16, ఆగస్టు 2021, సోమవారం

*3rd wave.

 *3rd wave...* With the new virus Covid Delta.. There is no cough, no fever. With a lot of joint pain, headache, neck and upper back pain, general weakness, loss of appetite and pneumonia, it's Covid Delta ! And of course, more virulent and with a higher mortality rate. It takes less time to go to extremes and sometimes without symptoms !! Let's be much more careful ! 


This strain does not live in the naso-pharyngeal region !! Now it directly affects the lungs, which means that the 'windows' (periods of time between getting infected & having pneumonia) are shorter. Several such patients are without fever, without pain, but reports show mild chest pneumonia on their X-rays. Nasal swab tests are very often negative for Covid-19, and there are more and more false negative results from nasopharyngeal tests.  


This means that the virus spreads fast and spreads directly to the lungs, causing acute respiratory stress caused by viral pneumonia. This explains why it has become sharp, more virulent and deadly !! 


Please, let's be more careful, avoid crowded places, keep *1.5 metre distance* even in open spaces, use *double face masks* and *wash our hands often* (and when we cough or sneeze). Please, no hugs, as it is very dangerous at the moment, as everyone is asymptomatic. 


This *"3rd wave"* is much more deadly than the first or second. So we have to be VERY careful and *take all kinds of precautions* .


Please also be an alert communicator for your near and dear ones. Do not keep this information to yourself. Share it as much as you can, especially with family and friends.


Dr P P Venugopal 

Head-Emergency Department, Aster MIMS

Kozhikode

నిర్వాణ షట్కం

నిర్వాణ షట్కం

శ్రీ కైవల్య స్థితిని పొందటం అనేది కేవలం మన హిందూ ధర్మంలోనే సాధ్యం అంటే అందులో లేశమైన అసత్యము లేదు.  అనాదిగా బుద్ది, జ్ఞానం కలిగిన మానవుడు సృష్టికి కారణభూతుడు ఎవరు అనే ప్రశ్నతో తన జీవనాన్ని గడుపుతూ ప్రశ్న సమాధానంగా మన మహర్షులు, ఋషులు అనేక విధాలుగా తప్పస్సులు చేసి వారి అద్వితీయ మహోన్నత శక్తితో మనకు భగవంతుని ఉనికిని సాక్ష్కాత్కరింపచేసారు. మనిషి జీవితము కేవలము ఇతర ప్రాణుల లాగ ఇంద్రియ సుఖాలను పొందటమే కాదు, జీవన సాఫల్యాన్ని అంటే మోక్షాన్ని చేరుకోవాలని సూచించారు. అంతేకాదు మోక్ష సాధన ఎలా చేయాలో కూడా మనకు తెలియ చేశారు. అటువంటి మహర్షుల కోవలో జన్మించిన జగత్ గురువు అది శంకరాచార్య మన జీవితాలకు ఒక దిశ, లక్ష్యాన్ని ఏర్పాటు చేసిన మహానుభావులు.  అది శంకరాచార్యుల మార్గంలో పయనిస్తే తప్పకుండా మోక్షం సిద్దిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. శంకరులు మనకు అందించిన అనేక వేదాంత రచనలలు వున్నాయి.  ప్రతిదీ ఒక ఆణిముత్యం.ఆ కోవకు చెందిన ఒక రచన నిర్వాణ షట్కం కేవలం ఆరు శ్లోకాలలో మోక్ష సారాన్ని మనకు అందించారు ఆరు శ్లోకాలే  నిర్వాణ షట్కం గా పేరుగాంచాయి

నిర్వాణం అనేది వేదాంతపరంగా చాలా గొప్ప భావన. ఈ షట్కమును ప్రతి వక్కరు జాతి,కుల,మత బేధాలు లేకుండా తప్పకుండా కంఠతా చేసి అవగాహన చేసుకొని, తమ జీవితాలకు అనుసంధానించు కోవచ్చు. ఎందుకంటే,ఆత్మతత్త్వం మనుషుల అందరికీ ఒకే విధంగా ఉంటుంది. నిర్వాణం అంటే సూక్ష్మంగా చెప్పాలంటే మోక్షం! ఆరు శ్లోకాలలో ఆత్మ స్వరూపాన్ని గురించి అద్భుతంగా బోధ చేసారు ఆదిశంకరులు ఆరు శ్లోకాలని ఆత్మషట్కం అని కూడా కొందరు అంటారు.షట్కం అంటే ఆరు.  ప్రపంచ వేదాన్త సాహిత్యం మొత్తం మీద ఇలా వేదాంత సారాన్ని ఇంత సరళంగా,క్లుప్తంగా చెప్పిన జ్ఞాని మరెవ్వరూలేరు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ! వేదాంత సారమంతా ఆరు శ్లోకాలలో నిక్షిప్తం చేసిన ఆది శంకరులకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాను

1.మనోబుధ్యహంకార చిత్తాని నాహం

శ్రోత్ర జిహ్వే ఘ్రాణనేత్త్రే

వ్యోమ భూమి ర్న తేజో వాయు:

చిదానంద రూప: శివోహం శివోహం 

అర్ధం-మనస్సు,బుద్ధి,చిత్తము,అహంకారము అనేటటువంటివి ఏమీ నేను కాను. .చెవి,నాలుక,ముక్కు, నేత్రములు మొదలైన ఇంద్రియాలను నేను అసలు కాను.ఆకాశము,భూమి,అగ్ని,వాయువు,నీరు లాంటి పంచభూతాలను నేను కానే కాను . ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.

వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు మనకు భగవంతుని స్వరూపము మన చిత్త ప్రవ్రుత్తి కాదు, అలాగని ఈ పంచభూతాత్మక జగత్తు కాదు అని పేర్కొంటున్నారు.  అంటే ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది. శివుడు సదా ఆనందాన్ని కలిగించే స్వరూపం అని పేర్కొంటున్నారు.  

2. ప్రాణ సంజ్నో వై పంచవాయు:

వా సప్తధాతు ర్న వా పంచకోశ:

వాక్పాణిపాదౌ చోపస్థపాయు:

చిదానంద రూప: శివోహం శివోహం 

అర్ధం-ప్రాణమనే పేరు కలవాడను కాను.ఐదు రకములైన వాయువును కాను, .సప్తధాతువులను కానే కాను.పంచకోశములను కాను.మాట,చేయి,పాదములను కాను.సహాయపడే ఇంద్రియాలను కానే కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను

వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు మనకు భగవంతుడు మనం అనుకునే పంచ ప్రజాలు కాను, అలాగే ఏడు ధాతువులు అంటే 

ధాతువు అంటే దేహమునకు ఆఱంభకమైన రసము లోనగునది, వ్యు. ధీయతే అస్మిన్ - ధా + తున్, కృ.ప్ర., జవసత్వాదులు ఇందుండును. ఇవి సప్తసంఖ్యలో ఇలా చెప్పుదురు

)వసాదులు (వస, అసృక్కు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లములు)

) రోమాది (రోమ, త్వక్, మాంస, అస్థి, స్నాయువు, మజ్జ, ప్రాణములు)

) త్వగాది (1త్వక్, మాంస, రుధిర, మేధో, మజ్జ, అస్థి, శుక్లములు)

()1వస (బొడ్డుక్రిందనుండు ఉల్లి పొర వంటి క్రొవ్వు) 2అసృక్కు (రక్తం) 3మాంసము 4మేధస్సు (మెదడు) 5అస్థి (ఎముక) 6మజ్జ (ఎముకలలోని కొవ్వు) 7శుక్లములు (రేతస్సు)

() 1రోమ (వెంట్రుక) 2త్వక్ (చర్మము) 3మాంస 4అస్థి (ఎముక) 5స్నాయు (సన్నపు నరము) 6మజ్జా (ఎముకలలోని కొవ్వు) 7ప్రాణములు (ప్రాణవాయువు)

() 1త్వక్ (చర్మము) 2మాంస (మాంసము) 3రుధిర (రక్తము) 4మేధో (మెదడు) 5మజ్జ (మూలుగ) 6అస్థి (ఎముకలు) 7శుక్లములు (వీర్యము) కాదని 

అదే విధంగా పంచ కోశాలు అంటే 

1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .

3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .
5. ఆనందమయ కోశం .కానీ కాదని ఆది శంకరులు పేర్కొంటున్నారు.
అదే విధంగా పంచేంద్రియాలు అంటే ఇందులో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు అవి

కర్మేంద్రియ పంచకం: 1) వాక్కు 2) పాణి 3) పాదం 4) పాయువు 5) ఉపస్థ ఇక

జ్ఞానేంద్రియ పంచకం: 1) త్వక్కు = చర్మం 2) చక్షువు = కన్ను 3) రసన = నాలుక 4) శ్రోతం = చెవి 5) ఘ్రాణం = ముక్కు ఇవి ఏవి కూడా నేను కాను అని అంటున్నారు. అయితే మరి ఎవరు అంటే ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది. శివుడు సదా ఆనందాన్ని కలిగించే స్వరూపం అని పేర్కొంటున్నారు.  

3. మే ద్వేషరాగౌ మే లోభమోహౌ

మదోనైవ మే నైవ మాత్సర్యభావ:

ధర్మో చార్ధో కామో మోక్ష:

చిదానంద రూప: శివోహం శివోహం 

అర్ధం-రాగద్వేషాలంటే నాకు తెలియదు.లోభమోహాలు అంటే అసలు తెలియవు. మద మాత్సర్యములు నాకు లేనే లేవు.ధర్మ,అర్ధ,కామ మోక్షములు నాకు అసలు లేనేలేవు. ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను

వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు మనకు భగవంతుడు మానవ స్వభావాలైన్ గుణాలు, అదే విధంగా పురుషార్ధాలు నేను కాను. సదా ఆనంద స్వరూపమైన్ శివుడను నేను అని పేర్కొంటున్నారు. 

4. పుణ్యం పాపం సౌఖ్యం దు:ఖం

మంత్రో తీర్థం వేదా యజ్ఞా:

అహం భోజనం నైవ భోజ్యం భోక్తా

చిదానంద రూప: శివోహం శివోహం 

అర్ధంపుణ్యపాపాలు,సుఖదు:ఖములు నాకు లేనే లేవు.మంత్రంలేదు,క్షేత్రములు లేవు.వేదములు,యజ్ఞములు అసలు లేనే లేవు.నేను భోజనాన్ని కాను,భోజ్యమును కాను,భోక్తను కూడా కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను

వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు మనకు భగవంతుడు మానవుడు ఆచరించే కర్మ ఫలితాలు అంటే పాప పుణ్యాదులు కాదు.  అంతేకాదు వేదవిహిత కర్మలు కానీ మానవుడు భుజించు భోజనము కానీ తినే వాడిని కాను నేను కాదని పేర్కొంటున్నారు.  మరి ఎవరు అంటే సదా ఆనంద స్వరూపమైన్ శివుడను నేను అని పేర్కొంటున్నారు. 

5. మృత్యు ర్న శంకా మే జాతి భేద:

పితో నైవ మే నైవ మాతా జన్మ

బంధు ర్నమిత్రం గురుర్నైవ శిష్య:

చిదానంద రూప: శివోహం శివోహం 

అర్ధంనాకు మరణంలేదు.మృత్యుభయం,సందేహం లేదు.జాతిభేదములు లేనేలేవు.తండ్రిలేడు,తల్లి లేదు.అసలు నాకు పుట్టుకయే లేదు.బంధుమిత్రులు,గురుశిష్యులు లేనేలేరు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను

వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు మనకు భగవంతుడు మానవుడికి కలిగే జనన మరణాదులు లేవంటున్నారు. అందుకే తల్లి దండ్రులు కూడా లేరు అంటున్నారు.  జననము ఉంటేనే కదా తల్లి ఉండేది. జన్మే కానప్పుడు జన్మతో ఏర్పడే సంబంధాలు కూడా తనకు లేవని అంటున్నారు. మరి ఎవరు అంటే సదా ఆనంద స్వరూపమైన్ శివుడను నేను అని పేర్కొంటున్నారు

6.అహం నిర్వికల్పో నిరాకార రూపో

విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణాం

చా సంగతం నైవ ముక్తి ర్నమేయ:

చిదానంద రూప: శివోహం శివోహం 

అర్ధంనాకు ఎటువంటి వికల్పములు,బేధములు నాకు లేవు.నేను,నా ఇంద్రియాలు విశ్వమంతా వ్యాపించినట్లు అనిపించుట వలన నాకు సంబంధించని వస్తువులు కానీ,విషయములు కానీ లేనేలేవు.నేను తెలుసుకొన వలసినది మరియూ పొందవలసిన మోక్షమూ లేదు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.

వివరణ: ఈ శ్లోకంలో ఆది శంకరులు ఇంకా ముందుకు వెళ్లి మనకు మనము కోరుకునే మోక్షం కన్నా భిన్నంగా ఆనంద స్వరూపాన్ని సాక్షాత్కరిస్తున్నారు.  కొన్ని విషయాలు వివరణకు అందవు, కేవలము అనుభవం మీదనే తెలుసుకోగలుగుతాము. ప్రత్యక్షానుభవం కలగాలంటే సాధన చేయాలి.  సాధన ద్వారానే మనిషి తన నిజ స్వరూపమైన ఆత్మ స్థితిని తెలుసుకోగలుగుతాడు. అదే నిత్యానంద స్వరూప స్థితి.  ఆ స్థితికి చేరుకోవటమే ముముక్షువు అంతిమ లక్ష్యం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ. 

 


రసాదిదోషాలు వ్యాధులు

 శరీరంలో రసాదిదోషాలు ప్రకోపించిన ఏయే స్థానాలలో ఏయే వ్యాధులు కలుగునో సంపూర్ణ వివరణ - 


 * రసం దోషం పొందిన కలుగు వ్యాధులు - 


    అన్నం మీద ఇష్టం లేకపోవుట, రుచి తెలియకపోవటం, ఆహారం జీర్ణం కాకపోవడం , శరీరం నొప్పులు , జ్వరం, గుండెపీకుట , వాంతి వచ్చునట్లు ఉండటం, ఆహారం తినకపోయినను తినినట్లు ఉండటం , శరీరం బరువు, హృదయ సంబంధ వ్యాధులు , పాండురోగం , శరీరం కృశించటం, అవయవములు కృశించుట, అకాలంలో శరీరం ముడుతలు పడుట, అకాలం నందు జుట్టు నెరియుట వంటి వ్యాధులు కలుగును.


 * రక్తం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


     కుష్టు , విసర్ప, పిడక ,మశక ,నీలిక , తిలకాలకా, నశ్చ , వ్యంగ అను చర్మవ్యాధులు , పేనుకొరుకుడు, ప్లీహ సంబంధ సమాస్యలు , విద్రది అను వ్రణం , గుల్మవాతం, శోణిత, క్యాన్సర్ , రక్తపిత్తం వంటి వ్యాధులు సంభంవించును.


 * మాంసం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


     ఆసనము , నోరు , నాలిక పుండ్లు పడుట, మాంసం వృద్ధినొందుట, క్యాన్సర్ కణుతులు, మొలలు , కొండనాలుక వాచుట, ఇగుళ్ళు నొప్పులు , గలగండిక ( టాన్సిల్స్ ) , పెదవులు పుండ్లు పడుట, గొంతు చుట్టూ కణుతులు వచ్చుట, గొంతు వాచుట మొదలైన వ్యాధులు సంభంవించును.


 * మేథస్సు అనగా కొవ్వు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


     శరీరంపై గ్రంథులు లేచుట , అండవృద్ధి, గొంతు వ్రణాలు , క్యాన్సర్ , మధుమేహం , శరీరం లావెక్కుట , అధికమైన చెమట మొదలయిన రోగాలు సంభంవించును.


 * ఎముకలు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


      ఎముకపై ఎముక పెరుగుట, దంతముల పై దంతము పెరుగుట, ఎముకలపై సూదులతో పొడిచినట్లు అగుట, పిప్పిగొళ్ళు మొలుచుట మెదలైనవి ఎముకలలో దోషం పొందుట వలన కలుగు వ్యాధులు . 


 * మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


        అజ్ఞానము కలుగుట, మూర్చ వచ్చుట, శరీరం తిరిగినట్లు అనిపించటం, జాయింట్లలో వాపులు , బాధ కలుగుట, కళ్ళకలక మొదలైనవి శరీరంలో మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు . 


 * శుక్రం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


       నపుంసకత్వం ,సంతోషం లేకపోవటం , రోగంతో ఉన్న నపుంసకునకు అల్ప ఆయుర్దాయం , వికృత రూపం కలిగిన సంతానం కలుగుట, గర్భస్రావం మెదలైనవి శరీరంలో శుక్రం దోషం పొందుట వలన కలుగును.


 * మలము దొషం పొందట వలన కలుగు వ్యాధులు - 


       మలము వెలువరించుటకు అవరోధం కలుగుట, లేదా అధికంగా వెలువడుట, సకాలంలో విరేచనం అవ్వకపోవుట, కడుపులో వికారాలు, చర్మవ్యాదులు సంభవించుట జరుగును.


        పైన చెప్పిన విధముగా ఆయా శరీరంలోని ముఖ్య భాగాలకు దోషాలు సంభవించినప్పుడు అయా వ్యాధులు కలుగును.


           నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

శివాలయంలో సోమసూత్ర ప్రదక్షిణ


 ఏ గుడిలోకి వెళ్ళిన సర్వసాధారణంగా ప్రదక్షణలుచేస్తారు కానీ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది .

ఇతర దేవాలయాలలో చేసిన విధంగా *ఈశ్వరుని* దేవాలయంలో ప్రదక్షణ చేయకూడదు శివాలయంలో ఏ విధంగా ప్రదక్షణ చేయాలో

 *లింగపురాణంలో* స్పష్టంగా వివరించింది.

శివాలయంలో చేసే ప్రదక్షిణ 

*చండి ప్రదక్షిణ* లేదా *సోమసూత్ర ప్రదక్షిణ* మని అంటారు


ఈ చండి ప్రదక్షిణ చేయడం వలన ఎలాంటి ఫలితాలుపొందవచ్చు పురాణాల్లో వివరంగా పేర్కొన్నారు లింగపురాణంలో శివాలయంలో చేయవలసిన ప్రదక్షిణ గురించి ఈ విధంగా చెబుతుంది

 శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షణ ప్రారంభించి ధ్వజస్తంభం నుండి చండీశ్వరుని వరకు ప్రదక్షణ చేసి చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుండి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది

వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు.

ఈ విధం చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర పదకిణమని అని పేరు.


 శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలము సోమసూత్రం నుండి పోతుంది అంతేకాక అక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటారు ఈ విధంగా చేసే ఇలా చేసే ప్రదక్షిణం సాధారణ ప్రదక్షణాలు కంటే పదివేల ప్రదక్షణాలుతో సమానమని లింగా పురాణంలో పేర్కొనబడింది


ఇలా మూడు ప్రదక్షణాలు చేయాలి

 అయితే నంది శివునికి మధ్యలో నడవకూడదు ఎందుకంటే సదా ఆయన చూపులు శివుని మీదే ఉంటాయి అలాగే చాలామంది ఏ దేవాలయంలో అయినా 

తెలియక చేసే పొరపాటు గర్భ గుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు అలా చేయకూడదు మరో విషయం ఏమిటంటే....

విగ్రహానికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా ఏ దేవత దర్శనం చేయకూడదు ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి వాటిని వాటి శక్తి మనం భరించలేం కనుక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలి.



సంస్కృత మహాభాగవతం

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*


*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*89.1 (ప్రథమ శ్లోకము)*


*సరస్వత్యాస్తటే రాజన్ ఋషయః సత్రమాసత|*


*వితర్కః సమభూత్తేషాం త్రిష్వధీశేషు కో మహాన్॥12051॥*


*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! ఒకానొకప్పుడు మహామునులు పవిత్రమైన సరస్వతీ నదీ తీరమునందు యజ్ఞమును నిర్వహించుటకై చేరిరి. 'త్రిమూర్తులలో (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో) ఎవరు శ్రేష్ఠులు?' అని వారిలో వారికి చర్చ ఏర్పడెను.


*89.2 (రెండవ శ్లోకము)*


*తస్య జిజ్ఞాసయా తే వై భృగుం బ్రహ్మసుతం నృప|*


*తజ్జ్ఞప్త్యై ప్రేషయామాసుః సోఽభ్యగాద్ బ్రహ్మణః సభామ్॥12052॥*


మహారాజా! ఆ విషయమును తెలిసికొనగోరి వారు బ్రహ్మదేవుని కుమారుడైన భృగుమహర్షిని త్రిమూర్తులకడకు పంపిరి. అంతట భృగుమహాముని మొదట బ్రహ్మదేవుని సభకు వెళ్ళెను.


*89.3 (మూడవ శ్లోకము)*


*న తస్మై ప్రహ్వణం స్తోత్రం చక్రే సత్త్వపరీక్షయా|*


*తస్మై చుక్రోధ భగవాన్ ప్రజ్వలన్ స్వేన తేజసా॥12053॥*


*89.4 (నాలుగవ శ్లోకము)*


*స ఆత్మన్యుత్థితం మన్యుమాత్మజాయాత్మనా ప్రభుః|*


*అశీశమద్యథా వహ్నిం స్వయోన్యా వారిణాఽఽత్మభూః॥12054॥*


బ్రహ్మదేవుని ప్రభావమును తెలిసికొనుటకై ఆ మహర్షి చతుర్ముఖునకు నమస్కరింపలేదు. స్తుతింపలేదు. ఆ కారణముగా బ్రహ్మదేవుడు ఎంతయు కుపితుడై ఆ మహామునిమీద మండిపడసాగెను. అగ్నినుండి పుట్టిన జలముతో అగ్నిని చల్లార్చబడినట్లు ఆ బ్రహ్మదేవుడు తన కుమారుడైన భృగువుపై తనలో పెల్లుబికిన కోపమును వివేకబుద్ధితో (శాంతస్వభావముతో) ఉపశమింపజేసెను.


*ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోఽన్నమ్* (ఉపనిషద్వచనము)


*89.5 (ఐదవ శ్లోకము)*


*తతః కైలాసమగమత్స తం దేవో మహేశ్వరః|*


*పరిరబ్ధుం సమారేభ ఉత్థాయ భ్రాతరం ముదా॥12055॥*


పిదప ఆ భృగుమహర్షి కైలాసమునకు వెళ్ళెను. మహాదేవుడైన శంకరుడు తన సోదరుడైన ఆ మహామునియొక్క రాకను గమనించి, ఆసనమునుండి లేచి ఆయనను ఆత్మీయతతో (సంతోషముతో) తన అక్కున జేర్చుకొనుటకై సిద్ధపడెను.


*89.6 (ఆరవ శ్లోకము)*


*నైచ్ఛత్త్వమస్యుత్పథగ ఇతి దేవశ్చుకోప హ|*


*శూలముద్యమ్య తం హంతుమారేభే తిగ్మలోచనః॥12056॥*


కానీ, భృగువు 'నీవు లోకమర్యాదలను, వేదమార్గములను ఉల్లంఘించినవాడవు' అని పలుకుచు ఆ పరమశివుని ఆలింగనమును స్వీకరింపకుండెను. అంతట మహేశ్వరుడు క్రోధముతో ప్రళయాగ్నివలె ఉగ్రుడై, త్రిశూలమును చేబూని, అతనిని చంపుటకు సిద్ధమయ్యెను.


*89.7 (ఏడవ శ్లోకము)*


*పతిత్వా పాదయోర్దేవీ సాంత్వయామాస తం గిరా|*


*అథో జగామ వైకుంఠం యత్ర దేవో జనార్దనః॥12057॥*


అప్పుడు పార్వతీదేవి తన పతిదేవుని పాదములపై వ్రాలి, మృదుమధుర (సాంత్వన) వచనములతో ఆ శంకరుని శాంతింపజేసెను. అంతట ఆ మునిశ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుని నివాసమగు వైకుంఠమునకు చేరెను.


*89.8 (ఎనిమిదవ శ్లోకము)*


*శయానం శ్రియ ఉత్సంగే పదా వక్షస్యతాడయత్|*


*తత ఉత్థాయ భగవాన్ సహ లక్ష్మ్యా సతాం గతిః॥12058॥*


*89.9 (తొమ్మిదవ శ్లోకము)*


*స్వతల్పాదవరుహ్యాథ ననామ శిరసా మునిమ్|*


*ఆహ తే స్వాగతం బ్రహ్మన్ నిషీదాత్రాసనే క్షణమ్|*


*అజానతామాగతాన్ వః క్షంతుమర్హథ నః ప్రభో॥12059॥*


అప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవియొక్క ఒడిలో శిరస్సును ఉంచి పరుండియుండెను. భృగుమహర్షి తన పాదముతో వైకుంఠుని వక్షస్థలమున తన్నెను. అంతట భక్తవత్సలుడైన (సత్పురుషులకు ఆశ్రయుడైన) విష్ణుభగవానుడు లక్ష్మీదేవితో సహా లేచి కూర్చొనెను. పిమ్మట ఆ ప్రభువు తన శయ్యనుండి దిగి, ఆ మునికి శిరసా ప్రణమిల్లి ఇట్లు పలికెను- "బ్రాహ్మణోత్తమా! నీకు స్వాగతము. ఒక్కక్షణము ఈ ఆసనమునందు విశ్రమింపుము. మహాత్మా నీ శుభాగమనమును ఎఱుంగక తగు విధముగా అర్ఘ్యపాద్యాదులను నెఱపకుంటిని. నన్ను క్షమింపుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*970వ నామ మంత్రము* 16.8.2021


*ఓం సువాసిన్యై నమః*


నిత్య సుమంగళియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సువాసినీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సువాసిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులు ఆ తల్లి కరుణచే శుభప్రదము, సుఖప్రదము, శాంతిప్రదమైన జీవనమును కొనసాగించుదురు.


పరమేశ్వరి సర్వమంగళ, నిత్యయౌవ్వని. నిత్యసుమంగళి. నిండు ముత్తైదువుగా ఆ తల్లి పచ్చని పసుపురంగు కూడిన ముఖంపై, సిందూరవర్ణభరితమైన కుంకుమతో *(పసుపుకుంకుమలతో)* , గలగలలాడుచూ మంగళరవములు వినిపించు గాజులతో *(గాజులు)*, మంగళప్రదమైస కాలి *మట్టెలు* వాటి సవ్వడితో, శుభప్రదమైన కాంతులు విరజిమ్మే *మంగళసూత్రము* లతో, ధగధగకాంతిపుంజములీను గళసీమయందలంకరింపబడిన *నల్లపూసల* తో సౌభాగ్యవతిగా, నిత్యసుమంగళిగా దర్శనమిచ్చు అమ్మవారు ముత్తైదువులలో తానొక ముత్తైదువ. అందుకే ఆ అమ్మ *సువాసినీ* యని అనబడినది.


పసుపు కుంకుమలు, గాజులు, మట్టెలు, మంగళసూత్రాలు, నల్లపూసలు సౌభాగ్యాభరణములు. ఇవి ధరించిన స్త్రీమూర్తి *సువాసిని* యని అనబడుతుంది. అమ్మవారు నిత్యసుమంగళి. అమ్మవారు ఎన్ని అవతారములు ధరించినను, పరమశివుడే ఆమె భర్త. పరమశివుడు మృత్యువుకే మృత్యువు. ఆయనను ఎదిరించు తాహతు మృత్యువుకు కూడా లేదు. అందుకే ఆయన మృత్యుంజయుడు. మృత్యుంజయుడే తన భర్త అయిన పరమేశ్వరి *సువాసినీ* యని అనబడినది.


అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం సువాసిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

గురుకులాలు

 * ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811 లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. *


మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో, గురుకుల అభ్యాసం ఎలా ముగిసింది తెలుసుకుందాం.

గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో) ఈ క్రింది విషయాలను బోధించారు.

01 అగ్ని విద్య (లోహశాస్త్రం)

02 వాయు విద్య (గాలి)

03 జల్ విద్య (నీరు)

04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)

05 పృథ్వి విద్య (పర్యావరణం)

06 సూర్య విద్య (సౌర అధ్యయనం)

07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)

08 మేఘ విద్య (వాతావరణ సూచన)

09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)

10 దిన్ రాత్ విద్య.

12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)

13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)

14 భుగోళ విద్య (భౌగోళిక)

15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)

16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)

17 రత్నాలు మరియు లోహాలు 

18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)

19 ప్రకాశ విద్య (శక్తి)

20 సంచార విద్య (కమ్యూనికేషన్)

21 విమాన విద్య (విమానం)

22 జలయన్ విద్య (నీటి నాళాలు)

23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)

24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)

25 యజ్ఞ విద్య

*ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి మాట్లాడదాం!*

26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)

27 కృషి విద్య (వ్యవసాయం)

28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)

29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)

30 యాన విద్య (మెకానిక్స్)

32 వాహనాల రూపకల్పన

33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)

36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)

37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)

38 తక్కలు

39 రంగ్ విద్యా (డైయింగ్)

40 ఖాట్వాకర్

41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)

42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)

43 ఖానా బనానే కి విద్యా (వంట)

44 వాహన్ విద్యా (డ్రైవింగ్)

45 జలమార్గాల నిర్వహణ

46 సూచికలు (డేటా ఎంట్రీ)

47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)

48 బాగ్వానీ (హార్టికల్చర్)

49 వాన్ విద్యా (అటవీ)

50 సహోగీ ( పారామెడిక్స్).

ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత భవిష్యత్తు ఇప్పటి కీ నాశనం అవుతోంది.


భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?

కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.


మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.


భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ *దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ* పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.

మెకాలే ఇలా చెప్పాడు - ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి. అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థ కు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.

1850 వరకు భారతదేశంలో '7 లక్ష 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ 'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి. గురుకులములు ప్రజలు మరియు రాజు చేత కలిపి నడుపుబడేవి.

విద్యను ఉచితంగా ఇచ్చారు.

గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!

మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలం తో నిండి ఉంటుంది మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు". ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువ గా భావిస్తున్నాము. 

మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.


 మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని తిరిగి పొందే సమయం ఇది.


🇮🇳 *జైహింద్ 🇮🇳 🤝

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 20

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 20       

                           SLOKAM : 20

                                                

बद्धेनाञ्जलिना नतेन शिरसा गात्रैः 

                                   सरोमोद्गमैः

कण्ठेन स्वरगद्गदेन 

                  नयनेनोद्गीर्णबाष्पाम्बुना ।

नित्यं त्वच्चरणारविन्दयुगल 

                        ध्यानामृतास्वादिनां

अस्माकं सरसीरुहाक्ष सततं सम्पद्यतां 

                            जीवितम् ॥ २०॥  


బద్ధేనాంజలినా నతేన శిరసా 

                    గాత్రైస్సరోమోద్గమై:

కంఠేన స్వరగద్గదేన నయనే 

                   నోద్గీర్ణ బాష్పాంబునా I            

నిత్యం త్వచ్చరణారవింద యుగళ    

             ధ్యానామృతా స్వాదినాం 

అస్మాకం సరసీరుహాక్ష సతతం 

         సంపద్యతాం జీవితమ్ ॥ 20  



ఓ పుండరీకాక్షా! 

    మేము ఎల్లప్పుడూ మనస్సుతో నీ పాదారవిందాలను ధ్యానిస్తూ, 

    ఆనందం అనుభవిస్తూ, 

    చేతులు జోడించి,శిరస్సు వంచి నమస్కారం చేసేటట్లును, 

    కంఠం గద్గదమయ్యేటట్లును,    

   శరీరం పులకాంకితమై ఉండేటట్లును, 

   కన్నులు ఆనందబాష్పాలతో నిండేటట్లును, 

   మేము జీవించి ఉన్నంత కాలం ఎడతెగక ఇలానే జరిగేటట్లుగా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను.    


O lotus-eyed Lord!    

     please sustain our lives as we constantly relish the nectar of meditating on Your lotus feet, with 

  - our palms prayerfully joined, 

  - our heads bowed down,  

  - our bodily hair standing up in jubilation, 

  - our voices choked with emotion, and 

  - our eyes flowing with tears.


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సలహా..సంతానం..*


శ్రీ మీరాశెట్టి గారు నిరంతరమూ శ్రీ స్వామివారి మందిర అభివృద్ధి గురించే ఆలోచించేవారు..ఆ విషయమై తరచూ మొగలిచెర్ల కు వచ్చి మా తల్లిదండ్రులైన శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్లతో చర్చిస్తూ వుండేవారు..ఆ క్రమం లోనే వారితో నాకు చనువు బాగా ఏర్పడింది..


వింజమూరు లో వుండే శ్రీ గంగిశెట్టి కామేశ్వరరావు కు వివాహం జరిగి ఏడెనిమిది సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలుగలేదు..అతనూ శ్రీ మీరాశెట్టి గారికి దగ్గర బంధువేనన్న సంగతి నిన్ననే మనం చదువుకొని వున్నాము..ఒకసారి మీరాశెట్టి గారు, కామేశ్వరరావు దంపతులు అందరూ కలిసి శివరాత్రి పర్వదినానికి ఒక రోజు ముందుగా మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి రావడం జరిగింది..ప్రతి శివరాత్రి రోజు, శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉన్న ఆర్యవైశ్య సత్రం తరఫున అన్నదానం చేయడం పరిపాటి..ఆ సేవా కార్యక్రమంలో అందరినీ మీరాశెట్టి గారు భాగస్వామ్యులుగా చేర్చేవారు..ఆ పనుల నిమిత్తమే కామేశ్వరరావు దంపతులూ వచ్చారు..


ఆరోజు మధ్యాహ్నం.. ఆర్యవైశ్య సత్రం లో అందరూ కూర్చుని ఉండగా..కామేశ్వర రావు తో మీరాశెట్టి గారు, " సంతానం కలగాలని శ్రీ దత్తాత్రేయస్వామి వారిని వేడుకోరా..ఆయన తప్పక కరుణిస్తాడు..నీకు త్వరలో పిల్లలు పుడతారు.." అని చెప్పారు..

"ఆ యోగం నాకు లేదేమో పెదనాయనా.." అన్నాడు కామేశ్వర రావు.."అట్లా అనవద్దు..మీ దంపతులు ఇంతవరకూ ఈ స్వామిని వేడుకోలేదు..ఇప్పుడు మనస్ఫూర్తిగా వేడుకోండి.. తప్పక సంతానం కలుగుతుంది..నా మాట నమ్ము.." అని గట్టిగా చెప్పారు..ఈ సంభాషణ అంతా వింటున్న శ్రీ చెక్కా కేశవులు గారు కూడా..కామేశ్వర రావు తో స్వామివారిని వేడుకోమని సలహా ఇచ్చారు..కామేశ్వర రావు తన భార్య వైపు చూసాడు..ఆవిడ ఏదో పని ఉన్నదానిలా చటుక్కున లేచి, బైటకు వెళ్ళిపోయింది..


కొద్దిసేపటికి, కొంతమంది ఆడవాళ్లు కామేశ్వర రావు వద్దకు వచ్చి.."అయ్యా..మీ భార్య స్వామివారి మందిరం లో పెద్ద పెద్ద కేకలు పెడుతున్నది.. జుట్టు విరబోసుకొని మందిరం అంతా తిరుగుతున్నది..నువ్వు వెంటనే మందిరం లోకి వెళ్ళు.." అని చెప్పారు..కామేశ్వర రావు పరుగులాటి నడకతో శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..అతను వచ్చేసరికి, ఒక పెద్ద బండరాయిని నెత్తిన పెట్టుకొని, కామేశ్వర రావు భార్య..మందిరం చుట్టూ పరుగెడుతూ.."దత్తాత్రేయా..నేను ఉండలేను..నేను ఈ అమ్మాయిని వదిలి పోతానూ.." అంటూ కేకలు వేస్తోంది..కామేశ్వర రావు కేమీ అర్ధం కాలేదు..తన భార్య ఎన్నడూ ఇటువంటి విపరీత ప్రవర్తన తో వుండలేదు..ఈరోజు ఏమి జరిగింది?..ఉన్నట్టుండి ఈ ఉపద్రవం ఏమిటి?..సంతానం కోసం, తామిద్దరూ శ్రీ స్వామివారిని మొక్కుకోవాలని అనుకుంటుంటే..ఈలోపల ఈవిడ ఈవిధంగా మారిపోయిందేమిటి?..అని ఆలోచించ సాగాడు..మరి కొద్దిసేపటికే ఆమె లో ఉన్న ఉన్మాదం తగ్గి, మామూలు మనిషిగా మారింది..భార్యను తీసుకొని, శ్రీ స్వామివారి సమాధి వద్దకు వచ్చి.."స్వామీ..నా భార్య లోని ఈ జబ్బును తగ్గించు తండ్రీ..ఆ తరువాత..మేమిద్దరమూ నీ దగ్గరకు వచ్చి..సంతానం గురించి మ్రొక్కుకుంటాము.." అని వేడుకున్నాడు..


"ఒరే కామేశ్వర రావూ..ఈరోజు జరిగింది నీ మంచికేరా.. ఆ అమ్మాయిలో ఉన్న దుష్ట గ్రహం..ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోయింది..ఇంక నువ్వేమీ బాధపడనక్కరలేదు..ఇద్దరూ తలారా స్నానం చేసి..మీకు సంతానం కలిగితే..నీకు తోచినంత హుండీలో వేస్తానని మొక్కుకో..ఖచ్చితంగా పిల్లలు పుడతారు.." అని మీరాశెట్టి గారు చెప్పారు..


కామేశ్వర రావు దంపతులు మీరాశెట్టి గారు చెప్పినట్లే చేశారు..తమకు సంతానం కలిగితే..సమాధి వద్ద మీద పదివేల రూపాయలు పెడతానని కామేశ్వర రావు మ్రొక్కుకున్నాడు..మరో మూడు నెలల కల్లా కామేశ్వర రావు భార్య నెల తప్పింది..మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది..అమ్మాయికి "నాగ దత్త కల్యాణి" అని పేరు పెట్టుకున్నారు..ఆ అమ్మాయి వివాహం తాలూకు శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన కామేశ్వర రావు ఆనాటి అనుభవాన్ని మాతో మరొక్కసారి పంచుకున్నాడు..తమకు రెండవ సంతానం గా మొగపిల్లవాడు కావాలని శ్రీ స్వామివారినే వేడుకున్నామని..ఆ స్వామివారు ఆ కోరిక కూడా తీర్చాడని..అత్యంత భక్తి తో ఆ దంపతులు చెప్పుకొచ్చారు..మీరాశెట్టి గారిచ్చిన సలహా తమ జీవితం లో ఎంతో విలువైనది అని అంటుంటారు కామేశ్వర రావు దంపతులు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

ప్రశ్న పత్రం సంఖ్య: 19

 ప్రశ్న పత్రం సంఖ్య: 19                కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింది  ప్రశ్నలకు జవాబులు తెలుపండి   

1) శ్రీకృష్ణదేవరాయలఆస్థానంలో వున్న "అష్టదిగ్గజాల" పేర్లు ఏమిటి 

2)సంస్కృతంలో  పంచ కావ్యాలు అని వేటిని అంటారు. 

3) క్రింది ఖాళీలను పూరించండి 

_________నాస్తి దుర్భిక్షం!

జపతో నాస్తి ______ !
మౌనేన ________ నాస్తి!

నాస్తి _________భయః!! 

4)  సాధారణంగా ఒక పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి. కానీ కొన్ని దేశీయ ఛందస్సులో చాలా పాదాలు ఉండవచ్చు ఆ ఛందస్సులు తెలపండి. 

5) అతిశయోక్తి అలంకారం  అంటే ఏమిటి. 

6)"తెగేదాకా లాగకూడదు" అని ఏ సందర్భంలో ఉపోయోగిస్తారు.  

7)శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంధము ఏమిటి. 

8) తెలుగు పంచ కావ్యాలు ఏవి 

9)  " ఏడ్చే దాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు" అని ఎప్పుడు ఉపయోగిస్తారు 

10) త్యాగరాజు వ్రాసిన పంచ రత్న కీర్తనలు ఏవి 

11) మన దేశంలో ఎన్ని రకాల సంగీత పద్ధతులు వున్నాయి 

12) లంకను కాపలా కాసేది ఎవరు. 

13) వసుదేముడు ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు. 

14) హనుమంతుడు ఎన్ని వ్యాకరణల పండితుడు 

15) "కుమారసంభవం" వ్రాసిన కవి ఎవరు 

16) పంచ భీములు అని ఎవరిని అంటారు. 

17) కౌరవుల సోదరి పేరు ఏమిటి. 

18) రామాయణంలో విమానం ఎవరికి వున్నదని పేర్కొన్నారు ఆ విమానం పేరు ఏమి

19) "అటజని కాంచె భూమిసురు డంబర చుంబి" ఏ గ్రంధములోనిది కవి ఎవరు. 

20) ఉత్తర భర్త పేరు ఏమిటి.