28, మార్చి 2024, గురువారం

నరాల్లో కణుతులు

 మెదడు నరాల్లో కణుతులు ఏర్పడి వచ్చు మూర్ఛలు కొరకు నివారణా యోగం - 


        వావిలి ఆకు రసం , కస్తూరి , వెల్లుల్లిపాయ రసం కలిపి ముక్కులో వేయుచున్న శాశ్వతంగా కణుతులు కరిగిపోయి మూర్చలు తగ్గిపోతాయి. 


మోతాదు 4 నుంచి 5 చుక్కలు . 


          ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

నందనవనంతో సమానం.

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో॥ *క్రోధో వైవస్వతోరాజా|*

      *ఆశా వైతరణీనదీ।*

       *విద్యా చ కామధుక్ ధేనుః|*

      *సంతుష్టో నందనంవనం॥*


               _- *నందనవనం* -_


భావం : 

కోపం యమునితో సమానం.

ఆశ వైతరణీనదితో సమానం.

విద్య కామధేనువతో సమానం.

సంతోషం నందనవనంతో సమానం.

{ *విద్య అనే "కామధేనువు పాలు" త్రాగిన జీవితం సుఖశాంతులతో గడుస్తుంది*....}

కర్మ సిద్ధాంతం

 కర్మ సిద్ధాంతం-19 (యమస్మృతిలోని కథ)

ఎవరు చేసిన పాపం వారు అనుభవిస్తారు అని మనం వింటూ ఉంటాము. అయ్తే కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కూడా మనకు వెరొకరి కర్మ అంటుకుంటుంది. అందుకు సంబంధించిన కథ ఒకటి యమస్మృతిలో కనిపిస్తుంది.

ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు. పాలు పెరుగు పోసే గొల్ల అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. తన్ ప్రాణ రక్షణ కోసం చేస్తున్న పోరాటంలో పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు ఆ పెరుగును తన ఇంట పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులకు ఆహారంలో వడ్డించగా వారు మృత్యువాత పడ్డారు.

ఇది జరిగిన తరువాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించటం మొదలుపెట్టారు. కొందరు " ఆ గొల్లవనితది" తప్పన్నారు. కొందరు పాముది తప్పు అని, కొందరు గరుడపక్షిది తప్పు అని, కొందరు బ్రాహ్మణుడిది తప్పుఅని వాదించటం ఆరంభించారు.

ఈ వాదప్రతివాదములు యమలోకం దాకా వెళ్ళినాయి.

చిత్రగుప్తుడు, "ప్రభూ! పాపం ఎవరికి చెందుతుంది" అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు. దానికా సమవర్తి "చిత్రగుప్తా! ప్రకృతిసిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు. ఆకలిగొన్న పక్షి తన ఆహారంకోసం పాముని తన్నుకెళ్ళటం సహజం. అది ప్రాణభయంతో విషం క్రక్కుట సహజం. గాలికి పెరుగుకుండ పైన బట్ట తొలగటం సహజం. నివేదనకు భోక్తలు మరియు అథిదులకు పెట్టే అన్నం ముందే రుచి చూడరు. అది సహజ ధర్మం. అలా చూస్తే ఎంగిలి దోషం వస్తుంది. కనుక బ్రాహ్మణుడు తన ధర్మం నిర్వర్తించాడు. ఇలా సహజముగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి?

ఏమైనా పాపం ఉంటే, అక్కడ భూలోకంలో ఈ ధర్మసూక్ష్మాలు తెలియకుండా "పాపం వీరిది, వారిది అని" ధర్మనిర్ణయం చేస్తున్నారే, వారికి పంచు" అని తీర్పునిచ్చాడు.

కాబట్టి మనము ధర్మసుక్ష్మాలు తెలియకుండా (మరియు మనం చూడకుండా ఎవరో చెప్పింది విని) వారిది తప్పు , వీరిది తప్పు అని నిర్ణయము చేస్తే, పాపములో భాగము మనకు పంచుతారు. ఇది యమధర్మరాజు చేసిన నిర్ణయము, శాస్త్రాము. కనుక గాలిమాటలు, పుకార్లు, చాడీలు చెప్పేవారు, ఇతరులను నిందించడమే పనిగా పెట్టుకున్నవారు తస్మాత్ జాగ్రత్త! మీకు ఎవరి పాపం అంటుకుంటోందో ?! 

To be continued ....