7, ఏప్రిల్ 2020, మంగళవారం

మేధావులకు వందనాలు

ఇప్పుడు మన సైన్స్ చాల అభివృద్ధి చెందినది. ప్రతి దానిని అది ఎంత సూక్షమైనకాని దానిని చూసి దాని గుణ గణాలను తెలుసుకొనే వీలు మన శాస్త్రీయ విజ్ఞానం, పరికరాలు ఉపకరిస్తున్నాయి.  కాబట్టే ఎంతో సూక్ష్మమైన కరోనా వైరస్ నిర్మాణాన్ని, దాని ఉనికిని దాని పనితనాని, అది ఏరకంగా మానవ శరీరంకు ముప్పు కలుగ చేస్తున్నది ఆవిష్కరించారు.  ఈ విజ్ఞానాన్ని మనకు అందించిన మేధావులు, డాక్టర్లు కానీ, శాస్త్రజ్ఞులు కానీ, బహుదా ప్రశంసనీయులు.  వారికీ ఈ ప్రపంచ మానవాళి యావత్తు సర్వదా కృతజ్ఞత కలిగి వుంటారు. 

ఈ కరోనా వైరస్ ఏమిటి: మనం తరచూ మూడు పేర్లు వ్యాధి కారకాల విషయంలో వింటూ ఉంటాము. అవి ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్. ఈ మూడింటిలో మొదటి రెండు జీవులు.  కానీ ఈ వైరస్ అనేది పూర్తిగా జీవి అని మనం చెప్పలేము. ఎందుకంటె జీవులకు వుండాలిసిన పూర్తి లక్షణాలు దీనిలో వుండవు.  కానీ ఇది జివి లాగ ప్రవర్తిస్తుంది. ఇక వివరాల లోకి వెళితే. 

ప్రతి జంతువు అనేక కణ జలాలు కలిగి ఉంటుంది.  ఆ కణాలు అవి చేసే పనులను బాట్టి ఆ పేర్లతో పిలువ బడతాయి.  కానీ ప్రాధమికంగా అన్ని కణాలకు ఒక nucleus ఉంటుంది అది రెండు రకాల nucleic acids  కలిగి ఉంటుంది.  అవి 1) RNA, 2) DNA అనగా ribonucleic acid.Deoxyribonucleic acid ఈ రెండిటిలో స్వల్ప బేధాలు వున్నాయ్. 
ఇకపోతే మనం ఈ కరోనా వైరస్ నిర్మాణ గూర్చి తెలుసుకుందాం. 
ఒక ఫాట్ పొరతో కప్పబడ్డ ఒక RNA అణువే  ఈ వైరస్.  నిజానికి ఇది చాలా చిన్నగా వున్న అణువు.  ఈ వైరస్ స్వతహాగా బైట ఉంటే ఎక్కువ కాలం జీవించి వుండలేదు.  కానీ దాని host Cell దొరికితే అప్పుడు అది దాని ప్రతాపం చూపెడుతుంది. మన శరీరంలో వున్న కొన్ని కణాలు ఈ వైరస్కు host Cells గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ వైరస్ మానవ శరీరంలో ప్రవేశించి దాని  host Cell మీదికి వెళుతుందో అప్పుడు ఈ కణంలో వున్న RNA అణువు మానవ శరీర కణంలోకి ప్రేవేశించి శరీర కణం మీద ఆధిపత్యం వహించి అనేక  RNA అణువులను సృష్టిస్తుంది.  ఆ విధంగా శరీరం నిండా వ్యాపిస్తుంది.  ఈ వైరస్ మానవ శరీరంలో ఊపిరితిత్తుల కణాలను ఆక్రమించుకొని పూర్తిగా ఉపిరితితుల కణజాలాన్ని వైరస్ కణాలుగా మార్పు చెందిస్తుంది.  ఈ విధంగా ఇది వ్యాపిస్తుంది.  తద్వారా ఊపిరి పీల్చుకోటం కష్టం అయి నిమోనియా వస్తుంది.  శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం వస్తుంది.  ఆ రకంగా మనుషుల మరణాలకు కారణం అవుతుంది.  
ఇప్పటి దాకా మనకు ఈ వైరస్ ఏరకంగా హాని చేస్తుందో మాత్రమే తెలుసుకున్నారు.  ఇది వైరస్ కాబట్టి మందుల ద్వారా దీనిని అరికట్ట లేము.  కాకపోతే టీకాల ద్వారా అంటే వాక్సిన్ ద్వారా రోగం రాకుండా ఆపవచ్చు.  కానీ ఇప్పటి వరకు వాక్సిన్ కనుగొన్న సమాచారం లేదు.  కాకపోతే మనకు వున్నా సమాచారం ప్రకారం ఈ రోగానికి వైరస్ కనుగొనటానికి కొంత సమయం పడుతుంది.  మరి అప్పటి దాకా మానవాళి మనుగడ యెట్లా? 
మనం కంటికి కనపడే శత్రువును ఎదుర్కొటం కొంత తేలిక ఎందుకంటే మన శత్రువు మనిషే కానీ వేరే ఏ జంతువూ కాని మనం ఒక్కళ్ళం దానిని లేక అతనిని ఎదుర్కొలేకే పోతే సమిష్టిగా దానిని నియంత్రించ గలం.  కానీ ఇది జీవం ఉందొ లేదో అనే ఒక చిన్న నూక్లిక్ ఆసిడ్ కణం.  ఇది కంటికి కనిపించదు. మనకు సోకింది లేనిది వెంటనే తెలియదు.  అంతే కాదు కొన్ని సందర్భాలలో మానవ శరీరంలో వున్నా ఆ మనిషికి ఎటువంటి అనారోగ్య లక్షణాలు బైటపడవు.  అధవా బైట పడ్డా కనీసం 14 రోజులు పడుతుందని వైదులు చెపుతున్నారు.  కాబట్టి మనం అత్యంత జాగ్రత్త వహించాలి. ఇంకొక విషయం.  ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమే కాక అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి వున్నది.  మనకు తెలియకుండా పాకుతుంది.  కాబట్టి దీనిని గుర్తు పట్టటం ఎవరికి సాధ్యం కాదు.  వైద్య పరీక్షలలో నెగటివ్ వచ్చినా తరువాత పాజిటివ్ వచ్చిన కేసులు వున్నాయి.  కాబట్టి ఈ వ్యాధికి చాలా, చాలా దూరంగా ఉండాలి.  అది యెట్లా అంటే మనం వేరే ఏ మనిషితోటి శారీరక కాంటాక్ట్ కలిగి ఉండరాదు. అంతే కాదు అతని చేతుల ద్వారా లేక ఆటను తుమ్మినా దగ్గినా, చీదినా వుమ్మిన కూడా ఆ తుంపెరలలో ఈ వ్యాధి కణాలు కలిగి ఇతరులకు సంక్రమించే అవకాశం వున్నది.  కాబట్టి ఈ వ్యాధిని అరికట్టడం చాలా కష్టమైన పని. కనుక మనం ఎట్టి పరిస్థితులలోను ఇంటిలోంచి బైటికి రాకూడదు.  బైటి వారిని ఇంట్లోకి రానీయకూడదు. ఇక ఇతరుల ద్వారా ఏ వస్తువైనా తీసుకొన్న వెంటనే మన చేతులను పరిశుభ్రంగా సబ్బుతో, డెట్టాల్తో కడుక్కోవాలి.  చేతులు కడుకొనే ముందర మన చేతులను కళ్లకు, ముక్కుకు, నోటికి తాకించవద్దు. ఇంట్లో వాడే వస్తువులను అంటే పప్పులు, ఉప్పులూ మొదలైనవి సాధ్యమైనంత సమయం ఒక చోట ఉంచి తరువాత వాటిని వాడుకుంటే మనం రక్షింప బడతాము.  ఇక కూరలు మెడకినవి తెచ్చిన వెంటనే శుభ్రంగా నీటిలో 2% potassium paramanganetu  ( Kmno 4)  కలిపి కడగమని మేధావులు చెపుతున్నారు.  కానీ ఆ ద్రావకం మనకు కొట్లలో దొరకదు కాబట్టి నీటిలో ఒకటికి రెండు సార్లు కడుగుతే సరిపోతుంది.  కడిగిన వెంటనే వాడే రెట్లైతే కూర చేసేరప్పుడు స్టౌ మీద మనం వేడి చేస్తాం కాబట్టి ఒక వేళ వైరస్ వున్నా ఆ వేడికి దాని లిపిడ్ పొర కరిగి పోతుంది కాబ్బట్టి అది నిర్వేర్యం అవుతుంది. ఎలాంటి ప్రమాదం ఉండదు.  ఒక వేళ onlinge money transfer చేయ గలిగితే మనం రూపాయి నోట్లను చేతితో తాకవలసిం పని లేదు.  కాకపోతే ఎవ్వరి వద్ద నుండిన రూపాయలు కానీ ఏదైనా కాగితాలని గాని తీసుకోవలసి వస్తే వాటిని తీసుకొని ఒక చోట భద్రపరచి తరువాత వెంటనే చేతులను సబ్బుతో కానీ డెటాల్ తో కానీ శుభ్రంగా కడుగుకొండి.  మీరు తీసుకున్న ఆ రూపాయి నోట్లను ఒక రోజు దాకా ముట్టుకోకండీ.  వాటి మీద ఒకవేళ వైరస్ వున్నా అది కొన్ని గంటలు వుండి నశిస్తుంది కాబట్టి భయ పడనవసరం లేదు. ఇలాటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం కరోనా వైరస్ నుండి రక్షింప పడతాము.  
ముఖ్య మైన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధెర్యం వీడ వద్దు.  కస్టాలు కలకాలం ఉండవ్. మంచిరోజులు వస్తాయ్. 

మందులు లేవు కాబట్టి ఇప్పుడు వున్న పరిస్థితులలో కేవలం ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడటమే.  వ్యాధి సోకకుండా ఉండాలంటే ఈ వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండటమే.  ఎందుకంటే ఈ వ్యాధి కలిగిన రోగి drop lets అంటే వాళ్ళు దగ్గినప్పుడు, లేక తుమ్మినప్పుడు, ఉమ్మి నప్పుడు వారి శరీరం నుండి వెలువడే వైరస్ బైటికి వచ్చి ఇతరులకు శోకగలదు.  కాబట్టి ప్రతి మనిషి వేరే వాళ్లకు దూరంగా ఉండటం మంచిది.  మన ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పకుండ పాటించి ఈ రోగ బారిన పడకుండా మనలను మనం కాపాడుకుందాం. 

ఓం శాంతి శాంతి శాంతిః: