2, ఆగస్టు 2021, సోమవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

 *01.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఐదవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు వసుదేవునకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుట - శ్రీకృష్ణుడు దేవకీదేవి యొక్క ఆరుగురు మృతపుత్రులను సజీవులనుగా తీసికొనివచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీబాదరాయణిరువాచ*


*85.1 (ప్రథమ శ్లోకము)*


*అథైకదాఽఽత్మజౌ ప్రాప్తౌ కృతపాదాభివందనౌ|*


*వసుదేవోఽభినంద్యాహ ప్రీత్యా సంకర్షణాచ్యుతౌ॥11843॥*


*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! ఒకనాడు ప్రాతఃకాలమున బలరామకృష్ణులు తమ తల్లిదండ్రులైన దేవకీవసుదేవులకు పాదాభివందసమొనర్చుటకై వారి కడకు వచ్చిరి. అంతట వసుదేవుడు ప్రేమతో వారిని అభినందించెను. 


*85.2 (రెండవ శ్లోకము)*


*మునీనాం స వచః శ్రుత్వా పుత్రయోర్ధామసూచకమ్|*


*తద్వీర్యైర్జాతవిశ్రంభః పరిభాష్యాభ్యభాషత॥11844॥*


వసుదేవుడు కురుక్షేత్రమున తమ తనయులైన బలరామకృష్ణుల ప్రభావమును గూర్చి మునులద్వారా వినియుండెను. వారి మహత్త్వమును స్వయముగా చూచియుండెను. అందువలన ఆయనకు వారి జగదీశ్వరత్వమును గూర్చి పూర్తి విశ్వాసము కుదురుకొనెను. పిమ్మట అతడు వారిని సంబోధించుచు ఇట్లు నుడివెను.


*85.3 (ముడవ శ్లోకము)*


*కృష్ణ కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన|*


*జానే వామస్య యత్సాక్షాత్ప్రధానపురుషౌ పరౌ॥11845॥*


"సచ్చిదానంద స్వరూపుడవైన శ్రీకృష్ణా! మహాయోగీశ్వరుడవైన బలరామా! 'మీరు ఇరువురును సనాతనులు. మీరు ఈ సమస్త జగత్తునందలి ప్రకృతి - పురుషులకు నియామకులు. సాక్షాత్తు పరమేశ్వరులు మీరే' అని నేను మీ కృపతో ఎరుగుదును.


*85.4 (నాలుగవ శ్లోకము)*


*యత్ర యేన యతో యస్య యస్మై యద్యద్యథా యదా|*


*స్యాదిదం భగవాన్ సాక్షాత్ప్రధానపురుషేశ్వరః॥11846॥*


కృష్ణా! మీరు ఈ జగత్తునకు ఆధారభూతులు. నిర్మాతలూ, నిర్మాణసామాగ్రియు మీరే. సమస్త జగత్తునకును మీరే ప్రభువులు. ఈ సమస్త జగత్తూ మీకు క్రీడాపరికరము. ఏది ఏ సమయమున ఏ రూపములో ఉండునో, ఎట్లు పరివర్తనము చెందునో, వాటికి అన్నింటికిని మీరే కారణము. ఈ జగత్తునందు ప్రకృతి రూపములో భోగ్యవస్తువులుగను, పురుషరూపములో భోక్తలుగను విలసిల్లుచుండువారు మీరే. అంతేగాదు మీరు వాటికి (భోగ్యములకు - భోక్తలకు) అతీతీలూ, నియామకులూ ఐన పరమాత్మ స్వరూపులు.


*85.5 (ఐదవ శ్లోకము)*


*ఏతన్నానావిధం విశ్వమాత్మసృష్టమధోక్షజ|*


*ఆత్మనానుప్రవిశ్యాత్మన్ ప్రాణో జీవో బిభర్ష్యజ॥11847॥*


*85.6 (ఆరవ శ్లోకము)*


*ప్రాణాదీనాం విశ్వసృజాం శక్తయో యాః పరస్య తాః|*


*పారతంత్ర్యాద్వైసాదృశ్యాద్ద్వయోశ్చేష్టైవ చేష్టతామ్॥11848॥*


ప్రభూ! నీవు ఇంద్రియాతీతుడవు. జన్మ-అస్తిత్వాది భావవికార రహితుడవైన పరమాత్మవు. చిత్రవిచిత్రమైన ఈ జగత్తు నీ నుండియే వ్యక్తమగుచున్నది. దాని స్రష్టవు నీవే. దేవ-నర-పశు-వృక్షాది నానారూపమలలో జీవాత్మ రూపమున అందు ప్రవేశించి, వాటిని రక్షించుచుందువు. వాటి ప్రాణ (క్రియా-శక్తి), జీవ (జ్ఞానశక్తి) రూపములలో వాటిని పోషించుచుందువు. క్రియాశక్తి ప్రధాన ప్రాణాదులైన జగద్వస్తువులలోని సృష్టి సామర్థ్యము వాటిది గాదు. అది నీదే. ఏలయన అవి నీ వలె చేతనములు గావు. అచేతనములు (జడములు) స్వతంత్రములు గావు. పరతంత్రములు. చేష్టాశీలములైన ప్రాణాదులయందుగల శక్తివి నీవే.


*85.7 (ఏడవ శ్లోకము)*


*కాంతిస్తేజః ప్రభా సత్తా చంద్రాగ్న్యర్కర్క్షవిద్యుతామ్|*


*యత్స్థైర్యం భూభృతాం భూమేర్వృత్తిర్గంధోఽర్థతో భవాన్॥11849॥*


మహాత్మా! చంద్రునికాంతి, అగ్నియొక్క తేజస్సు, సూర్యుని ప్రభ, నక్షత్రములయొక్క, విద్యుత్తుయొక్క వెలుగులు, పరత్వములయొక్క స్థిరత్వము, భూమియొక్క ఆధార శక్తిరూపమైన వృత్తి, దాని గుణమైన గంధము ఇవి యన్నియును వాస్తవముగా నీవే.


*85.8 (ఎనిమిదవ శ్లోకము)*


*తర్పణం ప్రాణనమపాం దేవత్వం తాశ్చతద్రసః|*


*ఓజః సహో బలం చేష్టా గతిర్వాయోస్తవేశ్వర॥11850॥*


సర్వేశ్వరా! ప్రాణుల దాహము తీర్చి తృప్తిపఱచుట, ప్రాణములను నిలబెట్టుట, శుభ్రపఱచుట అను జలముల శక్తులన్నియును నీ స్వరూపమే. అంతేగాక! ఆ జలములలోని రసము (రుచి) నీవే. ఇంద్రియశక్తి, అంతఃకరణశక్తి, శరీరశక్తి, వేగము, కదలుట, కదిలించుట, వీచుట, చరించుట అను వాయువుయొక్క శక్తులు అన్నియును నీవే.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు

 🙏🙏🙏🙏🙏

🌼🌼🌼🌼🌼

పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు

గృహంలో దేవతా విగ్రహాలు బొటనవేలు కన్నా పెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పైజన్మలో చేతులు లేకుండా జన్మించటం కానీ, మధ్యలో చేతులు పోవటం కానీ జరుగుతాయి. 


ఈశ్వరుడికి వీపు చూపరాదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతికర్పూరంకానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులోవుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడం చేయి పూజా విధులలో నిషేధం. 


ఇక ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు. 

    

ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించేవారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు. 

🌼🌼🌼🌼🌼

🙏🙏🙏🙏🙏

ప్రకృతి పరిరక్షణ

 " ప్రకృతి పరిరక్షణ విశ్వ మానవాళి బాధ్యత " సృష్టాదిగ విశాల విశ్వంలో ప్రత్యేకతనొందిన ప్రకృతి వైశిష్ట్యం ! సమస్త జీవజాలంలో మానవాళి సృష్టి, " బ్రహ్మ దేవుని " మహోన్నత దూర దృష్టి ! వసుధపై వసించెడి చరాచర జీవరాసులలో మానవాళి శక్తి అత్యున్నతం ! రానున్న కాలానికి అనువైన రీతిలో ఈ భువిపై వలసిన వనరుల సమృద్ధికై, బ్రహ్మ చేసిన దివ్య భావనాత్మకత సమ్మళితమై యున్న అద్భుత రచన ! విశ్వ మానవాళి తమదైన శైలిలో సకల జీవ ప్రశాంత మనుగడకు చేయాల్సిన కృషి, బ్రహ్మ రచనలో అంతర్భాగం ! బ్రహ్మ యొక్క సుదూర యోచనలో విశ్వ మానవాళి, తమ నిత్య జీవన పథంలో స్నేహ మాధుర్యానికి ప్రతీకయై నిలవాలన్న సత్య చైతన్య దృక్పథం ! తల్లి ఒడిలో ప్రప్రథమ జీవన పాఠం నేర్చే మానవాళి, ప్రకృతి ఆసరాతో తమలో సన్మైత్రీ యోచన పరిపుష్టమై భావితరాలకు మార్గగామి కావాలన్న బ్రహ్మదేవుని సదాలోచన ! విద్వేషాలు కానరాని, వైషమ్యాలు లేని నిత్య సమున్నత సమైక్య స్నేహ దివ్య జీవన గమనం వారి నిత్య సత్య ప్రశాంత జీవన పథం కావాలన్న బ్రహ్మ దృక్పథం ! ప్రకృతి ప్రసాదించే అత్యంత విలువైన ఓషధుల పరిరక్షణ, సక్రమ వినియోగం విశ్వ మానవాళి కనీస కర్తవ్యం ! " బ్రతుకు, బ్రతకనివ్వు అనే జీవకారుణ్యతా వికాసం ", బ్రహ్మ సృష్టిలో అంతర్లీన సహృదయ, సుహృద్భావ చైతన్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం ! రచన : గుళ్లపల్లి ఆంజనేయులు

Supreme Court in Chennai now*

 *Supreme Court in Chennai now*

Congratulations to Prime Minister Modi. The Central Government has decided to expand the branches of the *Supreme Court to three locations, Chennai, Mumbai and Calcutta,* for the first time since India's independence, with the Supreme Court operating only in the capital Delhi. Those who are dissatisfied with the High Court judgments in all the states of India will last seek the Supreme Court. Only those who could afford it went to Delhi and appealed. Many poor people were affected by not being able to go to Delhi and prosecute without knowing the procedure. The Madurai branch of the High Court has become a boon for those who are unable to come to Chennai and file a case as the Madurai branch of the High Court has already come to Tamil Nadu. Similarly, the Central Government has decided to expand the branches of the Supreme Court to three locations: Chennai, Mumbai and Calcutta. That too will be a boon for the people living in the southern states as the Supreme Court is coming to Chennai. The coming of the Supreme Court branch in Chennai is considered to be beneficial not only to the people of Tamil Nadu but also to the people living in other southern states like Andhra Pradesh, Telangana, Karnataka and Kerala.

ధర్మం భగద్గీత

 "ధర్మం " అనే పదాన్ని ఇతర పాపపుణ్యాల భావములకు అన్వయించకూడదు. భగద్గీత అనుసరించి "ధర్మం " అనగా:


"ధర్మం " అంటే స్వధర్మ కర్మాచరణే . చాతుర్వర్ణం మయాసృష్ఠం వాసుదేవుడు అన్నాడు కాబట్టి ఆయన తన సృష్టి అనే కార్యాలయములో గుణ,కర్మ విభాగాలననుసరించి నాలుగు వర్ణాలు లేక పరంపర ని ఏర్పరుచుకున్నాడు. సృష్టిలో దేవతలు, మానవులు ప్రముఖ పాత్ర పోషిస్తారు. మానవులకు యజ్ఞాలతో వర్షాలు కురిసి ఆహారము పొంది , వర్షాలకు కారణమైన దేవతలకు హవిస్సులు ఇచ్చి మిగిలిన శేషం తినమన్నాడు . తనకు తానే వండుకు తినువాడు దొంగతో సమానము . హవిస్సులు పొంది దేవతలు సంతోషంతో వర్షాలు ఇస్తారు. 

తన సృష్టి అనే కార్యాలయములో యజ్ఞం నిరాటంకముగా కొనసాగుటకు నాలుగు వర్ణాలు తమవంతు పాత్ర నిర్వహించాలి . బ్రాహ్మణుడు యజ్ఞం హోత . 

క్షత్రియుడు యజ్ఞ రక్షణ . వైశ్యుడు యాజ్ఞవస్తువుల సరఫరా. శూద్రుడు యజ్ఞ నిర్వహణలో పై మూడు నిర్వహకులకు దేహశక్తి సహాయం అందించాలి. 

అదే ఏర్పాటు . ఈ నిర్వహణలో మరణము సంభవించినను స్వర్గతుల్యమే. ఎవరు తమ పాత్ర తక్కువని ఇతర పరంపర/వర్ణం ఆకర్షణమైనదని భావించి అటువైపు దృష్టి మళ్ళి వెళ్లారో వారికి ఇహంలోనూ పరంలోను దుర్గతి. 

ఇంకొక సందేహం రావచ్చు ఒక వర్ణములో జన్మించినవాడు భ్రష్టుడైతే అతని పునర్జన్మ కర్మ, గుణానుసారముగా మానవుణ్ణి నుంచి క్రిమి కీటకాదులవరకు కలుగవచ్చు. శుభమ్ భూయాత్త్.

దీపారాధన-పరిహారాలు*

 శ్రీనివాస సిద్ధాంతి.9494550355.


*దీపారాధన-పరిహారాలు*


 ఈ పరిహారాల్లో దేన్నైనా... ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు. 


1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు అవనూనెతో దీపారాధన – ఆరోగ్యం


2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని పిండి చేసి, దీపప్రమిదగా చేసి, అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.


3. వివాహం కావడానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.


4. శని భగవాన్ ప్రతికూలమై తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.


5. కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి. 


6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.


7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి.


తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే....!! తరచూ గృహంలో స్పర్థలు వస్తుంటే, సమస్యలు ఉత్పన్నం అవుతుంటే, రామభజన చేస్తున్న ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి, యథాశక్తి శ్రీరామనామ జపం చేయాలి. 


జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును. *ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*

*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.*

*9494550355*


*plz forward the message*

ప్రశ్న పత్రం సంఖ్య: 17

  ప్రశ్న పత్రం సంఖ్య: 17                 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింది  ప్రశ్నలకు జవాబులు తెలుపండి   

1) శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో వున్న "అష్టదిగ్గజాల" పేర్లు ఏమిటి 

2)సంస్కృతంలో  పంచ కావ్యాలు ఏవి .   

3) క్రింది ఖాళీలను పూరించండి 

_________నాస్తి దుర్భిక్షం!

జపతో నాస్తి ______ !
మౌనేన ________ నాస్తి!

నాస్తి _________భయః!! 

4)  సాధారణంగా ఒక పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి. కానీ కొన్ని దేశీయ ఛందస్సులో చాలా పాదాలు ఉండవచ్చు ఆ ఛందస్సులు తెలపండి. 

5) అతిశయోక్తి అలంకారం  అంటే ఏమిటి. 

6)"తెగేదాకా లాగకూడదు" అని ఏ సందర్భంలో ఉపోయోగిస్తారు.  

7)శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంధము ఏమిటి. 

8) తెలుగు పంచ కావ్యాలు ఏవి 

9)  " ఏడ్చే దాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు" అని ఎప్పుడు ఉపోయోగిస్తారు

10) త్యాగరాజు వ్రాసిన పంచ రత్న కీర్తనలు ఏవి 

11) మన దేశంలో ఎన్ని రకాల సంగీత పద్ధతులు వున్నాయి 

12) లంకను కాపలా కాసేది ఎవరు. 

13) వసుదేముడు ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు. 

14) హనుమంతుడు ఎన్ని వ్యాకరణల పండితుడు 

15) "కుమారసంభవం" వ్రాసిన కవి ఎవరు 


ధర్మం’ అంటే

 *ధర్మం’ అంటే ఏమిటి ??*


• ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం వివాహ ధర్మం!

• తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం భార్య ధర్మం!

• నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం మిత్ర ధర్మం!

• సోమరితనం లేకుండటం పురుష ధర్మం!

• విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం గురుధర్మం!

• భయభక్తులతో విద్యను నేర్చుకోవటం శిష్యధర్మం!

• న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మం!

• భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం ఇల్లాలి ధర్మం!

• సైనికుడుగా వుండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం!

• వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం పుత్రధర్మం!

• తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం తండ్రి ధర్మం!

• తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం బిడ్డలందరి ధర్మం!

• తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం ప్రతివాని ధర్మం!

• తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం సంసార ధర్మం!

• అసహాయులను కాపాడటం మానవతా ధర్మం!

• చెప్పిన మాటను నిలుపుకోవటం సత్య ధర్మం!సేకరణ..

సాత్వికకర్త

 చేసే పని మీద ఆసక్తి, సంగము లేనివాడు, ఈ పని నేను చేస్తున్నాను అనే అహంకారము లేని వాడు, ఏ పని అయినా ధైర్యము, ఉత్సాహముతో చేసేవాడు. తాను చేసిన కార్యము సిద్ధించినా, సిద్ధించకపోయినా ఎటువంటి వికారము చెందని వాడు, ఇటువంటి కర్తను సాత్వికకర్త అని చెప్పబడతాడు.


చేసేది సాత్త్విక కర్మ కావచ్చు, కాని ఆ కర్మ చేసే కర్త కూడా సాత్త్వికుడు అయి ఉండాలి. లేకపోతే అది సాత్త్విక కర్మ అనిపించుకోదు. ఉదాహరణకు శరీరంతో సాత్త్విక కర్మలు చేస్తూ, మనసులో రాజస భావాలు, తామస భావాలు కలిగి ఉంటే, దాని వలన లాభం ఏమిటి.

   కర్మలు సాత్విక, రాజసిక, తామసిక కర్మలుగా ఉన్నట్టే, ఎవరు ఏపని చేసినా, ఆ పని చేసే కర్త కూడా మూడు విధాలుగా ఉంటాడు. సాత్విక కర్త, రాజసికకర్త, తామసిక కర్త. ఇప్పుడు సాత్విక కర్త అంటే ఎవరో తెలుసుకుందాము. ఎవరు ఏ కర్మ చేసినా దానిని నుండి ఫలితం ఆశించి చేయకూడదు. ఆ కర్మకు పూర్తిగా అంకితం అయి పోకూడదు. ఆ కర్మ అలవాటుగా మారకూడదు. ఆ కర్మచేయడం తన విద్యుక్త ధర్మం కాబట్టి ఆ కర్మ చేస్తున్నాను అని అనుకోవాలి. అప్పుడే విహిత కర్మలు చేయగలుగుతాడు. ఆ కర్మ నేనే చేస్తున్నాను, నేను కాబట్టి ఈ పని చేయగలుగుతున్నాను, నేను చేసాను కాబట్టి ఇంత మంచి ఫలితం వచ్చింది అనే అహంకారము కరత్వభావన ఉండకూడదు. ఇటువంటి వాడు, ఏ కర్మచేసినా ధైర్యంగా పట్టుదలతో చేస్తాడు. ఏపనిలో అయినా ముందుకు దూసుకుపోతాడు. చేస్తానో చేయలేనేమో అనే అధైర్యం మనసులోకి రానీయడు. కొన్ని కార్యాలు ఫలిస్తాయి. మరి కొన్ని ఫలించవు. చేసిన అన్ని కర్మలు ఫలించాలని లేదు. దేశ,కాల,విధినిర్ణయాన్ని బట్టి ఫలితాలు వస్తుంటాయి. కాబట్టి తాను చేసిన కర్మ ఫలించినపుడు ఎగిరి గంతేయడం, ఫలించనపుడు కుంగిపోవడం వంటి వికారములకు సాత్త్విక కర్త లోనుకాడు. తాను చేసినపని ఫలించినా, ఫలించకపోయినా, చలించడు. నిర్వికారంగా సంతోషంగా ఉంటాడు. ఇటువంటి వారిని సాత్వికకర్తలు అని అంటారు.


కాబట్టి ఎవరు ఏ కర్మ చేసినా దానితో అనుబంధం పెంచుకోకపోవడం, అహంభావము, కర్తృత్వ భావన లేకుండ చేయడం, ధైర్యంగా చేయడం, ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా చలించకుండా ఉండటం, నిరుత్సాహపడకకుండా ఉండటం, ఆఖరుగా ఏ ఫలితం వచ్చినా ఆనందంతో స్వీకరించడం. వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పించడం సాత్త్విక కర్త చేసే పనులు.


   🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩

పెళ్లిలో కన్యను గంపలో తెచ్చే ఆచారము

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*పెళ్లిలో కన్యను గంపలో తెచ్చే ఆచారము కొంత మందికి ఉంటుంది. ఇలా ఎందుకు తేవాలి దీని వెనుక ఉన్న కారణం తెలుసుకుందాం*

☘☘☘☘☘☘☘☘

*పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు తేవాలి , తెస్తారు?*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *ముందుగా అమ్మాయి తో గౌరీ పూజ చేయించి ఆ తరువాత వెదురుతో చేసిన బుట్టలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని మేనమామలు కలిసి ఆ అమ్మాయిని వివాహ వేదిక మీదకి తీసుకొని వస్తారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అనగా దైవ రుణం పిత్రు రుణం ఋషి ఋణం తీరవు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి!*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది.ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది.అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది. ఆమెయే ఆతని లక్ష్మి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం.అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి.అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది.ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆమె ‘నిత్యానపాయినీ’. ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా చారజనంబు గాఁగ, విరజానది గౌతమిగా,వికుంఠమున్నార భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ కరుణాపయోనిధీ!*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది.ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది.ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది.ఎన్నడూ విడిచిపెట్టదు. అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ.అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది.ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇక్కడ లక్ష్మి పుట్టింది.అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను.ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను.ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది. అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం.ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి.ఆయన వృద్ధిలోకి రావాలి.ఎన్నో యజ్ఞములు చేయాలి.ఎంతో ధార్మికంగా సంపాదించాలి. ఆయనకి సంతానం కలగాలి.ఆయన సంతోష పడిపోవాలి.ఆయన తండ్రి కావాలి, తాత కావాలి. ముత్తాత కావాలి.ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది. ఆ సంతానం నానుండి రావాలి. ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి.ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే.నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి.లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది. నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం. ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు. తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు. ఈమె నీ లక్ష్మి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోనక్కరలేదు.నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ. మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది. బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు. అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు. మేనమామలు ప్రేమైక మూర్తులు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది. నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు. లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి. మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది. అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు.ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను.భర్తృ భావనతో చూడలేదు.పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు.అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ, ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి ఆధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు. వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి సంస్కృతి మనది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

గుడికి ఎందుకు వెళ్ళాలి

 మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? 

కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.

గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. 

అవేంటో చూద్దాం.

అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, 

ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి 

మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.

మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. 

అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, 

నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే 

గురువులు పరిగణిస్తారు. 

అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. 

ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. 

స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.


భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. 

అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.

దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. 

రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను 

గ్రహించే తత్వం ఉంది. 

ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.

అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి 

ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. 

కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.

ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. 

అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. 

గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.


ఆలయాల్లో గంటలు మోగిస్తారు. 

వేద మంత్రాలు పఠిస్తారు. 

భక్తి గీతాలు ఆలపిస్తారు. 

ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.

గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, 

కర్పూర హారతి, 

అగరొత్తులు, 

గంధం, 

పసుపు, 

కుంకుమల 

నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.

మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.

గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. 

ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.


తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) 

సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), 

తులసి పత్రాలు (holy basil), 

లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. 

ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. 

అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. 

రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 

ఆయురారోగ్యాలను ఇస్తుంది. 

ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఇప్పుడు చాలామంది పాటించడంలేదు 

కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. 

దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. 

స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.

లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. 

ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.

భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.

కర్పూరహారతి వెలిగిస్తారు. 

గంటలు మోగుతాయి.

తీర్థ ప్రసాదాలు ఇస్తారు. 

అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. 

మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, 

ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.

కనుక అందరూ తప్పకుండ వారానికి ఒక్కసారి అయినా దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుందాం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*వేదన..స్వాంతన..*


"స్వామివారి మందిరానికి రావాలని అనుకుంటున్నాము..ఎలా రావాలో తెలుపుతారా?.." అంటూ చెన్నై నుంచి మధుసూదనరావు గారు అడిగారు..ఆయన వయసు డెబ్భై ఏళ్ళు..రైల్లో ఎక్కడ దిగాలో చెప్పి..అక్కడనుంచి మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి ఆశ్రమానికి బస్ లో రావడానికి మార్గాన్ని వివరంగా తెలిపాను..ఆ తరువాత శని ఆదివారాల్లో మందిరానికి వస్తానని చెప్పారు..అనుకున్న ప్రకారమే మధుసూదనరావు గారు శనివారం ఉదయం తొమ్మిదిన్నర కల్లా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..గది కి వెళ్లి, స్నానాదికాలు ముగించుకొని, మందిరం లోకి వచ్చి..శ్రీ స్వామివారి విగ్రహానికి నమస్కారం చేసుకొని...నావద్దకు వచ్చి.."ఇక్కడికి మాలకొండ దగ్గరే కదా..అక్కడికి వెళ్ళడానికి ఆటో లు ఉన్నాయా?.." అన్నారు..ఒక గంట ఆగితే బస్ వస్తుందని..అందులో వెళ్ళమని సలహా ఇచ్చాను..సరే అన్నారు..మాలకొండకు వెళ్లి, శ్రీ లక్ష్మీ నరసింహుడి దర్శనం చేసుకొని సాయంత్రానికి తిరిగి మందిరానికి వచ్చారు..


ఆరోజు సాయంత్రం పల్లకీ సేవ వద్ద పూజ చేయించుకొని..తిరిగి నా వద్దకు వచ్చి.."ప్రతి శనివారం నాడు ఇంతమంది భక్తులు ఉంటారా?..వీళ్ళందరికీ అన్నదానం చేస్తున్నారా?.."అన్నారు..అవును అన్నాను..ఓ ఐదు నిమిషాల పాటు మౌనంగా వున్నారు..ఆ తరువాత.."శనివారం నాటి సాయంత్రం అన్నదానం చేయించడానికి సుమారుగా ఖర్చు చెప్పండి..వచ్చే వారానికి నేను భరిస్తాను.." అన్నారు..వివరంగా చెప్పాను..అంతా విని.."బాబూ..నేను రేపు సాయంత్రం తిరిగి చెన్నై వెళ్లాలని టికెట్ బుక్ చేసుకున్నాను..కానీ ఇందాకటి నుంచీ ఈ కోలాహలం చూసిన తరువాత..ఈ వారమంతా ఇక్కడే వుండి.. స్వామివారి సేవ చేసుకొని..శనివారం నాడు అన్నదానం చేసి..ఆదివారం నాటి సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను..నాకు కేటాయించిన గదిని ఈ వారమంతా నాకే ఉంచండి.."అన్నారు..సరే అన్నాను..


ఆరోజు గడిచిపోయింది..ప్రక్కరోజు ఆదివారం ఉదయం ప్రభాత పూజ, సమాధికి అభిషేకం, విశేష హారతులు అన్నీ దగ్గరుండి చూసారు..మధ్యాహ్నం అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేసి వచ్చారు..

"నువ్వు నాకన్నా చిన్నవాడివి..బాబూ అని ఏకవచనం తో పిలుస్తున్నాను.. ఏమీ అనుకోకు..నీతో కొంచెం సేపు మాట్లాడాలి.." అన్నారు..దగ్గరకు జరిగి కూర్చున్నాను..


"నాకు ఇద్దరు కుమారులు..ఇద్దరూ ఇంజినీర్లే.. పెద్దవాడికి వివాహం చేసాను..రెండో వాడికి సంబంధాలు చూస్తున్నాము..పోయిన సంవత్సరం చాలా గడ్డుకాలం నా జీవితం లో..నలభై ఐదు ఏళ్ల పాటు నాతో సంసారం చేసిన నా భార్యకు కాన్సర్ సోకి..మేము గ్రహించేసరికి ఆలస్యం జరిగి..ఆవిడ కాలం చేసింది..బాగా కృంగిపోయాను..ఈ వయసులో తోడు లేకుండా పోయింది..మరో మూడు నెలలు గడిచేసరికి.. రెండో వాడు ప్రమాదంలో చనిపోయాడు..దెబ్బ మీద దెబ్బ..పెద్ద కొడుకు వద్ద ఉంటున్నాను..మానసికంగా కోలుకోలేని పరిస్థితి..ఒంటరితనం పీడించసాగింది.. మా కాలనీకి దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళసాగాను.. అక్కడ సత్సంగం లో ఈ స్వామివారి గురించి..ఈ మందిరం గురించి విన్నాను..ఎందుకో తెలీదు..ఒక్కసారి వెళ్లి చూసిరావాలని బలంగా అనిపించింది..ఆలస్యం చేయకుండా వచ్చాను..ఇన్ని రోజుల తరువాత ఈరోజు నాకు మనసు ప్రశాంతంగా ఉంది..ఒక వారం పాటు ఇక్కడే వుంటాను..నువ్వు కాస్త సహకరించాలి.." అన్నారు...చాలా బాధగా అనిపించింది.."సరే..వారం పాటు వుండండి..భోజనం ఏర్పాటు కూడావుంది.." అని చెప్పాను..


ఆ వారం లో సోమవారం నుండీ శుక్రవారం వరకూ శ్రీ స్వామివారి మందిర మంటపం లో ఎక్కువ సేపు ధ్యానం చేసుకుంటూ వున్నారు మధుసూదనరావు గారు..శనివారం సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆరాత్రి అన్నదానం వద్ద తాను కూడా పాల్గొని..వడ్డన కూడా చేశారు..ఆదివారం నాడు శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, నమస్కారం చేసుకొని వచ్చారు..


"బాబూ..మళ్లీ కొన్నాళ్ళు ఆగి వస్తాను..ఇక్కడ నా మనసుకు స్వాంతన దొరికింది..నైరాశ్యం తొలిగింది..తప్పకుండా మళ్లీ వస్తాను..అక్కడికి వెళ్లిన తరువాత కూడా ఊరికే కూర్చోకుండా..నాకు చేతనైన సేవ చేస్తాను..సాటివాళ్లకు సేవ చేస్తే, నీ మనోవేదన తీరుతుంది అని శ్రీ స్వామివారు ఆదేశించినట్లు అనిపించింది.. అంతా ఈ స్వామివారి దయ!.." అన్నారు..ఈ వయసులో మధుసూదనరావు గారికి ఏది ముఖ్యమో దానినే స్వామివారు అనుగ్రహించారు..వారి సమస్యకు ఉపయుక్తమైన పరిష్కారం చూపారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

బహిష్టు నొప్పి నివారణ కొరకు

 బహిష్టు నొప్పి నివారణ కొరకు నేను ప్రయోగించిన సిద్దయోగం - 


     ముదురు చింతచెట్టు బెరడు తెచ్చుకొని ఆ బెరడును భస్మం చేసి జల్లించుకొనవలెను . భస్మం చేయుటకు వేరే కర్రపుల్లలు వాడరాదు. జల్లించగా వచ్చిన మెత్తటి భస్మమును ఒక సీసా నందు నిలువ ఉంచుకుని ఇంకో రెండు రోజుల్లో బహిష్టు అవుతారు అనగా ఒక గ్రాము మోతాదుగా ఉదయం పూట నిమ్మరసంలో కలిపి లోపలికి ఇవ్వవలెను. సాయంత్రం ఒక గ్రాము తేనెతో కలిపి సేవిస్తూ ఉండాలి . బహిష్టు మూడు రోజులు కూడా ఇలానే సేవించాలి. 


            ఈ విధంగా ప్రతినెలా బహిష్టు ముందు రెండు రోజులు , బహిష్టు మూడు రోజులు కలిపి 5 రోజులపాటు సేవించాలి .ఇలా 3 నెలలపాటు సేవించినచో స్త్రీలకు వచ్చు బహిష్టునొప్పి సంపూర్ణంగా పోవును . ఈ ఔషధాన్ని వాడు సమయంలో ఉప్పు , కారం వాడకుండా చప్పిడి పథ్యం పాటించండి. త్వరగా ఫలితం పొందుతారు. 


          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు