26, సెప్టెంబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం

 *26.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*8.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*ఏవం దురాశయా ధ్వస్తనిద్రా ద్వార్యవలంబతీ|*


*నిర్గచ్ఛంతీ ప్రవిశతీ నిశీథం సమపద్యత॥12525॥*


ఇట్లు క్షణక్షణము పెల్లుబుకుచున్న పేరాసతో ఆ పింగళ నిద్రను మాని ద్వారముకడనే విటునికొరకు ఎదురుతెన్నులు చూచుచు నిలబడియుండెను. ఫలితము కనబడకపోవుటతో ఏమియు తోచక ఇంటిలోనికి వెళ్ళుచు వచ్చుచుండెను. ఇంతలో అర్ధరాత్రి గడచిపోయెను.


*8.27 (ఇరువది ఆరవ శ్లోకము)*


*తస్యా విత్తాశయా శుష్యద్వక్త్రాయా దీనచేతసః|*


*నిర్వేదః పరమో జజ్ఞే చింతాహేతుః సుఖావహః॥12526॥*


ఎంతకును ఆమెలో ధనాశ చావకుండెను. ఎదురుచూచి ఎదురుచూచీ నోరు ఎండిపోవుచుండెను. ముఖము వాడిపోవుచుండెను. ఆమెలో అనుక్షణము దైన్యము ఆవరించుచుండెను. అప్పుడు ఆమెలో గొప్ప వైరాగ్యము జనించెను. ఎంతయో చింతాగ్రస్తురాలయ్యెను. కడకు వైరాగ్యమతోపాటు ఇవి అన్నియును కలిసి ఆమె శ్రేయస్సునకే కారణములయ్యెను.


*8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*తస్యా నిర్విణ్ణచిత్తాయా గీతం శృణు యథా మమ|*


*నిర్వేద ఆశాపాశానాం పురుషస్య యథా హ్యసిః॥12527॥*


క్రమముగా ఆమె చిత్తమంతయును విరక్తితో నిండిపోయెను. అప్పుడు ఆమె 'వ్యక్తియొక్క ఆశాపాశములను త్రెంచివేయుటకు విరక్తియే (వైరాగ్యమే) ఒక ఖడ్గము' అనుచు ఒక గీతమును ఆలపించెను.


*8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*న హ్యంగాజాతనిర్వేదో దేహబంధం జిహాసతి|*


*యథా విజ్ఞానరహితో మనుజో మమతాం నృప॥12528॥*


యదుమహారాజా! 'అజ్ఞానియైన వానినుండి మమకారములు తొలగిపోనట్లు, విరక్తి (వైరాగ్యము) కలుగనిదే దేహబంధములు (ఆశాపాశములూ) వీడవు' అనునది పింగళ పాడిన పాటలోని సారాంశము.


*పింగళోవాచ*


*8.30 (ముప్పదియవ శ్లోకము)*


*అహో మే మోహవితతిం పశ్యతావిజితాత్మనః|*


*యా కాంతాదసతః కామం కామయే యేన బాలిశా॥12529॥*


*పింగళ ఇట్లు పలికెను* నేను ఇంద్రియసుఖములకు బానిసనైతిని. అంతులేని మోహములో మునిగి తుచ్ఛుడైన పురుషునితో విషయసుఖములను కోరుకొనుచుంటిని. నేనెంత మూర్ఖురాలసు. ఇది చాలా విచారకరమైన విషయము.


*8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*సంతం సమీపే రమణం రతిప్రదం విత్తప్రదం నిత్యమిమం విహాయ|*


*అకామదం దుఃఖభయాధిశోకమోహప్రదం తుచ్ఛమహం భజేఽజ్ఞా ॥12530॥*


పరమానందస్వరూపుడు, సుఖప్రదాతయు ఐన పురుషోత్తముడు నా హృదయమునందే స్థిరముగా నిలిచియున్నాడు. అతడు లక్ష్మీపతియగుటవలన ధనమును కొల్లలుగా ఇయ్యగలడు. అంతేగాక చతుర్విధ పురుషార్థములను గూడ ఇయ్యగలడు. ఇట్టి ప్రభువును వీడి ఒక తుచ్ఛునికై ఆశపడుచుంటిని. అతడు నా మనోరథమును తీర్చుటకు అసమర్థుడు. అతని వలన నాకు దుఃఖము, భయము, ఆధివ్యాధులు, శోకము, మోహము ప్రాప్తించును. తెలివిలేనిదాననై అట్టి హీనుని భజింపదలచితిని కదా!


*8.32 (ముప్పదిరెండవ శ్లోకము)*


*అహో మయాఽఽత్మా పరితాపితో వృథా సాంకేత్యవృత్త్యాఽతివిగర్హ్యవార్తయా|*


*స్త్రైణాన్నరాద్యార్థతృషోఽనుశోచ్యాత్ క్రీతేన విత్తం రతిమాత్మనేచ్ఛతీ॥12531॥*


నేను నింద్యమైన వేశ్యావృత్తిని అవలంబించి నా దేహమును, మనస్సును వృథాగా క్లేశములపాలు చేసికొంటిని. స్త్రీలోలుడు, లోభులు అగు గౌరవహీనులకు ఈ శరీరమును అమ్ముకొని, ధనమును, రతిసుఖముసు కోరుకొంటిని. నేను ఎంతటి మూర్ఖురాలను?


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీమద్భాగవతము

 *26.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2273(౨౨౭౩)*


*10.1-1394-*


*క. జననీజనకుల వృద్ధులఁ*

*దనయుల గురు విప్ర సాధు దారాదులనే*

*జనుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక*

*వనరును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్.* 🌺



*_భావము: భాగ్యవంతుడై యుండి కూడా, ఎవరైతే తల్లిదండ్రులను, వృద్ధులను, సంతానాన్ని, గురువులను, బ్రాహ్మణులను, సాధు పురుషులను, భార్యను ఆదుకుని పోషించక నిరాదరణ చేస్తాడో, అట్టి వాడు ఈ భూమి మీద బ్రతికియున్నా, చచ్చినవానితో సమానము._*🙏



*_Meaning: "If one who is full of resources and capable, neglects one's parents, elders, wife, offspring, Guru, Brahmins and noble persons, even if alive, is equal to a dead person._* 🙏 



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

భారతీయ గణిత శాస్త్రజ్ఞులు

 గణితంలో, 1 నుండి 10 వరకు ఉన్న అన్ని సంఖ్యల ద్వారా ఏ సంఖ్యను విభజించలేము, 


కానీ ఈ ఒక సంఖ్య చాలా వింతగా ఉంది, ప్రపంచంలోని గణిత శాస్త్రజ్ఞులందరూ

ఆశ్చర్యపోయారు. 


ఈ సంఖ్యను భారతీయ గణిత శాస్త్రజ్ఞులు వారి అచంచలమైన తెలివితేటలతో కనుగొన్నారు.


ఈ సంఖ్య చూడండి 2520. 

ఇది చాలా సంఖ్యలలో ఒకటిగా అనిపిస్తుంది, 

కాని వాస్తవానికి అది కాదు, ప్రపంచంలోని చాలా మంది గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన సంఖ్య ఇది.

ఈ సంఖ్య 1 నుండి 10 వరకు ఏదైనా సంఖ్యతో విభజించబడుతుంది.

 సరి సంఖ్య అయినా లేదా బేసి అయినా

ఈ సంఖ్య 1 నుండి 10 వరకువరకు ఏ సంఖ్యతోనైనా విభజించబడుతుంది. మిగిలినది సున్నా. 

ఇది నిజంగా అద్భుతమైన మరియు అసాధ్యమైన సంఖ్యలా అనిపిస్తుంది. ఇప్పుడు తదుపరి పట్టికను చూడండి.


2520÷1 = 2520   

2520÷2 = 1260 

2520 ÷ 3 = 840 

2520 4 = 630 

2520 5 = 504 

2520 6 = 420 

2520 ÷ 7 = 360 

2520 8 = 315 

2520 ÷ 9 = 280 

2520 10 = 252 


2520 సంఖ్య యొక్క రహస్యం [7 × 30 × 12] యొక్క గుణకారంలో దాగి ఉంది. 


భారతీయ హిందూ సంవత్సరానికి సంబంధించి, ఈ 2520 సంఖ్య యొక్క చిక్కు పరిష్కరించబడుతుంది, 

ఇది ఈ సంఖ్య యొక్క గుణకం. 


వారంలో రోజులు (7), 

 నెలలో రోజులు (30) 

మరియు ఒక సంవత్సరంలో నెలలు (12) 


 [7 × 30 × 12 = 2520] కాలక్రమం యొక్క లక్షణం మరియు ఆధిపత్యం ఇది.

ఇది కనుక్కున్న మహానుభావుడు 

*శ్రీ శ్రీనివాస రామానుజం*

శ్రీ మహాభారతంలో శ్లోకములు

 

శ్రీ మహాభారతంలో శ్లోకములు


మనకు గల అన్ని పురాణములలో, ఇతిహాసములలొ ముఖ్యమైనది మహాభారతం. తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట " తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి". అంటే కాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా, ఎక్కువ సేపు చెప్తుంటే మనం సహజంగా అనే మాట "ఏమిటి ఆ చాట భారతం" అని కదా! మరి భారతం ఎంత పెద్దదో మనకు తెలుసా?


మనకు తెలిసినంత వరకు భారతం 18 సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది. ఇందులో ఏది చూసినా 18. దీనిలోని పర్వములుకూడా 18. ఇప్పుడు వాటి పేర్లు వానిలోగల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం!



ఆదిపర్వం - 9984 శ్లోకములు

సభాపర్వం - 4311 శ్లోకములు

అరణ్య పర్వం - 13664

విరాటపర్వం - 3500

ఉద్యోగ పర్వం - 6998

భీష్మ పర్వం - 5884

ద్రోణ పర్వం - 10919

కర్ణ పర్వం - 4900

శల్య పర్వం - 3220

సౌప్తిక పర్వం - 2870

స్త్రీ పర్వం - 1775

శాంతి పర్వం - 14525

అనుశాసనిక పర్వం - 12000

అశ్వమేధ పర్వం - 4420

ఆశ్రమవాస పర్వం - 1106

మౌసల పర్వం - 300

మహా ప్రస్థాన పర్వం - 120

స్వర్గారోహణ పర్వం - 200


అన్ని కలిపితే మనకు మహాభారతం లో మొత్తం 1,00,696 శ్లోకములు ఉన్నాయి

కాశీకంటేపురాతనమైనపుణ్యక్షేత్రం

 #వృధ్ధాచలం(విరుదాచలం)

#కాశీకంటేపురాతనమైనపుణ్యక్షేత్రం


          తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెలుతామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం.


          #వృద్దాచలాన్ని, వృద్ధకాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే #మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం #వృద్ధకాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే, ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు


          కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న #వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు #తారకమంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు.


       అదే విధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి ఈయన చిదంబరంలో, కాళీతో పోటిపడి నాట్యం చేస్తే ఈ విరుదాలచలం లేదా వృద్దాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు. అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే.


#ఆనందతాండవం


చిదంబరంలో పరమశివుడు కాళీ మాతతో పోటీ పడి నృత్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు. 

అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా, గిట్టినా, నివసించినా భగవంతుడిని ప్రార్థించినా మోక్షం లభిస్తుందని చెబుతారు.


        ‌శివుడు మొదట ఇక్కడ కొండరూపంలో వెలిశాడని చెబుతారు. 

అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట #పఝుమలై అని పిలచేవారు. 

అటు పై విరదాచలంగా ఖ్యాతి పొందింది.


స్వామివారిని సేవిస్తే


పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్టకష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి, స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు.దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది.దీనికి విభాసిత మహర్షి , వృద్దేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పనిచేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతంగా లాభం చేకూరుతుందని చెప్పారు. 

దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకొన్నారు.

ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి #విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు.


ఆశ్చర్యం ఆకులు నాణ్యాలుగా


ఎవరు ఎంత పని చేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి. అప్పటి నుంచే చేసిన వారికి

 " చేసినంత,చేసుకున్నవారికి చేసుకొన్నంత " అనే #నానుడి మొదలయ్యిందని చెబుతారు.


మణిముత్తా నదిలో వేసిన నాణేలు తిరువారూరు కొలనులో ...


ఒకసారి ఈ క్షేత్రం గుండా సుందరర్ అనే గాయకుడైన శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు. 

దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణ్యాలను అందజేస్తాడు.తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు. 

ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణ్యాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని నీవు తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు.ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణ్యాలను తీసుకొన్నాడని కథనం.అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు.


5 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత


ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది. 

ఈ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు 5 5. 

వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. 

ఇక్కడ స్వామివారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు. 

ఆలయానికి 5 గోపురాలు ఉన్నాయి. 

అదే విధంగా 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి. 

వేకువజాము నుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు. 

ఇక్కడ 5 రథాలు ఉన్నాయి. 

ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మన:శ్శాంతి కలగడమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు. 

ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు.


పాతాళ వినాయకుడు


శ్రీ కాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ విగ్నేశ్వరుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు.


ఈ విరుదాచలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. ఈ విషయానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. అరుణాచలంలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.


వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు :


ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయంలో చూస్తాం. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నించుకొన్న కోరికలు త్వరగా తీరుతాయని చెబతారు.


సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ట చేసిన 28 శివలింగాలు


శైవ సిద్దాంతం ప్రకారం ఇక్కడ 28 ఆగమ శాఖలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివలింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని నమ్ముతారు.


ఈ సిద్ధాంతాల వల్లే ఈ ఆలయానికి ఆగమ ఆలయమని పేరు. ఈ విశేషం ఉన్న ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ అదే విధంగా సాయంకాలం 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది.


ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ


అరుణాచలం అంటే తిరువణ్ణామలైలో చేసినట్లుగానే 

ప్రతి పౌర్ణమికీ ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.

దీని వల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.


చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

                            #స్వస్తి

🙏🕉️🌞🔱🚩💐🌈💐💐🙏

అందమైన పత్రిక..!*

 *పుత్రిక..నీ జీవితాన అందమైన పత్రిక..!*


నువు పోతే కర్మ 

చేసే కొడుకు 

బ్రతికున్నప్పుడు 

నీ ఖర్మకి నిన్నొదిలేస్తే 

అక్కున చేర్చుకుని 

ఓదార్చేది ఆడపిల్ల..

కొడుకు ఉద్ధరిస్తాడనేది కల్ల

కూతురే ఇప్పుడు 

కొడుకై వర్థిల్లుతున్నది జగమెల్ల..!


కూుతురంటే....

నీ ఇంటి సిరి..

నీ పాలి జాబిల్లి..

నీ జీవితాన మహారాణి

పుట్టుకతోనే నీ యువరాణి..


అమ్మ వెళ్ళిన 

తర్వాత అంత ప్రేమగా 

నీకు ముద్ద పెట్టే..

ముద్దు పెట్టే తోడు లేదని 

బాధ పడే 

నిన్ను లాలనగా 

దగ్గరికి తీసుకుని 

తన ఎంగిలి కంచంలోని గోరుముద్దని ప్రేమగా నీకు పెట్టి నువ్వు తింటుంటే చూసి మురిసిపోయే

మరో అమ్మ..నీ ముద్దుగుమ్మ!


తన ఆటపాటలతో 

నిను మురిపించే చిన్నారి..

బుడిబుడి అడుగులతో పరిగెత్తుకొచ్చి 

నిన్ను హత్తుకునే పొన్నారి..

తన చిన్ని చిన్ని 

ఆనందాలను 

నీతో పంచుకునే చిట్టితల్లి..

ఒకనాటికి కన్యాదాన ఫలంతో నిన్ను ఋషిని చేసే దేవత..

అత్తింటికి వెళ్తూ 

నీవైపు చూసే ఆ కళ్ళు..

కన్నీటి సెలయేళ్ళు..

ఓ జన్మకు సరిపడే 

అనుభూతికి ఆనవాళ్లు..

అప్పుడు ఆ బుట్టబొమ్మ 

కన్నీటి చారికకు 

ఓ ఫోటో తీసి 

నెగటివ్ ని పాజిటివ్ గా 

మారిస్తే కనిపించే అక్షరాలు..

నాన్నా..ఐ మిస్ యు.. 

నీ జన్మకు 

అంతకు మించిన బాధ..

మరొకటి ఉండేనా

అది నీ నుదుటిన 

నీ బిడ్డ రాసిన 

అనుభవాల

అనుభూతుల గాథ..

ఓ దృశ్యకావ్యమే కదా..

నిజానికి అదే కదా 

నీ అసలు కథా..


ఇప్పుడిప్పుడు ఆమెకు ప్రభుత్వాలు ఇమ్మంటున్నాయేమో

ఆస్తిలో వాటా..

అది లేకపోయినా..

ఇవ్వకపోయినా

కూతురు తీసుకుంటుంది 

నీ బాధల్లో వాటా..

కొడుకు పంచుకునేది 

నీ అంతస్తు..

ఆడపిల్ల కోరుకునేది 

మాత్రం నీ శ్రీరస్తు..

అందుకే ఇప్పుడు 

చాలామంది 

తల్లిదండ్రల వానప్రస్థం 

కూతురి సన్నిధిలోనే శుభమస్తు!


       daughter"s day               

             శుభాకాంక్షలతో

     *సురేష్ కుమార్ ఎలిశెట్టి*

          9948546286

శుక్లాం బరధరం అయ్యిందా

 శుక్లాం బరధరం అయ్యిందా!! ♥️

☕☕

కాంచి మహా పెరియవర్ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మంచి హాస్య ప్రియులు. ఒకరోజు తన శిష్యుని పిలిచి,

"సంధ్యా వందనం అయిందా? శుక్లాం బరధరం అయిందా? "అనిఅడిగారు.

వెంటనే ఆ శిష్యుడు అయిందని తల ఆడించాడు.

దానికి మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం చెప్పావా అని అడగలేదు. అయిందా అని అడిగాను " అన్నారు.

శిష్యుని కి ఏమీ అర్థం కాలేదు. పెరియవర్ ఏమని అడిగారు? ఈ పదాలకు వున్న భేదాలేవీ బోధపడక పరితపించాడు. అతనికి సందేహంగాను వుంది. .......

కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిన తరువాత,

మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం "చెప్పు చూద్దాం అన్నారు.....

పెరియవర్ చెప్పమన్న వెంటనే,"శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే "అని శిష్యుడు చెప్పాడు.......

శిష్యుడు చెప్పింది విన్న మహాపెరియవర్ " దీనికి అర్థం తెలుసా? "అని అడిగారు. "తెలుసు "అని బదులు చెప్పిన శిష్యుడు, తెల్లని మనసు, యేనుగులా నల్లని రంగు, నాలుగు చేతులు,ప్రకాశమయిన ముఖం, అందరూ తలచి చూసేలా చేయు ఆకారం వున్న వినాయకుని స్మరిస్తే ఏవిధమైన ఆటంకాలు, బాధలూ వుండవని చెప్పాడు. .....

అరే !సరిగ్గా చెప్పావే,దానికి ఇంకో అర్థం వుంది, అది నీకు తెలుసా? అని చెప్పి,నవ్వారు.

శుక్లాం అంటే తెల్లనిది. అంటే పాలు. విష్ణుం అంటే నలుపు అది డికాషన్. శశి వర్ణం అంటే నలుపు తెలుపు కలిసినది. అంటే "కాఫీ". చతుర్బుజం అంటే నాలుగు చేతులు. అంటే, భార్యవి రెండు

చేతులు, కాఫీ ఇవ్వగానే అందుకునే భర్తవి రెండు చేతులు కలిసి నాలుగు చేతులు.

"ధ్యాయేత్ అంటే తలిచే తలపులు. అంటే అలాకాఫీ ఇవ్వడాన్ని మనసులో తలవగానే

"ప్రసన్న వదనం "ముఖం వికసిస్తుంది ఆసమయంలో. "సర్వ విఘ్నోప శాంతయే "అంటే అన్ని వేదనలూ పోగొట్టేది. అనగా కాఫీ త్రాగితే వేదనలుతీరి, మనసు శాంతమవుతుందని అర్థం. ....

"శుక్లాం బరధరం అయిందా "అన్న ప్రశ్నలో , కాఫీ త్రాగటం అయ్యిందా? అన్న అర్ధం దానిలో ఇమిడి వుంది.

అని తెలుసుకున్న శిష్యులు మైమరచి నవ్వనారంభించారు.

 🙏శుభోదయం🙏

☕☕☕☕☕☕☕☕☕☕

కథ

 

 కథ* 

                  🌷🌷🌷

"సార్ !మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు" అటెండర్ వచ్చి వినయంగా చెప్పాడు. "లోపలకి పంపించు" అన్నాను." సరే సార్!" అంటూ అటెండర్ వెళ్ళాడు.

      కొద్దిసేపు సేపటికి ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అతని వంక పరిశీలనగా చూస్తూ "కూర్చోండి "అన్నాను. అతను ముఖానికి పట్టిన చెమట తుడుచు కోవటానికి కళ్ళజోడు తీసి జేబురుమాలుతోముఖం తుడుచుకున్నాడు.

    క్షణమాగి "నాపేరు పురుషోత్తం.తాలూకా ఆఫీస్ లో యూడీసీ గాపని చేస్తున్నాను" అని పరిచయం చేసుకున్నాడు.నేను అతనివంక సాలోచనగా చూసాను."మీతో ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను" అన్నాడు." చెప్పండి" అన్నాను. అతను కుర్చీలో కొంచెం ఇబ్బందిగా కదలడం గమనించాను.అతని మౌనం నాకు కాస్తంత చిరాకు తెప్పించింది. అది బయటకు కనిపించకుండా 

" వచ్చిన విషయం చెప్పండి "అన్నాను 

      అతను తనఇబ్బంది పక్కన పెట్టి" మీ అబ్బాయి సందీప్ మా అమ్మాయి వెంట పడి అల్లరి చేస్తున్నాడు" అని చెప్పాడు. అతను చెప్పింది వినగానే నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మనసులో అలజడిమొదలైంది.అతను చెప్పింది ఒప్పుకోవడానికి నా మనసు అంగీకరించలేదు .కానీ అకారణంగా ఏ ఆడపిల్ల తండ్రీ వచ్చి నా కూతుర్ని నీ కొడుకుఅల్లరి పెడుతున్నాడని చెప్పడు. అతను

చెప్పేది జీర్ణం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.

      నా కన్నులముందు సందీప్ ముఖం కదలాడింది. ఇంటికి వెళితే "డాడీ !డాడీ!" అంటూ ఇంకా చిన్నపిల్లాడిలా కబుర్లు చె ప్తూ ఎంతో అమాయకంగా కనిపించే సందీప్ ఒక ఆడపిల్ల వెంటపడి అల్లరి చేసే స్థాయికిదిగజారడం నిజమేనా ?నిజమే అయితే నా పెంపకంలో ఎక్కడుంది లోపం? చిన్నప్పటినుంచి సందీప్ కి నేనుచెప్పిన నీతి కథలు గుర్తుకు వచ్చాయి. వాడిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నేను పడిన తపన నన్ను వెక్కిరించింది.

       చదువులో సందీప్ ఫస్ట్ వస్తే నేను ఎంతో సంతోషించేవాడిని. మంచి గిఫ్ట్ కొనిచ్చి ప్రోత్సహించే వాడిని. అవన్నీ ఎదుటి వ్యక్తి చెప్పిన ఒకే ఒక్క మాటతో చెల్లాచెదురయ్యాయి. నా ముఖంలోని భావాలు ఎదుటి వ్యక్తి గమనించినట్లు ఉన్నాడు" క్షమించండి!ఈ విషయం మీ వరకు తీసుకు రాకూడదు అనే అనుకున్నాను. అందుకే నేను వ్యక్తిగతంగా మీ అబ్బాయిని కలిసి మంచిగా చెప్పి చూసాను. అయినా సరే పరిస్థితిలో మార్పు రాలేదు. అందుకే మిమ్మల్ని కలవక తప్పలేదు" అన్నాడు." మావాడు నిజంగానే అలా ప్రవర్తించి ఉంటే హృదయపూర్వకంగా క్షమార్పణలు కోరుతున్నాను. మీ సమస్య నేను సరి చేస్తాను" అన్నాను.

     నేను అన్న మాటల్లో "నిజంగానే" అన్న పదం వాడటం సందీప్ మీద నాకున్న నమ్మకాన్ని పూర్తిగా విచ్చిన్నం చేయలేదని గమనించాను." మీరు ఎక్కడ ఉంటున్నారు" అని ప్రశ్నించి అతను చెప్పిన అడ్రస్ నోట్ చేసుకున్నాను.

     అతను పైకి లేచి" మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి "అని రెండుచేతులు జోడించాడు. "క్షమార్పణ చెప్పవలసింది నేను. వెళ్ళిరండి" అన్నాను. అతను వెళ్ళిపోయాడు. 

        వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడానికి నా మనసుఎదురు తిరుగుతున్నది. సందీప్ భవిష్యత్తును ఉజ్వలంగా చేయడానికి నేను అందరి తండ్రుల కంటే ఎక్కువ తపన పడ్డాను. వాడిని ఎల్కేజీ లో జాయిన్ చేసిన దగ్గర్నుంచి బీటెక్ లో జాయిన్ చేసే వరకు ఎంతో శ్రమించాను. నిజానికి మగపిల్లలు తల్లికి ఎక్కువ మాలిమి అవుతారు. కానీ మా సందీప్ విషయంలో అలా కాదు. వాళ్ళ అమ్మతో కంటే నాతోనే చనువుగామసలేవాడు. అది తెలిసిన నా భార్య కౌసల్య ఉడుక్కున్నసందర్భాలు ఉన్నాయి.

      సందీప్ కి నేనంటే ఎంతో గౌరవం. నా మాట ఎప్పుడూ కాదు అనడు. ఒకరకంగా చెప్పాలంటే నా మాట వాడికి వేదం. సందీప్ చిన్నప్పుడు నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి కౌసల్య" ఈ పూట వీడుచదవలేదు" అని ఫిర్యాదు చేసేది. "ఏం సందీప్" అనగానే వాడు నిజాయితీగా తప్పు ఒప్పుకునే వాడు. అప్పటికప్పుడు స్కూల్ బ్యాగ్ తెచ్చుకొని కూర్చొని చదివేవాడు. వాడలా చదవడం చూస్తే నాకు ఇచ్చే గౌరవానికి ముచ్చట వే సేది ."అయితే డాడీ చెప్తేనే గాని చదవవు అన్నమాట అనేది కౌసల్య .అలా అన్నప్పుడు నేను చూడకుండా వెక్కిరించే వాడని కౌసల్య చెప్పేది.

 సందీప్ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక కోరిక కోరాడు." డాడీ !నాకు ఎంసెట్ లో మంచి ర్యాంకు వస్తే హీరో హోండా కొనిపెట్టండి" అని అడిగాడు." మంచి ర్యాంకు తెచ్చుకో! కొనిపెడతాను" " అన్నాను.

           సందీప్ మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు.

మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది.

 అదీమా సిటీ లోనే .వాడికి హీరో హోండా కొనిచ్చి నా మాట నిలబెట్టుకున్నాను. 

     హీరో హోండా డ్రైవ్ చేస్తూ సందీప్ఒక అమ్మాయిని అల్లరి పెడుతున్న దృశ్యం ఊహించుకుంటూ ఉంటేనే నా మనసు బాధతో విలవిలలాడింది.తప్పు ఎక్కడ జరిగి ఉంటుందా?

అని ఆలోచించసాగాను.ఆ పూట ఆఫీస్ పని అటెండ్ కాలేకపోయాను. సాయంత్రం ఐదింటికే ఆఫీస్ నుంచి బయలుదేరి పోయాను

      సమయానికి డ్రైవర్ లేడు. నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ ఉదయం పురుషోత్తం చెప్పిన గుర్తుల ప్రకారం అతని ఇల్లు చేరాను. అప్పటికే నా మనసు ఒక నిర్ణయానికి వచ్చేసింది.

     నేను వెళ్లే సరికి పురుషోత్తం ఇంట్లో లేడు. అతని భార్య నన్ను చూడగానే

" మీరు... "అని సందిగ్ధంగా ఆగింది.

 సందీప్ తండ్రి గా తొలిసారి సిగ్గుపడుతూ పరిచయం చేసుకున్నాను.

     సందీప్ పేరు వినగానే ఆమె ముఖంలో రంగులు మారడం గమనించాను. తన భావాలు

కప్పి పుచ్చుకుంటూ "లోనికి రండి" అని మర్యాదగా లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చో పెట్టింది .

      పురుషోత్తం భార్య ఇచ్చిన కాఫీ తీసుకుంటూ సందీప్ విషయం కదిలించాను. "ఉదయం పురుషోత్తం గారు ఆఫీస్ కి వచ్చి విషయం చెప్పారు. సందీప్ తరఫున కమార్పణ వకోరడానికి వచ్చాను" అన్నాను.

          ఒక్కసారిగా అలా అనేసరికి ఆమె తడబడి "అంత మాట వద్దు. మీ బాబుని మందలిస్తే సరిపోతుంది"అన్నది." నిజంగా సందీప్ ఇటువంటి పని చేస్తాడని ఊహించ లేదు. నేను ఎరిగిన సందీప్ బుద్ధిమంతుడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది" అన్నాను.

       అంతలో ఒక అమ్మాయి చేతిలో బుక్స్ తో ఇంట్లోకి వచ్చింది. ఆ అమ్మాయి అందంగా...నాజూగ్గా ఉంది." మా అమ్మాయి దివ్య" అని పరిచయం చేసింది ఆమె." నమస్తే!" అన్నది దివ్య. ప్రతి నమస్కారం చేశాను.ఆ అమ్మాయి ముఖంలోని ప్రశ్నార్థకం గుర్తించిన పురుషోత్తం భార్య "సందీప్ నాన్నగారు" అని పరిచయం చేసింది. 

     అంతే ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ముఖంలో రంగులు మారాయి." కూర్చో దివ్యా!" అన్నాను. దివ్య చేతిలోని బుక్స్ టేబుల్ మీద పెట్టి వచ్చి నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ."సూటిగా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. సందీప్ ఎప్పటి నుంచి నీ వెంట పడుతున్నాడు?" అని ప్రశ్నించాను ."సుమారు రెండు నెలల నుంచి " అన్నది దివ్య ."వాడి కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా? "అని అడిగాను." ఇంకో అబ్బాయి ఉంటాడు. అతని ఫ్రెండ్ అనుకుంటాను .బండి వెనక కూర్చొని మీ అబ్బాయి కామెంట్స్ విసరడానికి హుషార్ చేస్తుంటాడు"చెప్పింది దివ్య .

        నాకు విషయం అర్థమైంది .సందీప్ కొత్తగా బీటెక్ లో జాయిన్ అయ్యాడు. కొత్త స్నేహితుల ప్రభావం అతని మీద పడింది. 

       అంతలో పురుషోత్తం వచ్చాడు. నన్ను చూడగానే నమస్కరిస్తూ "మీ వంటి పెద్దవారు మా బోటి వారింటికి రావడం...." అంటూ మాట పూర్తి చేయలేకపోయాడు. అతను దివ్య పక్కన ఉన్న కుర్చీ లో కూర్చున్నాక ,దివ్య ఏ కాలేజీలో చదువుతున్నదో ... ఏం చదువుతుందో అడిగి తెలుసుకున్నాను. దివ్య ఉమెన్స్ కాలేజ్ లో బి.ఏ చదువుతున్నది. ఏం చేయాలో ఆలోచించాను.సందీప్ పట్ల ఎలా వ్యవహరించాలి? అన్నది నా మనసు ఒక నిర్ణయం తీసేసుకుంది.

        పురుషోత్తం తో "మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నాతో మా ఇంటికి తీసుకు వెళతాను. గంటలో తెచ్చి డ్రాప్ చేస్తాను "అన్నాను. పురుషోత్తం ఏమనుకున్నాడో "ఎందుకండి? ముందుగా సందీప్ తోమంచిగా చెప్పి చూడండి. అమ్మాయిని తీసుకుని వెళ్లి తన ముందు మందలించడం బాగుండదేమో!" అన్నాడు. నేను చిన్నగా నవ్వాను." నేను సందీప్ మందలించను. దయచేసి మరేం ప్రశ్నించకుండా దివ్య ను నాతో పంపండి" అన్నాను .అతను మరి ఇంకేం మాట్లాడకుండా దివ్య తో "అంకుల్ తో 

వెళ్ళమ్మా!" అన్నాడు.

      " ఒక్క నిమిషం" అని దివ్య లోనికి వెళ్లి ముఖం కడుక్కుని ఫ్రెష్ గా వచ్చింది. నేను ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని మా ఇంటికి తీసుకు వెళ్ళాను. అప్పటికి ఇంకా సందీప్ ఇంటికి రాలేదు. నా భార్య కౌసల్యకు దివ్యనునా స్నేహితుడు కూతురు గా పరిచయం చేశాను.

      మరో పావు గంటలో బయట హీరోహోండా చప్పుడు వినిపించింది. కొద్ది సేపటికి సందీప్ లోనికి వచ్చాడు.సోఫాలో నాతోపాటు కూర్చున్న దివ్యను చూడగానే సందీప్ కంగారు పడ్డాడు.అది నేనుస్పష్టంగా గమనించాను .గమనించనట్లు ఈ అమ్మాయి దివ్య .నా ఫ్రెండ్ కూతురు.కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చారు" అని పరిచయం చేసాను. "హలో!" అని గొణిగాడు సందీప్.దివ్య తలదించుకుంది. సందీప్ తడబడే అడుగులతో తన గదిలోకి వెళ్ళిపోయాడు.

         మరో అరగంట తర్వాత దివ్యను కారులో తీసుకుపోయి డ్రాప్ చేసి వచ్చాను .మధ్యలో "దివ్యా! నా అంచనా తప్పకపోతే సందీప్ నీ వెంట ప డడు. పడితే మాత్రం సందేహించక నాకు ఫోన్ చెయ్యి" అని నా విజిటింగ్ కార్డ్ అందిం చాను .

     ఆ తర్వాత వారం రోజులు నేనుసందీప్ తో

ముభావంగా వ్యవహరించాను. నేనెందుకు ముభావంగా ఉన్నానన్నది సందీప్ గ్రహించే ఉంటాడు. నాతో మాట్లాడడానికి 

ప్రయత్నించాడు కానీ నేనే కట్ చేశాను.

       వారం తర్వాత ఒకరోజు "సందీప్! నాకు డబ్బులు అవసరం వచ్చింది. నీ హీరో హోండా అమ్మే ద్దామనిఅనుకుంటున్నాను" అన్నాను.

" మీ ఇష్టం" అన్నాడు సందీప్.

    " మరి కాలేజీకి బస్సులో వెళ్లి రాగలవా?" అన్నాను ." ఇబ్బంది లేదు అన్నాడుసందీప్. పది రోజుల్లో హీరో హోండా అమ్మేశాను.

నా భార్యకు సూచాయగా విషయం చెప్పాను. 

     " ఈమధ్య వాడికి సురేష్ అనే వాడితో పరిచయం అయిందట. దివ్య వెంటపడి అల్లరి చేయడానికి కారణం సురేష్ అట. మీరు వాడి హీరో హోండా అమ్మి వేసిన దానికంటే మీరు వాడితో సరిగ్గా మాట్లాడనందుకే వాడు ఎక్కువ బాధ పడుతున్నాడు" అని చెప్పింది నా భార్య.

 నేను వాడిని అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి పురుషోత్తం కలిసి "సందీప్ మునుపటిలా ప్రవర్తించడం లేదు" అని చెప్పాడు. అప్పుడప్పుడు దివ్యను మా ఇంటికి పంపమని పురుషోత్తం తో చెప్పాను.

       దివ్య అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. ఇప్పుడు వాళ్ళుఇద్దరూ మంచి స్నేహితులు.

        సందీప్ బీటెక్ పూర్తయింది నా పరపతితో పనిలేకుండానే మంచి ఉద్యోగం వచ్చింది. పోస్టింగ్ ఢిల్లీలో ఇచ్చారు .

            సందీప్ జాబ్ లో చేరడానికి ఢిల్లీ బయలుదేరాడు.

        వాడితో పాటు స్టేషన్ కి నేను, కౌసల్య వెళ్ళాము .ట్రైన్ వచ్చింది. కొత్త ప్రదేశం జాగ్రత్తగా ఉండమని కౌసల్య పదేపదే చెప్పింది. ట్రైన్ బయలుదేరే సమయం అయింది. సందీప్ ఒంగి నా పాదాలు తాకి" థాంక్యూ డాడీ" అన్నాడు." ఎందుకు ?"అన్నాను .

     గతంలో నేను దివ్యను అల్లరి చేసినప్పుడు మీరు నన్ను సూటిగా అడిగినా, మందలించినా తప్పక ఎదురు తిరిగి ఉండేవాడిని .ఎందుకంటే అప్పుడు సురేష్ ప్రభావం నా మీద అంతగా ఉండేది. కానీ మీరు ఆ విషయాన్ని చాలా సున్నితంగా డీల్ చేశారు.నన్ను చెడు మార్గం నుంచి బయటకు లాగి నా భవిష్యత్తు పాడవకుండా చూశారు" అన్నాడు.

    " నిజానికి ఇందులో నీవు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. నేను చేసింది కేవలం నీ తప్పు నువ్వు గ్రహించేలా దివ్యను మా ఫ్రెండ్ కూతురు గా పరిచయం చేశాను. నేను ఊహించినట్లే నువ్వు చేసిన తప్పు గ్రహించావు.ఆ తప్పును సరిదిద్దుకున్నావు. అది నీ గొప్పతనం" అన్నాను.

       గార్డ్ విజిల్ వేసి పచ్చ జండా ఊపాడు.

 ట్రైన్ కదిలింది.కను చూపు మేర వరకూసందీప్ చేయి ఊపుతూనే ఉన్నాడు." థాంక్యు డాడీ" అన్నవాడి మాట నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది .

                      ట్రైన్ వేగం పుంజుకుంది.

గాడి తప్పిన రైలును పట్టాలు ఎక్కించడం కష్టం.ఆ తరువాత ఆ వేగం సహజం.

     సందీప్ విషయం లో నేను చేసింది అంతే!!

శ్రీకృష్ణుణుకి

 దుర్యోధనుని కూతురు లక్ష్మణను పెండ్లిచేసుకొన్న శ్రీకృష్ణుని కొడుకు ఎవరో మరి.

........................................................


శ్రీకృష్ణుణుకి ఎనిమిది మంది భార్యలు. వారిపేర్లు (1) రుక్మిణి, (2) సత్యభామ, (3) జాంబవతి, (4) నగ్నజితి, (5) కాళింది, (6) మిత్రవింద, (7) భద్ర, (8) లక్ష్మణ. వీరినే అష్టభార్యలంటారు.


శ్రీకృష్ణుడి అష్టభార్యలకు ప్రతి ఒక్కొక్కరికి పదిమంది కొడుకులు జన్మించారు.

వారెవరంటే 


పట్టపుమహిషి రుక్మిణిదేవికి శ్రీకృష్ణునికి (1) ప్రద్యుమ్నుడు, (2) చారుదేష్ణుడు, (3) సుదేష్ణుడు, (4) చారుదేహుడు, (5) సుబారుడు, (6) చారుగుప్తుడు, (7) భద్రకారుడు, (8) చారుచంద్రుడు, (9) విచారుడు, (10) చారుడు అనే కొడుకులు కలిగారు. 


వీరిలో ప్రద్యుమ్నుడి సంతానమే శ్రీకృష్ణుని వారసులుగా ద్వారకనేలుతారు.


సత్యభామ వల్ల కృష్ణునికి (1) భానుడు, (2) సుభానుడు, (3) స్వర్భానుడు, (4) ప్రభానుడు, (5) భానుమంతుడు, (6) చంద్రభానుడు, (7) బృహద్భానుడు, (8) అతిభానుడు, (9) శ్రీభానుడు, (10) ప్రతిభానుడు అనువారు కలిగారు.


జాంబవతీ శ్రీకృష్ణులకు (1) సాంబుడు, (2) సుమిత్రుడు, (3) పురజిత్తు, (4) శతజిత్తు, (5) సహస్రజిత్తు, (6) విజయుడు, (7) చిత్రకేతుడు, (8) వసుమంతుడు, (9) ద్రవిడుడు, (10) క్రతువు కలిగారు. 


సాంబుడు దుర్యోధనుని కుమార్తె లక్ష్మణను స్వయంవరంలో అపహరించి, కౌరవులతో పోరాడి ఓడి బందీగాదొరికి పెదనాన్న బలరాముడి ద్వారా విడుదలైతాడు. దుర్యోధనచక్రవర్తి తన గురువు బలరాముడి మాటలను గౌరవించి సాంబుడికి తన కుమార్తె లక్ష్మణను ఇచ్చి పెండ్లిచేశాడు.ఇలా శ్రీకృష్ణదుర్యోధనులు వియ్యంకులైనారు.


సాంబుడు అతని సహచరులు దుర్వాసుని గేలి చేయడం వలన ఆ మహముని శాపంతో సాంబుడి కడుపున ముసలం (రోకలి ) పుట్టి అశేషంగా యదువంశం నశిస్తుంది.

 

నాగ్నజితి, శ్రీకృష్ణులకు (1) వీరుడు, (2) చంద్రుడు, (3) అశ్వసేనుడు, (4) చిత్రగుడు, (5) వేగవంతుడు, (6) వృషుడు, (7) లముడు, (8) శంకుడు, (9) వసుడు, ( 10 ) కుంత అనువారు కలిగారు. 


శ్రీకృష్ణుడికి కాళింది వలన (1) శ్రుతుడు, (2) కవి, (3) వృషుడు, (4) వీరుడు, (5) సుబాహుడు, (6) భద్రుడు, (7) శాంతి, (8) దర్శుడు, (9) పూర్ణమానుడు, (10) శోమకులు జన్మించారు. 


లక్షణకు, శ్రీకృష్ణుడికి (1) ప్రఘోషుడు, (2) గాత్రవంతుడు, (3) సింహుడు, (4) బలుడు, (5) ప్రబలుడు, (6) ఊర్ధ్వగుడు, (7) మహాశక్తి, (8) సహుడు, (9) ఓజుడు, (10) అపరాజితుడు అనేవారు కలిగారు.


మిత్రవింద, శ్రీకృష్ణులకు (1) వృకుడు, (2) హర్షుడు, (3) అనిలుడు, (4) గృద్ధుడు, (5) వర్ధనుడు, (6) అన్నడు, (7) మహాశుడు, (8) పావనుడు, (9) వహ్ని, (10) క్షుధి పుట్టారు.


శ్రీకృష్ణ భద్రలకు (1) సంగ్రామజిత్తు, (2) బృహత్సేనుడు, (3) శూరుడు, (4) ప్రహరణుడు, (5) అరిజిత్తు, (6) జయుడు, (7) (9) సుభద్రుడు, (8) వాముడు, ఆయువు, (10) సత్యకుడు అనేవారు కలిగారు.


శ్రీకృష్ణుడికి అష్టభార్యల వలన కలిగిన కొడుకుల సంఖ్య > 80.

సంస్కృతి సంప్రదాయాలను

 చిన్నవయసులో నేర్పిన తిధులూ వాటి ప్రాధాన్యత కలిపి చెప్పారు. అవే ఈనాటికీ గుర్తు. మనం కూడ మన వారసులకు ఇలా సంస్కృతి సంప్రదాయాలను నేర్పాలి. 

తిధులు:15 అవే తిరిగి మరల వస్తాయి కదా.

1.పాడ్యమి: సంవత్సరాది పాడ్యమి 

2.విదియ: ప్రీతి విదియ 

3.తదియ: అట్ల తదియ

4.చవితి: వినాయక చవితి 

5.పంచమి: ఋషి పంచమి 

6.షష్ఠి: సుబ్రహ్మణ్య షష్ఠి 

7.సప్తమి: రథ సప్తమి

8.అష్టమి:కృష్ణాష్టమి

9నవమి: శ్రీరామ నవమి

10.దశమి: విజయ దశమి 

11.ఏకాదశి: భీష్మ ఏకాదశి 

13.ద్వాదశి: చిలుకు ద్వాదశి 

14.చతుర్దశి: నరక చతుర్దశి

15.పౌర్ణిమ: శ్రావణ పౌర్ణమి 

లేక అమావాస్య: దీపావళి అమావాస్య 

ధన్యవాదాలు పరిశీలించిన వారికి. సంస్కృతి ఇలాగే జీవిస్తూ వుంటుంది.

నేర్చుకుందాం

 *గద్ద నుండి నేర్చుకుందాం*


       *గద్ద జీవితం! గ్రద్ద అనగానే మనకు ఎప్పుడూ కోడి పిల్లలను ఎత్తుకుపోయే దానిగా లేదా మనుషులను భయపెట్టే ఒక పక్షిగా మాత్రమే తెలుసు.*


 *ఇంకా గద్ద మనుషుల కళేబరాలని పీక్కు తింటాయని తెలుసు. 


 *కానీ గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుంది.*


 *గద్ద జీవితకాలం 70ఏళ్ళు, ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గద్దే. అయితే గద్దకి 40ఏళ్ళు పూర్తి అయ్యేసరికి దాని కాళ్ళ గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు.*


 *పొడవైన దాని ముక్కు కొన చివర వొంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై... చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఆ సమయంలో దాని ముందున్నవి రెండే లక్ష్యాలు. ఒకటి ఆహారాన్ని సంపాదించుకోలేక శుష్కించి మరణించడం, లేదా బాధాకరమైన సరే తనను తాను మార్చుకోవడం.*


 *ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా… ఎంత క్షీణ దశకు వచ్చినా బతకాలనే అనుకుంటుంది. అలాగే గద్ద కూడా. మరి గద్ద ఏవిధంగా తనను తాను మార్చుకుంటుందో ఒక్కసారి చూద్దాం!*


 *గద్దకు ఈ మార్పు చాలా బాధాకరమైనది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ. ఈ మార్పు కోసం గద్ద తనకు అందుబాటులో వున్న ఒక ఎతైన కొండను తన స్థావరంగా చేసుకుంటుంది. అక్కడకి వెళ్ళి పెరిగిపోయిన తన ముక్కుకొనను కాలిగోళ్ళ మధ్య పెట్టుకొని ఎంతో భాద కలిగినా నెమ్మదిగా వొలిచేసుకుంటుంది.*


 *ఇలా వదిలించుకున్న ముక్కు కాస్తా మళ్ళీ కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది.* 


*అలాగే పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్ళను వదిలించుకుంటుంది. ఇక కొత్త గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో తన రెక్కలకు బరువైన పాత ఈకలను పీకేస్తుంది. అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది.*


*ఇలా 5నెలలు బాధాకరమైన కృషితో సాధించుకున్న పునరుజ్జీవనం, పునరుత్తేజంతో మరో 30ఏళ్ళు హాయిగా బతుకుతుంది.* 


*ఈ సృష్టిలో మనం బ్రతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం. అలాగే కొత్తగా ఆలోచించడం, నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడం అనే జీవిత సత్యాన్ని, గద్ద జీవితం నుంచి నేర్చుకుందాం.


*ఇలానే ప్రతీ మానవునికి కూడా జీవించాలనే ఉంటుంది. కాని జీవితాన్నే మార్చే వ్యాయామం మాత్రం 1 గంట చేయలేము. మంచి జీవితం మాత్రం కావాలి.*


*ఒక పక్షి 150 రోజుల కఠోర సాధనతో మరో 30 సంవత్సరాల వయస్సు పెంచుకుంది.* 


*పాత సామెత ఒకటి ఉంది…"కుండలో ఉన్న అన్నం కుండలోనే ఉండాలి, అబ్బాయి మాత్రం బొద్దుగా ఉండాలి అని"*


*అలానే మనం మన శరీరాన్ని అసలు కష్టపెట్టం, ఎండతగలనీయం, వ్యాయామం చేయము కాని ఆరోగ్యం, ఆనందం మనకు కావాలి....!* 

*ఎలా వస్తుంది... ? ఎక్కడ నుంచి వస్తుంది....?*


*ఒక పక్షి సాధన చేత మరో పునర్జీవనం తెచ్చుకున్నట్టుగా ....*


*మనమూ శారీరక వ్యాయామం చేద్జాం...ఆరోగ్యమైన మనుషులుగా మారి ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమే మహాసంపద*

🙏🙏🙏శుభోదయం🙏🙏🙏

సంస్కృత మహాభాగవతం

 *26.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*8.17 (పదిహేడవ శ్లోకము)*


*గ్రామ్యగీతం న శృణుయాద్యతిర్వనచరః క్వచిత్|*


*శిక్షేత హరిణాద్బద్ధాన్మృగయోర్గీతమోహితాత్॥12516॥*


వనవాసియగు సన్న్యాసి విషయభోగములకు సంబంధించిన గీతములను వినరాదు. కిరాతునియొక్క సంగీతమునకు ఆకర్షితమైన హరిణము ఆ వ్యాధునిచే బంధింపబడి కడకు అసువులనే కోల్పోవును. అందువలన యతి లేదా సాధకుడు దైవమునకు సంబంధించిన గీతములను సంభాషణలను వినవలెనేగాని, గ్యామ్య-శృంగార గీతములకు చెవియొగ్గినచో, అతడు భ్రష్టుడగును.


*8.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*నృత్యవాదిత్రగీతాని జుషన్ గ్రామ్యాణి యోషితామ్|*


*ఆసాం క్రీడనకో వశ్య ఋష్యశృంగో మృగీసుతః॥12517॥*


యదుమహారాజా! హరిణియొక్క గర్భమునుండి జన్మించిన ఋష్యశృంగుడు (విభాండకుని సుతుడు) తరుణీమణులయొక్క విషయభోగములకు సంబంధించిన నృత్యములను జూచుచు, మృదంగాది వాద్యములతో గూడిన గీతములను వినుచు వారికి వశుడై, వారి చేతిలో ఆటబొమ్మ అయ్యెను. గ్రామ్య-శృంగార గీతముల దుష్ప్రభావము ఎంతవరకు దారితీయునో నీవు ఎరిగినదే గదా!


*8.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*జిహ్వయాతిప్రమాథిన్యా జనో రసవిమోహితః|*


*మృత్యుమృచ్ఛత్యసద్బుద్ధిర్మీనస్తు బడిశైర్యథా॥12518॥*


గాలమునకు గ్రుచ్చబడిన ఎరకు ఆశపడిన చేప ఆ గాలమునకు చిక్కుకొని తుదకు ప్రాణములనే పోగొట్టుకొనును. అట్లే అంతులేని జిహ్వచాపల్యముగల మానవుడు రోగములపాలై మృత్యుముఖమున బడును. 


*8.20 (ఇరువదియవ శ్లోకము)*


*ఇంద్రియాణి జయంత్యాశు నిరాహారా మనీషిణః|*


*వర్జయిత్వా తు రసనం తన్నిరన్నస్య వర్ధతే॥12519॥*


*8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*తావజ్జితేంద్రియో న స్యాద్విజితాన్యేంద్రియః పుమాన్|*


*న జయేద్రసనం యావజ్జితం సర్వం జితే రసే॥12520॥*


వివేకముగలవారు ఆహారమును భుజించుటమాని, ఇతరేంద్రియములను వశపరచుకొనవచ్చును. కాని దానివలన రసనేంద్రియము వశము గాదు. సరిగదా! భోజనేచ్ఛ ఇంకను ప్రబలమగును. కనుక రసనేంద్రియమును జయింపనంతవరకును మానవుడు జితేంద్రియుడు కాజాలడు. రసనేంద్రియమును జయించినచో అన్ని ఇంద్రియములు అతనికి వశమైనట్లే.


*8.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*పింగలా నామ వేశ్యాఽఽసీద్విదేహనగరే పురా|*


*తస్యా మే శిక్షితం కించిన్నిబోధ నృపనందన॥12521॥*


యదుమహారాజా! పూర్వకాలమున విదేహ నగరమునందు *పింగళ* యను వేశ్యగలదు. ఆమె నుండియు నేను కొంత నీతిని నేర్చుకొంటిని. ఆ విషయమును వినిపించెదను ఆలకింపుము.


*8.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*సా స్వైరిణ్యేకదా కాంతం సంకేత ఉపనేష్యతీ|*


*అభూత్కాలే బహిర్ద్వారి బిభ్రతీ రూపముత్తమమ్॥12522॥*


ఆ స్వేచ్ఛాచారిణి ఒకనాటి రాత్రి ఒక కాముకుని తన శయన మందిరమునకు తీసికొనపోదలచినదై, చక్కని వస్త్రాభరణములను అలంకరించుకొని (బాగుగా ముస్తాబై) గృహముఖద్వారము కడ వేచియుండెను.


*8.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*మార్గ ఆగచ్ఛతో వీక్ష్య పురుషాన్ పురుషర్షభ|*


*తాన్ శుల్కదాన్ విత్తవతః కాంతాన్ మేనేఽర్థకాముకా॥12523॥*


*8.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*ఆగతేష్వపయాతేషు సా సంకేతోపజీవినీ|*


*అప్యన్యో విత్తవాన్ కోఽపి మాముపైష్యతి భూరిదః॥12524॥*


యదుమహారాజా! పురుషశ్రేష్ఠా! ధనమునందు పేరాసతోనున్న ఆ పింగళ ఆ మార్గమున వచ్చిపోవుచున్న ప్రతిపురుషుని చూచుచు ఇట్లు తలపోయుచుండెను. 'ఇతడు ధనవంతుడు కావచ్చును. ఈ సుందరుడు సమృద్ధిగా శుల్కమును ఇచ్చి, నాతో రమించుటకే వచ్చుచుండవచ్చును'. పురుషులనుండి పుచ్చుకొనిన శుల్కముతోనే జీవించుచుండెడి ఆ సుందరి ఆ దారిలో వచ్చి పోవుచున్న పురుషులను అందరిని పరికించి పరికించి చూడసాగెను. ఆమె ప్రతి ఒక్కరిని జూచి ఇట్లు అనుకొన దొడంగెను. 'ఇతడు ధనికుడే కావచ్చును. నన్ను పొందుటకే వచ్చుచుండవచ్చును. ఇతడు సమృద్ధిగా శుల్కమును ఈయగలిగి యుండవచ్చును'. అని ఆమె అనుచుండగనే అందరును తమదారిన తాము వెళ్మిపోవుచుండిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*418వ నామ మంత్రము* 26.9.2021


*ఓం జడశక్త్యై నమః* 


జడాత్మకమైన ప్రకృతిని సృష్టించడానికి ఏర్పడిన మాయాపరిమాణ శక్తిస్వరూపిణి యైన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జడశక్తిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం జడశక్త్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులను ఆ పరమేశ్వరి సకలచరాచరాత్మకమైన జగత్తును తెలియువారిగను, సకలజగత్తుల సృజనకు కారణమైనది పరమేశ్వరియే అనియు, అట్టి పరమేశ్వరిని ఉపాసించి అనంతమైన బ్రహ్మజ్ఞానసంపదలను పొందగలమను జ్ఞానసమృద్ధిని అనుగ్రహించును.


జగత్స్వరూపమును సృష్టించుటకు ఏర్పడిన మాయాపరిణామ శక్తినే జడశక్తి యని అందురు. ఈ జడశక్తియే జగత్స్వరూపముగా పరిణమించినది. సకలభావములకును శక్తులు లుండును. ఆ శక్తులన్నియు జ్ఞానముతోనే తెలిసికోదగినవి. పరమాత్మయొక్క చిచ్ఛక్తియందు అన్ని శక్తులు ఉండునని భావము. సృష్ట్యాది శక్తులు కూడా బ్రహ్మకు శక్తులే. అగ్నికి వేడి ఏవిధముగా సహజముగా నున్నదో అలాగే బ్రహ్మకు కూడా సృష్టికార్యము నెరవేర్చుటకు ఈ శక్తులు సహజముగా ఏర్పడినవి. బ్రహ్మ కేవలం నిమిత్తమాత్రము మాత్రమే. ప్రధానకారణము కాడు. మాయలోని సృజనశక్తులే ప్రధానకారణములగుచున్నవి. సృష్ట్యాది శక్తులు వస్తుకారణములు. దీనినిబట్టి జడశక్తి వస్తుకారణమైనది.


బ్రహ్మపదార్థము సకలశక్తుల సమ్మేళనము. సృష్టివిషయములో పరమాత్మ నిమిత్తకారణము తప్ప అన్యవిషయములకు సంబంధములేదు. వస్తుస్వరూపము వస్తువుయొక్క శక్తియే.


సకల శక్తులు పరమేశ్వరివే. చైతన్యశక్తి పరమేశ్వరియే. అలాగే జడశక్తియునూ పరమేశ్వరియే. గనుకనే ఇంతకుముందు *చిచ్ఛక్తి* అనబడినదియు, ఇప్పుడు *జడశక్తి* అనుబడునదియు కూడా పరమేశ్వరియే. అందుకే ఈ నామ మంత్రముద్వారా అమ్మవారిని *జడశక్తి* యని అన్నాము.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం జడశక్త్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*417వ నామ మంత్రము* 26.9.2021


*ఓం చేతనారూపాయై నమః*


శుద్ధ చైతన్య స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చేతానారూపా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం చేతనారూపాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదలు సంప్రాప్తించుటకు కావలసిన సాధనాశక్తిని, ధ్యాననిమగ్నతను ప్రసాదించును.


చిచ్ఛక్తి అంటే చైతన్యశక్తి. అది నిర్మలమైన చైతన్యశక్తి. అట్టి చైతన్యశక్తిరూపంలో ఉండే పరమాత్మ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహానికి చలనశక్తి ఏర్పడుతుంది. 'ఏ శక్తి మాకు ధర్మ బుద్ధిని ప్రేరణచేయునదియు, సర్వచైతన్య స్వరూపురాలును, జ్ఞానస్వరూపురాలు అని యనబడుతున్నదో అట్టి విద్యకు (పరమేశ్వరికి) నమస్కరింతును అను భావముతో దేవీభాగవతమునందు మొదటి శ్లోకం చెప్పబడినది. 'గాయత్రితో ప్రారంభింపబడినదియే భాగవతము' అని మత్స్యపురాణమునందు చెప్పబడినది. అనంతకోటి జీవరాశులలోను జీవాత్మరూపంలో ఉండే పరమాత్మయే చిత్ అనగా జ్ఞానము. అటువంటి పరమాత్మ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహానికి చైతన్యము కలుగుతుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, మనస్సు పనిచేస్తూ ఉంటాయి. ఈ చైతన్యమే చిచ్ఛక్తియొక్క పరమధర్మము. అందుకే చైతన్యశక్తిస్వరూపమైన పరమేశ్వరియే *చేతానారూపా* యని అనబడినది. ఈ చేతానాశక్తి సర్వావస్థలయందును (జాగ్రస్వప్నసుషుప్తులయందు) ఉంటూ శరీరమందున్న ఆత్మకు పూర్వజన్మకర్మవాసనలననుసరించి కర్మలనాచరింపజేస్తూ, కర్మఫలాలను అనుభవింపజేస్తూ ఉంటుంది. చైతన్యశక్తి రూపంలో దేహమందు ఉండే పరమేశ్వరియే *చేతనారూపా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం చేతనారూపాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సామర్థ్యం

 తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది. చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది. కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి. అయ్యో నన్ను ఏదో బంధించేసింది అని చెప్పేసి ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది.


అయితే మహా మహా వృక్షాలకు రంధ్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేెకులను తొలచలేదా మరి. ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా. గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి. కానీ 

అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో లేక నన్నేదో బంధించింది అన్న భావన దాని శక్తిని బలహీన పర్చిందనో. 


ఆ భావనను నమ్మడమే దాని బలహీనత. నేను రంధ్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అని నమ్మింది. అంతే అది మరణాన్ని కొని తెచ్చుకుంది.


మన జీవితంలో సమస్యలూ అంతే, సమస్య బలమైంది కాదు. మన శక్తిని మనం మర్చిపోవడమే దాని బలం. మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే, గుర్తించడమే, నమ్మడమే దాని బలం.


"మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు. దాని బలం తామర రేకు అంత. నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత. తెలుసుకో అదే జీవిత సత్యం.


 - వల్లూరి సూర్యప్రకాష్

Bhagwan Shri Krishna

 Excellent information about Bhagwan Shri Krishna


1) Krishna was born *5252 years ago* 

2) Date of *Birth* : *18 th July,3228 B.C*

3) Month : *Shravan*

4) Day : *Ashtami*

5) Nakshatra : *Rohini*

6) Day : *Wednesday*

7) Time : *00:00 A.M.*

8) Shri Krishna *lived 125 years, 08 months & 07 days.*

9) Date of *Death* : *18th February 3102BC.*

10) When Krishna was *89 years old* ; the mega war *(Kurukshetra war)* took place. 

11) He died *36 years after the Kurukshetra* war.

12) Kurukshetra War was *started on Mrigashira Shukla Ekadashi, BC 3139. i.e "8th December 3139BC" and ended on "25th December, 3139BC".*  

12) There was a *Solar eclipse between "3p.m to 5p.m on 21st December, 3139BC" ; cause of Jayadrath's death.*

13) Bhishma died on *2nd February,(First Ekadasi of the Uttarayana), in 3138 B.C.*


14) Krishna is worshipped as:

(a)Krishna *Kanhaiyya* : *Mathura*

(b) *Jagannath*:- In *Odisha*

(c) *Vithoba*:- In *Maharashtra*

(d) *Srinath*: In *Rajasthan*

(e) *Dwarakadheesh*: In *Gujarat*

(f) *Ranchhod*: In *Gujarat*

(g) *Krishna* : *Udupi in Karnataka*

h) *Guruvayurappan in Kerala*


15) *Bilological Father*: *Vasudeva*

16) *Biological Mother*: *Devaki*

17) *Adopted Father*:- *Nanda*

18) *Adopted Mother*: *Yashoda*

19 *Elder Brother*: *Balaram*

20) *Sister*: *Subhadra*

21) *Birth Place*: *Mathura*

22) *Wives*: *Rukmini, Satyabhama, Jambavati, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana*

23) Krishna is reported to have *Killed only 4 people* in his life time. 

(i) *Chanoora* ; the Wrestler

(ii) *Kansa* ; his maternal uncle

(iii) & (iv) *Shishupaala and Dantavakra* ; his cousins. 

24) Life was not fair to him at all. His *mother* was from *Ugra clan*, and *Father* from *Yadava clan,* inter-racial marriage. 

25) He was *born dark skinned.* He was not named at all throughout his life. The whole village of Gokul started calling him the black one ; *Kanha*. He was ridiculed and teased for being black, short and adopted too. His childhood was wrought with life threatening situations.

26) *'Drought' and "threat of wild wolves" made them shift from 'Gokul' to 'Vrindavan' at the age 9.*

27) He stayed in Vrindavan *till 10 years and 8 months*. He killed his own uncle at the age of 10 years and 8 months at Mathura.He then released his biological mother and father. 

28) He *never returned to Vrindavan ever again.*

29) He had to *migrate to Dwaraka from Mathura due to threat of a Sindhu King ; Kala Yaavana.*

30) He *defeated 'Jarasandha' with the help of 'Vainatheya' Tribes on Gomantaka hill (now Goa).*

31) He *rebuilt Dwaraka*. 

32) He then *left to Sandipani's Ashram in Ujjain* to start his schooling at age 16~18. 

33) He had to *fight the pirates from Afrika and rescue his teachers son ; Punardatta*; who *was kidnapped near Prabhasa* ; a sea port in Gujarat. 

34) After his education, he came to know about his cousins fate of Vanvas. He came to their rescue in ''Wax house'' and later his cousins got married to *Draupadi.* His role was immense in this saga. 

35) Then, he helped his cousins establish Indraprastha and their Kingdom.


36) He *saved Draupadi from embarrassment.*


37) He *stood by his cousins during their exile.*

38) He stood by them and *made them win the Kurushetra war.*


39) He *saw his cherished city, Dwaraka washed away.* 

40) He was *killed by a hunter (Jara by name)* in nearby forest. 

41) He never did any miracles. His life was not a successful one. There was not a single moment when he was at peace throughout his life. At every turn, he had challenges and even more bigger challenges. 

42) He *faced everything and everyone with a sense of responsibility and yet remained unattached.*


43) He is the *only person, who knew the past and future ; yet he lived at that present moment always.*


44) He and his life is truly *an example for every human being.*🌷🙏🏻


*Jai Shri Krishna*🙏

భగవంతుడు - దేవుడు

 ॐ భగవంతుడు - దేవుడు అంటే ఎవరు? 

 

భగవంతుడంటే మొదటి నిర్వచనం


 భగములు ఆరు. అవి 

1. ఐశ్వర్యము, 

2. వీర్యము, 

3. యశస్సు, 

4. సంపద, 

5. జ్ఞానము, 

6. వైరాగ్యము. 


"ఐశ్వర్యస్యసమగ్రస్య వీర్యస్య యశస శ్శ్రియః I 

 వైరాగ్యస్యాథమోక్షస్య షణ్ణాం భగ ఇతీ రణా ॥"


      ఈ ఆరు గుణాలు కలవాడు "భగవంతుడు". 


రెండవ నిర్వచనం


1. భూతముల పుట్టుకను, 

2. నాశమును, 

3. రాబోయెడి సంపత్తును, 

4. రాబోయెడి ఆపత్తును, 

5. అజ్ఞానమును, 

6. జ్ఞానమును ఎఱుంగువాడు.


"ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం I 

  వేత్తి విద్యా మవిద్యాం చ సవాచ్యో భగవానితి॥" 


      ఈ ఆరూ ఎవ్వరెరుగురో, ఆయన "భగవంతుడు" అనబడతాడు. 



      ఇప్పుడు "దేవుడు" అనే దానికి నిర్వచనం చూద్దాం.


                      దేవుడు


"దేవుడు" అనే శబ్దం పది అర్థాల సమూహం గా నిర్వచింపబడింది.


1.శుధ్ధమగు జగత్తును క్రీడింప చేయువాడు.

అ)తన స్వరూపమందు తానే ఆనందంతో క్రీడించువాడు,లేక,

ఆ)పర సహాయంలేకుండా,సహజ స్వభావంతో క్రీడలాగా సమస్త జగత్తునూ చేసేవాడు,లేక,

ఇ)సమస్త క్రీడలకు ఆధారమైనవాడు.

"యో దీవ్యతి క్రీడతి స దేవః"


2.ధార్మికులు జయించాలి అనే కోరిక కలవాడు.

అందరిను జయించేవాడు,అనగా అతనిని ఎవరూ జయించలేరు.

"విజగీషతే స దేవః"


3.అన్ని ప్రయత్నములకు సాధనోప సాధనములను ఇచ్చువాడు

న్యాయాన్యాయ రూప వ్యవహారమూలను తెలియువాడు.

"వ్యవహారయతి స దేవః"


4.స్వయం ప్రకాశ స్వరూపుడు,

అన్నిటికి చరాచర జగత్తు అంతటికి ప్రకాశకుడు.

"యశ్చరాచరం జగద్ద్యోతయతి సదేవః"


5.ఎల్లర ప్రశంసకు యోగ్యుడు.

.నిందింప దగనివాడు.

"య స్త్యూయతే స దేవః"


6.తాను స్వయమానంద స్వరూపుడు.

ఇతరులకానందము కలుగజేయువాడు,దుఃఖము లేశమూ లేనివాడు.

"యో మోదయతి స దేవః"


7.మదోన్మత్తులను తాడించేవాడు.

సదాహర్షితుడు.శోకరహితుడు.ఇతరులను హర్షింపజేయువాడు,దుఃఖమునుండి దూరము చేసేవాడు.

"యో మాద్యతి స దేవః"


8.అందరి శయనార్థము రాత్రిని,ప్రలయాన్ని చేసేవాడు.

.ప్రలయసమయమున అవ్యక్తమందు సమస్తజీవులను నిద్రింపజేయువాడు.

"యః స్వాపయతి స దేవః"


9.కామించుటకు యోగ్యుడు.

సత్యకాముడు.శిష్టులకామమునకు లక్ష్యమగువాడు.

"యః కామయతే కామ్యతే వా స దేవః"


10.జ్ఞాన స్వరూపుడు.

అన్నిటియందు వ్వాప్తుడై, తెలియుటకు యోగ్యుడు.

"యో గఛ్ఛతి గమ్యతే వా స దేవః"



దేవః - అనే శబ్దం "దివు క్రీడా విజగీషా వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు" అనే ధాతువునుండి సిధ్ధమవుతోంది.దాని నుంచీ వచ్చినవే పైన పేర్కొన్న పది అర్థాలు.  


— రామాయణం శర్మ

        భద్రాచలం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి లీలలు..


*ఆర్థికభారం..అన్నదానం..*


"అప్పులన్నీ..ఒక్క నయాపైసా కూడా బాకీ లేకుండా..అణా పైసలతో సహా..తీర్చేసానండీ..ఇప్పుడు ప్రశాంతంగా వున్నాను..మూడు నెలల క్రితం వరకూ ఒక్క క్షణం కూడా మనసుకు శాంతి అనేదే లేకుండా నరకం అనుభవించాను." అన్నారు విశాఖపట్నం నుంచి వచ్చిన శ్రీ చింతా సుధాకర్ గారు..


శ్రీ సుధాకర్ గారు MBBS చదివి, హోమియోపతి లో MD పట్టా తీసుకున్నారు..విశాఖపట్నం లో డాక్టర్ గా పనిచేస్తున్నారు..కొన్ని సంవత్సరాల పాటు విదేశాలలో కూడా పని చేసి వచ్చారు..ఆ సమయం లో ఆర్ధికంగా స్థిరపడ్డారు కూడా..ఒక ఇల్లు కట్టుకున్నారు..భార్యా పిల్లలతో ఏ లోటు లేని జీవితం గడుపుతున్నారు..అనుకున్న విధంగానే జీవితం సాఫీగా జరిగిపోతూ వుంటే మనిషికి దైవం గుర్తుకు రాడు..శ్రీ సుధాకర్ గారు కూడా తన వద్ద ఉన్న డబ్బుతో ఏదైనా చేయాలని ఆలోచన చేసి..తనకు అవగాహన లేని కొన్ని వ్యవహారాలలో డబ్బు పెట్టుబడి పెట్టారు..అందులో భారీగా నష్టం వచ్చింది..తాను కూడబెట్టుకున్న డబ్బే కాక..అప్పుతెచ్చి మరీ పెట్టుబడిగా పెట్టింది కూడా పూర్తిగా నష్టపోయారు..కేవలం తన వృత్తి మీద వచ్చే సంపాదన తో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి దాపురించింది..ఇల్లు అమ్మివేసి, అప్పుతీరుద్దామనుకున్నారు..కానీ సుధాకర్ గారి పరిస్థితి ఆసరాగా తీసుకుని..ఇంటిని అతి తక్కువ ధరకు కొంటామని కొందరు ప్రయత్నం చేశారు..ఆ ధరకు అమ్ముకోలేక..అప్పులవాళ్లకు సమాధానం చెప్పుకోలేక సుధాకర్ గారు సతమతం అవసాగారు..


"మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్న స్వామివారి లీలలను ప్రతి నిత్యం చదువుకునే వాడిని..కానీ ఒకతట్టు ముప్పైలక్షల రూపాయల అప్పు నెత్తిన ఉన్నది..అప్పిచ్చిన వాళ్ళు ప్రతిరోజూ ఫోన్ చేసి తమ బాకీ తీర్చమని అడుగుతున్నారు..దిక్కుతోచని స్థితిలో ఈ స్వామివారి కి మనసులోనే మొక్కుకొని..మొగలిచెర్ల కు ప్రయాణమై వచ్చేసానండీ..ఆరోజు మీరు ఇక్కడ లేరు..నేను ఉదయాన్నే మందిరానికి వచ్చి..స్నానాదికాలు ముగించుకొని..శ్రీ స్వామివారి వద్ద పూజ చేయించుకున్నాను..పూజారి గారి అనుమతి తీసుకొని శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..నా కష్టాలన్నీ చెప్పుకున్నాను..ఆరోజు మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేశానండీ..అప్పుడే నిర్ణయం తీసుకున్నాను..తండ్రీ నా కున్న ఆర్ధిక బాధల నుంచి నన్ను విముక్తుడిని చేస్తే..నీ సన్నిధిలో అన్నదానం చేస్తానని..మనస్ఫూర్తిగా మొక్కున్నాను..ఎందుకనో శ్రీ స్వామివారు పరిష్కారం చూపుతారనే నమ్మకం కలిగిందండీ..నేను ఇక్కడినుంచి విశాఖపట్నం చేరిన మూడోరోజు..మా ఇల్లు కొనడానికి వచ్చారండీ..స్వామివారి లీల అప్పుడే కనబడింది..నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ధరకు కొంటామని చెప్పారండీ..చెప్పడమే కాదు..అప్పుడే ఐదు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారండీ..అంతా కలలో జరిగినట్లు జరిగిపోయింది..మరో నెలకల్లా మరో ఇరవై లక్షలు ఇచ్చారండీ..నా అప్పులన్నీ తీర్చేసానండీ..అందరికీ చెప్పుకున్నాను..ఆ మొగలిచెర్ల దత్తాత్రేయుడే నాకు అండగా నిలబడ్డాడని..ముందు స్వామివారి వద్ద మొక్కుకున్నాను కదండీ..అందుకని ఈరోజు అన్నదానం చేయడానికి వచ్చానండీ.." అని చెప్పుకొచ్చారు..


సుధాకర్ గారు శ్రీ స్వామివారి సమాధిని మనసారా దర్శించుకున్నారు..దగ్గరుండి మరీ అన్నదానం చేశారు..తనకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు నేరుగా శ్రీ స్వామివారి వద్దకు వస్తానని పదే పదే చెప్పి వెళ్లారు..ఒక్కొక్కరి అనుభవం ఒక్కో విధంగా ఉంటుంది..భక్తుడికి, స్వామివారికి మధ్య అన్యులెవరూ వుండరు.. వారి వారి భక్తి విశ్వాసాలే వారికి ఫలితాలను కలుగ చేస్తాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).