9, అక్టోబర్ 2024, బుధవారం

హైందవం వర్ధిల్లాలి 25*

 *హైందవం వర్ధిల్లాలి 25*


సభ్యులకు నమస్కారములు.


*ధర్మప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, హిందూ నాయకులు హైందవ జాగ్రుతికై ప్రజలలోకి రావాలి* vi) :- తెలుగునాట వేద, స్మార్త, వైష్ణవ, శైవ విద్వన్మూర్తులు, పండితులు, ధార్మిక వరేణ్య బిరుదాంకితులు, స్వర్ణ కంకణధారులు, తత్వవేత్తలు, జీయరుస్వాములు, ఎకరాలకొద్దీ మాతృ భూమిని పొందిన ఆశ్రమాధిపతులు, మహా ఘనతవహించిన పీఠాధి పతులు ఇంకా ఎందరెందరో మహానుభావులు. దేశం యావత్తు గమనిస్తే ఇంకా ఎందరెందరో గొప్ప వారు. స్వదేశీ పలుకుబడి కలవారితో బాటు అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన న్యాయవాదులు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రముఖులు, విదేశీ దౌత్యవేత్తలు వీరందరూ భారతీయులే గదా. భారత దేశ మూల మరియు అనాదిగా నెలకొని ఉన్న హిందూ/సనాతన ధర్మానికి, సంస్కృతి, సంప్రదాయాలతో బాటు జనులకు గూడా హాని జరుగుచున్నపుడు, వీరందరూ కేంద్ర మరియు రాష్ర్ట ప్రభుత్వాలను, వివిధ రాజకీయ నాయకులను కలసి పరిస్థితులను సరిదిద్దాలి గదా. 


*ధర్మ సంస్థాపనార్థం మరియు అధర్మమునకు అడ్డుకట్టు వేయుటకు మళ్ళీ శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారే దివి నుండి భువికి రావల్సిందేనా*. 


భారతదేశ ప్రజలు భగవత్ చింతన లేనివారా, అధార్మికులా అంటే కానే కారు అని ఘంటాపథంగా చెప్పవచ్చును. రుజువులు ఎన్నెన్నో. అసంఖ్యాకంగా దేవాలయాలు దర్శనమిస్తున్నాయి, ఇంకా నిర్మించబడుచున్నాయి. దైనందిక పూజలతో సహా ప్రజలు శ్రీ అయ్యప్ప స్వామి మాలలు ధరిస్తున్నారు, మరికొందరు శ్రీ ఆంజనేయ స్వామి మరియు దుర్గా దేవి మండల దీక్షలు చేపడుతున్నారు, ఇవన్నీటితో బాటు వీలుని బట్టి, అవసరమైనప్పుడల్లా ప్రజలు హోమాలు, యాగాలు, యజ్ఞాలు, శాక్తేయ పూజలు, గణేష్ మరియు దేవి నవ రాత్రులు నిర్వహిస్తున్నారు. *ఇవన్నిటి ఉద్దేశ్టమేమిటి, ప్రజలు భక్తులుగా మారి ఏమి నేర్చుకుంటున్నారు*. 


హిందువు అను పదమునకు ఉన్న నానార్థాలలో ఒక అర్థము గురించి పరిశీలిద్దాము. *హింసామ్ దూషయతి ఖండయితి హిందు*. అర్థం:- హింస మరియు దూషణ ఎక్కడ ఉంటుందో వాటిని ఖండించే వాడే హిందువు. *హిందువులుగా మన స్వభావాన్ని మనధర్మాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నాము*. మరింత విపులంగా చెప్పాలంటే *మన జాతిపై పరజాతి వారి హింసాత్మక చర్యలను మాత్రమే ఖండించమని* అర్థము. హింసా చర్యలను ఖండించడానికైనా ప్రతి పౌరుడు ముందుండాలి. హిందూ సమాజ రక్షణకు చుక్కానిగా నిల్చి, జనుల రక్షణ చేపట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ ఉదయించాలా, అంతే సామర్థ్యంతో హిందూ ధర్మ వ్యతిరేకులను నిరోధించిన మహారాజ్ రాణా ప్రతాప్ సింగ్ అరుదెంచాలా. ధర్మ వ్యతిరేకులను ఎదిరించండి అని కురుక్షేత్రంలో నుడివిన శ్రీ కృష్ణ పరమాత్మ మళ్ళీ అవతరించాలా. ఇవన్నిటికి సమాధానం, ప్రజలు, పెద్దలు మరియు మేధావులే సమాధానం చెప్పాలి. *స్వధర్మ రక్షణ, ప్రోత్సాహం నేరం కాదు, కాదు, కాదు*.


హైందవ ధర్మ ప్రచారం కొనసాగిస్తున్న పెద్దలందరికి సవినయ విజ్ఞప్తి. మహానుభావులారా ముఖాముఖి గాని, బహిరంగ సభలలో గాని, వీడియోలలో, Tv మరియు రేడియోలలో గాని మీరు ఎక్కడ ఏ గీతోపదేశము, ధర్మోపదేశము చేసినా, సంప్రదాయ భజనలు గావించినా దయచేసి అరుదెంచిన లేక మీ కార్యక్రమాలను వీక్షిస్తున్న భక్తులకు, శ్రోతలకు *ప్రస్తుతం దేశానికి, ధర్మానికి, సంస్కృతికి, సంప్రదాయాలకు వాటిల్లుతున్న హాని గురించి విశదీకరించి, హిందు సమాజ జాగ్రూతికై*, తప్పనిసరిగా సమయము కేటాయించగలరు. *వినే ప్రజలు క్షేమంగా ఉంటేనే చెప్పే మహానుభావుల ఉనికి మరియు అస్థిత్వము*. ఇది పరమ సత్యము. అన్యధా భావించకండి.


*కావున, మన హిందూ ధర్మానికి సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*


ధన్యవాదములు

*(సశేషం)*

శారదా దేవి దివ్య స్వరూపం!

 శు  భో   ద  యం🙏


శారదా దేవి దివ్య స్వరూపం!  


ఉ:  "  అంబ!  నవాంబుజోత్పల  కరాంబుజ  శారద!  చంద్ర  చంద్రికా


          డంబర  చారుమూర్తి; !  ప్రకట స్ఫుట భూషణ  రత్నదీపికా 

          

           చుంబిత  దిగ్విభాగ , శ్రుతి  సూక్తి  వివిక్త  నిజప్రభావ,   భా

            

           వాంబర  వీధి   విశ్రుత  విహారిణి!  నన్ గృపజూడు  భారతీ!


                 హరివంశము- అవతారిక - ఎఱ్ఱాప్రగ్గడ ;


(నవాంబుజోజ్జ్వలయనిపాఠాంతరము)


మాత  సరస్వతిని  కవులందరూ  స్మరించారు. కానీ , కవిత్రయంలో  తృతీయుడు  ఎఱ్ఱన  ప్రస్తుతించిన  తీరు అబ్బురమైనది.

ఆమూర్తిలోని  అంతస్ఫూర్తి  ,నింత గొప్పగా  ఆవిష్కరించిన  కవి  మరియొకఁడు  కానరాడు. బాహిర స్వరూపము నొక్కింత తడవుచు ఆతల్లి యక్షరామృత  వితరణా శీలమును  యెఱ్ఱన  యీపద్యమున  రూపు గట్టించినాడు.

    

         కఠినపదములకు అర్ధము:- అంబుజము-పద్మము; ఉత్పలము-కలువ; చంద్రిక-వెన్నెల;  చారు మూర్తి-  మనోహరాకారము కలది; రత్నదీపిక- రత్న దీపము; చుంబిత -ముద్దిడుకొను ; శ్రుతి-వేదము; సూక్తి-మంచిమాట;

వివిక్త- విశ్లేషణ;( కాళీప్రదేశమని మరొక అర్ధముంది) భావాంబరము- మనస్సనే యాకాశము; విశ్రుత విహారిణి: ప్రసిధ్ధినొందిన విహారముగలది;


           అప్పుడే వికసించిన పద్మములను,కలువలను బోలిన కరములు గలదానా! చంద్రుని వెన్నెలను బోలిన  మనోహర స్వరూపిణీ! ఆభరణములందు గల దీప సదృశములగు రత్నకాంతులను దిగంత పరివ్యాప్త మొనరించుదానా! వేదవాక్యములయందు  నిరూపింపబడు మహా ప్రభావ శాలినీ!  హృదయాకాశమునందు  స్వేఛ్ఛావిహారమొనరించు  మాతా! 

భారతీ!  నన్ను  దయజూడుము;  అని భావము.


                    ఈపద్యంలో 1  నవాంబుజోత్పల కరాంబుజ!


                                        2భూషణ  రత్నదీపికా చుంబిత  దిగ్విభాగ!

   

                                        3 శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ!

       

                                        4 భావాంబర వీధి విశ్రుత విహారిణి!                      అనే యీనాల్గు  విషయాలూ  విశ్లేషింప దగినవి.

మొదటిది: ఆమె కరములు  అంబుజములట! అంబుజములు రెండురకములు .పగటికి తామరలు పద్మములు.రేయికి కలువలు. ఆమెహస్తము లీ  రెంటిని బోలి యుండునట. రేయింబవళ్ళు  ఆమెచేతులకు పని. యేమిపని? జ్ఙానామృతమును పంచుపని.అక్షరామృతమునందించుపని, పద్మమునందు మకరంద ముండును.మాత సరస్వతి హస్తమున జ్ఙానామృతముండును. దానినామె నారాధించువారికి  రేయింబవళ్ళు వితరణ మొనర్చును. ఆహా! ఎఱ్ఱనగారి యూహ యెంత గొప్పది!!!


               ఇఁక రెండవ యంశము: ఆమెభూషణములు  రత్నదీపములట!ఔను రత్నదీపికలే! శ్రుతులే యామెకు నిజభూషణములు. వాటిప్రభావము విశ్వ వ్యాప్తమేగదా! భారతీయ జ్ఙాన వికాసమునకు వాని వెలుగులే  యాధారము.


            3శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ! వేద సూక్తుల యందు ఆమెప్రభావము  అడుగడుగునా ప్రస్ఫుట మగుట మనకు విదితమే"  అక్షరం పరమంపదం"- ఆఅక్షరమైన పరంబ్రహ్మ  స్వరూపావిష్కరణకు  అక్షరం అవసరంగదా! ఆఅక్షరమే ఆమెరూపము, ఆమెస్వభావము, ఆమెప్రభావము. 


                        4  భావాంబర వీధి  విశ్రుత విహారిణి! హృదయాకాంశంలో  తిరుగు లేని సంచారంచేసే తల్లి.ఆమాట నిజమే!

కానీ, భావాంబరమని  " అంబర"- శబ్దాన్ని యెఱ్ఱన ప్రయోగించుటలో  నేదో ప్రత్యేకత యున్నది. అంబరము అనుపదమునకు 

ఆకాశము  అను నర్ధమేగాక  వస్త్రము  అను నర్ధముకూడా ఉన్నది. హృదయమనే కేన్వాసుపై  చెరగని ముద్రవైచుకొని  యెటుబోయిన నటువచ్చు(మూవీ) స్వరూపముగలదట! ఈచిత్ర మెంత చిత్రము!


                               మనము  మరియొక దాని నుపేక్షించితిమి ." శారద  చంద్ర చంద్రికా డంబర  చారుమూర్తి" శరత్కాలమునందలి చంద్రుని వెన్నెలనుదలపించు చల్లని మనోహర రూపిణి! మాత  సరస్వతి  చల్లనిది. ఆమెకరుణ సూర్యాతపమువంటిదికాదు, చంద్రాతపమును బోలి చల్ల నిది. వెన్నెలను జ్ఙానముగా పెద్దల సూచన! అందుచేత చల్లగ మెల్లగ జ్ఙాన సంపదను యిచ్చుతల్లీ!యని కవియను చున్నాడు.


                              ఇటులీ పద్యము  అనవద్యము  హృద్యమునై  చదువుల తల్లి యంతః సత్త్వమును వ్యక్తమొనర్చు

పరమామ్నాయ  సదృశమై  యొప్పారు చున్నది.


                                                                  స్వస్తి! 🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👏🌷🌷🌷🌷🌷👏

40. " మహాదర్శనము

 40. " మహాదర్శనము " ---నలభైయవ భాగము --జ్యోతిర్దర్శనము


40. నలభైయవ భాగము-- జ్యోతిర్దర్శనము



        యాజ్ఞవల్క్యునికి ఇంతవరకూ లేని ధర్మ సంకటమొకటి ప్రాప్తమైంది . ఇంతవరకూ తన బ్రహ్మ కర్మలు ముగిసిన తర్వాత జపమునకు కూర్చొనేవాడు . 


          ఒక్కో దినము అప్రతిమమైన తేజోమండలము ఒకటి కనిపించేది . అది సర్వ దిక్కులనూ తన వెలుగుతో నింపుతూ అది ఉన్నంత వరకూ తేజస్సు తప్ప ఇంకేదీ కనిపించేది కాదు . అది చక్షుర్గోచరమగు ప్రకాశమా ? లేక అలౌకికమైన ఇంకేదైనా ప్రకాశమా -అనునది తెలుసుకోవలెనని కుతూహలము కలిగేది . అయితే , ఆ మండలము ఉన్నపుడు మాత్రము ఆ కుతూహలమునకు అవకాశమే లేదు . మనో బుద్ధులు ఆ మండలమును తప్ప ఇతరమైన దేనినీ గమనించవు . ఆ తేజస్సు ఎదురుగా ఉన్నపుడు చెవులు బాహ్య శబ్దములను వినుచుండుట లేదు . ఊపిరాడుచుండెడిదో లేదో , అదికూడా తెలియదు . స్పర్శ యైతే ఎక్కడికో పారిపోయి ఉండెడిది . ఆ తేజస్సు లేనపుడే ఈ కుతూహలము కలిగేది , కలిగినపుడు మనసు ," ఇది జాగ్రత్స్వప్నము అయిఉండాలి . మెలకువ లో నున్నట్లే బాహ్య స్మృతి ఉన్నది . కలలో వలె జ్ఞానేంద్రియముల కర్మ నడచుచున్నది . " అంటుంది . ఆలోచనలు దానికన్నా ముందుకు పోయేవి కావు. అక్కడికే తుంచివేసినట్లు కుతూహలమే ఆరిపోయేది .  


          ఇప్పుడు యాజ్ఞవల్క్యునికి అగ్ని దేవుడి ఆదేశము వచ్చినది . " పంచ భూతములను ప్రత్యేక ప్రత్యేకముగా చూడు ." అని . కానీ చూచుటెలా ? ఎటు తిరిగిననూ పంచభూతములనుండీ ఏర్పడిన వస్తుజాలమే కంటికి కనబడుతున్నది . కావలెనన్న , అగ్ని ధ్యానము వలన పంచభూతములు గూడు కట్టుకొని యున్న చేతనా ప్రకాశమును చూడ వచ్చును . తానే ఆ గూడు అనుకొని ఆ చైతన్యము పుట్టుచున్నది . అది గర్భములో నున్నపుడు దానిని మాట్లాడించి చూడవలెను . కానీ బ్రహ్మచారియైన తనకు అదెలా సాధ్యము ? 


ఇలాగ అసాధ్యమైన దానిని వదలి , సాధ్యమైన జపమును చేస్తూ ఉందామా అంటే ఒకసారి ప్రశ్న మనసులోకి వచ్చినాక , ఊరికే కూర్చొనుటకు సాధ్యము కాదు . దీని వలన , దీర్ఘ కాలము జరుగుతున్న జపము కొంచము సేపే క్లుప్త కాలములో జరిగి , మిగిలిన సమయమంతా ఆ విచారములోనే గడచిపోతున్నది . ఒకటే ప్రశ్న. పంచభూతములను ప్రత్యేకముగా చూచుట ఎలా ? వెనుకా ముందూ తిరిగి తిరిగీ అదే ప్రశ్న , అదే ప్రశ్న , అదే ప్రశ్న .


          ఇలాగ ప్రశ్నను ముందుంచుకొని పరిభావిస్తున్నపుడు ఆ దినము ధేనువు మాట్లాడినది జ్ఞాపకము వచ్చినది . ధేనువు చెప్పినదంతా గుర్తొచ్చింది . " ఉత్తరము చెప్పునది ఉదానము . ఉదానపు వెనుకల ఉన్న ప్రాణము వరకూ నా ప్రశ్న పోవలెను . అప్పుడు కోష్ఠగతమైన ప్రాణము , విశ్వములోనున్న ప్రాణమును చేరి , విశ్వపు ఏమూలనో ఉన్న ఉత్తరమును పట్టుకొని తెచ్చును . అయితే , ఇప్పుడు నాకు కావలసినది క్రియ. ఈ క్రియ , మొదట వాగ్రూపముగా ఉత్తరమును పొందవలెను . దానికేమి చేయవలెను ? ... సరే , మొదట వ్యాపారపు కథను విందాము , తర్వాత వ్యాపారము చేయు ఆలోచన " అను సిద్ధాంతమునకు వచ్చినాడు . 


          " ప్రాణదేవుడినే సాక్షాత్కరించుకొని ఏల అడుగరాదు ? " అని ఇంకొక ప్రశ్న లేచింది . అయితే అతడిని అడుగుటకు ఏదో బెదురు . " ’అడగమని అగ్ని దేవుని అనుమతి యైనది’ , అనిన చాలు " అని ఇంకో ధైర్యము . అయినా నిశ్చయము చేసుకోలేదు . ఎందుకో దిగులవుతుంది . " నేనిన్ని దినములు ప్రాణ పరిచర్యను చేసినాను . అదీకాక, ప్రాణ దేవుడు నాకు కొత్తవాడేమీ కాదు , కాబట్టి దిగులెందుకు ? " అని అధైర్యమును పోగొట్టు నమ్మకము ఒకటి . 


ఇలాగే నలిగిపోయి మరలా పయోవ్రతమును ఆరంభించినాడు . ఒక మండలము పయోవ్రత మందుండి ప్రాణదేవుని అడుగవలెను అని నిర్ణయించుకున్నాడు . 


         అయితే , ఇంకొకరి ఆశ్రమములో ఉండి , వారిని అడుగక , తానే స్వతంత్రించుటెలా ? కాబట్టి , ఉద్ధాలకుల అనుమతి పొంది , ఆచార్యాణి అనుజ్ఞతో పయోవ్రతమును ఆరంభించవలెను అనుకున్నాడు .


          ఒక దినము ఆచార్య ఉద్ధాలకులు దిగుపొద్దులో ఆశ్రమపు తల వాకిట్లో ఉన్న రాతి పానుపు పైన కృష్ణాజినమును పరచుకొని కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు వస్తున్నది చూచినాడు . వారికి యాజ్ఞవల్క్యుడంటే అమితమైన అభిమానము . దానికి తోడు , ఆచార్యాణులనుండీ ప్రాణాగ్ని సంభాషణమును విన్న తరువాత ఆ అభిమానము గౌరవముగా మారింది . ఇప్పుడు వస్తున్న వాడినీ ఆముఖములోని భావమునూ చూచి , " ఏదో అడుగవలెనని వస్తున్నట్లుంది . ఇతడు అగ్ని, ప్రాణ , ఆదిత్యులను వదలి ఇక దేనినీ అడిగేవాడు కాదు , ఏది అడిగిననూ చెప్పవలెను " అనుకున్నారు . వారు తమ అంగాంగములూ యాజ్ఞవల్క్యుని చూచి ప్రసన్నములైనది చూచినారు . ఆశ్చర్యమైనది . అంటే దేవతలు తమ భక్తులను చూచి ఇంత విశ్వాసము చూపెదరా ? ఇకముందు ఏమగునో గానీ , ఈతడి వలన మాకు ఇప్పుడే ప్రయోజనమైనట్లయింది . " అని ప్రసన్నులై, సావధానులై కూర్చున్నారు . 


          యాజ్ఞవల్క్యుడు వచ్చినాడు . వచ్చి , పెద్దవారిని చూచినపుడు చిన్నవారికి కలుగు సహజమైన వినయ విశ్వాసములతో అభివాదనము చేసి ఆశీర్వాదమును పొంది వారి అనుమతితో నేలపైన కూర్చున్నాడు. ఆచార్యుడు వద్దని , ఎవరినో పిలచి లోపలినుండీ ఒక కృష్ణాజినమును తెప్పించి పరచి , దానిపైన కూర్చోమని అన్నారు . యాజ్ఞవల్క్యుడు అటులే చేసినాడు . 


         అదే సమయానికి ఆచార్యాణి కూడా అటు వచ్చి , " చూచితిరా ? ఇదిప్పుడు సరియైన జోడి . ఆ దినము అగ్నిదేవుని అనుమతియైనది . మీరు వచ్చిన తరువాత మీ వద్ద పంచాత్మ సంక్రమణ విద్యనూ , అవస్థా క్రమ విచారమునూ గురించి ప్రస్తావించవలెనని ! ఈ దినము కుమారుడు దానికే వచ్చినాడేమో ? " అన్నారు . 


          యాజ్ఞవల్క్యుడు ఏమి చెప్పవలెనో తెలియక, తల పంకించినాడు . ఆచార్యుడు అప్పుడే సరిగ్గా అన్నాడు , " వాడికేమి , పుణ్యవంతుడు .! వాడు జాతవేదుడు . వాడికి తెలియనిది లేదు . అయినా , రాజ్యపు విస్తారమునూ , వైభవమునూ చూడని యువరాజు వలె ఉన్నాడు . మేమైతే ఎప్పుడో చెప్పినాము , అతడికి కావలసినది అడగవచ్చునని . ఒకవేళ అతడు అడిగే విషయము మాకు తెలియదనుకుందాము , అతనిచేత పరిచర్యలను చేకొన్న అగ్ని ప్రాణులే దానిని చెపుతారు . దీనికి నువ్వే సాక్షి ! " అన్నారు . 


          వారి మాట విని యాజ్ఞవల్క్యునికి ఆలోచనలు చుట్టుముట్టినాయి . వీరు , జాతవేదుడిని అంటున్నారు . ఆచార్యాణి నోటి ద్వారా , అగ్నిదేవుడు సర్వజ్ఞ బీజముందని చెప్పినాడు . అలాగయితే నేను చేయవలసినది ఒక్క తపస్సు మాత్రమే . సకాలములో ఋతులింగ న్యాయము ( బాహ్య ప్రపంచములో ఆయా ఋతువులకు తగ్గట్టుగా చెట్లు , పక్షులు మొదలైన ఆయా గుర్తులు ఎవరి అపేక్ష లేకుండా వ్యక్తమగును --అను న్యాయము ) వలన అది తానే కనిపిస్తుంది . అలాగే కానిమ్ము , నేను ఆగి వేచియుంటే నష్టమేమిటి ? వారినోటనే వస్తున్నది కదా , నన్ను కాపాడుటకు ప్రాణాగ్నులిద్దరూ సిద్ధముగా ఉన్నారని ? " అని ఊరకే కూర్చున్నాడు . 


         ఆచార్యులు , " యాజ్ఞ వల్క్యా , వచ్చిన కారణమేమో చెప్పనేలేదే ? " అన్నారు . అతడేమి చెప్పవలెను , ? తన ప్రశ్నను పక్కకుపెట్టి , " తల్లిగారు అప్పుడే చెప్పినారు , ఇక నేను దానినే మరలా చెప్పుట ఎందుకని ఊరకే ఉన్నాను " అన్నాడు . 


          ఆచార్యులు , ’ అలాగా ? ’ అని వెనక్కు తిరిగి చూచినారు . ఆలాపిని ఒక కృష్ణాజినమును తెచ్చి గడప లోపల వేసుకొని కూర్చున్నది . అది చూచి ఉద్ధాలకులకు బహు సంతోషమైనది . " నువ్వున్నావో లేదో యని తిరిగి చూచితిని . ఇదిగో , చూడు . అమృత మేఘము వచ్చింది . నానుండీ అమృత వర్షము కురిపిస్తున్నది . ఇద్దరం ఆ వర్షపు ప్రయోజనమును పొందెదము " అని యాజ్ఞవల్క్యుని వైపుకు తిరిగినారు . 


          " చూడు యాజ్ఞవల్క్యా , పంచాత్మ సంక్రమణము , అవస్థాత్రయముల విచారములో మొదట అవస్థాత్రయమును తీసుకొనవలెను . ఈ అవస్థాత్రయమును గురించి చెప్పుటకు ముందే చెప్పవలసినది ఇంకాఉంది ,అది విను . అజ్ఞులు ( తెలియని వారు ) అవస్థ నుండీ అవస్థకు ప్రకృతి వశమున వెళ్ళి వచ్చెదరు . విజ్ఞుడయినవాడు ( తెలిసినవాడు ) వాటికి సాక్షి కావలెను . వాడికి కల , నిదుర అనునవి ఒక గది నుండీ ఇంకొక గదికి వెళ్ళివచ్చు నట్లుండవలెను . విజ్ఞుడగువరకూ ఇది సాధ్యము కాదు . ఇది అగువరకూ విజ్ఞుడు కాలేడు . ఇదే ఇక్కడున్న రహస్యము . " 


యాజ్ఞవల్క్యుడు ఒళ్ళంతా చెవులై వింటున్నాడు . ఆలాపిని ఆ విద్య తెలిసినదాని వలెనే అనుసంధానము చేస్తున్నది . అప్పటికే ఆమెకు సాక్షీభావము కూడా వచ్చింది . 


          ఆచార్యులు కొనసాగించినారు : " చూడు , ఈ రహస్యమును తెలుసుకొనుట కోసము ఇంద్రుడు నూటొక్క సంవత్సరములు బ్రహ్మచర్యము పాటించినాడు . ఇంకొక మార్గము ద్వారా దానిని ఛేదించిన యమధర్మరాజు నచికేతునికి ఆ రహస్యమును చెప్పినాడు . జాగృదవస్థ చివర , స్వప్నావస్థ ఆరంభమున ఉన్న స్థితిలో ఈ సాక్షీభావము లభించును . జాగృదవస్థలో కర్మేంద్రియములతో చేరిన మనసు వాటినుండీ విడిపించుకొని స్వప్నపు జ్ఞానేంద్రియములకు ఇంకా దొరకని సంధి సమయములో దీనిని చూడవలెను . మనసు , ఇటు ఇంద్రియాలు అటు బుద్ధి , రెండింటికీ సంబంధించినట్లు ఉంటే , అప్పుడు లాగి కట్టిన తాడువలె జీవము తన సంకల్ప వికల్పములను చేస్తూ కూర్చొనును . అలాకాక, ఇంద్రియ సంబంధమును వదలి బుద్ధికి మాత్రమే సంబంధించునట్లు ఉంటే , మనసు నేలపై పడియున్న తాడు వలె ఏ పనీ లేక , తానున్ననూ లేనట్లే అగును . అప్పుడు కనిపించు జాగృత్ , స్వప్న , సుషుప్తి అను మూడు అవస్థలూ కాక, నాలుగవ అవస్థలో సాక్షి దర్శనమగును . అలాగయినపుడు జాగృత్ కాదు , స్వప్నము కాదు , సుషుప్తి అసలే కాదు , ఈ స్థితిలో కూర్చొని చూచుట నేర్చినవాడికి తత్త్వ దర్శనమగును . ఆ దర్శనము ఇటు జాగృత్తు , అటు సుషుప్తి లను ఆవరించినపుడు ఆ రెండు అవస్థలూ లేకుండాపోవును . ఇలాగ జాగృత్సుషుప్తులు రెండూ ఉన్ననూ లేకుండా పోయినపుడు , ఆ సాక్షీ భావము అంతటా తానే నిండి మహా దర్శనమగును . తెలిసిందా , యాజ్ఞవల్క్యా ? "


         యాజ్ఞాల్క్యుడు వెనుక తనకు కలిగిన జ్యోతిర్దర్శనమును జ్ఞాపకము చేసుకున్నాడు . వాన పడగానే తడిసిపోవు నేల వలె , అతని జీవము తన విశ్వ స్థానమైన భ్రూ మధ్యమును వదలినది .( జీవుడికి విశ్వతైజస్యప్రాజ్ఞుడు అని మూల నామము . భ్రూ మధ్యమము , కంఠము , హృదయము అను మూడు స్థానములు . ) తైజస స్థానమగు కంఠమును ఇంకా చేరలేదు . ఇంద్రయోని స్థానములో ఎవరో పైనుండీ లాగుతున్నారు . కిందకు వెళ్ళకుండా ఎవరో నిలిపివేసినారు . కుమారునికి ఈ విశాల జగత్తంతయూ ఆచార్యుల మాటలలో కేంద్రీకృతమైనట్టుంది . లాగుతున్నది ఎవరు ? తనను కిందకు పడకుండా నిలుపుతున్నదెవరు ? అనునది చూచుటకు కూడా అవకాశము లేదు . దేహమంతా చెవులే అయితే ఎలా వినవచ్చునో అలాగ వింటున్నాడు . 


          ఆచార్యులు దానిని చూచినారు . వారు అతడి దేహమును ప్రవేశించకయే అతడి స్థితిని కనిపెట్టినారు . అంతా అద్దములో చూచినట్లే వారికి స్ఫురించినది . దానిని , అతడి స్థితినీ భార్యకు కూడా చూపించవలెనని వారికి ఇష్టము . అయితే ఆమెకూడా అనుసంధానము చేస్తున్నది . 


         ఆచార్యులు ఒక ఘడియ ఊరికే ఉన్నారు . అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది : " యాజ్ఞవల్క్యుడు ఇలాగ వ్యాపారవంతుడైనదెలాగ ? తన మాటయొక్క బలము వలన అనునట్లయితే , ఇంతవరకూ ఈ విషయమును అనేకులకు చెప్పియున్నాను . వారెవరికీ మొదటిసారికే ఇలాగ వ్యాపారము ఆరంభము కాలేదు . కాబట్టి ఇది యాజ్ఞవల్క్యుని పూర్వపుణ్యమై యుండవలెను " అనుకున్నారు . 


        అంతలో యాజ్ఞవల్క్యుడు వ్యాపారమును ముగించి బయటికొస్తున్నట్లు కనిపించినది . మరలా అతడిని సంబోధించి అన్నారు : " చూడు యాజ్ఞవల్క్యా , అక్కడున్నపుడే చూడు. నిన్ను కిందకు పడకుండా ఆపుతున్నది ఎవరు ? పైకి లాగుతున్నది ఎవరు ? " ఈసారి మాటలో ఆజ్ఞాభావము ఉంది . పెద్దవారు చిన్నవారికి చెప్పునపుడు కనిపించు వాత్సల్యము , అధికారమూ రెండూ ఉన్నాయి .


       యాజ్ఞవల్క్యుడు చూచినాడు : తనను పైకి లాగుతున్నవి సూర్య కిరణములు . తానున్నది భూమ్యాకాశములు రెండూ కాని అంతరిక్షము . అక్కడ నుండీ కిందకు పడకుండా , తరుణి ఒకతె తన చేతులను చాచి అతడిని పట్టిఉన్నది . ఆమెను అడిగితే , " నేను సూర్యగణమునకు చెందినదానిని . ఇప్పటికింతే చాలు " అని దాక్కుంటున్నది . ఆమె మాయమైనట్లే సూర్య కిరణములు కూడా మాయమగుచున్నవి . అయితే , ఆ పైని లాగుట , కింది పట్టు ఇవి తప్పలేదు . 


      ఆచార్యులు ఆమె ఆడిన మాటను అలౌకిక శ్రవణ శక్తితో విన్నారు . బహు సంతోషమయినది . కుమారుడికి తనకుతానుగా మెలకువ కానీలెమ్మని నెమ్మదితో కాచి కూర్చున్నారు . 


        కొంతసేపటికి యాజ్ఞవల్క్యుడు మేలుకున్నాడు . అంతవరకూ అతడు చేసిన , చేస్తున్న వ్యాపారమంతా తన ముందున్న పాత్రలోని నీటిలో ఈదుతున్న చేపల వ్యాపారము వలె స్పష్టముగా కనపడుచున్ననూ ఆచార్యులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు కనులు తెరచి నవ్వుచూ ఆచార్యునికి నమస్కారము చేసినాడు . ఆచార్యులు అడిగినారు : 


" ఏమేమి చూచితివి యాజ్ఞవల్క్యా ? " 


        " ఏమి చెప్పుదును ఆచార్యా ? నేను చూచినది చెప్పుటకు నాకు మాటలు చాలడము లేదు . కాబట్టి కొంచము హెచ్చుతక్కువ అయితే క్షమించవలెను . మొదట భ్రూమధ్యము నుండీ ఏదో ఒక అదృశ్య పదార్థము మెరిసి కిందికి దొరలినట్లాయెను . అప్పుడు నా తల ముందుకు వాలి పడిపోవలసినది . ఎవరో పడుతున్న తలను అలాగే నిలిపివేసినారు . లోపల , పడుచున్న ఆ పదార్థమును ఎవరో ఆదుకొని అక్కడే నిలిపినారు . నేను ఉన్నది భూమికాదు , ఆకాశమూ కాదు అనిపించినది . వెంటనే తానుగా అర్థమైనది , ఇది అంతరిక్షము అని . అక్కడ తమరు చెప్పుచున్నవి , నేనాడినవి మాటలు గా కాకుండా , వ్యాపారమును ప్రచోదించు క్రియల వలె ఉన్నాయి . అటు ఆదిత్యుని కిరణాలు , ఇటు ఆదిత్యగణపు దేవియొకతె , ఇద్దరూ ఒక జ్యోతిర్మండలమును పట్టుకొనియున్నారు . ’ఆ జ్యోతిర్మండలమే నేను ’ అన్నది స్ఫురించుచుండెను . ఆ పక్కలోనే , తమరు చెప్పినట్లు ఒక తాడు వదులుగా వేలాడుతూ యుండెను . ఆ మండలమునకు తానొక సంపుటములో నున్నట్లు తోచినది . తాను జ్యోతియై ఉన్నందు వల్లనో ఏమో , అంతటా జ్యోతియే కనిపించు చుండినది . "


       " ఆ సంపుటమే బుద్ధి , యాజ్ఞవల్క్యా . ఆ వేలాడుతున్న తాడు వలె నిర్వ్యాపారముగా నున్న ప్రకాశమే మనసు . నిన్ను కిందకు పడకుండా పట్టుకున్నామె ఉషా దేవి . ఇదిగో , ఆమెయే వచ్చినది . ఋగ్వేదపు ఉషా సూక్తముతో ఆమెను ఆరాధించు " 


ఆచార్యుల అనుజ్ఞమేరకు యాజ్ఞవల్క్యుడు ఉషా సూక్తమును చెప్పినాడు . అది సామముగా పరిణమించినది . 


ఇటూ ఆచార్యులూ , ఆచార్యణీ ఆ సామము ముగియువరకూ చేతులు జోడించి నిలుచున్నారు . 


        అంతా ముగిసిన తరువాత ఆచార్యులు అన్నారు , " యాజ్ఞవల్క్యా , ఈ దినము నీకు సాక్షీ దర్శనమైనది . ఇకముందు నీకు తత్త్వ శాస్త్రమును అభ్యాసము చేయుటకు అధికారము వచ్చినది . ఇప్పుడు నీకు అయినది దర్శనము . నువ్వు తత్త్వమును సమగ్రముగా తెలుసుకుంటే అది ’ మహా దర్శనమగును ’ . "


        యాజ్ఞవల్క్యుడు ఆచార్యవాక్కును ఆశీర్వాదమని పరిగ్రహించి , నమస్కారము చేసినాడు . ఆచార్యాణి , తనకు నమస్కారము చేయుటకు వచ్చిన కుమారుని వారించి , " అది మాకు మూల స్థానము , అక్కడ అయినదంతా మాకూ అయినట్లే " అని అంటున్ననూ , యాజ్ఞవల్క్యుడు ఆమెకూ నమస్కారము చేసినాడు . 

Janardhana Sharma

39. " మహాదర్శనము

 39. " మహాదర్శనము "--ముప్పై తొమ్మిదవ భాగము-- సర్వజ్ఞుడు 2


39.  సర్వజ్ఞుడు 2



         ఆచార్యాణితో నడచిన సంభాషణ వలన యాజ్ఞవల్క్యునికి జ్ఞానోదయమైనది . తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు అన్నాడు ."  అలాగయితే , ఈ చిన్నదీ , పెద్దదీ అనుకుంటూన్న భేదమంతా పరిమాణములోనే కానీ , జాతిలో కాదు ! " 


        దానిని ఒప్పుకున్నట్లు అన్నాడు , " అలాగయితే ప్రకృతి చేతికి దొరకువరకూ ఈ చిన్నతనము . దీని గుర్తుగా శోక మోహములు . ప్రకృతినుండీ ముక్తుడైతే ఇవి లేవు . అప్పటి స్థితి ఏమిటి తల్లీ ? "


         " ప్రకృతి బయట ఉన్నవాడిని శృతీ భగవతి కూడా వర్ణించలేక , ’ మహాన్ ’ అనీ , ’ బ్రహ్మ ’ అనీ ఊరకుండి పోయింది . ఇంకొక చోట బ్రహ్మను గురించి , ’ సత్యం జ్ఞానమనంతం  బ్రహ్మ ’ అన్నది . ఈ వాక్యములో నున్న జ్ఞానము బయటి వస్తువుల విషయమును సంగ్రహించుకొను భాండారము కాదు , యాజ్ఞవల్క్యా , అనుకూల కాలములో మఠములో కనిపించు చిగురు వలెనే  ఇదీ ! . అదీకాక , సంగ్రహ భాండారమైన జ్ఞానము , మనోవృత్తి .  దానిని వదిలితే , అనగా మనసు నుండీ బయటికి పోతే బుద్ధివృత్తి . అక్కడినుండీ కూడా బయటికి పోతే అక్కడ జ్ఞానమే తానై యున్న బ్రహ్మ . అక్కడికి పోవచ్చును . అయితే , చక్కెరను నోట్లో వేసుకుంటే ఎలాగుంది అంటే ’ తియ్యగా ఉంది ’ అనవచ్చు , తీపిని వర్ణించుటకగునా ? అటులనే , దానిని చెప్పుటెలాగో తోచక , ’ అది జ్ఞానము ’ అంటాము , తెలిసిందా ? " 


" తెలిసింది " 


        " ఇప్పుడు నీ ప్రశ్నను తీసుకుందాము . జ్ఞాన రూపియైన బ్రహ్మ పంచభూతములలోనూ , గుణత్రయములోనూ  అనగా , ప్రకృతిలో చేరినందువలన , ఇలాగ చిన్నవాడై యున్నాడు . ఇలాగ ప్రకృతికి చిక్కి , చిన్నవాడయిననూ , తన గుణములను పోగొట్టుకోలేదు కదా ? కాబట్టి అతని సర్వజ్ఞత్వము ఎక్కడికి పోయింది ? " 


" తల్లీ , ఇది నిజంగా ప్రౌఢ వాదము . మాట యొక్క బలము చేత నా నోటిని మూయించినారు , కదా ? . "


       " కాదు యాజ్ఞవల్క్యా , నీ నోరు మూయించే అవసరము నాకు లేదు . నువ్వు నా కడుపున పుట్టిన కొడుకు లాంటి వాడవు . నిజంగా నీకు చెప్పవలెనంటే , ఇంత సేపూ మాట్లాడినది నేను కాదు . నీ ఉపాస్య దేవత యైన అగ్ని దేవుడు . ఔనో కాదో చూడు . "


        యాజ్ఞవల్క్యుడు కన్నులు మూసి అనుసంధానము చేసినాడు . ఇంతవరకూ తన దేహములో , తాను కోరిన చోట దర్శనమిస్తున్న అగ్నిదేవుడు ఇప్పుడు ఆచార్యాణిలో కూర్చొని పలుకుతున్నాడు . దేవుడికి నమస్కారాదులు చెల్లించి , " ఇదేమి విచిత్రము ? ఇందుకేనేమి , ఈ రోజు నాతో జపము చేయించ నియ్యకుండా ఇక్కడికి పిలుచుకు వచ్చినది ? " అని అడిగినాడు . 


        అగ్ని దేవుడు ప్రసన్నుడై , " ఔను , ఇక నీకు దేహ తత్త్వ , మనస్తత్త్వములను బోధించవలెను . ఇప్పుడు చెప్పినది జీవ తత్త్వము మాత్రమే . ఈ దినము నీకు సర్వజ్ఞ బీజపు యోచన వచ్చినపుడు , నువ్వు అడిగి ఉంటే అప్పుడే అక్కడే చెప్పేవాడిని . నువ్వు అడుగలేదు . అందుకని ఇక్కడికి పిలుచుకొచ్చి , ఈ ముఖముగా చెప్పినాను . ఇదంతా మా దేవతల ఆట. ఇప్పటికి ఇంత తెలుసుకో, చాలు " అన్నాడు . 


అగ్ని దేవుని మాట ముగిసిన తర్వాత ఆలాపిని అడిగినది . " నమ్మకము కుదిరిందా? యాజ్ఞవల్క్యా ? " 


" సరే , మరి దేహతత్త్వ , మనస్తత్త్వముల గురించి ఎప్పుడు చెప్పెదరు ? "


        " అది ఇంతవరకూ మాట్లాడినవారి ఇష్టము . నేను ఒకటి మాత్రము చెపుతాను , వినియుండు . వారు తిరిగి వచ్చిన తర్వాత , వారి దగ్గర , ఛాందోగ్యములోని , ఇంద్ర విరోచనోపాఖ్యానమును , తైత్తిరీయపు పంచాత్మ సంక్రమణ విద్యనూ అడుగు . "


       యాజ్ఞవల్క్యుడు సరేనన్నాడు . నమస్కార పూర్వకముగా వీడ్కొని , తన గుడిసెకు వెళ్ళినాడు . దారిలో తనకు కలిగిన అనుభవమును గురించే ఆలోచనలు . 


Janardhana Sharma

హరికిం బట్టపుదేవి

 శు  భో  ద   యం  🙏


💥మ.

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం

దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.


(పోతనామాత్య "శ్రీమదాంధ్రమహాభాగవతము" 

👉భావము:

దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి;

రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి;

సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు;

వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి;

అరవిందాలు మందిరంగా గల జవరాలు;

అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న;

చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే

బంగారు తల్లి;

ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రహించు గాక!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

దుర్గామాత

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹దసరా సమయంలో అమ్మ వారిని, ఆమె అంశా రూపాలను తలచుకోవడం, తెలుసుకోవడం ఓ దివ్యానుభూతిని ఇస్తుంది. నవ దుర్గల గురించి అనేక విధాలుగా మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆ దుర్గామాత అంశా రూపాలను గురించి చాలా తక్కువగా వినిపిస్తుంది. దేవీభాగవతం లోని ఆ అద్భుతమైన విషయాలు మనకు అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. భ్రామరీ దేవి ఎవరు? అరుణుడనే అసురుని తుమ్మెదలతో ఎలా అంతమొందించిందో ఈ ఎపిసోడ్ లో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

రామాయణం పాత్ర

 భారత సంస్కృతి లో రామాయణం పాత్ర ఎంతో ఉంది.  రామాయణం అధ్యయనం చేసినవారి మనోనిశ్చలత అసాధారణమైనది. ఎందరో కవులు వివిధభాషలలో రామాయణాన్ని తమదైన భాణిలో రచించినప్పటికి వాటన్నిటిలో వాల్మీకి రామాయణానిదే పెద్దపీట. వాల్మీకి రామాయణం ఆమూలగ్రం పఠిస్తే కలిగే మానసిక ప్రశాంతతను ప్రత్యక్షంగ అనుభవిస్తే కానీ తెలియదు.  


మన దురదృష్టవశాత్తు రామాయణం పై మంచి అభిప్రాయంతో పాటు అపోహలు కూడ బలంగానే ప్రచారంలో ఉన్నాయి. అసలు రామాయణంలో ఉన్నదేమిటో తెలియకపోవటంతో చెప్పినవన్నీ లేక చదివినవన్నీ నమ్మే స్థితిలో ఈ తరంవారు తప్పుదారి పడుతున్నారు.


నిత్యం పరుగులతో నిండిపోయిన ఈ జీవితశైలిలో సుమారు 24 వేల శ్లోకాలను చదవటమంటే మాటలు కాదు.  పైగ అది సంస్కృతంలో ఉన్నవాయె.  రామాయణం పై సరైన అవగాహన లేకపోవటానికి ఇదికూడ ఓ కారణం కావొచ్చు. వీటన్నిటికి పరిష్కారంగ వాల్మీకి రామాయణం ఆధారంగ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పరచబడినది. 


రోజుకో సందేశమనే నిబద్ధతతో, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ల గొడవలు ఏమాత్రంలేకుండ కేవలం వాల్మీకి రామాయణం ఆధారంగ క్రమపద్దతిలో సందేశాలు పంపబడుతాయి.  సరళమైన తెలుగులో ఈ సందేశాలు ఉండటం ఓ ప్రత్యేకత. ఉదయమే సందేశాలు పంపబడుతాయి కాబట్థీ మీ వీలును బట్టి రోజులో ఏ సమయంలోనైన చదువుకోవచ్చు. అంతే కాక నిత్యరామాయణ పారాయణ చేసే మరెందరో పెద్దలు వారు అనుభవంతో చేసే వ్యాఖ్యలు కూడ చాలా ఉపయోగకరంగ ఉంటాయి.


ఆసక్తి ఉన్నవారు చేరటానికి లింకు  ఇవ్వబడింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది.  పూర్తి స్థాయి సందేశాలు మొదలవటానికి మరో 2 లేక 3 రోజులు పట్టొచ్చు. మీ స్నేహితలను, కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించొచ్చు.


జై శ్రీరామ్.

బుధవారం*🪷 🌷 *09, అక్టోబర్, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🪷 *బుధవారం*🪷

🌷 *09, అక్టోబర్, 2024*🌷

      *దృగ్గణిత పంచాంగం*                  


          *ఈనాటి పర్వం*

          దేవీ శరన్నవరాత్రి     

        *(మూలా నక్షత్రం)*

    *శ్రీ మహా సరస్వతీదేవి*

           *అలంకారం* 🙏


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి : షష్ఠి* మ 12.14 వరకు ఉపరి *సప్తమి*

*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం : మూల* పూర్తిగా రోజంతా రాత్రితో సహా


*యోగం  : సౌభాగ్య* ఉ 06.37 *శోభన* రా 05.53 తె వరకు 

*కరణం : తైతుల* మ 12.14 *గరజి* రా 12.28 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 06.00 - 08.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  :*రా 10.33 - 12.14*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు* 


*వర్జ్యం : మ 12.30-2.11 & రా 3.34-5.15 తె*

*దుర్ముహూర్తం : ప 11.31 - 12.18*

*రాహు కాలం : ప 11.54 - 01.23*

గుళికకాళం : *ఉ 10.25 - 11.54*

యమగండం : *ఉ 07.28 - 08.57*

సూర్యరాశి : *కన్య*

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 05.59* 

సూర్యాస్తమయం :*సా 05.50*

*ప్రయాణశూల : *ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.59 - 08.21*

సంగవ కాలం   :      *08.21 - 10.43*

మధ్యాహ్న కాలం :*10.43 - 01.06*

అపరాహ్న కాలం:*మ 01.06 - 03.28*

*ఆబ్ధికం తిధి: ఆశ్వీయుజ శుద్ధ సప్తమి*

సాయంకాలం  :  *సా 03.28 - 05.50*

ప్రదోష కాలం   :  *సా 05.50 - 08.16*

రాత్రి కాలం : *రా 08.16 - 11.30*

నిశీధి కాలం      :*రా 11.30 - 12.19*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.10*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🪷 *శ్రీ సరస్వతీ స్తోత్రం* 🪷


*సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |*

*ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷

🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🌹🪷🪷🌹🌷🌹

అద్భుతమైన మంత్రం*

 *🕉️🙏ఓం శ్రీ మా త్రే న మః!!!*


*🌹చాలా అద్భుతమైన మంత్రం*

*చాలా మహిమగల మంత్రం 🌹*


🌿ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై 

శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతుడై ఉండగా, అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి..లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు. 


🌸అల్లంతదూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది.


🌿ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, 

ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు.


🌸 వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. 


🌿ఇంకేం.. .కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకేచోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. 


🌸కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి.. 

వారి మధ్య కలహాన్ని రేపి, తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. 


🌿అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి  'ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు. ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి'' అని నిర్ణయించుకుని బ్రహ్మమానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు. 


🌸ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి.. నమస్కరించాడు. ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి, విషయాలేంటని అడిగారు. 


🌿ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు. 

త్రిమూర్తులైన వారికి..భార్యలైన మీరు ముగ్గురూ, సకల లోక వాసులచే స్తుతింపబడుతున్నారు. 


🌸అంతవరకు బాగానే ఉంది.. కానీ మీ ముగ్గురిలో ఎవరుగొప్ప? అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్తాడు. 


🌿నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు.. నారదా నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి.. 


🌸అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు. కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు. 


🌿ముందు సరస్వతీ దేవి నారదునితో.. ! నారదా! భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి, అక్కడున్న 

ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి, 


🌸సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో   "ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్ఛరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది.


🌿 మంత్రోచ్ఛరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీ దేవి అంటుంది. 


🌸ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్లి సెల్వనాథుడి గురువును కలిశాడు. 


🌿సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు.. సెల్వ నాథుడికి అక్షరం ముక్క రాదు...వాడితో నా ప్రాణం విసిగిపోయింది. పశువులను మేపాల్సిందిగా పంపేశాను.. 

వెళ్ళి చూడమంటాడు. 


🌸నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని.. తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని.. 


🌿ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇలా సముద్రంలో స్నానం చేసి.. శుచియై వచ్చిన 

ఆ బాలుడికి ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని 

108 సార్లు జపం చేయమని చెప్తాడు. 


🌸ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు. 


🌿పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారదా.. కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు. 


🌸అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ''ఓం శ్రీ మాత్రే నమః'' మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. 


🌿ఇలా పెరినాయకి ఇంటికి వెళ్లిన నారదుడు.. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. 


🌸సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు. ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. 


🌿ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు. 


🌸ఇక మూడో సారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే 

పేద పండితుడిని కలవమంటుంది. 


🌿''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది.

అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్లి.. దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు.


🌸 రాజశేఖరుడు తనవద్ద ఉన్న బియ్యాన్ని మారు వేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా, రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది. 


🌿దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించి 108సార్లు జపించమని చెప్తాడు.


🌸ఆ తర్వాత ఆ పేద పండితుడు  శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శింటుకుంటాడు.


🌿అమ్మలారా! మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను. ఇప్పటికైనా..ఇప్పటికైనా ఈ మంత్రం ఎలాపుట్టింది అని అడుగుతాడు. 


🌸అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది. బ్రహ్మదేవ పుత్రా.. మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు. జగదాంబ ఆజ్ఞానుసారం..


🌿నా వలన ఐశ్వర్యం, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం, సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తుంటాయి. 


🌸శ్రీ లక్ష్మిలోని శ్రీ సరస్వతీ లోని శ్రీ శక్తి లోని బీజాక్షరాలు జతచేసి   ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రసృష్టి.

ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది.


🌸అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది...స్వస్తి...🚩🙏🌹

  

  *🙏ఆ మంత్రమే 'ఓం శ్రీ మాత్రే నమః' అనే మంత్రం🙏*

Deepam Vundagaane దీపం వుండగానె


 

*శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*సులభుల్మూర్ఖులు నుత్తమోత్తములు రాజుల్గల్గి యేవేళ న*

*న్నలఁతం బెట్టిన నీపదాబ్జములఁ బాయం జాల, నేమిచ్సినం*

*గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గావుండు టబ్జంబు పైఁ*

*జెలు వొప్ప న్సుఖియింపఁ గాంచుట సుమీ, శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 56*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! రాజులు భిన్నమనస్కులు. కొందఱు మంచివారు, కొందఱు మూర్ఖులు, మరి కొందఱు ఉత్తమోత్తములు... వారు నాకు ఏ విధమైన ప్రలోభములకు లోను చేసినా నేను నీ పాదారవిందములను విడువబోను.... నీవు నాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే ప్రభో....*


✍️🌷🌺🌹🙏

మహనీయుల మాట🙏

 🙏.సర్వేజనాః సుఖినోభవంతు.🙏


     : 🕉 శుభోదయం 🕉


   🙏మహనీయుల మాట🙏

................................


ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు   ఓటమిని   నీకు పరిచయం  చేస్తే  

మౌనంగా ఉండి చూడు  నీ విజయానికి దార్లు కనిపిస్తాయి  .....


ఆవేశంలో ఆలోచన తగ్గుతుంది.

నిశ్శబ్దంలో ఎన్నో మంచి ఆలోచనలు  వికసిస్తాయి  ........


🙏నేటి మంచి మాట🙏

.....................................

 చేసినతప్పు వొప్పుకోవాలంటే- సంస్కారం కావాలి. 

చేయనితప్పు మీద వేసుకోవాలంటే-గొప్ప మనసు కావాలి.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺పంచాంగం🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ... 09 - 10 - 2024,

వారం ...  సౌమ్యవాసరే ( బుధవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయణం - శరదృతువు,

ఆశ్వయుజ మాసం -  శుక్ల పక్షం,


తిథి      :  షష్ఠి ఉ7.24 వరకు,

నక్షత్రం  :  మూల రా1.29 వరకు,

యోగం :  శోభన తె3.23 వరకు,

కరణం  :  తైతుల ఉ7.24 వరకు,

                తదుపరి గరజి రా7.21 వరకు,


వర్జ్యం                  :  ఉ9.02 - 10.41,

                                మరల రా11.50 - 1.29,

దుర్ముహూర్తము  :  ఉ11.24 - 12.11,

అమృతకాలం     :  సా6.54 - 8.33,

రాహుకాలం        :  మ12.00 - 1.30,

యమగండం       :  ఉ7.30 - 9.00,

సూర్యరాశి          :  కన్య,

చంద్రరాశి            :  ధనుస్సు,

సూర్యోదయం     :  5.55,

సూర్యాస్తమయం:  5.41,


               *_నేటి విశేషం_*


             *సరస్వతీ పూజ* 

        *దేవీ త్రిరాత్ర వ్రతము*


_ఇంద్రకీలాద్రిపై  సరస్వతీదేవి అలంకరణ మరియు శ్రీశైలములో శ్రీకాళరాత్రిదేవి అలంకరణ_


_*సరస్వతీ దేవి చరిత్ర*_


చదువుల తల్లి

దేవనాగరి:  సరస్వతీ

తెలుగు:    సరస్వతీ దేవి

వాహనం:   హంస , నెమలి


హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు , పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి , సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి.


నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. స్వరూపం ఋగ్వేదంలోనూ , దేవీ భాగవతంలోనూ , బ్రహ్మ

వైవర్త పురాణంలోనూ (2.6.13-95) , పద్మ పురాణంలోనూ సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి.


సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని , సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.


వాక్ , బుద్ధి , వివేకం , విద్య , కళలు , విజ్ఞానం –

వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని

పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా , వీణాపాణిగా , పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి

వర్ణనలలోతెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. *“శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల*

*కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు”* నది గా  బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.


సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”.

పరాశక్తి , జ్ఞాన ప్రదాతసరస్వతి – రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం – 9 వ శతాబ్దానికి చెందినది. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో

అధ్యాయం వివరిస్తోంది. మహామాయ , భాషా జ్యోతిర్మయి , కళారస హృదయగా సరస్వతీ

పూజలందుకొంటోంది.


*జ్ఞాన ప్రదాతగా సరస్వతి – కొన్ని గాధలు*


పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ

పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు.

అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన  జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు.


వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని

పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర  తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని  పొంది  సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే  ఆయన వేద విభాగాన్ని , పురాణ రచనను చేశాడు. ఓసారి

ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని

అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి  ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర  క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల

పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.


పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి  భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు.


అయితే

యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు.  యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు , జ్ఞాపక శక్తి  కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి  జ్ఞాన , జ్ఞాపక శక్తులను ప్రసాదించమని , విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని , గ్రంధ రచనా శక్తి , ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు.


సత్సభలలో మంచి విచారణ శక్తిని , సత్య స్వరూపిణి , వ్యాఖ్యాన రూపిణి , వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన  సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత  యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా , సుకవిగా వెలుగొందమని  ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా  దేవీ భాగవతంలో ఉంది.


శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు.

అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది.                                             



*శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామావళి*


ఓం శ్రీ సరస్వత్యై నమః

ఓం మహాభద్రాయై నమః

ఓం మహామాయాయై నమః

ఓం వరప్రదాయై నమః

ఓం శ్రీప్రదాయై నమః

ఓం పద్మనిలయాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మవక్త్రికాయై నమః

ఓం శివానుజాయై నమః

ఓం పుస్తకహస్తాయై నమః (10)


ఓం జ్ఞానముద్రాయై నమః

ఓం రమాయై నమః

ఓం కామరూపాయై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం మహాపాతక నాశిన్యై నమః

ఓం మహాశ్రయాయై నమః

ఓం మాలిన్యై నమః

ఓం మహాభోగాయై నమః

ఓం మహాభుజాయై నమః

ఓం మహాభాగాయై నమః (20)


ఓం మహోత్సాహాయై నమః

ఓం దివ్యాంగాయై నమః

ఓం సురవందితాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం మహాపాశాయై నమః

ఓం మహాకారాయై నమః

ఓం మహాంకుశాయై నమః

ఓం సీతాయై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వాయై నమః (30)


ఓం విద్యున్మాలాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం చంద్రికాయై నమః

ఓం చంద్రలేఖావిభూషితాయై నమః

ఓం మహాఫలాయై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం సురసాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం దివ్యాలంకార భూషితాయై నమః

ఓం వాగ్దేవ్యై నమః (40)


ఓం వసుధాయై నమః

ఓం తీవ్రాయై నమః

ఓం మహాభద్రాయై నమః

ఓం మహాబలాయై నమః

ఓం భోగదాయై నమః

ఓం భారత్యై నమః

ఓం భామాయై నమః

ఓం గోమత్యై నమః

ఓం జటిలాయై నమః

ఓం వింధ్యావాసాయై నమః (50)


ఓం చండికాయై నమః

ఓం సుభద్రాయై నమః

ఓం సురపూజితాయై నమః

ఓం వినిద్రాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం బ్రాహ్మ్యై నమః

ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః

ఓం సౌదామిన్యై నమః

ఓం సుధామూర్తయే నమః

ఓం సువీణాయై నమః (60)


ఓం సువాసిన్యై నమః

ఓం విద్యారూపాయై నమః

ఓం బ్రహ్మజాయాయై నమః

ఓం విశాలాయై నమః

ఓం పద్మలోచనాయై నమః

ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః

ఓం ధూమ్రలోచన మర్దిన్యై నమః

ఓం సర్వాత్మికాయై నమః

ఓం త్రయీమూర్త్యై నమః

ఓం శుభదాయై నమః (70)


ఓం శాస్త్రరూపిణ్యై నమః

ఓం సర్వదేవస్తుతాయై నమః

ఓం సౌమ్యాయై నమః

ఓం సురాసుర నమస్కృతాయై నమః

ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః

ఓం చాముండాయై నమః

ఓం ముండకాంబికాయై నమః

ఓం కాళరాత్ర్యై నమః

ఓం ప్రహరణాయై నమః

ఓం కళాధారాయై నమః (80)


ఓం నిరంజనాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం వాగ్దేవ్యై నమః

ఓం వారాహ్యై నమః

ఓం వారిజాసనాయై నమః

ఓం చిత్రాంబరాయై నమః

ఓం చిత్రగంధాయై నమః

ఓం చిత్రమాల్య విభూషితాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామప్రదాయై నమః (90)


ఓం వంద్యాయై నమః

ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః

ఓం శ్వేతాననాయై నమః

ఓం రక్త మధ్యాయై నమః

ఓం ద్విభుజాయై నమః

ఓం సురపూజితాయై నమః

ఓం నిరంజనాయై నమః

ఓం నీలజంఘాయై నమః

ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః

ఓం చతురానన సామ్రాజ్జ్యై నమః (100)


ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః

ఓం హంసాసనాయై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం మంత్రవిద్యాయై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం మహాసరస్వత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం జ్ఞానైకతత్పరాయై నమః (108)


*ఇతి శ్రీసరస్వత్యష్టోత్తరశతనామావళిః సమాప్తం*


*శ్రీశైలంలో కాళరాత్రీ దుర్గా అలంకరణ*


కాళీ , మహాకాళీ , భధ్రకాళీ , భైరవి , మృత్యు , రుద్రాణి , చాముండా , చండీ , దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రీదేవి కూడా ఒకరు.


కాళరాత్రి " శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము , మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.


కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను *"శుభంకరి"* అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని , ఆందోళనను గాని పొందనవసరమే లేదు.


కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు , దైత్యులు , రాక్షసులు , భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని , జలము , జంతువులు మొదలగువాటి భయముగాని , శత్రువుల భయముగాని , రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.


              *_🌺శుభమస్తు🌺_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

భా ర్య

 ఓ చిన్నపాటి రచయితను ఆతని భార్య అడిగిందిలా


ఏమండీ ! మీరెపుడూ అమ్మ గురించే రాస్తారు, భార్యను గురించి రాయరా ? 


అతని కలం పరుగులు తీసింది  ఇలా ......


             భా ర్య 

          -------

(రెండక్షరాల ప్రేమ మరియు జీవితం)


ఎవరో నీవు

చందమామంత అందం లేదు

కలువ భామంత  సుకుమారం లేదు


సరస్వతీ దేవంత చదువు లేదు

కనక మాలక్ష్మంత ధనం లేదు

పార్వతీ దేవంత శౌర్యం లేదు


కానీ ....... 


కన్నుల నిండా వెన్నెల

మనసు నిండా కరుణ


మాటల్లో తేనెలా కమ్మదనం

ఆకలైతే కడుపు నింపే అమ్మదనం


ప్రేమలో నాలో ఐక్యమయ్యే కనకాంబరం


ఆకాశమంత నీకు

నా బతుకంతా నీవైన నీకు

రెండు అక్షరాల 'భార్య' పదం  చాలునా ? 


గృహస్తాశ్రమ ధర్మాలు నీతోనే

వానప్రస్తాశ్రమ ధర్మం నీతోనే

ధర్మేన అర్థేన కామేన నాతిచరామి నీతోనే


మా అమ్మ నాతో చెప్పిన మాట

ఆ చేయి పట్టుకోరా


మీ అమ్మ నీతో చెప్పిన మాట

ఆ చేయి విడువకమ్మా


అలా నా దీపమైనావు

నా ఇంటి మణిదీపమైనావు

నా జీవితపు మణి ద్వీపమైనావు


పాలేవో నీరేవో తెలియనంతగ కలిసాం


వెన్నెలైనా చీకటైనా కలిసి ఒక్కటై సాగాం


నాలో నీవు ... నీలో నేను

అమరమైన ఈ అధ్వైతంలో

వేలకొద్దీ తీయని గురుతులే

ఎగిరే సీతాకోక చిలుకల్లా 

కమ్మని కవితలా .. 

మధుర గీతంలా ..

మధు మాసంలా ..


అర క్షణంలో 

ఆవిరై పోయే కోపతాపాలు

మరుక్షణంలో కలిసిపోయే అనుబంధాలు


అదేఅదే నీవు నేర్పిన  

భార్యాభర్తల బంధాలు


గొప్ప బహుమతులు వద్దంటివి

ప్రేమతో ఇచ్చే చిన్ని జ్ఞాపకాలు చాలంటివి


భూతల్లి పిలిచేవరకు

కష్టమైనా

సుఖమైనా 


నీతోనే

నీతోనే


కన్నుల్లో నిలిచావు కంటిపాపలా


గుండెల్లో ఉన్నావు గుండె సవ్వడిలా


"మన జీవన లీల ఆనంద హేల"


ఋణం ఉండి కలిసామో

ఋణం తీర్చుకోవడానికి కలిసామో

తె లి య దు కానీ 


నీవో అధ్బుతానివి 

నేనో  నిమిత్ర మాత్రుడను


ప్రతి ఇంటిలో

ప్రతి భర్తలో

ఆకాశమంత  'ప్రేమైన'  నీకు

రెండక్షరాల 'భార్య' అను పదం చాలునా


ఓ దేవతలారా !

ఓ కవి శ్రేష్టులారా !


ఈమెకో  పేరు సూచించండి

అమ్మలా ....  తీయగా

అమృతంలా .... గొప్పగా


................🙏...................

                   💞

            M N Chary