ" అంటూ ముందు నడిచే వ్యక్తి వల్ల ఆ కుటుంబం ప్రశాంతతను పొందుతుంది. ఆస్తిపాస్తులు సంపాదించడం, వాటిని అనుభవించడం ఆదరణీయమే కాని అవి కుటుంబ సభ్యుల మధ్య ఆడంబర ప్రదర్శనకు కారణం కావద్దు. భౌతిక సంపదలు ఎల్లకాలం నిలుస్తాయని చెప్పలేము కాని ప్రేమలు ఆప్యాయతలు ఎల్లకాలం నిలుస్తాయని చెప్పవచ్చు. మనందరి జీవితకాలం చాలా చిన్నది... కక్షలు కార్పణ్యాలతో, అహంభావ ప్రదర్శనలతో దానిని మరింత చిన్నదిగా చేసుకోవడం సమంజసం కాదనేది నా నమ్మకం. సంపదలు ఒక పరిమితి వరకే అవసరం.. ఆ పరిమితులు అధిగమించిన తదుపరి ఆ సంపదల అవసరాలు ఆడంబరానికేననే సత్యం గుర్తించాలి. 3 రూపాయల కలమైనా 30000 రూపాయల కలమైనా దాని ప్రయోజనం వ్రాయడానికే.. అది వ్రాయని నాడు.. వ్యర్ధమే...

 ఇప్పటికే ఎక్కువగా వ్రాసాను. మనసులోని ఆవేదన మిత్రుని ఆత్మీయ స్పర్శతో బహిర్గతమై.. అక్షర రూపాన్ని దాల్చింది. మిత్రుడు తన పేరును బహిర్గతం చేయవద్దనడం కారణంగా ఈ వ్రాతలకు కారణమైన మిత్రుని పేరును ప్రస్తావించకుండా అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ...మహాభారతంతో ఆరంభమయిన వ్యాసం మహాభారతంతోనే అంతంచేయడం సమంజసం...


కురుక్షేత్ర యుద్ధం పిమ్మట... యుద్ధంలో గెలిచిన ధర్మరాజు ఏ నాడు సంతోషంగా లేడు.. జీవితకాలం అంతా పశ్చాత్తాపంలో మ్రగ్గిపోయాడు.. అంతేకాదు... 

అహంకారాన్ని ప్రదర్శించిన దుర్యోధనుడు సపరివారంగా నశించి పోయాడు.

"నేను నాది" అనే భావనలో పుత్ర వాత్సల్యంతో, రాజ్య కాంక్షతో కొట్టుమిట్టాడిన ధృతరాష్ట్రుడు 100 మంది కుమారులను కన్నా... తలకొరివి పెట్టేందుకు దిక్కులేక పాండవుల పంచన వారి దయా ధర్మంపై బ్రతికాడు.

అవకాశం ఉండి కూడా యుద్ధాన్ని ఆపలేని భీష్ముడు... అంపశయ్యపై జీవితాన్ని ముగించాడు..


దేని కోసం దేనిని విడిచి పెట్టాలో తెలియడమే విజ్ఞత. అదే మన జీవితాన్ని... రసమయం చేస్తుంది లేదా నీరసమయం చేస్తుంది.


ఆలోచించండి... మన చిన్నప్పుడు మన తాతలు అందరూ కలసి సమష్టి కుటుంబంగా ఆనందంగా ఉన్న సంఘటనలు అపారంగా విన్నాము.

ఆ ఆనందాన్ని తిరిగి మన తరం భావితరాలకు అందించాలి అంటే ఎలాంటి సూచనలు అవసరమో మీ అభిప్రాయాలను పంచుకుంటే ఈ వ్యాసం సమగ్రతను సంతరించుకుంటుందని భావిస్తూ...

(ఒక పెద్దాయన షేర్ చేసింది) (🙏)

సత్యాను సారిణీ లక్ష్మీ

 సత్యాను సారిణీ లక్ష్మీ

కీర్తి: త్యాగాను సారిణీ

అభ్యాసాను సారిణీ విద్యా

బుద్ధి: కర్మాను సారిణీ. 


సత్యమనుసరించి సాగును సంపద

త్యాగ మనుసరించి సాగు కీర్తి 

అరయ  చేరు విద్య యభ్యాస కతమున

కర్మ ననుసరించి కలుగు బుద్ధి 


గోపాలుని మధుసూదనరావు శర్మ

బ్రహ్మను చేరుతున్నాడు

 శ్లోకం:☝️

*సర్వభూతస్థమాత్మానం*

   *సర్వభూతాని చాత్మని l*

*సపశ్యన్ బ్రహ్మ పరమం*

   *యాతి నాన్యేన హేతునా ll*


భావం: సమస్త భూతములను తనలో, తనను సమస్త భూతములలో దర్శించువాడు ఆ బ్రహ్మను చేరుతున్నాడు. ఇది తప్ప వేరే మార్గం లేదు.

ఇక్కడ భూతములు అంటే పంచభూతములు మరియు వాటితో తయారయిన సమస్త ఉపాధులు / వస్తువులు.

*భూ* _సత్తాయామ్_ = to be, ఉండటం, అస్తిత్వం

కృతజ్ఞత

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

🎻🌹🙏*కృతజ్ఞత...!!🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకూ ఉన్నాయి. అయితే నీకు ఉద్యోగము వచ్చింది....!

ఇతరులకు రాలేదు....!

*కృతజ్ఞత కలిగి ఉండు.*


నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిచ్చాడో...

అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు.....!

జవాబు రాలేదు....!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజూ క్షేమంగా ప్రయాణం

చేస్తున్నావో.... అదే దారిలో...

అనేకులు మరణించారు...!

*కృతజ్ఞత కలిగి ఉండు.*


 ఏ స్థలంలో అయితే దేవుడు 

నిన్ను దీవించాడో, అక్కడే... అనేకులు దేవున్ని పూజిస్తూనే ఉన్నారు, ఇంకా దీవెన రాలేదు..!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఆసుపత్రిలో  ఏ పడక  మీద ఉండి నీవు బాగుపడి 

ఇంటికెళ్ళావో......

అదే పడకపై ఉండి అనేకులు

మరణించారు....!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఏ వర్షమైతే నీ పొలానికి మంచి 

పంటలనిచ్చిందో...

అదే వర్షం, ఇతరుల పొలాలను 

నాశనం చేసింది.

*కృతజ్ఞత కలిగి ఉండు.*



నీవేదైతే కలిగి ఉన్నావో

 అది *నీ శక్తి* కాదు,

*నీ బలం* కాదు,

*నీ అర్హతలు* కాదు.

*కేవలం దేవుని అనుగ్రహం* అని గుర్తుంచుకో...

నీకు కలిగిన ప్రతీది ఇచ్చేవాడు

*ఆయనే.*

ప్రతీ విషయంలో *దేవునికి* 

కృతజ్ఞత కలిగి ఉండండి.


👌🙏నీకు ఏదైనా సమయంలో సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడం మరిచిపోకు. 


🤝కృతజ్ఞత ఆశించడం వాళ్ళ తప్పు కాదో తెలియదు కానీ చెప్పడం మాత్రం నీ బాధ్యత విజ్ఞత... 


🤝ఒక్కసారి ఆలోచించు. 

కోట్లు సంపాదించే వాళ్లు మన వాళ్ళు ఎక్కడ ఉన్నా , నీకు నెలకు ఎన్ని పైసలు పంపినా, పక్కన (గంజి) నీళ్లు అందించే వాడే గొప్పోడు....


🙏అందుకనే అప్పుడప్పుడు "మనీ"తో కాకుండా "మనిషి"తో కూడా మాట్లాడుతుండండి, 

చెప్పలేం ఏ అవసరం ఎలా వస్తుందో.! 

ఎన్ని కోట్లు ఉన్నా ఎప్పుడు ఎవరి సాయం తీసుకోవలసి వస్తుందో ఎవరికీ తెలియదు కదా…


*అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి…*🚩🌞🌹🙏


🙏సమస్త లోకాసుఖినోభవంతు🙏


సేకరణ: గిరిధర్ గారి వాట్సాప్ పోస్ట్ 

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

Papaya

  !


【 Papaya is the King of Fruits 】


In the future, the new treatment method for malignant tumors is no longer Chemotherapy, Radiotherapy or Surgery, but Changing One's Diet to improve the new Blood Vessels !


Great medical Knowledge ! A high-quality diet is the natural chemotherapy three times a day. The following information should be taken seriously, it is simple and easy to implement, and it is very good!

 ‭‭ 

What you may not know is: Papaya, which we usually find strange and easy to obtain, is the King of Fruits ! The tomato that the doctor praised was nothing compared to Papaya. Papaya has been selected by WHO ( World Health Organisation ) as the fruit with the highest nutritional value for two consecutive years, that is, the King of Fruits !


 The nutritional value of Papaya is :


1. Calcium : Papaya is 2 times that of apples.


 2. Vitamin C: Papaya is 13 times that of apples, 7 times that of bananas, 7 times that of watermelon, 8 times that of cherries, and 1.3 times that of pineapples.


 3. Vitamin A: Papaya is 10 times that of kiwi, 18 times that of apple, 1.5 times that of guava, 15 times that of banana, 1.5 times that of watermelon, 15 times that of cherries, and 16 times that of pineapple.


 4. Vitamin K: Papaya is 5 times that of bananas, 2.5 times that of watermelon, and 4 times that of pineapples.


 Great again ! Related to eye protection...


 5. Carotenoids, lycopene, B carotene, lutein and zeaxanthin, etc.:

 Papaya is 2000 times bigger than kiwi! Kiwis, apples, cherries, pineapples, bananas, guava, none of these ingredients.


Great ! The above data source is of the United States Department of Agriculture (USDA) 2016.


 [Note] I have been suffering from cancer for 16 years. I have undergone chemotherapy. Some doctors told me to eat more papayas. The heart of gratitude is indescribable, I just hope that more people can benefit from it!


 When you go to visit in the future, if you choose fruit as a gift, you can bring papaya!

According to a

Doctor from US:

After the age of 50 

one may experience

many types of illnesses.

 But the one I am most worried about is Alzheimer's.

Not only would I not be able to look after myself, 

but it would cause 

a lot of inconveinence to family members


One day, my son Sushil

came home and told me

that a doctor friend 

has taught him an exercise using the tongue. 


The tongue exercise is effective to reduce the onset of Alzheimer's and is also useful to reduce / improve


*1* Body weight

*2* Hypertension

*3* Blood-Clot in Brain 

*4* Asthma

*5* Far-sightedness

*6* Ear buzzing

*7* Throat infection

*8* Shoulder / Neck infection

*9* Insomia


The moves are very simple and easy to learn


Each morning, when you wash your face, in front of a mirror, do the exercise as below :

 

stretch out your tongue and move it to the right then to the left for 10 times


Since I started exercising my tongue daily, there was improvement in my Brain Retention. 


My mind was clear and fresh and there were other improvements too...


   1 Far sightedness 

   2 No giddiness 

   3. Improved wellness

   4. Better digestion 

   5. Lesser flu / cold 


I am stronger and more agile.


The tongue exercise helps to control and prevent Alzheimer's...

Medical research has found that the tongue has connection with the BIG Brain. When our body becomes old and weak, the first sign to appear is that our tongue becomes stiff and often we tend to bite ourselves.


Frequently exercising your tongue 

will stimulate the brain, help to reduce our thoughts from shrinking and thus achieve a healthier body.


Senior Citizenss Please forward



తల్లితండ్రుల గొప్పదనం

 *తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్ప బడిన సత్య,ధర్మ విధానం:🌅💦🚩🛕🐄🎍🦚🥦🦢🦜🔥

====================

*01.ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.*

*02.ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి:*

*03.ఒక్కసారి తల్లికి,తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.*

*04.సత్యం తల్లి:జ్ఞానం తండ్రి.*

*05.పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు.ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి.*

*06.తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ,వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.*

*07.ఎవరు మాతృ, పిత్రు,దేవతలను సుఖముగ ఉంచరో,సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం:*

*08.ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా,వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.*

*09.తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పు లేదు.చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే,అని ధర్మశాస్త్రం చెబుతోంది.*

*10. తల్లిని,తండ్రిని,సత్య ధర్మ, ఉత్తమ సంస్కారాల మంచి,సత్కర్మల,జ్ఞాన గురువులను మించిన దైవం లేదు:గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు.*

🌹❤️🙏💪🤝✅🙏♥️💐🙏

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 49 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


వృత్రాసుర సంహారం చేయడం వలన మరల బ్రహ్మ హత్యాపాతకం అంటుకుంటుంది. క్రిందటి సారి ఆ బ్రహ్మహత్యా పాతకమును నలుగురికి పంచాడు. ఇప్పుడు ఈ బ్రహ్మ హత్యా పాతకం పరమ వృద్దుడయిన వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో, ఒళ్ళంతా క్షయ వ్యాధి, కుష్ఠు వ్యాధి చేత పుండ్లు పడిపోయి నోటివెంట నవరంధ్రముల వెంట పుల్లటి కంపు కొడుతుండగా ఒంట్లోంచి నెత్తురు కారిపోతున్న వ్రణములతో ఇంద్రుని కౌగలించుకోవడానికని వెంటపడింది. బ్రహ్మహత్యాపాతక స్వరూపం బాధించడం కోసమని వెంటపడితే ఇంద్రుడు పరుగుపరుగున అన్ని దిక్కులకు వెళ్ళాడు. ఎటువైపుకు వెళ్ళినా విడిచి పెట్టలేదు. ఇంక దారిలేక ఇంద్రుడు ఈశాన్య దిక్కుపట్టి పరుగెత్తి మానససరోవరంలోకి దూరిపోయాడు. ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంటుంది. అక్కడికి బ్రహ్మహత్యా పాతకం కూడా తరిమి రాలేక పోయింది. ఇంద్రుడు వెనక్కి వస్తాడేమో అని ఎదురుచూస్తూ నిలబడింది. ఇంద్రుడు మానస సరోవరంలోకి దూకి ఒక తామరపువ్వు గుండా తామర నాళం లోనికి ప్రవేశించి అందులో ఉండే ఒక తంతువులోకి దూరి వేయి సంవత్సరములు ఉన్నాడు. ఒడ్డున ఆ బ్రహ్మహత్యా పాతకం బయటకు రాకపోతాడా పట్టుకోలేక పోతానా అని నిరీక్షిస్తూనే ఉన్నది. అలా ఇంద్రుడు నారాయణ కవచమును, శ్రీమన్నారాయణుని తపమును ఆచరిస్తూ కూర్చున్నాడు. భయపడుతూ కూర్చోలేదు. ఈశ్వరారాధనం చేస్తూ కూర్చున్నాడు.

ఈ వెయ్యి సంవత్సరములు గడిచేలోపల ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇంద్రపదవి ఖాళీగా ఉన్నది. ఆ పదవిలోకి తాత్కాలికముగా అనేక యాగములు చేసిన నహుషుడు అనే మహారాజును తెచ్చి కూర్చోబెట్టారు. ఇంద్రపదవిలో కూర్చోగానే ఆయనకో వెర్రి పుట్టింది. ‘ఇంద్రపదవి ఒకటీ ఇచ్చి వదిలిపెడితే ఎలా – శచీదేవి కూడా నాది కావాలి కదా’ అన్నాడు. ‘ప్రస్తుతం నేనే ఇంద్రుడిని కాబట్టి అసలు ఇంద్రుడు వచ్చే వరకు నీవు నా భార్యగా ఉండు’ అని శచీదేవికి వర్తమానం పంపాడు. ఆయన ప్రవర్తన నచ్చక శచీదేవికి ఏమి చేయాలో అర్థం కాలేదు. లలితా సహస్రనామ స్తోత్రములో అమ్మవారికి ‘పులోమజార్చిత’ అని పేరు ఉన్నది. పులోముడు శచీదేవి తండ్రి. పులోముని కుమార్తె అయిన శచీదేవి చేత నిరంతరం లలితా పరాభట్టారిక అర్చింపబడుతు ఉంటుంది. భార్య చేసే పూజ వలన భర్తకి అభ్యున్నతి కలుగుతుంది. అందుకని ఆయన ఇంద్రపదవి యందు ఉన్నాడు. ఈమె యందు ఏ దోషము లేదు బృహస్పతి ఈమెకు దర్శనం ఇచ్చి ‘అమ్మా!దీనికి ఒకటే పరిష్కారం. నీ భర్త ఏ మహాత్ముడికి అపచారం చేసి ఇవాళ దాగి ఉన్నాడో ఇలాగ వీనితోను ఒక అపచారం చేయించు. నహుషుడిని ‘సప్తర్షులు మోస్తున్న పల్లకిలో రా – నీవు నాకు భర్తవు అవుదువు గాని’ అని కబురు చెయ్యి. కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఈ పని చేయనా అని ఉండదు. ‘సప్తర్షులను పిలిచి మోయమని పల్లకి ఎక్కుతాడు అని చెప్పాడు. బృహస్పతి తెలివితేటలు వట్టినే పోవు. ఆవిధంగా నహుషుడు సప్తర్షులు మోస్తున్న పల్లకి ఎక్కాడు. ఆ పల్లకి మోస్తున్న వారిలో ఉన్నారు.

మహాశక్తి సంపన్నుడు, పొట్టిగా ఉన్న అగస్త్యమహర్షి ఉన్నారు. అడుగులు గబగబా పడడము లేదు. నహుషుడు లోపలినుంచి చూశాడు. తొందరగా శచీదేవి వద్దకు వెళ్ళాలనే తాపత్రయంతో ‘సర్పసర్ప’ ‘నడు నడు’ అని ఆయనను హుంకరించి డొక్కలో తన్నాడు. అగస్త్యునికి కోపం వచ్చింది. పైకి చూసి ‘చేయకూడని పని చేస్తూ మహర్షుల చేత పల్లకి మోయిస్తూ పొట్టివాడిని అడుగులు వేయలేక పోతున్న వాడిని అయిన నన్ను ‘సర్ప సర్ప’ అన్నావు కాబట్టి నీవు సర్పమై కొండచిలువవై భూలోకంలో పడిపో’ అని శపించాడు.వెంటనే నహుషుడు కొండచిలువయి క్రిందపడ్డాడు. మరల ఇంద్రపదవి ఖాళీ అయింది మరల ఇంద్రుని తీసుకురావాలి. దేవతలు, ఋషులు అందరూ కలిసి మానససరోవరం దగ్గరకు వెళ్ళారు. వెయ్యి సంవత్సరాలు తపించిన ఇంద్రుని శక్తి చూసి బ్రహ్మహత్యా పాతకం వెనక్కి తిరిగింది. పూర్తిగా నివారణ కాలేదు. ఇంద్రుని తీసుకు వచ్చి అశ్వమేధ యాగం చేయించారు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాపపరిహారం చేశారు. ఏది చేసినా భగవానుడే చేయాలి. ఇంద్రుడు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహమునకు నోచుకున్నాడు. బ్రహ్మహత్యా పాతకము నివారణయై మరల వచ్చి ఇంద్రపదవిలో కూర్చుని సంతోషముగా గురువును సేవిస్తూ కాలమును గడుపుతున్నాడు.

ఇంద్రపదవిని అలంకరించిన వాడే గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కష్టములు పడ్డాడు. మనం ఎల్లప్పుడూ గురువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువులు మీ డబ్బు కోరుకునేవారు కారు. ఐశ్వర్యమును కోరుకునే వారు కాదు. వారిపట్ల ఎప్పుడూ మర్యాద తప్పకూడదు. ఎప్పుడూ వారిపట్ల మర్యాదతో ప్రవర్తించడం, వారు చెప్పిన మాట వినడం అనే మంచి లక్షణమును కలిగి ఉండాలి. దాని చేత ఉద్ధరింపబడతారు.

సప్తమ స్కంధము – ప్రహ్లాదోపాఖ్యానం:

ప్రహ్లాదోపాఖ్యానం పరమపవిత్రమయిన ఆఖ్యానం. అందులో ఎన్నో రహస్యములు ఉన్నాయి. వైకుంఠ ద్వారపాలకులయిన జయవిజయులు ఇద్దరు సనక సనందనాదుల పట్ల చేసిన అపచారం వలన శాపవశం చేత భూలోకమునందు అసురయోనిలో జన్మించి రాక్షసులయి మూడు జన్మలు ఎత్తిన తరువాత మరల శ్రీమన్నారాయణుడు వారిని తన ద్వారపాలకుల పదవిలోనికి తీసుకుంటాను అని అభయం ఇచ్చాడు. వాళ్ళే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు.

హిరణ్యకశిపుడు అంటే కనబడినదల్లా తనదిగా అనుభవించాలని అనుకునే బుద్ధి కలవాడు. ఆయనకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అను నలుగురు కుమారులు కలిగారు. ప్రహ్లాదునికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు సింహిక. సింహిక కుమారుడు రాహువు. ఆ రాహువే ఇప్పటికీ పాపగ్రహం క్రింద సూర్య గ్రహణం, చంద్ర గ్రహణంలో కనపడుతూ ఉంటాడు. ఆయనే మేరువుకి అప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాడు. హిరణ్యాక్షుడు మరణించిన సందర్భముతో ఈ ఆఖ్యానమును ప్రారంభం చేస్తున్నారు. ఆయన భార్యలు, తల్లిగారయిన దితి హిరణ్యాక్షుడు మరణించాడని విలపిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి హిరణ్యకశిపుడు వచ్చాడు. హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతమును చూస్తే అసలు ఇతను రాక్షసుడేనా ఇలా వేదాంతమును ఎవరు చెప్పగలరు? అనిపిస్తుంది.

హిరణ్యకశిపుడు ఏడుస్తున్న భార్యలను, తల్లి చూసి “సాక్షాత్ శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేసి వీరమరణం పొందాడు. ఉత్తమలోకాల వైపుకి వెళ్ళిపోయాడు. అటువంటి వాని గురించి ఎవరయినా ఏడుస్తారా? ఏడవకూడదు అని ఒక చిత్రమయిన విషయం చెప్పాడు.

పూర్వకాలంలో సుయజ్ఞుడు చాలాకాలం ప్రజలను పరిపాలన చేసి అనేకమంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకనాడు మరణించాడు. అతని భార్యలు, పుత్రులు అందరూ విలపిస్తున్నారు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఆయన ఒక బ్రాహ్మణ కుమారుని వేషంలో అక్కడికి వచ్చి ఒకమాట చెప్పాడు “ఏమయ్యా, మీరందరూ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. చావు తప్పించుకొని దాక్కున్న వాడెవడూ లేదు. కొన్నాళ్ళు బ్రతికిన తరువాత వెళ్ళిపోవడం అన్నది ఈ ప్రపంచమునకు అలవాటు. ఈ మహాప్రస్థానంలో మనం ఎక్కడినుండి వచ్చామో అక్కడికి వెళ్లిపోతాము. ఆ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారెందుకు?’ అని అడిగాడు యమధర్మరాజుగారు.

పూర్వకాలంలో ఒక చెట్టు మీద గూటిలో ఒక మగపక్షి, ఒక ఆడపక్షి ఉండేవి. ఒక బోయవాడు అటు వెళ్ళిపోతూ చెట్టుమీద మాట్లాడుకుంటున్న పక్షుల జంటను వాటి వెనకాల ఉన్న పక్షి పిల్లలను చూసి ఉండేలు బద్ద పెట్టి రాతితో ఆడపక్షి గుండెల మీద కొట్టాడు. గిరగిర తిరుగుతూ ఆ పక్షి కిందపడిపోయింది. అది మరల ఎగరకుండా ఆ పడిపోయిన పక్షి రెక్కలు విరిచేచేసి బుట్టలో పడేసుకొని తీసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. ఆ బుట్ట కన్నాలలోంచి ఆడపక్షి నీరస పడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి భర్తవంక చూస్తోంది. భర్త అన్నాడు “మనిద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాము. నాకేమీ సంసారం తెలియదు. రేపటి నుండి పిల్లలు లేవగానే అమ్మ ఏది అని అడుగుతాయి. నేను ఏమని సమాధానం చెప్పను? ఈ పిల్లలు ఆహరం కోసమని నోళ్ళు తెరచుకుని చూస్తూ ఉంటాయి. నీవు లేని సంసారం ఎలా చేయాను’ అని ఆడపక్షి వంక చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఆడపక్షి వంక చూస్తూ మాట్లాడుతూ మైమరచి ఉన్న మగపక్షిని చూసి బోయవాడు బాణం వదిలి దానిని కొట్టాడు. అది చచ్చిపోయింది. తాను ఉండిపోతాను అనుకున్న మగపక్షి చచ్చిపోయింది. రెక్కలు వంగిన ఆడపక్షి ఇంకా బ్రతికే ఉన్నది. కాబట్టి ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలుసు. అందుకని ఈశ్వరుని గురించి ప్రార్థన చెయ్యండి అన్నాడు.

ఈ మాటలకు దితి, హిరణ్యాక్షుని భార్యలు ఊరట చెంది అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం తపస్సుకు బయలుదేరాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

జ్వరము లక్షణాలు

 జ్వరము లక్షణాలు - నివారణా యోగాలు .


    శరీరం వణుకుట, పెదవులు , నోరు ఆరిపోవుట, నిద్రపట్టకపోవుట, తుమ్ము రాకుండా ఉండటం, తల ఇతర భాగాలు నొప్పులుగా ఉండటం, నోటికి రుచి తెలియకపోవటం , మలబద్దకం, కడుపునొప్పి, కడుపుబ్బరం, ఆవులింతలు ఇటువంటి లక్షణాలు అన్నియు వాతం వలన కలుగు జ్వర లక్షణాలు .


     బాగా వొళ్ళు కాలుట, అతిసారం, సరిగ్గా నిద్రపట్టకపొవుట, వాంతులు , నోటిలో పుండుపడుట, నోరు చేదుగా ఉండటం, మూర్చ, తాపము , దాహము , మలమూత్రాలు, కళ్లు పచ్చగా ఉండటం వంటి లక్షణాలు అన్నియు పిత్త సంబంధ జ్వర లక్షణాలు .


     శరీరం బాగా చలిగా ఉండటం, సోమరితనం, నోరు తియ్యగా ఉండటం , చర్మం పాలిపోవుట , మూత్రం తెల్లగా రావటం, శరీరం బిగుసుకుపోయినట్టు ఉండటం, పొట్ట, శరీరం బరువుగా ఉండటం , అతినిద్ర, మలము కొద్దిగా వచ్చుట, నోటిలో ఎక్కువ నీరు ఊరట, మూత్రం ఎక్కువుగా రావటం, వాంతులు , అరుచి , జీర్ణం కాకుండా ఉండటం, దగ్గు, జలుబు , కళ్లు తెల్లగా ఉండటం ఈ లక్షణాలు అన్నియు కఫ సంబంధ జ్వర లక్షణాలు .


         పైన చెప్పిన విధముగా జ్వరం వచ్చినపుడు లక్షణాన్నిబట్టి దేని సంబంధమైన జ్వరమో నిర్ణయించుకొని దానికి తగ్గ ఔషథాన్ని నిర్ణయించుకుని వాడవలెను.


 నివారణా యోగాలు  -


 *  తిప్పతీగ , మోడి , శొంటి మూడు సమాన బాగాలుగా తీసుకుని కషాయం చేసుకుని సేవిస్తున్న వాతజ్వరం నశించును.


 *  దురదగొండి వేర్లు, పర్పాటకం, ప్రేంఖనం , నేలవేము , అడ్డసరం, కటుకరోహిణి వీటి కషాయం ఎక్కువుగా చక్కర కలిపి తీసుకుంటే దాహము , రక్తపిత్తం, జ్వరం, తాపం నివారిస్తాయి.


 *  పర్పాటకం , చందనం,వట్టివేళ్ళు , ధనియాలు  వీటి కషాయం తీసుకుంటే పైత్య జ్వరం వెంటనే నివారణ అగును.


 *  వాము , వస, శొంటి, పిప్పళ్లు , నల్ల జీలకర్ర సమాన చూర్ణాలను తీసుకుని కలిపి కొంచం నీరు కలిపి శరీరానికి మర్దన చేయుచున్న టైఫాయిడ్ జ్వరములో వచ్చు శరీరపు మంటలు తగ్గును.


 *  బెత్తెడు వేపచెక్క దంచి గ్లాసున్నర నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు లోపలికి ఇచ్చి పడుకోపెట్టి లొపలికి గాలి చొరబడకుండా నిండగా దుప్పట్లు కప్పవలెను. లోపల అంత చెమట పట్టి జ్వరం తగ్గును. ఈ విధముగా మూడుపూటలా చేయుచున్న అన్నిరకాల జ్వరాలు నశించును.


 *  నిమ్మకాయ రసంలో పంచదార కలిపి తాగించుచున్న జ్వరం వల్ల వచ్చు తాపం తగ్గును.


 *  కృష్ణ తులసి ఆకులు 50 గ్రాములు , మిరియాలు 10 గ్రాములు రెండూ కలిపి నూరి బటాణిగింజ అంత మాత్రలు చేసి పూటకి ఒక మాత్ర చొప్పున ఇచ్చి వేడి నీరు తాగించవలెను . చలిజ్వరం నందు పూటకి రెండు మాత్రలు చొప్పున ఇవ్వవలెను.  దీనివలన సాధారణ జ్వరములు, మలేరియా జ్వరములు కూడా నశించును.


 *  గుంటగలగరాకు జ్వరం ఉన్నవారు కొంచం కొంచం నమిలి మింగుచున్న జ్వరం తగ్గును.


 *  రావిచెట్టు ఆకులు 5 , మారేడు ఆకులు 15 , తులసి ఆకులు 45 ఈ వస్తువులను మెత్తగా నూరి అర లీటరు నీళ్లలో కలిపి కషాయం కాచి పావులీటరులో సగం వచ్చేంత వరకు మరిగించి దింపి వడపోసుకొని ఉంచుకుని గంట గంటకు 10ml చొప్పున తాగించుచున్న రెండు రోజుల్లొ టైఫాయిడ్ జ్వరం నశించును.


 *  గుంటగలగర చిగుళ్లు 7 , మిరియాలు 7 కలిపి నూరి ఒక్క మోతాదుగా రోజూ రెండుపూటలా ఇచ్చుచుండిన యెడల చలిజ్వరం తగ్గును.


 *  5 తులసి ఆకులు , 5 మిరియపు గింజలు కలిపి నూరి 60ml నీరు , 15ml తేనె కలిపి భోజనానికి గంట ముందుగా ఉదయం , సాయంత్రం కలిపి ఇచ్చుచుండిన టైఫాయిడ్ జ్వరం తగ్గాక వచ్చు బలహీనత నివారించబడును.


 *  వరిపేలాలు చూర్ణం చేసి కషాయం పెట్టి ఆ కషాయంలో కొంచం పటికబెల్లం పొడి కలిపి తాగించున్న పైత్యం వలన వచ్చు జ్వరం తగ్గును.


 * గోధుమల కషాయం లో పటికబెల్లం పొడి కలిపి తాగించుచున్న పైత్యజ్వరం నశించును.


      జ్వరం తగ్గుటకు పథ్యం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. సరైన పథ్యమును పాటిస్తూ ఔషధాలను తీసుకొనుచున్న ఎటువంటి జ్వరం అయినా నశించును.


        మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు .