23, సెప్టెంబర్ 2020, బుధవారం

శ్రీ పాదరాజ కరావలంబ స్తోత్రం

 

1. అనఘాసహితఅనశ్వరచారిత్ర్యకీర్తిం

త్రిమూర్త్యాత్మకత్రిజగన్నుతదిగంబరరూపం

సంగీతసాహిత్యసారస్వతప్రదభవ్యరూపం

శ్రీ పాదరాజ మమ దేహి కరావలంబం ||


2. భజే ఇందుశీతలాకుందమందారహాసం

భజే బృహద్భావనాగమ్యచారుప్రకాశం

భజే విశ్వవ్యాప్తబ్రహ్మజ్ఞానప్రబోధతత్త్వం

శ్రీ పాదరాజ  మమ దేహి కరావలంబం ||





3. భావాతీతనిర్గుణాత్మకతరం 

బ్రహ్మానందసంతతధ్యానపరం

సర్వేజనాఃఅజ్ఞానదాహకవరం

శ్రీ పాదరాజ మమ దేహి కరావలంబం ||


4. జగద్విఖ్యాతఅనఘాద్భుతచారిత్ర్యకీర్తిం

 అలౌకికానందపదమహిమాన్వితపాదపీఠం

 విద్యుత్కోటిప్రభాసమానదివ్యసుందరవిగ్రహం

 శ్రీ పాదరాజ మమ దేహి కరావలంబం ||


5. సంతతమత్తచిత్తబ్రహ్మసమాధిస్థితపరాత్పరతరం

బ్రహ్మేంద్రాదిసురసేవితమృదుపల్లవపాదపద్మయుగం

సంగీతసాహిత్యసారస్వతజ్ఞానప్రదభవ్యదిగంబరతత్త్వం

శ్రీ పాదరాజ మమ దేహి కరావలంబం ||

శ్రీ పాదరాజ దివ్యచరణారవిందార్పణమస్తు

**హిందూ ధర్మం** 46

 **దశిక రాము**




భారతీయ ధర్మం ప్రకారం మనం దైవసంతానం. ఋషుల వారసులం. అంతేకానీ పాపులం కాదు. మనది ఋషుల డి.ఎన్.ఏ. వాళ్ళ గొప్ప మేధాశక్తి మన జన్యువుల్లో ఇంకా సజీవంగా ఉంది. ధూమాపానం, మద్యపానం డి.ఎన్.ఏ ను నాశనం చేస్తాయి. డి.ఎన్ ఏ స్వరూపాన్ని సంపూర్తిగా మార్చి వేస్తాయి. అట్లాగే మత్తు పదార్ధాలు కూడా. ఫలితంగా మేధాశక్తి, బుద్ధి శక్తి నాశనమవుతుంది, ఇంద్రియనిగ్రహం సడలిపోతుంది. కనుక ఇటువంటి దురలవాట్లకు దూరంగా ఉండడం ధర్మాచరణకు ఉండవలసిన లక్షణం.


అట్లాగే చెడు సాంగత్యం ఎప్పుడూ ఉండకూడదు. దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. ఈ లోకంలో అత్యంత దుర్లభమైనవి, దైవానుగ్రహం ఉంటే తప్ప లభించనవి మూడు ఉన్నాయి. ఒకటి మానవజన్మ, రెండవది మోక్షం పొందాలి, పరమాత్మను చేరాలన్న తపన, మూడవది మహాపురుషులు, సాధుపురుషులతో స్నేహం, సహవాసం. భాగవతులు, భవద్భక్తులతో స్నేహం చేయడం వలన మనలో భక్తి ఏర్పడుతుంది. గురువులు, మహాపురుషుల భోధనలు, మాటలు వినడం వలన చిత్తశుద్ధి కలిగి, మనసు భగవంతుని గురించి తీవ్రంగా తపిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కలిగి, ఆత్మ పరమాత్మలో ఐక్యం అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చిన ఇటువంటి మహాపురుషులతో స్నేహం వదలకూడదు. అట్లా సత్ సాంగత్యం చేయడం ధీః.


యోగా, ధాన్యం మొదలైనవి ఆత్మశుద్ధిని కలిగిస్తాయి, రోగాలను తగ్గిస్తాయి. ధాన్యం, యోగా వలన క్షీణించిన డి.ఎన్.ఏ తిరిగి పూర్వస్థితిని పొందుతుందని, డి.ఎన్.ఏ.లో లోపాలు సవరించబడతాయని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు తెలుసుకొన్నారు. ఈ ప్రక్రియలు బుద్ధిని వృద్ధి చేస్తాయి.


నిత్యం ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడం, శుద్ధ జలాలను త్రాగడం, శుద్ధమైన గాలిని పీల్చడం మొదలైనవి కూడా ధర్మాచరణలో భాగమే అన్నారు భారతీయ గురువులు. ఇటువంటి లక్షణాలతో జీవంచడం 'ధీః'.


తరువాయి భాగం రేపు......

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


*ధర్మము - సంస్కృతి* గ్రూప్

 ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


91 - అరణ్యపర్వం.


మార్కండేయమహర్షి కలియుగ ప్రభావం గురించి ధర్మరాజుకూ, పరివారానికీ, శ్రీకృష్ణుని సమక్షంలో వివరిస్తున్నాడు.


కలియుగాంతంలో, సకాలంలో ఋతువులు తమధర్మం నిర్వర్తించవు. యజ్ఞయాగాదులు లేకపోవడం వలన దేవతలకు హవిస్సులు అందవు. వర్షాలు సకాలంలో కురవవు. నాణ్యమైన విత్తనాలు దొరకవు. , భూసారం క్షీణిస్తుంది. క్రూరమృగాలు యథేచ్ఛగా గ్రామాలలోకి వచ్చి ప్రజలను హింసిస్తుంటాయి. అనావృష్టి వలన, ఆకలికి తట్టుకోలేని బలహీనులంతా నశిస్తారు.


ఒక్కసారిగా ఏడుగురు సూర్యులు ఉదయించినట్లుగా ఉష్ణం ప్రసరించి నదులలో సాగరాలలో జలాలు పీల్చివేయబడతాయి. చెట్లు, పచ్చికట్టెలు కూడా యెండిపోతాయి. సంవర్థకమనే అగ్ని వాయువుతో యేకమై విశ్వమంతా వ్యాపించి దేవలోకాలని కూడా భయభ్రాంతులని చేస్తుంది. 


ఆకాశంపెద్దపొగతో నిండిపోయి, కారుమేఘాలు వ్యాపిస్తాయి. ఉరుములూ మెరుపులతో భయంకరమైన వర్షం కుండపోతగా కురిసి, విశ్వమంతా జలమౌతుంది. సంవర్తకాగ్ని అందులో లీనమైపోతుంది. 12 సంవత్సరాలు ఆవిధంగా జలధారలతో విశ్వం నిండిపోతుంది.


అంతా సద్దుమణిగిన తరువాత, శ్రీమన్నారాయణుని నాభికమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఆ జలధారాలలో నుండి వచ్చిన గాలిని పీల్చుకుని, యోగనిద్రలో వుంటాడు. 


ఈ విశ్వమంతా నీటిలో మునిగిపోగా, నేను ఒక్కడినే( మార్కండేయ మాహర్షి ), దిక్కుతోచక జలాలలో యీదుకుంటూ చాలాదూరంప్రయాణించి, ఒక పెద్దమర్రిచెట్టును చూశాను. దాని కొమ్మలమధ్యలో ఒక హంసతూలికాతల్పం వుంది. దానిమీద అతి సుందరమైన ముఖవర్ఛస్సుతో, కలువపూలవంటి కన్నులతో వున్న ఒక పసిబాలుని చూసాను. ఇక్కడ మర్రిచెట్టు యేమిటీ ! ఈ బాలుని దర్శనమేమిటీ !! అని నేను ఆశ్చర్యపడుతుండగా, అవిసెపూవురంగుతో వున్న ఆబాలుని, శ్రీవత్సవక్షంతో ప్రకాశిస్తున్నవాడిని చూస్తుండగా, 'మార్కండేయా ! నీవు చాలా అలసిపోయావు. నాలో విశ్రమించు. ' అని ఆబాలుడు అన్నట్లుగా వినిపించింది. ఆబాలుడు తన నోరు తెరవగా, సంభ్రమంగా నేను ఆ నోటిలోనికి ప్రవేశించాను.  


ఆ నోటిలోనుండి ఉదరం లోనికి వెళ్ళగానే, అందులో సమస్తభూమండలం నాకు కనిపించింది. గంగా యమునలను చూశాను. హిమగిరులను చూశాను. యజ్ఞయాగాలు నిర్వహిస్తున్న బ్రాహ్మణులను చూశాను. యేమని చెప్పను ఆ అద్భుతం, ధర్మరాజా ! ఆద్యంతాలు లేని ఆ ఉదరం నన్ను యెంతో అబ్బురపరిచింది.


అలా నేను బాలుని ఉదరంలో తిరుగుతుండగా, ' మార్కండేయా అలసట తీరిందా, విశ్రాంతి తీసుకున్నావా ' అని బాలుడు అడిగినట్లుగా వినిపించింది. ' స్వామీ ! బాలుని రూపం లో వున్న నీవెవరో తెలుసుకున్నాను. నేనెక్కడున్నానో నాకే తెలియని అయోమయ స్థితిలో వున్నాను. ' అన్నాను.


తన విశ్వరూప రహస్యాన్ని బాలునిరూపంలో వున్న మహావిష్ణువు మార్కండేయునికి వివరించాడు. ఏ దేవతలూ చూడని రహశ్యాలు నీవు చూశావు. ' బ్రహ్మదేవుడు యోగనిద్ర చాలించిన తరువాత, నేను అతనిలో లీనమై ఆయన సృష్టి చెయ్యడానికి ప్రేరేపిస్తాను. సృష్టి మొదలయ్యే వరకూ, నారూపాన్నే దర్శిస్తూ, నన్నే ధ్యానిస్తూ విశ్రాంతి తీసుకో ! ' అని చెప్పాడు నారాయణుడు. 

అని కొద్దిసేపు నిశ్శబ్దం తరువాత, తనకళ్ళు తుడుచుకుంటూ, పులకించిన దేహంతో ఆనందబాష్పాలు నిండిన కళ్ళతో,అందరినీకలయజూశాడు, మార్కండేయమహర్షి.  


ధర్మరాజా ! ఇంకొక రహశ్యం మీకందరికీ చెబుతున్నాను. శ్రద్ధగా వినండి. ఆనాడు నేను మర్రిచెట్టు మీద చూసిన బాలుడే, మన కంటి ముందున్న ఈ శ్రీకృష్ణుడు. ఆ విషయం తెలుసుకుని మసలినవారు ధన్యులు. ' అని మార్కండేయమహర్షి శ్రీకృష్ణునికి సాష్టాంగ నమస్కారం చెయ్యగా, మిగిలిన అందరూ అనుసరించారు.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

శ్రీమాతా

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 6 by Pujya Guruvulu 

Brahmasri Chaganti Koteswara Rao Garu




 ‘శ్రీమాతా’ – అంటే మంగళప్రదురాలైన అమ్మా! అని అర్థము. గుర్తు పట్టవలసిన విషయము లోకములో ఉన్న ఏకైక సంథానమయిన అమ్మ అన్నమాటకు పరిచయము లేదు. కడుపులో ఉండగా నాభీగొట్టముతో ప్రారంభమైన అనుబంధము బయటికి వచ్చాక తెగిపోతుంది. హృదయసంబంధము అలాగే ఉంటుంది. అమ్మ అంటే పోషణ – రక్షణ – మంగళము. అమ్మలేకపోతే సృష్టి ఆగిపోతుంది. అమ్మవారి సృష్టిశక్తి, మాతృత్వము ఒక పురుష వీర్యమును స్త్రీ శరీరము పుచ్చుకునేట్టుగా నిర్మాణము చేయడములో ఉన్నది. ఆ తల్లి అనుగ్రహముతో పిల్లవాడు పూర్తిగా తయారు అయ్యేవరకు పెరగాలి. లోపల పిల్లవాడు నొక్కుడు పడకుండా, తల్లి శరీరము పిగిలిపోకుండా, మళ్ళీ పిల్లవాడు బయటికి వచ్చాక సంకుచితమవ్వాలి. ఇంతమంది జన్మించడానికి స్త్రీ ఉపాధుల యందు అంత మార్పుతో నిర్మాణము చేసి, లోపల పసిగుడ్డును కాపాడి జాగ్రత్త చేసింది శ్రీమాత. కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే అమ్మ స్తన్యములో కోలోస్ట్రం అనే పసుపు పచ్చని ముద్ద ఒకటి ఊరుతుంది. ఏమీ తెలియని వాడిని జగన్మాత ఆవహించి ‘ నీ పోషణకోసము, రక్షణకోసము మీ అమ్మ స్తన్యములయందు నేను ప్రకాశిస్తున్నాను’ అని చెపుతుంది. అమ్మ స్తన్యములలో ఊరిన ఆ పదార్థమును పిల్లవాడు చప్పరిస్తే లోపలున్న ఊపిరితిత్తులు, జీర్ణాశయము అన్నీ పనిచేస్తాయి. కడుపులో ఉండగా నల్లటి మలము గడ్డలుగా పెరుగుతుంది. దానిని బయటికి పంపడము ఎవరికీ సాధ్యముకాదు. కోలోస్ట్రం మ్రింగగానే నల్లటి మలము బయటికి వెళ్ళిపోతుంది. మలినములు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అమ్మ కడుపులో, పక్కలో దూరి పడుకోవడములో పిల్లవాడు ఎంతో భద్రత అనుభవిస్తాడు. ఆ అమ్మతనము అంతా హృదయము పరవశించిపోయే శ్రీమాతాతత్త్వము. అమ్మవారి వంకచూసి ‘శ్రీమాతా’ అని పిలవడానికి భయపడనవసరము లేదు. ఉపాసన చేయడానికి నియమ నిబంధనలు లేవు. అమ్మగా అమ్మవారిని చూడాలి. అమ్మని ఒక మొగవాడిగా చూస్తే దోషము. ఏ అమ్మా క్షమించదు. కొడుకుగా నిలబడి నమస్కారము చేస్తే ఆదుకోవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధముగా ఉంటుంది. ఆవిడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త గర్భాలయము ఇచ్చింది, పాలు పట్టింది, (స్వల్పకాలికలయము) నిద్రపుచ్చింది. ముగ్గురూ అమ్మలో ఉన్నారు కనక మొదటి దైవము అమ్మ. భగవంతుడు ఒక్కడే అయినా కర్తవ్యనిష్ఠ కలిగినప్పుడు బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రునిగా మూడురూపములతో ప్రకాశిస్తాడు. శ్రీమాత ఈ ముగ్గురూ మూడురకములైన కార్యములను నిర్వహించడానికి మూడురకములైన శక్తులను ఇచ్చింది. ఉపనిషత్తు – ‘యతోవా ఇమాని భూతాని జాయన్తి’ అంటుంది. దేనినుండి సమస్తము ఉత్పన్నము అయినదో – ‘దేనినుండి’ అన్నమాట ఏది ఉన్నదో అదే అమ్మవారు. దేనినుండి సమస్తము పుట్టాయో అన్న ఉపనిషత్ వాక్యము మారిస్తే అదే శ్రీమాత. అన్ని ప్రాణులను సృజించుట వెనక అమ్మదయ ఉన్నది. శ్రీమాత ఎవరు? అన్న విషయము జాగ్రత్తగా అవలోకనము చేస్తే ‘శ్’ ‘ర్’ ‘ఈ’ అన్న మూడు అక్షరములు కలిస్తే ‘శ్రీ’ అవుతుంది. ఆ మూడూ సత్త్వ, రజ, తమో గుణములను చూపిస్తాయి. లోకమంతా వీటిలోనే ఉన్నది. ఇవి బయటికి రాకుండా కలసిపోయి అవ్యక్తమైపోయి ఒక దానిలోకి వెళ్ళి ఉండిపోతే ‘శ్’ ‘ర్’ ‘ఈ’ కలసి శ్రీ – కలసిపోయి మాత – ఆవిడలోకి వెళ్ళిపోతాయి. సృష్టికి ముందర ఆవిడ ఒక్కత్తే ఉన్నది. ఆమెను పూర్వజా అంటారు. ఆవిడలో ఉన్న మూడుగుణములు ఆవిడలోనుంచే పైకి వచ్చాయి. ఈ మూడుగుణములు తీసి శుద్ధసత్త్వము ఆమెయే ఇవ్వాలి. అమ్మా! ఈ గుణముల వలన లోపలనుండి కలిగే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యములన్న శత్రువులు అని గుర్తించి ఆవి ఉండటము వలన బాధ, కష్టము కలుగుతున్నాయి అమ్మా! అని నిజాయితీగా అంటే చాలు అమ్మవారు ఆ మూడూ ఉపసంహారము చేసి బాధలను తీర్చేస్తుంది. భాస్కరరాయలవారు అంటారు -- ‘లోకములో ఒక తల్లికీ తండ్రికీ జన్మించిన బిడ్డడు అమ్మా! అనే పిలుస్తాడు. బిడ్డడిని విడచి ఉండమంటే ఏ తల్లీ అంగీకరించదు. నేను వేరొకజన్మ లేకుండా చేసుకోవడానికి తురీయాశ్రమమునకు వెళ్ళిపోతాను అంటే అంగీకరించదు. శ్రీమాతా అని పిలిస్తే వేరొకజన్మలో అమ్మా! అని ఎవరినీ పిలవనవసరము లేని స్థితిలో మోక్షము ఇస్తుంది. శివజ్ఞానము ఇస్తుంది. ఆ జ్ఞానము కలగగానే పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యస్థితి పొందడము జరుగుతుంది. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

సుదర్శనుడు

 🕉🕉🕉 *దేవి కథలు* 🕉🕉🕉     *కోసల దేశాన్ని పాలకుడైన ధ్రువ సింధు మహారాజు సూర్యవంశంలో జన్మించినవాడు. అతడు ధర్మాత్ముడు , సత్యసంధుడు. వర్ణాశ్రమ ధర్మరక్షణ తన కర్తవ్యంగా భావించి పాలన సాగిస్తున్న ఉత్తమ ప్రభువు. అతని రాజ్యంలో అన్ని వర్ణాలవారూ తమ తమ జాతులకు విధింప బడిన ధర్మాలను అనుకరిస్తూ, సామరస్యంతో జీవిస్తున్నారు. అతని రాజ్యంలో దొంగలు, ధూర్తులు, లోభులు, కృతఘ్నులు, డంబాచార పరాయణులు లేరు. అందరూ సద్గుణ సంపన్నులే*.


             *ధ్రువ సింధునికి మనోరమ, లీలావతి అని ఇద్దరు భార్యలున్నారు. పట్టమహిషి అయిన మనోరమ సహధర్మచారిణి అనే పేరును సార్థకం చేస్తూ, అన్ని విధాలా భర్తకు అనుకూలవతిగా ఉన్న ఉత్తమ ఇల్లాలు. చిన్న భార్య అయిన లీలావతి సౌందర్య గర్వంతో భర్తను చులకన చేసేది. రాజు మాత్రం ఇద్దరినీ ఒకే విధమైన ప్రేమానురాగాలతో ఆదరించేవాడు. అయినా చిన్న భార్య పట్ల కొంచెం మోగ్గు చూపేవాడు*.


      *కొంత కాలానికి ఆ రాణులిద్దరికి పుత్రసంతానం కలిగింది. రాజు తన పుత్రులిద్దరికీ జాత కర్మ, నామకరణం నిర్వహించాడు. మనోరమకు జన్మించిన పుత్రునికి 'సుదర్శనుడు' అని, లీలావతికి పుట్టిన కుమారునికి 'సుందరుడు' అని పేర్లు పెట్టాడు*.


                                           *కాలక్రమేణ రాజకుమారులిద్దరూ పెరిగి పెద్ద వాళ్ళయ్యారు. సుదర్శసుడు శత్రుసంహారం సాగించగల బల శౌర్య ధైర్య సముపేతుడై, తన సద్గుణ సంపదచేత అందరి మనసులనూ చూరగొన్నాడు. అయినా ధ్రువసింధువు చిన్న భార్యపట్ల గల మమకారాతిశయం చేత సుందరిని పట్లనే ఎక్కువ మక్కువ చూపసాగాడు. సుదర్సనుడు రాజయ్యే శుభతరుణం కోసం ప్రజలందరూ నిరీక్షించేవారు*.


         *కొంత కాలానికి ధ్రువసింధువు వేటకు వెళ్ళి, సింహాన్ని వేటాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. కుల గురువైన వశిష్ఠుడు సుదర్శునుని రాజుగా నిర్ణయించాడు. మంత్రులు, పురోహితులు ప్రజలు అందరూ ఆనందంగా అంగీకరించారు. ధర్మబుద్ధి గలవాడు, శాంతస్వబావుడు, పరిపాలనకు తగిన ధైర్యసాహసాలు గల వాడు అయిన సుదర్శనుడే రాజు కానున్నాడని దేశ ప్రజలంతా సంతోషించారు*.


              *అల్లుని మరణవార్త తెలిసి లీలావతి తండ్రి యుధాజిత్తు, మనోరమ తండ్రి వీరసేనుడు కోసల దేశానికి వచ్చారు. వారిద్దరూ ఎవరికి వారు తమతమ మనుమలకే పట్టాభిషేకము చేయాలని వాదించారు. ఆ వాదన క్రమంగా హద్దుమీరి, యుద్ధానికి దారితీసింది. యుద్ధంలో యుధాజిత్తు వీరసేనుణ్ణి సంహరించాడు. లీలావతి కుమారుడైన సుందరుడే పట్టాభిషిక్తు డయ్యాడు*.


         *తన తండ్రి మరణవార్త తెలిసి మనోరమ వేదన చెందింది. భర్తలేని తనకు తండ్రి అండ కూడా లేనందున రాజ్యంలో తనకు, తన పుత్రునికి రక్షణ ఉండదని భావించింది. అంతరంగికుల సహాయంతో అర్థరాత్రివేళ తన కుమారునితో కలసి నగరం విడిచి వెళ్ళింది. వారణాసి చేరి, గంగానదిని దాటి, భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నది. అక్కడి మహర్షులకు తన వృత్తాంతం విన్నవించింది. ఆమె కథ విన్న మహర్షులు ఆమెకు అభయమిచ్చి, ఆశ్రయ మిచ్చారు*.


           *కొంత కాలానికి యుధాజిత్తు మనోరమ, సుదర్శనుణ్ణి వెతుక్కుంటూ భరద్వాజాశ్రమానికి వచ్చాడు. మనోరమ, సుదర్శనుణ్ణి తనకు అప్పగించవలసిందిగా కోరాడు. అప్పగించని పక్షంలో సైనికులను పంపి, బలప్రయోగం చేసి, ఆశ్రమంపై దాడి జరిపి, వారిద్దరినీ తాను తన వెంట తీసికొని పోగలనని మహర్షిని బెదిరించాడు. ఆ మాటలు విన్న మహర్షి " ఓయీ ! ధూర్తుడా ! దుర్బుద్ధితో ఆశ్రమంలో అడుగు పెట్టినట్లుయితే, నువ్వు నీ సైన్యము కూడా నామరూపాలు లేకుండా నశించి పోగలరు. " అని హెచ్చరించాడు*.


                        *పూర్వము వశిష్ఠుని కామధేనువును అపహరించాలని తన సైనిక బలము సహాయంతో ప్రయత్నించిన విశ్వామిత్రుడు పరాభవము పాలైన సంగతిని మహర్షి వివరించాడు. వశిష్ఠుని తపశ్శక్తి ప్రబావంతో ఆ ధేనువు శరీరం నుండి ఆయుధాలను ధరించిన సైనికుల వేల సంఖ్యలో ఆవిర్భవించి, విశ్వామిత్రుని సైన్యాన్ని సంహరించిన వృత్తాంతాన్ని వివరించి, భరద్వాజ మహర్షి యుధాజిత్తును తిరిగి పొమ్మని మందలించాడు. గత్యంతరం లేక యుధాజిత్తు వెనుతిరిగి పోయాడు*.


   *కొంత కాలానికి ఆ సుదర్శనునకు ఆ మహర్షి ఉపనయన సంస్కారం జరిపించి, గాయత్రి మంత్రంతో పాటు దేవీ బీజాక్షరాలను కూడా ఉపదేశించాడు. సుదర్శనుడు శ్రద్ధాభక్తులతో, దీక్షతో దేవీ మంత్రాన్ని జపించాడు. కొన్నాళ్ళకు అతనికి దేవి ప్రత్యక్షమై ధనుర్భాణాలను, కవచాన్ని ప్రసాదించింది*.


                              *ఇలా ఉండగా, యుక్తవయస్కురాలైన కాశీరాజకుమారై శశికళకు ఒకనాటి రాత్రి కలలో దేవి కనిపించి " ఓ రాజకుమారీ!నీకు అన్ని విధాలా తగిన వరుడు భరద్వాజాశ్రమంలో ఉన్నాడు. అతని పేరు సుదర్శనుడు. ప్రస్తుతము రాజ్యభ్రష్టుడే అయినా, త్వరలో రాజు కాగలడు. అతడు నా భక్తుడు అతణ్ణి నువ్వు పతిగా వరించు. నీకు సమస్త సంపదలూ సకల శుభాలూ లభిస్తాయి." అని చెప్పింది*.



   *తెల్లవారిన తరువాత శశికళ తన స్వప్న వృత్తాంతాన్ని తల్లి ద్వారా తండ్రికి తెలియచేసి, సుదర్శనుణ్ణి భర్తగా నిర్ణయించు కున్నానని చెప్పింది. కలలో వార్తను నమ్మలేని కాశీరాజు రాజ్యభ్రష్టుడైన వానికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించలేకపోయాడు. "రాజ్యభ్రష్టుణ్ణి భర్తగా వరిస్తానంటావేమమ్మా సర్వలక్షణ సంపన్నులైన రాజకుమారులను అన్వేషించి. నీకు స్వయంవరం ప్రకటిస్తాను. నీకు నచ్చిన వారిని పెండ్లాడి సుఖంగా ఉండు." అని పరిపరి విధాల నచ్చచెప్పాడు*.


          *ఆ మాటలను అంగీకరించక, శశికళ "తండ్రీ !కలలో దేవీ చెప్పిన ఆ సుదర్శనుడే నాభర్త. దేవి చెప్పిన విధంగా భరద్వాజాశ్రమంలో ఆ లక్షణాలు గల సుదర్శనుడే ఉన్నాడో లేదో విచారించండి. నిజమైతే అతన్ని పిలిపించండి. అంతఃపురంలో రహస్యంగా మా వివాహం జరిపించండి. అలా కాని పక్షంలో నేను మరొకరిని వివాహం చేసుకునే ప్రసక్తి లేనేలేదు" అని నిష్కర్షగా తన నిర్ణయాన్ని తండ్రికి తెలియ చేసింది.*


         *కాశీరాజు భరద్వాజాశ్రమానికి గూఢచారులను పంపి సుదర్శనుని సమాచారం అంతా తెలుసుకున్నాడు. దేవి కలలో కనిపించి, తన కుమార్తెకు చెప్పినదంతా యథార్థమే అని గుర్తించాడు. సుదర్శనుణ్ణి స్వయంవరానికి ఆహ్వానించి , సగౌరవంగా తన నగరానికి తీసుకు వెళ్ళాడు. సుదర్శనుడు భరద్వాజుని ఆశీస్సులను అందుకుని, తల్లితో కలసి కాశీరాజు అంతఃపురానికి చేరుకున్నాడు.*


               *తెల్లవారితే స్వయంవరం. దేశదేశాల రాజులూ ఆ రాత్రి కాశీనగరంలో విడిది చేశారు. వచ్చిన వారిలో యుధాజిత్తు కూడా ఉన్నాడు. ఆ నాటి రాత్రి కాశీరాజు తన అంతఃపురంలో తన కుమార్తె అయిన శశికళను సుదర్శనున కిచ్చి రహస్యంగా వివాహం జరిపించాడు*.


                        *తెల్లవారితే ఈ వార్త రాజ్యమంతటా వ్యాపించింది. తమకు స్వయంవరానికి ఆహ్వానించి, శశికళకు రహస్యంగా పెళ్ళి చేయడం తమకు అవమానంగా భావించి, స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కాశీరాజుపై యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడ మామగారికి సహాయంగా నిలబడ్డాడు. యుధాజిత్తునకు సుదర్శనుణ్ణి చూడగానే క్రోధమాత్సర్యాలు పెల్లుబికాయి. వీరావేశంతో సుదర్శనుణ్ణి*

*చంపబోయాడు. సుదర్శనుడు ప్రశాంత చిత్తంతో దేవిని ప్రార్థించాడు. సింహవాహనారూఢ అయిన దుర్గాదేవి ప్రత్యక్షమై, వేలాదిగా సైన్యాన్ని సృష్టించి, సుదర్శనుని పైకి, అతని మామగారి పైకి వచ్చే శత్రువు లందరినీ నాశనం చేసింది*.


          *తన అల్లుని మంత్రానుష్ఠాన బలాన్ని గుర్తించి కాశీరాజు ఎంతో సంతోషించాడు. భక్తుడైన తన అల్లుని వల్ల తాను కూడా దేవిని సందర్శించ గలిగానని ఉప్పొంగిపోయాడు. అల్లుణ్ణి ఆదరించి, రాజలాంఛనాలతో కోసల దేశానికి తీసుకువెళ్ళి, అయోధ్యలో అతనికి యథావిధిగా పట్టాభిషేకం జరిపించాడు. సుదర్శనుడు దేవీ మంత్రానుష్ఠానాన్ని మరువకుండా, ఆమె అనుగ్రహంతో ధర్మబద్ధంగా పాలిస్తూ, ప్రజలకు సుఖశాంతులను కలిగించాడు. తన పుత్రునికి కలిగిన వైభవాన్ని చూచి తల్లి ఎంతో సంతోషించింది. జగన్మాతకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది*.


 *కాశీరాజు తన దేశంలో దుర్గాపూజలు ఆచరించి, ప్రజలందరికీ భక్తి భావాన్ని ప్రబోధించాడు. వాడవాడలా దేవీ ఆలయాలను ప్రతిష్ఠించి, అందరూ దేవి అనుగ్రహ పాత్రులయ్యే అవకాసం కల్పించాడు*.


 *దేవీ మంత్రాన్ని శ్రద్ధతో జపించినా, ఆమెను భక్తితో పూజించినా కష్టాలన్నీ తొలగి, సుఖశాంతులు కలుగుతాయనడానికి సుదర్శనుని కథే నిదర్శనం*.


🕉🔯🔯🕉☸☸🕉⚛⚛🕉

భగవద్గీత ... ప్రపంచ పుస్తకం

 #భగవద్గీత ఎప్పటికైనా 

తప్పకుండా ప్రపంచ పుస్తకంగా గుర్తించబడుతుంది..

********************************************


#గ్లోరియాఆరియెరా అనే ఈ పోర్చుగీసు మహిళకు భారత ప్రభుత్వం 2019లో #పద్మశ్రీ అవార్డును ప్రకటించింది..

ఆమె భగవద్గీతను పోర్చుగీసు భాషలోకి అనువదించి, తన ఆస్తినంతా అమ్మేసి వచ్చిన డబ్బుతో బ్రెజిల్ రాజధాని రియోడిజెనెరియో సమీపంలో వేదిక్ పాఠశాలను ఏర్పాటుచేసి భగవద్గీత, వేదాలను యూరోపియన్లకు నేర్పిస్తున్నది..

#సనాతనధర్మంలోని సైన్స్‌ను యూరోపియన్లకు వివరించేలా హిందూ ధర్మంపై అనేక రచనలు చేసింది....

"సనాతన జీవన విధానం అంటే నూటికి నూరు శాతం శాస్త్రీయంగా జీవించడమే.." అంటుంది ఈమె


Source: Asthram News

సయాటికా నొప్పి - తీసుకోవలసిన జాగ్రత్తలు .

 


   వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు 

సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు. 


              ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి. 


          ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.


         సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో గృ ధసీవాతం అని పిలుస్తారు .


  లక్షణాలు - 


     నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.


            ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .


              సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.సయాటికా వ్యాధిని గుర్తించడానికి X - ray పరీక్షల కంటే పైన పేర్కొన్న పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.


  సలహాలు - సూచనలు - 


    సయాటికానోప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యధేచ్చగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. అల్లోపతి మందులు నొప్పిని అదిమిపట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మీకు కనిపించదు. 


            వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది. 


         సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.


       

       ఈ వ్యాధి చికిత్సలో నేను రసఔషదాలు మరియు మూలికలు కలిపి ప్రయొగించినప్పుడు అద్బుత ఫలితాలు వచ్చాయి . ఈ వ్యాధి చికిత్స కొరకు నన్ను సంప్రదించగలరు . 


            ఆపరేషన్ చేయించుకొనవలసిన అవసరం లేదు. 


  గమనిక - 


        పథ్యం చేయగలను అనుకున్నవారు మాత్రమే సంప్రదించగలరు . కామెంట్స్ రూపంలో కాకుండా డైరెక్టుగా ఫొన్ చేయగలరు .


   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

*అష్టావక్ర మహర్షి



సకల విద్యావంతుడైన ఏకపాదునకు, సుజాతకు జన్మించిన వాడే అష్టావక్రుడు. ఏకపాదుడు గురుకులాన్ని నడుపుతూ, విద్యార్థులకు వేదవిద్య బోధించేవాడు. అయితే, విద్య బోధించే విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. ఈ విషయంలో నిద్రాహారాలు కూడా లెక్కచేసేవాడు కాదు. ఏకపాదునకు వివాహమై చాలాకాలం వరకూ సంతానం కలుగలేదు. ఎన్నో నోముల ఫలితంగా సుజాత గర్భవతి అయింది. ఏకపాదుని ఆనందానికి అవధులు లేవు. సుజాతకు నెలలు నిండుతున్నాయి.


ఒకరోజు ఏకపాదుడు నిద్రాహారాలు కూడా లెక్కచేయకుండా తన శిష్యులచేత వేదాధ్యయనం చేయిస్తున్నాడు. విద్యార్థులు అలసిపోతున్నారు... అయినా గురువుకు భయపడి వేదాన్ని అభ్యసిస్తూనే ఉన్నారు. ఇది సుజాత గర్భంలో పెరుగుతున్న శిశువుకు బాధాకరంగా తోచింది. వెంటనే తన తండ్రితో ‘ తండ్రీ.., ఏమిటీ విద్యాబోదన ? శిష్యులు నిద్రాహారాలు లేక సొలసిపోతున్నారు. వారి ఆరోగ్యం పాడవుతోంది.ఈ విదమైన విద్యావిధానాన్ని మార్చుకో ’ అని గర్భంలోంచే సలహా ఇచ్చాడు. ‘తనకు పుట్టబోయే కుమారుడు.., తనకు సలహాయిచ్చేంత గొప్పవాడా’ అని ఏకపాదుడు అహంకరించి, ఆ గర్భస్థ శిశువును ఉద్దేశించి.. ‘నీ జన్మకు కారణభూతుడనైన తండ్రినే విమర్శించేంత ఘనుడవా నీవు ? వేదాధ్యయనమునకు వక్రముగా గురువునే విమర్శించిన పాపానికి ప్రతిఫలంగా నీవు ‘అష్టావక్రుడు’గా జన్మించు’ అని కోపంగా శపించాడు. ఆ గర్భస్థ శిశువు తన తండ్రి శాపాన్ని ఆనందంగా స్వీకరించాడు.


సుజాతకు తొమ్మిది నెలలు నిండాయి. ప్రసవ సమయం దగ్గర పడిందని., ఇక రెండు మూడు రోజులలో శిశు జననం జరుగుతుందని గ్రహించాడు ఏకపాదుడు. ప్రసవ సమయానికి అవసరమైన తిలలు, ఘృతము, ఇతర ధాన్యములు సంపాదించే నిమిత్తం ఏకపాదుడు జనకుని రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ అనుకోని విధంగా వరుణుని కుమారుడైన వందితో వాదానికి దిగి ఓడిపోయాడు. పోటీ నియమానుసారం వంది.., ఏకపాదుని జల మధ్యంలో బంధించాడు. సరిగ్గా ఆ సమయంలోనే సుజాత., తన అన్న అయిన ఉద్దాలకుని ఇంట ఒక మగ శిశువును ప్రసవించింది. అయితే తండ్రి శాపానుసారం ఎనిమిది వంకరలు గల దేహంతో జన్మించాడు. అందుచేతనే అతనికి ‘అష్టావక్రుడు’ అని పేరు వచ్చింది.


ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతునకు, అష్టావక్రునకు సమంగా వేదవిద్య నేర్పుతున్నాడు. ఒకరోజు అష్టావక్రుడు తన మేనమామ అయిన ఉద్దాలకుని తొడపైన కూర్చున్నాడు. అది చూసిన శ్వేతకేతువు గబగబా వచ్చి ‘నా తండ్రి తొడ మీద నేను కూర్చోవాలిగానీ., నువ్వెలా కూర్చుంటావు? వెళ్లి నీ తండ్రి తొడమీద కూర్చో.’ అని ఘర్షణకు దిగాడు. వెంటనే అష్టావక్రుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ‘ అమ్మా..నా తండ్రి ఎక్కడ అని అడిగాడు’. ధన సంపాదనకై జనకుని సభకు వెళ్లారని చెప్పింది సుజాత. వెంటనే అష్టావక్రుడు జనకుని సభకు వెళ్లి., జరిగిన సంగతి తెలుసుకుని తన వాదనతో వందిని ఓడించి, తన తండ్రితో పాటు, గతంలో ఓడి బంధింపబడిన వారినందరినీ కూడా జలమధ్యం నుంచి విడిపించాడు. ఆ తర్వాత తన తండ్రిని తల్లికి అప్పగించి, తల్లికి ఆనందం కలిగించాడు.


అష్టావక్రునకు యుక్తవయస్సు వచ్చింది. వివాహం చేసుకోదలచి వదాన్యుని దగ్గరకు వెళ్లి అతని కుమార్తె అయిన ‘సుప్రధ’ను తనకు కన్యాదానంగా ఇమ్మని అర్థించాడు. వదాన్యుడు అతని శక్తిని పరీక్షింపగోరి ‘నీవు ఉత్తరదిశగా వెళ్లి, కుబేరుని పట్టణం దాటి, కైలాసగిరి చేరి, శివపార్వతులు సంచరించిన ప్రదేశం దాటి ముందుకు వెడితే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూసి రా..అప్పుడు నా కుమార్తె ‘సుప్రధ’ నీకిచ్చి వివాహం జరిపిస్తాను’ అని పలికాడు.


అష్టావక్రుడు ఉత్తరదిశగా బయలుదేరాడు. ముందుగా కుబేర పట్టణం చేరాడు. కుబేరుడు అతనికి స్వాగతం పలికాడు. అష్టావక్రుడు, కుబేరుని ఇంట రంభ, ఊర్వసి, తిలోత్తమల నృత్యగానాలను ఆస్వాదిస్తూ ఒక సంవత్పరం అతిథిగా కాలం గడిపి, తిరిగి తన ప్రయాణం కొనసాగించి.. హిమాలయాలలో బంగారుమయమైన ఒక దివ్యభవనాన్ని చూసాడు. అక్కడ కొందరు సుందరీమణులు అష్టావక్రునకు స్వాగత మర్యాదలు జరిపి ఆ భవనంలోకి తీసుకుని వెళ్లారు. ఆ భవనంలోపల ఒక జగన్మోహిని చిరునవ్వుతో అష్టవక్రుని దగ్గకు వచ్చి ప్రేమగా అతనిని తన అభ్యంతర మందిరానికి తీసుకుని వెళ్లి, తన కోరిక తీర్చమని అర్థించింది. ‘తల్లీ.. నేను అస్ఖలిత బ్రహ్మచారిని. పరసతిని కూడుట ధర్మం కాదు. నన్ను విడిచిపెట్టు’ అని అర్థించాడు. ‘ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్లండి’ అని కోరింది ఆ సుందరి.


అంగీకరించాడు అష్టావక్రుడు. తెల్లారింది. అష్టావక్రుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అప్పుడా జగన్మోహిని అతని దగ్గకు వచ్చి ‘ మహాత్మా...పరసతిని అనే కదా మీ అభ్యంతరం. నన్ను వివాహం చేసుకోండి. మీ సతిని అవుతాను. కాదనవద్దు.’ అని అర్థించింది. ‘అమ్మా...నీవు బాలవు. నీ వివాహ విషయంలో నీ తండ్రిగానీ, సోదరుడుగానీ నిర్ణయం తీసుకోవాలిగానీ.. నీకుగా నీవు స్వతంత్రించి నిర్ణయం తీసుకునే అధికారం నీకు లేదు. నిజం చెప్పు. నువ్వెవరు?’ అని ప్రశ్నించాడు అష్టావక్రుడు. ఆమె అతని దర్మనిష్ఠకు సంతసించి ‘మహామునీ..నేను ఉత్తరదిక్కాంతను. మిమ్ములను పరీక్షింపమని వదాన్యుడు నన్ను పంపాడు. ఈ పరీక్షలో విజయాన్ని వరించారు. వెళ్లి సుప్రధను వివాహం చేసుకోండి.’ అని పలికింది. ఆ తర్వాత సుప్రధ, అష్టావక్రుల వివాహం ఘనంగా జరిగింది.


*సక్షమ్ భారత్ సమర్థ్ భారత్*

*ఆయనతో మైత్రి*



మనిషికి... పుట్టిన క్షణం నుంచి చివరి క్షణాల వరకూ ఓ నేస్తం కావాలి. నేస్తం అంటే- ఓ తోడు, ఓ ఆనందం, ఒక భరోసా. వయసుకు, డబ్బుకు, హోదాకు సంబంధం లేని అందమైన అనుబంధం స్నేహం. అందుకే దానికి పరిమితుల్లేవు. పరిధులు అంతకంటే లేవు. అవసరాల పట్ల, అంతస్తుల పట్ల ఆసక్తులుండవు. అంతరాల అంచనాలుండవు. లింగభేదాలుండవు. వయోపరిమితులంతకంటే లేవు. భార్యాభర్తలు, తల్లీ బిడ్డలు, ఇరుగు పొరుగులు, దేశాలు, దేశాధినేతలు... స్నేహానికి ఎల్లలు లేవు. కష్టంలో, సుఖంలో, అవమానంలో, ఆనందంలో... సమతూకంగా పాలుపంచుకునే నిస్సంకోచ భరోసా అయిన భాగస్వామి- మిత్రుడు. చిన్ననాటి స్నేహమైతే మరీ మధురం.


రామ సుగ్రీవులు, శ్రీరామ గుహులు, కృష్ణ కుచేలురు, కృష్ణార్జునులు, రాధాకృష్ణులు... స్నేహశీలురు, స్నేహపాత్రులు. శ్రీకృష్ణుడికి గోపికలతో ఉన్న అనుబంధంలోని రహస్యం స్నేహమే. గోవులు, గోపాలురు, గోవర్ధనగిరి, నెమలి ఈకలు, పిల్లన గ్రోవి... ఆయన స్నేహ మాధుర్యంతో తడిసి పులకించిన జాబితా పెద్దదే. రాధతో ఆయన ప్రేమలోని కీలక అంశం స్నేహమే. మేనత్త కుంతితో, బావ అర్జునుడితో, చెల్లెలు ద్రౌపదితో ఆయనకున్న బంధుత్వం కంటే స్నేహభావమే ఎక్కువ. ఆయన స్నేహమాధుర్యం వల్లే కష్టాలు వాళ్లకు నీళ్లలో నావలా అనిపించాయి. జీవితంలోని బరువును తేలిక చేసే దివ్యౌషధం- స్నేహం.


రాముడైతే రాక్షసులతోనూ స్నేహం నెరిపాడు. వానరులైతే ఆయన ఆత్మీయ మిత్రులు. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా మైత్రీ బంధాన్ని స్థాపన చేసుకున్నాడు రాముడు.


స్నేహం అంటే ఇరువురు వ్యక్తులు, అభివ్యక్తుల అందమైన అల్లిక. మనోభావాల సుమమాలిక. ఒక వృక్షం- దాన్ని అల్లుకున్న పూలతీగ. ఒక రాకా చంద్రుడు- ఆయన్ని పరివేష్ఠించిన వెన్నెల మడుగు. ఎవరు వారో, ఎవరు వీరో తెలీదు. ఎవరు ఎవరైనా కావచ్ఛు ఇటు అటైనా, అటు ఇటైనా తలకిందులైనా ఆ రెంటి కలయిక ఒక అద్భుత ఆవిష్కరణ.


బాల్యంలో అమ్మ- పుట్టిన క్షణమే దొరికే నేస్తం. నిజానికి పుట్టకముందే స్నేహహస్తం అందించేందుకు తయారుగా ఉండే ‘సిద్ధ స్నేహితురాలు’ అమ్మ. ఆపై కాస్త ఎదిగాక తన ఈడు పిల్లలు, పెళ్ళయ్యాక జీవిత భాగస్వామి, ఆ తరవాత... పిల్లలు, వృద్ధాప్యంలో వారి పిల్లలు. ఏ వయసులోనైనా, ఎవరితోనైనా స్నేహం ఒక ఆగిపోని ఆనందపు వెల్లువ. ఊపిరి సలపని ఉత్సాహపు ఉప్పెన.


దురదృష్టవశాత్తు స్నేహానికీ గండిపడే ప్రమాదం ఉంటుంది. ఆటంకాలు పొంచి ఉంటాయి. తల్లి మరణించవచ్ఛు స్నేహితులు వివిధ కారణాలతో దూరం కావచ్ఛు జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్ఛు విడిపోనూ వచ్ఛు పిల్లలు, మనవలు... కారణం ఏదైనా జీవితంలో ఏ అనుబంధమూ శాశ్వతం కాదు.


కానీ ఆ ‘ఒక్కరితో’ స్నేహం, ఆ అనుబంధం ఎప్పటికీ చెదరనిది. చెరిగిపోనిది. తరిగిపోనిది. తెగిపోనిది. మనం వద్దనుకున్నా, దూరం జరిగినా నీడలా వెన్నంటి ఉండే ప్రియమైన నేస్తమది. నీ జీవితం ఉన్నంతవరకు, నీ శరీరం నిలిచినంత వరకు. ఇంకా ఆత్మానుసంధానం చేసుకుంటే... ఎప్పటికీ. ఎన్ని జన్మలకైనా అదే అనంతుడితో అనుబంధం. సాకేత రాముడితో స్నేహం. ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన వారిలా మనకు దూరం కాని, ఆయన అమృతస్నేహం గుర్తించని వారు దురదృష్టవంతులే!

ఆదిపర్వము -28 పాండురాజు అభ్యర్ధన

 ఆదిపర్వము -28 పాండురాజు అభ్యర్ధన


కుంతీ దేవిని పిలిచి, జరిగిందంతా ఆమెకు చెప్పాడు.


“కుంతీ, సంతానం లేకుండా జీవించి ఒకటే, మరణించి ఒకటే. కావున ధర్మ మార్గం ద్వారా మనకు సంతానం కలిగేట్లు చెయ్యవా. కుంతీ నీకు ఒక విషయం చేపుతాను వినుము. పుత్రులు ఆరు రకాలు. 1. ఔరసుడు, 2. దత్తకుడు, 3. కృత్రిముడు, 4. గూఢోత్పన్నుడు, 5. అపవిధ్ధుడు, 6. క్షేత్రజుడు. వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది.


ఇంకొక రకమైన పుత్రులు ఆరుగురు ఉన్నారు. వారు 1. కానీనుడు, 2. సహోఢుడు, 3. క్రీతుడు, 4. పౌనర్భవుడు, 5. స్వయందత్తుడు, 6. జ్ఞాతుడు. వీరు కూడా పుత్ర సమానులే కాని, వీరికి రజ్యాధికారము కాని, ఆస్తిలో భాగము కాని లేదు.


మొదట నేను చెప్పిన వారిలో ఔరసుడు, క్షేత్రజుడు ముఖ్యులు. ఔరసుడు పుట్టే యోగ్యత మనకు లేదు కాబట్టి, క్షేత్రజుడు మిగిలిన వారికంటే మేలు. దేవర న్యాయము చేత పుట్టిన పుత్రుడు ఉత్తముడు. పూర్వం కేకయ రాజుకు పుత్రులు లేరు. అప్పుడు ఆయన తన భార్యను నియోగించగా, ఆమె పుంసవన హోమం చేయించి ఉత్తమమైన ఋత్విజుల ద్వారా ముగ్గురు కుమారులను పొందింది. కాబట్టి ఔరసులు పుట్టడానికి అవకాశం లేనపుడు, క్షేత్రజులే మేలు” అన్నాడు పాండురాజు.


దానికి కుంతి “మహారాజా, మేము నీ ధర్మ పత్నులము. మనసులో కూడా పర పురుషులను తలపము. అలాంటపుడు వారితో కలిసి సంతానాన్ని ఎలా పొందగలము? కాని నీ వలననే మాకు సంతానం కలుగుతుంది.


ఎలా అంటే – పూర్వం పూరు వంశంలో వ్యుషితాశ్యుడు అనే రాజు, నూరు అశ్వమేధ యాగాలు చేసాడు. లోకంలో ఉన్న రాజులందరిని జయించాడు. కాని ఆయనకు కామం ఎక్కువ, మితి మీరి కామ సుఖాలు అనుభవించి, క్షయ రోగంతో మరణించాడు. ఆయన భార్య పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడు వ్యుషితాశ్వుని శరీరం నుండి ఒక మాట వినిపించింది.


“నీవు బహిష్టు అయిన ఎనిమిదో రోజు గాని, 14వ రోజు గాని, పడక మీద పడుకొని నన్ను స్మరించుము. నేను నీతో సంగమిస్తాను, నీకు పుత్రులు కలుగుతారు” అని వినిపించింది.


ఆ ప్రకారం చేసి ఆమె ఏడుగురు కొడుకులకు జన్మనిచ్చింది. కాబట్టి పాండురాజా, నువ్వు కూడా ఆ ప్రకారం సంతానం పొందవచ్చు కదా” అని అడిగింది కుంతీ దేవి.


అది సాధ్యం కాదు అని తెలుసుకున్నాడు పాండురాజు.


“కుంతీ, ఇదివరకు స్త్రీలు, భర్తల అదుపు ఆజ్ఞలలో ఉండేవాళ్లు కాదు. వారు స్వతంత్ర ప్రవృత్తి కలిగి ఉండేవాళ్లు. భర్త అనుమతితో గాని, భర్త అనుమతి లేకుండా కాని, తమ ఇష్టం వచ్చిన వారితో కాం అసుఖాలు అనుభవించేవారు. సంతానం పొందుతుండేవారు.


ఒకరోజు మహాతపస్వి అయిన ఉద్ద్దాలకుని భార్య బహిష్టు అయింది. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆమెను చూసి, మోహించి, తనకు సంతానం కావాలని ఆమెను అడిగాడు. ఇది విని ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతుడు కోపించాడు. అది ధర్మవిరుధ్ధం అని ఖండించాడు.


“ఈ రోజు నుండి స్త్రీలు ఎప్పుడూ పరపురుషుని కోరకూడదు. వివాహమైన స్త్రీలకు పరపురుషునితో సంగమం నిషిధ్ధం. దాని వలన సర్వ పాపాలు కలుగుతాయి” అని కట్టడి చేసాడు.


అప్పటి నుండి వివాహితులైన భార్యలు, తమ భర్తలతో తప్ప వేరే వారితో సంగమించడం లేదు. కాని భర్త ఆజ్ఞ ప్రకారం సంగమించ వచ్చును. భర్త ఆజ్ఞను అతిక్రమించడం దోషం. అంతే కాదు, కల్మాషపాదుడి తన భార్య దమయంతిని దేవర న్యాయం ప్రకారం పుత్రుని పొందమని నియోగించాడు. భర్త ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుందని, దమయంతి వశిష్టుని వలన, అశ్మకుడు అనే పుత్రుని పొందింది. అలాగే నువ్వు కూడా దేవర న్యాయంతో పుత్రులను పొందుము. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను” అని దీనంగా అన్నాడు పాండురాజు.

రామాయణమ్. 92

 

...

భరతుడి అరుపులు,కేకలు, పెడబొబ్బలతోఅంతఃపురం మారుమ్రోగిపోతున్నది.భరతుడి గొంతు గుర్తుపట్టిన కౌసల్య సుమిత్రతో అదిగో భరతుడు వచ్చినట్లున్నాడు ఆ గొంతు అతనిదే కదా అని ఆవిడ అంటూఉండగనే భరతశత్రుఘ్నులు పెత్తల్లి చెంతకు చేరారు.

.

ఆవిడ అప్పటికే భర్తృవియోగం ,పుత్రుడు దూరమవ్వటం అనే రెండు పదునైన దుఃఖాలు మనస్సును కోస్తూ ఉంటే మాటిమాటికీ సంజ్ఞతప్పి ఏడుస్తూ నేల మీదపడి దొర్లుతూ అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న కౌసల్యను చూడగనే భరతుడి హృదయంలో అంతులేని వేదన పుట్టింది.

.

నేలమీద పడి ఉన్న మహారాణి కౌసల్య మహాధానుష్కుడు,జగదేకవీరుడైన రాముడి కన్నతల్లిని అలా చూడలేక పోయాడు భరతుడు.వెంటనే జలజలకన్నీరు కారుస్తూ కౌసల్యను లేవనెత్తి ఆవిడను కౌగలించుకొన్నారు భరతశత్రుఘ్నులిరువురూ..

.

భరతుని చూడగనే కౌసల్య నాయనా ఏ శత్రుబాధలేని రాజ్యము నీకు లభించినదికదా ! ఏమి ఆశించి నా కొడుకుకు నారచీరలు కట్టబెట్టి నీ తల్లి వాడిని అడవులకు పంపింది .నా కొడుకున్నచోటికే నన్ను కూడ పంపివేయి. ఈ రాజ్యము హాయిగా నీవు ఏలుకోవచ్చు.

.

పుండును కెలికి సూదితో గుచ్చినట్లున్నాయి కౌసల్యామాత మాటలు .భరతుడి వేదన అంతకంతకూ హెచ్చింది .దానికి అంతం లేకుండా పోయింది...

.

పెద్దతల్లికి చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మా ఏ పాపము తెలియని నన్నెందుకు నిందిస్తావు.అన్నమీద నాకు గల ప్రేమ,భక్తి నీవెరుగనివా?

.

అమ్మా అన్నగారి అరణ్యవాసానికి నా సమ్మతి ఉన్నట్లయితే..

.

సూర్యభగవానుడి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసేవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది

.

జీతము ఇవ్వకుండా పని చేయించుకొన్న యజమానికి ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు కలుగుతుంది.

.

మాట ఇచ్చి తప్పినవాడికి ,ప్రజల రక్షణ మరచిన రాజుకు ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

రణరంగంలో పోరాడి మరణించక వెన్నుచూపి పారిపోయినవాడికి ఏ పాపం చుట్టుకుఙటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఆవులను కాలితో తన్నినవాడికి,పెద్దలను దూషించినవాడికి,మిత్రద్రోహము చేసిన వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఎదుటివాడు విశ్వాసముంచి చెప్పిన రహస్యాన్ని బహిర్గతపరచినవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది.

.

ఇంటిలోని భార్యాపిల్లలకు,అతిధులకు,బంధువులకు ఎవ్వరికీ పెట్టకుండా తానొక్కడే మృష్టాన్న భోజన మారగించే వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకొను గాక.

.

అమ్మకూడని వస్తువులు .లక్క,మధువు,లోహము,విషము,మాంసము అమ్మేవాడికి ఏ పాపము చుట్టుకుంటుందో అది చుట్టుకొను గాక.

.

నాకు ఆ ఉద్దేశ్యమే ఉండి నట్లయితే కుండ పెంకు చేతబట్టి చినిగిన గుడ్డలు కట్టి భిక్షమెత్తుకొంటూ ,పిచ్చివాడివాలే భూమి మీద తిరుగుదును గాక..

.

సంధ్యా సమయాలలో నిదురించే వాడికి కలిగే పాపము నాకు కలుగు గాక.

.

పరభార్యా సంగమము చేసిన వానికి ఎట్టిపాపము కలుగునో అట్టిపాపము నాకూ కలుగు గాక.

‌.

ఈ విధంగా కౌసల్యను ఓదర్చటానికి ప్రయత్నం చేస్తూ దుఃఖ భారంతో తానుకూడ నేలమీద పడిపోయాడు భరతుడు.


రామాయణమ్.93

...

దుఃఖార్తుడై తీవ్రమైన వేదనతో విలపిస్తూ శపధములు చేస్తూ ఒట్లుపెట్టకుంటున్న భరతుని చూసి కౌసల్య దుఃఖము మరింత హెచ్చింది .రాముడంటే ప్రాణమైన భరతుని దగ్గరకు తీసుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని చాలాసేపు దుఃఖిస్తూ అలాగే ఉండిపోయింది.అలాగే రాత్రి గడిచిపోయింది.

.

తెల్లవారుతుండగనే వశిష్ఠ మహర్షి భరతుడికి చేయవలసిన కార్యములను గురించి తెలిపి అందుకు కావాలసిన ఏర్పాట్లు చేసినాడు.

.

నూనెలో జాగ్రత్తగా ఉంచిన దశరధుడి కళేబరాన్ని బయటకు తీసి నేలపై ఉంచారు. మహారాజు ఇంకా నిదురిస్తున్నట్లుగనే ఉన్నాడు.

.

ఆయన పార్ధివ శరీరం వద్దకు వెళ్ళి భరతుడు ఎందుకు చేశావయ్యా నీవీ పని ? ధర్మమూర్తి రాముడిని అడవులకు పంపే నిర్ణయమెందుకు చేశావు.నా దగ్గర రాముడూలేడు,నీవూలేవు ఇక ఈ అయోధ్య భర్తలేని విధవరాలుగా ప్రకాశహీనంగా ఉన్నదయ్యా! అని పరిపరివిధాలుగా రోదిస్తున్న భరతుడిని వశిష్ఠుల వారు ఓదార్చి చేయవలసిన కార్యాలగురించి తొందరపెట్టాడు.

.

మహారాజుదేహాన్ని పల్లకిలో కూర్చుండ బెట్టి శ్మశానమునకు తీసుకువెళ్ళి చితిమధ్యలో పరుండబెట్టి అనేక విధాలైన గంధద్రవ్యాలు చేర్చగా,భరతుడు ఆయన చితికి నిప్పుపెట్టాడు.

.

ఆయనకు జరిపించవలసిన కర్మలు శాస్త్రోక్తంగా పూర్తిచేసి రాముడి వద్దకు వెళ్ళిపోవాలనే తలంపుతో శత్రుఘ్నునితో కలిసి కూర్చున్నాడు భరతుడు.

.

ఇద్దరూ మాట్లాడు కుంటున్నారు.సకల లోక రక్షకుడు ,మహాబలశాలి,మనకు కష్టాలు వస్తే ఆదుకునే రాముడిని ఒక ఆడుది అడవికి పంపి వేసింది.

.

ఆసమయంలో లక్ష్మణుడు ఏం చేస్తున్నట్లు?స్త్రీ వశుడైన తండ్రిని ఎందుకు నిగ్రహించలేకపోయినాడు? ఇలా మాట్లాడుకుంటుంటే వారికి అటుగా వెళ్తూ మంధర కనపడ్డది.

.

అది వంటి నిండా గంధము పూసుకొని రాణులు అలంకరించుకొనే విధముగా విలువైన వస్త్రాలు ధరించి రకరకాల అలంకారాలతో,నడుముకు వడ్డాణముతో త్రాళ్ళతో కట్టబడ్డ ఆడుకోతిలాగ ఉన్నది.

.

దానిని ద్వారపాలకులు పట్టుకొని ఇదిగో ఎవతెమూలంగా రాముడు అడవులపాలయ్యాడో ఆ దరిద్రపుగొట్టు మంధర ఇది ఏం చేస్తావో చెయ్యి అని శత్రుఘ్నునికి అప్పగించారు.

.

ఇది చేసిన వెధవపనికి ఇది ఫలితము అనుభవించాల్సిందే అంటూ ఆ గూనిదానిని జుట్టుపట్టుకొని ఒక ఈడ్పుఈడ్చాడు శత్రుఘ్నుడు అప్పుడు అది వేసుకొన్న ఆభరణాలు చెల్లాచెదురుగా పడి ఆ నేల అంతా నక్షత్రాలు పరుచుకొన్న ఆకాశంలాగ కనపడ్డది.

.

అది కుయ్యోమొర్రో అంటూ ఏడుస్తుంటే దాని వెంట వస్తున్న తక్కిన దాసీజనమంతా శరణువేడటానికి కౌసల్యా మందిరం వైపు పరుగెత్తారు.

.

శత్రుఘ్నుడు తీవ్రమైన క్రోధావేశంతో కైకేయినికూడా దూషిస్తూ ఉంటే ఆవిడ విపరీతమైన భయంతో భరతుడిని శరణువేడింది.

.

అప్పుడు శత్రుఘ్నుని చూసి భరతుడు తమ్ముడూ స్త్రీల ను చంపడం మహాపాపం వీరిని వదిలి వేయి ,అదీగాక వీరికి ఏవిధమైన హానికలిగినా జీవితాంతము రాముడు మనతో మాట్లాడడు.

.

రాముడు నిందిస్తాడు అనే భావనే నాకు లేకపోతే ఈ ధూర్తురాండ్రను నేనే ఎప్పుడో సంహరించి ఉండేవాడిని.

.

భరతుడి ఆ మాటలు విని వారిరువురినీ విడిచిపెట్టేశాడు శత్రుఘ్నుడు.

కంసుడిని

 శ్రీ గురుభ్యో నమః శుభమస్తు 

      ...............................

యోగమాయ పలికిన పలుకులు 

కంసుడిని కలవరపెట్టసాగాయి. దేవకి, వసుదేవుల పట్ల చూపిన

సౌజన్యం , తాత్కాలిక పరివర్తన మాత్రమే. మంచివారి ఆలోచనలు 

స్థిరం గా ఉంటాయి, కాని చెడ్డవారి మనసులు, ఆలోచనలు స్థిరం గా వుండవు. తనను చంపే పసిబిడ్డ ఎక్కడో , యోగమాయతో కూడా పుట్టియుంటాడన్న భావన కంసుడికి, ఆతని అనుచరులకు కలిగింది. 


, "ఏవం చేతర్షి భోజేన్ద్ర పురగ్రామ 

ప్రజాదిషు 


అనిర్దశాన్నిర్దసాంశ్చ హనిష్యామో 

ద్య వైశిశూన్ 


అనుజ్ఞ ఇస్తే నేడే పుర గ్రామాలలో ఉన్న, పదిదినముల లోపు, అంతకు మించిన వయస్సు గలవారిని , వధించి, విపత్తు ను నిర్మూలిస్తాము, అని అన్నారు. 


చెడును, ప్రారంభంలోనే నిర్మూలించకున్న, అది జయింపరాని, నిరోధించరాని బలీయ మైన శక్తి 

గా మారవచ్చునని రాక్షస మంత్రి మండలి సలహా ఇచ్చింది. కంసుడు గూడా నచ్చాడు. శిశు సంహారానికి, సాధు హింసకు అనుజ్ఞ ఇచ్చాడు. 


ఆయుః శ్రియం యశోధర్మం 

లోకానాశిష ఏవ చ 

హన్తి శ్రేయాంసి సర్వాణి పుంసో మహాదతి క్రమః 

(సాధువులను ఎవరు కష్ట పెడతారో, వారు ఆయుష్షు ను, సంపదను కీర్తిని, పుణ్యాన్ని పోగొట్టు కుంటారు )

మూర్కుడు, దుర్మార్గుడైన కంసుడికి ఇవేమి పట్టలేదు. తనకసాధ్యమైనది లేదన్న 

గర్వంతో వున్నాడు.. 

వినాశకాలే విపరీతబుద్ది యన్నట్లు  

తన చావుకు అన్ని మార్గాలు చూసుకుంటున్నాడు. 


అక్కడ, గోకులం లొ తెల్లవారింది. 

నందుడికి, కొడుకు పుట్టాడన్న శుభవార్త పల్లె కంటా తెలిసింది. 

, "ఏమినోము ఫలమో ఇంత ప్రొ 

ద్దొక వార్త, వింటి మబలలారా !

వీను లలర


మన యశోద చిన్ని మగవాని గనెనట చూసి వత్తమమ్మ సుదతులార!

గోప యువతు లందరు, ఒకరినొకరు నిద్ర లేపుకొంటూ, గుంపులు , గుంపులు గా, నందుడి ఇంటికి తరలివెళ్లారు. పల్లె పడుచుల అందానికి తోడు, ఆనందం కూడా తోడయ్యింది. 

వడిగా నడిచేవారు, వయ్యారంగా నడిచేవారు, వర్షాకాలపు చల్ల గాలులకు పయ్యెదలు కప్పుకొనేవారు, వ్రేపల్లె గోపికలంతా యశోద చుట్టూ మూగారు. నల్లనయ్య ను చూసారు. స్వామి తానప్పటి దాకా దాచిన తన మోహనాకారపు కళ లన్నిటిని 

నిలువెల్లా చూప సాగాడు. 


గోపికలందరు ఆ మోహనాకారాన్ని చూసి మోజు పడ్డారు. పసి కందులంటే, ఎవరికి మాత్రం ఇష్టం 

ఉండదూ? 

అందరూ కలసి, శరీరానికి పసుపు రాసి తలకు నూనె అంటి, శుభ్రం గా స్నానం చేయించారు. దిష్టి తీశారు సాంబ్రాణి పొగ పట్టారు. 

ముద్దులిడుకున్నారు. 

గోపికలతో తొలి జలస్నానం చేసి శ్రీమహావిష్ణువు పొత్తి గుడ్డలలొ విశ్రమించాడు.

తల్లి వొడిలో పెరగ సాగాడు. జాతకర్మ చేయించుకున్నాడు. 

తల్లి చను బాలకు అలవాటయ్యాడు. 

యశోద చేసుకున్న తపస్సు, పుణ్యం చనుబాలు రూపంలో, స్వామి ని చేరుకుంటున్నాయి. 

విచిత్రం, ఏమిటంటే, స్వామి చనుబాలుకు అలవాటు అయిన తరువాత, గోకులం లొ గోవుల పొదుగులు, నిండు పాలకుండల్లా నిండిపోయాయట. కుమ్మరి వారు పాల కుండలు తయారు చెయ్యడం లొ తలమునకలయ్యారట. 

పచ్చిక బయళ్లు సమృద్ధిగా గోవులకు గ్రాసం ఇవ్వసాగాయి 


యశోద తన బిడ్డ వర్చస్సు, అందము చూసి తను కన్నబిడ్డయేనా !అని అచ్చెరువు వొందింది. ప్రేమతో హృదయానికి ఒత్తుకుంటూ, ముద్దిడుకుంటూ, 

తన్మయత్వం చెంద సాగింది 


గోపికల దిష్టి తగులుతుందని దైవ ధ్యానం చేసుకునేది. తనకోసం ధ్యానం చేసే తల్లిని చూసి, మురిసిపోతూ, దేవదేవుడు తల్లి వంక, నవ్వుతూ చూస్తూ ఉండేవాడు. నవ్వే, నల్లనయ్యను చూసుకుంటూ, తల్లి తన్మయం చెందేది. 


గోకులం వార్తలు మధురకు కూడా చేర సాగాయి 


(అధిక మాసంలో దశమస్కందం 

చదివినా , విన్నా పుణ్యమంటారు )

భగవంతుడు

 రాత్రి పూట ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి.సూర్యోదయం అయిన తర్వాత అవి కనపడవు. అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పగలమా? మానవుడా! అజ్ఞానంలో నువ్వు భగవంతుణ్ణి కనుగొన లేకపోయినా అందువల్ల భగవంతుడు లేడని నిర్ణయించుకోవద్దు..

రెండు రకాల సంస్కారాల తో మానవుడు ఈ లోకంలో జన్మిస్తున్నాడు. 

అందులో ఒకటి ముముక్షు హేతువైన "విద్య"..

రెండవది సంసార బంధ హేతువైన "అవిద్య "..

మానవుని జనన కాలంలో ఇవి రెండు త్రాసులోని సిబ్బుల మాదిరి సరిసమానంగా ఉంటాయని చెప్పవచ్చు.

సంసారం, లౌకిక సుఖాలను-ఒక సిబ్బిలో, దైవం,దైవ జిజ్ఞాస అనేవి రెండవ సిబ్బిలో,ఉదయింప చేస్తాయి.

మనసు సంసారాన్ని కోరుకుంటే అవిద్య అనే సిబ్బి బరువై 

మానవుడు లోకం వైపు మొగ్గుతాడు.

అలాకాక దేవుని కోరుకుంటే విద్య అనే సిబ్బి బరువై అతన్ని దేవుడి వైపు మరలుస్తుంది.

గృహస్థులు- విధి విధానాలు



1. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.


2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.


3.ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు..


4.చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు...


5. లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.


6. కాళికా , ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు.


7. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు...


8. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్క ఉండవచ్చు..


9.ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు, ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు,వినాయకుడి ఫొటో, కానీ,దిష్టి యంత్రం గాని, కాళీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది..


10. నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండి.. 


11. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రములో తొండం ఎడమ వైపు ఉండాలి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహం కి తొండం కుడి వైపు ఉండాలి..వ్యాపారం చేసే ప్రాంతంలో లో నిల్చున్న వినాయకుడు ఉండాలి.


12. ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది..


13. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ ఐయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి.


14.పూజ గదిలో ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నాంకొమ్ముతో తిరు నామాలు, శైవులు అయితే త్రిపురాండ్రులు(అడ్డనామాలు), శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి, వైష్ణవుల అయితే తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రద్దీ నామాలు పెడతారు, మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం , ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు.


15. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.


16. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు.


17. బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్ట కూడదు.. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు.


18. నవగ్రహాలు తాకి మొక్క కూడదు...


19. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు, రాత్రి పూట తల చిక్కు తీయకూడదు, పెరుగు చేతితో చిలక కూడదు, 


20. నీరు,పాలు, పెరుగు, నైయి కి అంటు ఉండదు.అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు..


21. లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి, లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి.. అలాగే జేష్ఠ దేవి అనుగ్రహం ఎలా పొందాలి జేష్ఠ దేవి నివాసం పులిహోర ,జేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి.. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది, పులిహోర చేసి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు...పంచి పెడితే ఇంకా మంచిది.


22. రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు, ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటారు వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు.. సంతోషం గా వంట చేస్తే సంతోషం గా తింటారు...


23.ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు..


24.పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు..


25.ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో


కూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి..


26. జపానికి వాడే జప మాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడ కూడదు..


27. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు....


28.దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు...


29. ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు... మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనం కి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లెవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి..అలా ఓక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు..


30.ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి, అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది.


31.అద్దె ఇల్లు వాస్తు మీ జాతకనికి సరిపడక పోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన wallmat గోడకు డెకరేషన్ గా పెట్టాలి....


32. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది... సేకరణ


శుభోదయం

**శ్రీమద్భాగవతము**

 **దశిక రాము**




 తృతీయ స్కంధం -27


బ్రహ్మస్తవంబ 


దివ్యస్వరూపా! పరమాత్మా! ఈ పాపాత్ముడైన రాక్షసుడు నా వరంవల్ల గర్వించి లోకాలనన్నిటినీ చీకాకు పరుస్తున్నాడు. ఇటువంటి దుశ్చరిత్రుని చంపకుండా ఇలా నిర్లక్ష్యం చేయడం సరి కాదు. వీనిని సంహరించు. భూదేవికి శుభం కలుగుతుంది. శుభకరా! చిన్న పిల్లవాడు చేతిలో భయంకర సర్పాన్ని పట్టుకొని ఆడుకొనే విధంగా ఈ రాక్షసరాజును చంపకుండా ఊరికే ఉపేక్షించడం మంచిదా? అంతే కాక...పుణ్యాత్మా! ఈ అభిజిత్తు ముహూర్తంలోనే (మిట్ట మధ్యాహ్నమే) రాక్షసుని చంపకపోతే ఆ తరువాత రాక్షసులవేళ అయిన సాయంకాలం వస్తుంది. ఆ సమయంలో రాక్షసుల మాయాబలం వృద్ధి చెందుతుంది. అప్పుడు చంపడం సాధ్యం కాదు. కావున సాధుజనులకు మేలు చేసే సంకల్పంతో ఇప్పుడే వీనిని చంపు.” అని ఈ విధంగా పల్కిన బ్రహ్మ మాటలు విని విష్ణువు, దేవతలంతా చూస్తుండగా మందహాస వదనారవిందంతో ఒప్పుతూ రాక్షసుని ఎదుట నిలబడి...విష్ణువుయొక్క తెల్ల తామరల వంటి కన్నులు రోషంతో ఎఱ్ఱతామరల వలె కాగా తన పెను గదాదండంతో ఆ రాక్షసుని దవడపై తీవ్రంగా మోదాడు. వాడు ఆ దెబ్బను తట్టుకొన్నాడు.

ఆ హిరణ్యాక్షుడు వెంటనే భయంకరమైన గదను పట్టుకొని విచిత్ర భంగిమలతో, బాహుగర్వంతో విష్ణువును సమీపించి అతని చేతిలోని గదను సముద్రంలో పడగొట్టాడు. అప్పుడు...హరి నిరాయుధుడు కావడంతో హిరణ్యాక్షుడు యుద్ధధర్మాన్ని పాటించి పోరాటం ఆపి నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆకాశమంతా దేవతల హాహాకారాలతో 

నిండిపోయింది. కమలాక్షుడైన విష్ణువు రాక్షసరాజైన హిరణ్యాక్షుని యుద్ధధర్మానికి, అపార శౌర్యస్ఫూర్తికి మిక్కిలి ఆశ్చర్యపడినా పట్టుదల విడువలేదు.భూమిని ఉద్ధరించిన విష్ణువు ఆ రాక్షసరాజును వధించడం కోసం తన మనస్సులో సుదర్శన చక్రాన్ని స్మరించాడు. ఆ చక్రం దైత్యుల వంశమనే మహారణ్యాన్ని దహించే జాజ్వల్యమానమైన దావానలం. ఎల్లప్పుడు జయజయ శబ్దాలతో ప్రతిధ్వనించే దిక్చక్రం కలది. సర్వదా ఆశ్రయించేవారికి రక్షణ కలిగించేది. సమస్త భూమండలాన్ని పాలించేది. ఆ సుదర్శనచక్రం ప్రచండ సూర్యమండలం వలె తీవ్రంగా వెలిగిపోతున్నది. చెలరేగుతున్న అగ్నిజ్వాలలతో కోపంతో ఉన్న సమస్త శత్రువుల అడ్డులేని అహంకారమనే అంధకారాన్ని అణచివేస్తున్నది. సహింపరాని రివ్వురివ్వుమనే ధ్వనులతో సాగరఘోషను చులకన చేస్తున్నది. అది సమస్త దేవతలచేత పొగడబడుతూ, అనంత కాంతులతో విరాజిల్లుతూ, తన కాంతులతో బ్రహ్మాండాన్ని నింపుతూ వేగంగా వచ్చి విష్ణువు కుడిచేతిని అలంకరించింది. రాక్షసవైరి యైన విష్ణువు ఆ చక్రాన్ని ధరించి ఆకాశంనుండి దేవతలు జయజయ ధ్వానాలు చేస్తుండగా హిరణ్యాక్షునికి ఎదురుగా నడిచాడు. చక్రాన్ని ధరించి అమితోత్సాహంతో వస్తున్న ఆదివరాహమూర్తిని చూచి హిరణ్యాక్షుడు పెదవులు తడుపుకుంటూ, మొక్కవోని శౌర్యంతో, ధైర్యం చెడక భయంకరమైన గదతో కొట్టాడు.హిరణ్యాక్షుడు విసిరిన గదను విష్ణువు ఆనందంగా మందహాసం చేస్తూ ప్రక్కన పడేవిధంగా కాలితో తన్నాడు.ఈ విధంగా గదను దూరంగా తన్ని హిరణ్యాక్షునితో విష్ణువు ఇలా అన్నాడు. రాక్షసరాజులలో నీచుడవు. పెద్ద గద పట్టుకొని మహాబలవంతుడ నని గర్వించి యుద్ధరంగంలో నన్నెదిరిస్తున్నావు. రారా!” అని పలుకగా హిరణ్యాక్షుడు చెలరేగి గదతో విష్ణువును కొట్టాడు. ఆయన ఆ గదను గరుత్మంతుడు పామును పట్టినట్లుగా ఒడిసిపట్టుకొన్నాడు. హిరణ్యాక్షుడు తన బలం విష్ణువు యొక్క అడ్డులేని శౌర్యం ముందు ఎందుకూ పనికిరాదన్న సంగతి మనస్సులో తెలిసికూడ దురభిమానంతో ఎదిరించాడు. అప్పుడు...రాక్షసుడు ప్రళయాగ్నిలాగా భయంకరంగా మండుతున్న శూలాన్ని అందుకొని యజ్ఞవరాహ రూపంలో ఉన్న విష్ణువుపై వేశాడు. సద్బ్రాహ్మణునిమీద చాపల్యంతో ప్రయోగించిన చేతబడిలాగా; ఇంద్రుడు తన వజ్రాయుధంతో గరుత్మంతుని రెక్కలోని ఈకను మాత్రమే త్రుంచ గలిగినట్లు; హిరణ్యకశిపుని అంతటి శూలమూ వ్యర్థమైపోయింది. విష్ణువు తన చక్రాయుధంతో ఆ శూలాన్ని మధ్యలోనే చటుక్కన రెండుగా ఖండించాడు. అది చూసి దేవతలకు సంతోషం చెలరేగింది; రాక్షసులకు సంతోషం క్షీణించింది.ఆ సమయంలో రాక్షసుడు తన శూలం చక్రాయుధం చేత ఖండింపబడటం చూచి...

ఆ రాక్షసుడు కోపంతో మండిపడి కఠోరమైన తన పిడికిలితో విష్ణువును పొడిచాడు. హరి పూలదండ తాకిన ఐరావతం వలె కలత చెందక విరాజిల్లాడు. ఆ రాక్షసుడు విష్ణువుమీద కోట్లకొలది మాయలు ప్రయోగించాడు. భూమండలమంతా దుమ్ము రేగి చీకటితో నిండిపోయింది. మేఘాలు భయంకరంగా రాళ్ళను, మలమూత్రాలను, కుళ్ళిన ఎముకలను, రక్తప్రవాహాన్ని కురిపించి చీకాకును కలిగించాయి. ఇంకా...భూతాలు, పిశాచాలు, డాకినులు జుట్టు విరబోసుకొని, భయంకరమైన కరకు కోరలతో, దౌడలతో, ఎఱ్ఱని కన్నులతో గుంపులుగా ఆకాశంలో నిల్చి ఆయుధాలు ధరించి, పెద్దగా కేకలు వేస్తూ యక్ష రాక్షస సైన్యాలతో కూడి కనిపించాయి. అప్పుడు...కాలత్రయంలో చరించగలవాడైన ఆ యజ్ఞవరాహ రూప విష్ణువు ఆ రాక్షసరాజు మాయను నిరోధించగల ఆయుధాలలో అగ్రగణ్యమైన తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. విష్ణువు ప్రయోగించిన ఆ చక్రం యొక్క సూర్యకాంతి భూమండలమంతా నిండి ఆ మాయావి అయిన రాక్షసుడు ప్రయోగించిన మాయాచక్రాన్ని అతడు చూస్తుండగా అణచివేసింది.

ఆ సమయంలో ఇక్కడ....తన భర్త అయిన కశ్యప ప్రజాపతి చెప్పిన మాటలు తప్పవేమో అని దితి అనుకొంటుండగా హిరణ్యాక్షుని పతనాన్ని సూచిస్తున్నట్లుగా ఆమె పాలిండ్లనుండి రక్తధారలు ప్రవహించాయి. అప్పుడు ఆ రాక్షసుడు కృతఘ్నునికి చేసిన ఉపకారం లాగా తాను ప్రయోగించిన వందల కొలది మాయలు హరిమీద పనిచేయక విఫలం కాగా మొక్కవోని శౌర్యంతో విష్ణువును సమీపించి రెండు చేతులు చాచి అతని వక్షస్థలాన్ని బలంకొద్ది పొడచి బాధపెట్టాడు. విష్ణువు తప్పించుకొని ప్రక్కకు తొలిగాడు. రాక్షసుడు విజృంభించి బలమైన పిడికిలితో వరాహమూర్తిని పొడిచాడు. హరి అలసిపోక కోపంతో భయంకరమైన ఆకారం కలవాడై ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించిన విధంగా వజ్రాయుధం వంటి తన అరచేతితో మోటుగా నున్న రాక్షసుని నడుముపైన తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బకు హిరణ్యాక్షుడు గిరగిర తిరిగి కన్నులు తేలిపోగా సోలిపోయి ఎట్టకేలకు తేరుకొని ఎదుట నిలబడ్డాడు. అప్పుడు....

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

శివామృతలహరి

     .శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||


రొదగావించుచు నిర్విరామముగ నోర్పుంజూపి, పెన్గొండలన్

పిదపన్ కోనల కానలన్ గడచి యుద్వేగంబునన్ పాఱు త

న్నదికిన్ శాంతి నొసంగు సంద్రము విధానన్ సచ్చిదానంద మూ

ర్తి! దయాభ్దీ ! ననుగొంచు ముక్తి నిడరా శ్రీ సిద్దలింగేశ్వరా !


భావం;

గలగల మని శబ్దం చేస్తూ నిరంతరం ఓర్పుగా ప్రవహిస్తూ ఎత్తైన కొండలు,లోతైన కోనలు, దట్టమైన అడవులు దాటి ఉద్వేగంగా సముద్రుడి లో కలవటానికి తపన పడే నదికి, ఏ విధంగా తనలో చేర్చుకుని సముద్రుడు శాంతిని ప్రసాదిస్తాడో,

అదేవిధంగా నిరంతరం నీ నామజపం చేస్తూ, ఎంతో భక్త్యా వేశాలతో నిన్ను కలవాలని తపిస్తున్న నన్ను కూడా 

నీలో ఐక్యం చేసుకొని ముక్తిని ప్రసాదించవా! ఓ సత్యము, జ్ఞానము, ఆనందము కలిసిన

సచ్చిదానంద మూర్తి!

 ఓ దయా సముద్రుడా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

అని ప్రార్థించారు.

కేతువు వలన కలిగే దోషాలు - శాంతి మార్గాలు



కేతువు పార్ధివ నామ సంవత్సరం ఫాల్గుణమాసం శుక్ల పౌర్ణమి అభిజిత్ నక్షత్రంలో బుధవారం జన్మించాడు. కేతువు బూడిద వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇచ్చినందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీటి నుంచి అనేక వ్యాదులు ఉద్భవించాయి. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది.


కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుంచి మీనానికి.. ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి 18 సంవత్సరాల సమయం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని 7వ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం 7 సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి జన్మించిన ఆరంభ దశ కేతు దశ.


కారకత్వం

కేతువు మోక్షవిజ్ఞాన కారకుడు చపలత్వము, జ్ఞానహీనత, శత్రు బాధలు, దూర ప్రదేశాలు, దేశాలు తిరుగుట, ఉన్మాదము, దృష్టమాంద్యము, కర్రదెబ్బలు, క్షుద్రము మంత్ర ప్రయోగములు మొదలగునవి కలిగినచో కేతువు బలహీనుడని గుర్తించాలి. వేదాంతం, తపస్సు, మోక్షం, మంత్ర శాస్త్రం, భక్తి, నదీస్నానం, మౌన వ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసం, పరుల సొమ్ముతో సుఖించుట, దత్తత మొదలైన వాటిని సూచిస్తాడు.


వ్యాధుల వ్యాప్తి...

కేతువు మృత్యు కారకుడు, భయాన్ని కలిగిస్తాడు, వ్యాధులను కలిగిస్తాడు. రక్తపోటు, అలర్జీ, మతి స్థిమితం లేక పోవుట మొదలైన వ్యాధులకు కారకుడవుతాడు. అజీర్ణం, స్పోటకం, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యాస్, అసిడిటీ, వైద్యం, జ్వరం, వ్రణామలను సూచిస్తాడు కేతువు ఏ గ్రహముతో కలిసిన ఆ అవయవమునందు బాధలు కలిగిస్తాడు. రోగ నిర్దారణ సాగదు కనుక చికిత్స జరుగడంలో సమస్యలు సృష్టిస్తాడు.


కేతువు ధ్యానం

లాంగూలయుక్తం భయదంజనానం కృష్ణాంబు భృత్సన్నిభ మేకవీరమ్|

కృష్ణాంబరం శక్తి త్రిశూల హస్తం కేతుం భజేమానస పంకజే హమ్ ||

ఫలాశపుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకం |

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||

 

కేతు మంత్రము

ఓం హ్రీం............. స్వాహా ||

కేతుయంత్రం(యంత్రమునకు 9866193557)

సోమవారం రాత్రి చంద్రహోరలో అనగా రాత్రి 8-9 గంటల మధ్యలో ఈ యంత్రం ధరించాలి. ప్రతి రోజు ఉదయమే స్నానం చేసి శుచిగా కేతుధ్యానం 39 పర్యాయాలు చేయాలి. మంత్రజపం 108 మార్లు జపించి, పైన తెలిపిన ప్రకారము యంత్రాన్ని పూజించి ధరించాలి. 10 సోమవారాలు ఉలవలు దానం ఇవ్వాలి.


పరిహారం

కేతుగ్రహ పరిహార పూజా కోసం కంచు ప్రతిమ మంచిది.

అధి దేవత - బ్రహ్మ

నైవేధ్యం - చిత్రాన్నం

కుడుములు - ఉలవ గుగ్గిళ్ళు

ప్రీతికరమైన తిథి - చైత్ర శుద్ధ చవితి

గ్రహస్థితిని పొందిన వారం - బుధవారం

ధరించవలసిన రత్నజ్ఞం - వైడూర్యం

ధరించవలసిన మాల - రుద్రాక్ష మాల

ధరించవలసిన రుద్రాక్ష - నవముఖి రుద్రాక్ష

ఆచరించవలసిన దీక్ష - గణేశ దీక్ష

మండపం - జెండా ఆకారం

ఆచరించ వలసిన వ్రతం - పుత్ర గణపతి వ్రతం

పారాయణం చేయవలసినది - శ్రీ గణేశ పురాణం

కేతు అష్టోత్తర శతనామావళి - గణేశ శతనామావళి

దక్షిణగా ఇవ్వాల్సిన జంతువు - మేక

చేయవలసిన పూజ - విజ్ఞేశ్వర పూజ, సూర్యారాధన

దానం చేయవలసిన ఆహార పదార్ధాలు - ఖర్జూరం, ఉలవలు....మీ..... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* ( భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, *సెల్* :- 9866193557

అష్టాక్షరీ మంత్రంలో

 “ఓమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఓం” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.

అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.

జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,

“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే

“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే

“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే

“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే

“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించుటచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.

"ధ్యాయేన్నారాయణందేవం

స్నానాదిఘ చ కర్మసు,

ప్రాయశ్చిత్తం హి సర్వస్వ

దుష్కృత స్వేతివైశ్రుతిః!"

స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.

జీవితంలో మనం *సుఖంగా* ఉండాలి అంటే *

 *🙏🙏శ్రీ గురుభ్యోనమః🙏🙏*


జీవితంలో మనం *సుఖంగా* ఉండాలి అంటే *మూడే మూడు* విషయాలు గుర్తు పెట్టుకోవాలి. 

ఒకటి : *జరిగిన దాన్ని మర్చిపోవాలి* (ఎందుకంటే ఎప్పుడూ జరిగినదాన్ని గురించి ఆలోచిస్తూ వుంటే నీ సమయం వృధా అవుతుంది. జరిగింది మళ్ళీ నీకు తిరిగిరాదు)

 రెండు : *జరుగుతున్న దాన్ని గమనించుకోవాలి* (జరుగుతున్న దానిమీద సరైన దృష్టి పెట్టక పోతే చేసిన తప్పులు మళ్ళీ చేసే ప్రమాదం ఉంది. )

 మూడు : *జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి* (ఇది మనకి తెలియనిది. జరగబోయేది ఏదైనా జరిగి తీరేదే. దాన్ని ఎలాగూ తప్పించుకోలేవు కాబట్టి సిద్ధంగా వుండాలి)


*🙏🙏శుభం భూయాత్. సర్వే జనాః సుఖినోభవంతు🙏🙏*

రామాయణమ్..72

 

..

దశరథుడు కౌసల్య గృహము చేరి పరిపరివిధాలుగా ఆలోచిస్తూ ,కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నాడు.శోకంతో కృశించిపోయిన భర్తను చూస్తూ కౌసల్య కూడా దుఃఖము ఆపుకోలేక బిగ్గరగా ఏడ్వసాగింది.అడవిలో వారి అవస్థలు తలుచుకుంటున్నప్పుడల్లా వారి గుండె కరిగి కన్నీరై కాల్వలై ప్రవహించసాగింది.

.

అంతులేని వేదన ,అలపులేని రోదన 

అలుపుసొలుపూలేకుండా ఒకటే దుఃఖము! 

కౌసల్యాదేవి భవనము రోదనధ్వనులతో నిండిపోయి ఉన్నది.

.

సుమిత్రాదేవి ఈ ఏడుపులు పెడబొబ్బలు చూసింది !

.

ఏమైందని ఏడుస్తున్నారు మీరంతా ! రాముడంటే ఎవరనుకున్నారు? 

పురుషులలోశ్రేష్ఠుడు,సకలసద్గుణసంపన్నుడు,మహాబలశాలి,

అతడు అనుసరించేది ధర్మమార్గము‌ .

ఆ మార్గములో స్థిరంగా నిలిచి వున్నవాడి గురించి ఆందోళన ఎందుకు?

అన్నతోటి లక్ష్మణుడున్నాడు ,సీతకూడా అరణ్యవాసములోని కష్టాలన్నీ తెలిసే స్వయంగా వెళ్ళింది.

.

రాముడు ధర్మమూర్తి 

ఆయనను సూర్యుడు తనకిరణములతో బాధింపడు

వాయువు ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఆహ్లాదకరంగానే తాకుతుంది

రాత్రిపూట నిద్రించే రామునికి చంద్రకిరణస్పర్శ ఆయన కన్నతండ్రి స్పర్శ అంత ఆనందంగా వుంటుంది

.

లోకంలో అలాంటి వీరుడింకొకడు లేడు అంతటి మహావీరుడు అరణ్యంలో కూడా స్వంత ఇంటిలో ఉన్నట్లు ఉండగలడు!

.

రాముడి యందు లక్ష్మి,శౌర్యము,మంగళప్రదమైన బలము ఉన్నాయి అరణ్యవాసాన్ని ఏ విధమైన శ్రమలేకుండా పూర్తిచేసుకుని హాయిగా తిరిగివస్తాడు.

.

ఓ కౌసల్యా!

రాముడెవరనుకున్నావు?

సూర్యుడికి సూర్యుడు

అగ్నికి అగ్ని

ప్రభువులకు ప్రభువు

సంపదలకు సంపద

కీర్తికి శ్రేష్టమైన కీర్తి

ఓర్పుకు ఓర్పు

దేవతలకు దేవత

సకల భూతములకు భూతశ్రేష్ఠుడు

అనన్యసామాన్యము,అనితరసాధ్యమూ అయిన సామర్ధ్యము కలవాడు !

అట్టి రాముడు అరణ్యములో ఉంటేనేమి ? 

అయోధ్యలో ఉంటేనేమి? 

ఎక్కడైనా ఒకటే ఆయనకు!

.

ఓ కౌసల్యా! రాముడు తిరిగి వచ్చి నీ పాదాలకు నమస్కరించి 

రాజ్యలక్ష్మితో,సీతాలక్ష్మితో,మహాలక్ష్మితో మహావైభవంగా ఉండటాన్ని నీవు కనులారా కాంచుతావు ! 

.

ఏడవకు,ఏడవుకు రామమాతా ఏడవకు !

రాబోయే రోజులలో రాముడే అయోధ్యకు ఏడుగడ!

.

NB.

రాముడి గురించి సంపూర్ణముగా తెలుసుకొన్న మహాతపస్విని సుమిత్రామాత! అందుకే మారుమాటాడకుండా చిరునవ్వుతో కొడుకును రామునివెంట పంపింది. రాముడి సామర్ధ్యం తెలిసి విలపించకుండా ప్రశాంతంగా ఉన్న ధీరోదాత్తురాలైన వనిత సుమిత్ర ..

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఆరవ శ్లోక భాష్యం - మూడవ భాగం


యోద్ధలు సామాన్యంగా పెద్దపెద్ద మీసాలతో కండలు తిరిగి చూడటానికి భయం కలిగించే విధంగా ఉంటారు. మన్మథునికి రూపమే లేదు. పోనీ వసంతుణ్ణి ప్రకృతిని బట్టి గుర్తించవచ్చు. ఈ అంగాలన్నీ ఉన్న “అంగి” అయిన మన్మథుని ఏరకంగానూ గుర్తింపశక్యంకాదు. ఆయనను గుర్తించడానికి వీలుకాదు కానీ అందరిలోను ప్రవేశించి వారిని తన అదుపులో పెట్టుకొంటాడు. ఏం విచిత్రం – ప్రపంచాన్నంతా జయించే యోద్ధ ఇంతటి బలహీనుడు.


త్రిపురాసుర సంహారానికి పరమేశ్వరుడు బయలుదేరేటప్పుడు మేరు పర్వతం విల్లుగా, వాసుకి అల్లెతాడుగా, వాసుదేవుడు బాణంగా, బ్రహ్మదేవుడు రథసారధిగా ఏర్పాటు చేయబడింది. ఎంతటి బలిష్టమైన ప్రయత్నమో చూడండి. అయితే పరమశివుడు వీనిని వేటినీ ఉపయోగించలేదు. ధనుష్ఠంకారం లేదు, బాణప్రయోగం లేదు, భుజష్ఫాలనము లేదు. బాహాబాహిగా ముష్టాముష్టిగా తలబడటమూ లేదు, ఈశ్వరుడు కేవలం అట్టహాసం చేశాడు. ఎందుకా నవ్వు ? “అరె! పరాశక్తి నాలో ఉండగా నాకు సహాయంగా ఇన్ని సంభారాలు అమర్చబడ్డాయే” అన్న అలోచన వచ్చి ఆయనకు నవ్వు వచ్చింది. ఆ అట్టహాసానికి త్రిపురాసురులు మాడి బూడిదైపోయారు. పరమేశ్వరునికి బలిష్ఠమైన ఆయుధాలున్నా వాటిని ఉపయోగించుకోలేదు. మన్మథుడు బలమనే మాటకు ఎంతో దూరమైన ఆయుధాలతో యుద్ధం గెలుస్తాడు. ఈ ఇద్దరి గెలుపుకూ కారణం ఒక్కటే. పరాశక్తి పరమేశ్వర హృదయాంతర్గత అయి అక్కడ యుద్ధాన్ని గెలిపించింది. కేవలం తనక్రీగంటి చూపు ద్వారా ప్రసరింప చేసే కటాక్షం వలన మన్మథుని విశ్వవిజేతను చేస్తోంది.


మన్మథుడే శరీరం లేనివాడు. అతడి ఆయుధాలా అత్యంత బలహీనములు. అయినా ప్రపంచాన్నంతా గెలుస్తాడు. అతడికి కాల్బలమా, ఆశ్వికదళములా, గజ బలమా ఏమున్నాయి. పేరుకు వసంతుడొకడు చెలికాడు లేక సామంతుడు. అతడి గెలుపుకు కారణం అంబిక యొక్క కొంచెం దయ – శివుని విషయంలో వలే ఆమె హృదయంలో కూర్చోలేదు. పోనీ కనులన్నా పూర్తిగా తెరిచి దయాప్రసాదం చేయలేదు. ఇది అనిర్వచనీయమైన దయ అంటారు ఆచార్యులవారు. “కామపికృపాం” – వారు అంబికని హిమగిరి సుతా అని సంబోధిస్తారు. ఆమె క్రీగంటి చూపువలన కలిగిన దయాప్రసాదం వలన ఎందుకూ కొఱగాని మన్మథుడు “జగదిదం సర్వం విజయతే” రస ప్రపంచాన్నంతా జయిస్తున్నాడు.


ప్రపంచానికి చెందిన మాయా విలాసమైన వాటన్నిటికీ ఆమె ఒక్క క్షణం క్రీగంట ప్రసారం చేసే దయ చాలు. అన్నీ సిద్ధిస్తాయి. త్రిపురాసుర సంహారమంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని, మిగిలిన మహాకారణాన్ని (బ్రహ్మయొక్క) తిరస్కరించడం. అంటే నిష్ప్రపంచ స్థితిని పొందడం, అది అంబిక సంపూర్ణంగా అతనిలో ఉంటేనే సాధ్యమౌతుంది. త్రిపురాసురుని కాల్చినవాడే మన్మథునీ కాల్చివేశాడు. మన్మథునికి అంబిక క్రీగంట ప్రసారం చేత లభించిన దయ, పరమేశ్వరుడు ఆమె నుండి పొందిన సంపూర్ణ అనుగ్రహం ముందు నిలవలేదు.


మన్మథుణ్ణి అంబిక విజేతను చేసిందనే విషయంలోనే మనకు కథ ఆగిపోలేదు. మనం మన్మథుణ్ణి జయించాలి. మన్మథుని దగ్ధం చేసినపుడు అంబిక అతని హృదయంలో ఉండి సంపూర్ణానుగ్రహం చూపిన విషయం మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. మనకు ఆమె అనుగ్రహం కావాలి. ఆమె సృష్టించిన శక్తి ఆమెవల్లనే నాశనమవుతుంది. ఇక్కడ ఆచార్యులవారు అంబిక చేత సృష్టించబడిన శక్తి గురించి మాట్లాడుతున్నారు.


ఇట్టి ఉన్నతమైన ఉద్దేశ్యంతోనే అంబిక మన్మథునికి బలిమిలేని ఆయుధం ఇచ్చింది. అతడు ఈ సృష్టినంతటినీ ఒక ఆటపట్టిస్తున్నప్పటికీ అది తన ప్రతిభకాదనీ అంబిక కటాక్షమనీ క్షణక్షణం గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఇతనికి అహంకారం జనించరాదనే దయచేతనేమో అంబిక అంతటి బలహీనమైన ఆయుధాలనిచ్చింది.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

**ఆత్మ బోధ**

 **దశిక రాము**


**ఆది శంకరాచార్యుల వారి**




65 సర్వగం సచ్చిదాత్మానం


జ్ఞాన చక్షుర్నిరీక్షతే


అజ్ఞాన చక్షుర్నేక్షేత


భాస్వంతం భానుమంధవత్‌ || 65


xqsLRi*gRiLi = అంతటా ఉన్నటువంటి, సత్‌ + చిత్‌ + ఆత్మానం = సచ్చిదానందమయమైన ఆత్మను, జ్ఞాన చక్షుః = జ్ఞానమనే నేత్రాలే, నిరీక్షతే = చూస్తాయి, భాస్వంతం = ప్రకాశవంతంగా వెలుగొందేటటువంటి, భానుం = సూర్యుణ్ణి, అంధవత్‌ = గుడ్డివాడు ఏ విధంగా చూడలేడో ఆ విధంగా, అజ్ఞాన చక్షుః = ఆత్మజ్ఞానం లేకపోవటంచేత ఆతని కళ్ళు, న ఈక్షతే = చూడలేవు.


తా|| అంతటా ఉన్నటువంటి సచ్చిదానందమైన ఆత్మను జ్ఞాననేత్రాలే చూస్తాయి. ప్రకాశమానమైన సూర్యుణ్ణి గుడ్డివాడు ఏ విధంగా చూడలేడో ఆ విధంగానే ఆత్మజ్ఞానం లేని వాని కళ్ళకు ఆత్మ కనిపించదు.


వివరణ :- ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా చూసేవాడి దృక్కోణాన్నిబట్టే అవి అర్థం అవుతాయి. చూసేవాడికి ఆత్మజ్ఞానం ఉంటే కనిపించేవన్నీ బ్రహ్మంగా కనిపిస్తాయి. బ్రహ్మజ్ఞానం లేనివానికి అన్నీ నామరూపాలతోనే సృష్టి అంతా జగదాకారంగా కనిపిస్తాయి. అంధత్వానికి గల కారణం తొలగగానే అంధుడు సూర్యుణ్ణి చూసినట్లు అజ్ఞానం తొలగగానే అజ్ఞాని కూడా ఆత్మను దర్శించగలుగుతాడు. జ్ఞాననేత్రమంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే పేరుమీదుగా నాలుగురకాలుగా పనిచేస్తున్న మనస్సు ఏకమై అది ఆత్మలో గురుజ్ఞానంతో లీనమవటమే. ఆ విధంగా లీనమవటానికి సాధకునికి గురుజ్ఞానం లభించిన తర్వాత అది జరుగుతుంది. దానితో ఆతనికి అంధకారం తొలుగుతుంది. ఆతడు క్రమేపి బ్రహ్మానందంలో లీనమవుతాడు. గురుజ్ఞానంవల్ల సాధకుడు మరచిపోయిన ఆత్మను తెలుసుకొని ధ్యానం ద్వారా తానే బ్రహ్మాన్నని తెలుసుకొంటాడు. బ్రహ్మం అనేది విషయం కాకపోవటం వల్ల బ్రహ్మం అందరికీ తెలియటం లేదు. తెలుసుకొనేవాడు బ్రహ్మానికి వేరుగా లేడు కాన ఆత్మజ్ఞానం తెలిస్తే గాని అజ్ఞానికి బ్రహ్మం గోచరంకాదు. బ్రహ్మం వస్తు రూపంలో కనిపించదుగదా! బ్రహ్మం శుద్ధ చైతన్యం కదా ! శుద్ధచైతన్యం ఎవరికి తెలుస్తుంది ? ఆత్మజ్ఞానమనే జ్ఞాననేత్రం లభించినవారికి మాత్రమే ఆ శుద్ధచైతన్యం తెలుస్తుంది. కనుక జ్ఞానులకు గురుకృపవల్ల ఆ ఎరుక కలుగుతుంది. సాధకుడు గురుకటాక్షంవల్ల సాధనలో తన సహజ స్వరూపమైన ఆత్మను జ్ఞప్తికి తెచ్చుకొని తన సహజ స్వరూపాన్ని అనుభూతి పొందుతాడు. సామాన్య మానవుడు ఆత్మజ్ఞానం తెలియకపోవటం వల్ల అంధునివలె విషయవాంఛలతోనే సుఖాన్ని వెతుకుతూ సచ్చిదానందంలేదని భ్రమపడతాడు. సామాన్యమానవుడు సూర్యుని చూడలేని గుడ్డివాని వంటి వాడే కాని మరొకటి కాదు కారణమేమిటంటే ఆతడు అనుభవజ్ఞులైన జ్ఞానులమాట వినటంలేదు. ఒకవేళ విన్నా, విన్నదాన్ని ఆచరించి సాధనకు ఓర్చి, నిజాన్ని నిగ్గుతేల్చుకోవటానికి నమ్మకం, విశ్వాసం, పట్టుదల, లక్ష్యసాధనయందు నిరంతర కృషి కలిగి ఉండటంలేదు. అటువంటి లోపాల్ని సామాన్య మానవుడు గ్రహించలేకపోవటం వల్ల సచ్చిదానందాన్ని పొందలేకపోతున్నాడు. ఎదురు, ఆతడు సచ్చిదానందమైన ఆత్మేలేదని నిందిస్తున్నాడు. దానికి దేవాలయానికి గల ప్రతీకల్ని పరిశీలిద్దాము. అప్పుడు జ్ఞాననేత్రాన్ని గురించి తెలుసుకోవటానికి వీలు కుదురుతుంది. సంఘంలో ఎక్కువగా మానవులందరూ భక్తి మార్గంలోనే సంచరిస్తుంటారు. ఎక్కువమంది దేవాలయానికి వెళ్ళి పూజచేసుకొని వస్తూ పవిత్రులమయ్యామని భావిస్తుంటారు. ఆ విధమైన పవిత్రత చేకూరటమే ప్రతి మానవునికి కావలసింది. అందుకోసమే పూర్వులు ఆగమ శాస్త్రాన్ని అంటే దేవాలయ నిర్మాణ శాస్త్రాన్ని ఆత్మజ్ఞానానికి అనుకూలంగానే ఏర్పరచి దేవాలయాలను నిర్మింప చేశారు. కానీ సామాన్య మానవులందరికీ అది తెలియకపోవటం వల్ల సాకార పూజా విధానంలోనే తృప్తిపొంది అంతర్ముఖం అవ్వటం గురించి ఆలోచన చేయలేకపోతున్నారు. భగవంతుని దేవాలయానికి ఆత్మతో కూడి ఉన్న మానవ దేవాలయానికీ ఉన్న సామీప్య సాదృశ్యాలను ఈ కింద పోల్చి వివరించి చూపిస్తాను. నిజానికి పంచేంద్రియ నిగ్రహాన్ని కొనసాగిస్తూ ఆలయంలో అర్చన కొనసాగించటాన్నే పూజవిధానం అంటున్నాము. దాన్ని ఆ విధంగా అందరూ తెలుసుకొనేటట్లు జ్ఞానులైనవాళ్ళందరూ పూనుకొని అందరికీ తెలియజేయాలి.


దేవాలయం ఆత్మతో కూడిన శరీరమనే దేవాలయం


1. గుడి గోపురం ఎత్తుగా కనిపిస్తుంది. 1. మానవుని తల ఉన్నతంగా ఎత్తుగా పైన ; ; ఉంటుంది.


2. గుడిపైన బొమ్మలు చెక్కి ఉంటాయి. 2. లోపల మానసికంగా భద్రపరిచిన ; ; చిత్రాలుంటాయని తెలియజేస్తుంది.


3. బూతు బొమ్మలు చెక్కి ఉంటాయి. 3. మనస్సులో కదిలే దుష్ట సంకల్పాలను ; ; విడిచి ముందుకు వెళ్ళాలని సూచించటం ; ; జరుగుతుంది.


4. బొమ్మల్ని విస్మరించి లోనికి వెళ్ళాలి. 4. మానసిక సంకల్పాలను అధిగమించి ; ; కామాదులే ప్రధానం కాదని, వాటిని విడిచి అంతర్ముఖం కావాలని గ్రహించటం జరుగుతుంది.


5. బలిపీఠం వద్ద సాష్టాంగ నమస్కారం 5. అంతర్ముఖమైన ఆత్మజ్ఞాని అహంకారాన్ని చేయాలి. బలి ఇచ్చి ఆత్మకు సంపూర్ణ శరణాగతుడవటం జరుగుతుంది.


6. ధ్వజస్తంభాన్ని, దాని మీద 6. ఆత్మ అనే హృదయ మందిరంలో


ఉన్న పతాకాన్ని దర్శిస్తాడు. ప్రవేశించే హక్కును గ్రహిస్తాడు. ఆ


ద్వారం ఒక్కరికే ప్రవేశాన్ని ఇస్తుంది. అది శరీరానికి ప్రవేశాన్ని ఇవ్వదు. ఆత్మకు మాత్రమే అది ప్రవేశాన్ని ఇస్తుంది. అంతఃకరణ చతుష్టయం లయించిననాడు ఆత్మకు భగవన్మందిరంలో ప్రవేశం లభిస్తుంది. ఆ ద్వారాన్ని తెరిచే తాళం చెవి నా వద్ద ఉందని గురు మహారాజ్‌జీ అంటూ ఉంటారు.


7. వాహనమూర్తిని దర్శిస్తాడు. 7. సాధకుడు ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టి వాహనమూర్తి వలె ఆత్మ అనే భగవంతుని మోయాలని తెలుసు కొంటాడు.


8. వాహనమూర్తికి భగవంతునికి 8. భక్తుడు ఏ మార్గంలో నడుస్తున్నా

మధ్య నిలబడ కూడదు. ; ; భక్తునికి భగవంతునికి మధ్య జ్ఞానికూడా 9; 9; నిలబడకూడదు. ఆత్మప్రబోధం మాత్రమే

చేయాలి. ఆ భక్తునికి ఆ సంస్కారం ఉంటే

ఆత్మజ్ఞానానికి ఆతడే అంది వస్తాడని 9; 9; తెలుసుకొంటాడు.


9. గర్భాలయంలో ప్రవేశం అంతా 9. హృదయ గుహ చెంత అవిద్య ఆవరించి

చీకటిమయంగా ఉంటుంది. అంతా చీకటిమయంగా ఉంటుంది.


10. కొంతకాలం నిలబడితే తెర 10. కొంతకాలం అక్కడే వేచిఉండగా సాధన

తొలగుతుంది. కొనసాగుతుంది. అజ్ఞానపుతెర తొలగు

తుంది.


11. గంటలు మ్రోగుతాయి. 11. అనహద (అనాహత) శబ్దమనే #9; #9; గంటానాదం వినబడుతుంది.


12. నీరాజనం ఇవ్వబడు తుంది. 12. జ్ఞానప్రకాశమనే నీరాజనం ప్రకాశిస్తుంది.


13. సాకారమైన దైవదర్శనం 13. ప్రకాశవంతమైన వెలుగులో. #9; #9; జరుగుతుంది. #9; #9; ఆత్మదర్శనం జరుగుతుంది.


14. భగవంతుని ముందు నేత్రాలు 14. కళ్ళతో తపనపడుతూ బాహిరంగా

మూసుకొని సంపూ ర్ణంగా #9; #9; దర్శించవలసినవి లేవని తెలుసుకొని

తనలో తాను లీన మవుతాడు. #9; #9; లోకకాంక్షలు తొలగించుకొని #9; #9; అంతర్ముఖంగా నిలవ గలుగుతాడు.


15. చేతులు జోడించి హృదయ 15. జీవుడు బ్రహ్మ ఐక్యమై జీవాత్మగా #9; #9; స్థానం చెంత ఉంచుకొని అనగా ఆత్మ బ్రహ్మగా నిలుస్తాడు.

నమస్కరిస్తాడు.


16. కన్నులకు భగవంతుని దర్శనం 16. ఆత్మ అనే భగవంతుని తప్ప అన్యవస్తు

తప్ప మరొక దృశ్యం కనిపించదు. దర్శనం అవాంఛనీయమని తెలుస్తుంది.

దృగింద్రియ (కళ్ళు) నిగ్రహం జరుగుతుంది.


17. మంత్రాలు, ఘంటానాదాలు 17. భగవత్సంబంధమైన విషయాన్నే

వినిపిస్తాయి. ఆలకించాలి అనే భావన స్ఫురిస్తుంది.

శోత్రేంద్రియ (చెవులు) నిగ్రహం జరుగుతుంది.


18. పువ్వులు, సుగంధాలు 18. లోపల చోటుచేసుకొన్న సమస్తమైన

విరజిమ్మే వాసనలు ఆవరిస్తాయి. పూర్వవాసనలను భగవంతుని పాదాలచెంత సమర్పించాలనే అంతరార్థం స్ఫురిస్తుంది. ఘ్రాణంద్రియ

(ముక్కు) నిగ్రహం జరుగుతుంది.


19. తీర్థప్రసాదాలు స్వీకరిస్తాడు. 19. ఆత్మ ప్రసాదాన్ని స్వీకరించటం ద్వారా

ప్రసాద బుద్ధిని ఏర్పరుచుకొంటాడు. రసనేంద్రియ (నాలుక)నిగ్రహం జరుగుతుంది.


20. చందన భస్మాదులు 20. ఆత్మ స్పర్శద్వారా భగవద్భక్తిని

పూసుకోవటం, చెవిలో పూవులు హృదయంలో నింపుకోవటం పెట్టుకోవటం జరుగుతుంది. త్వగింద్రియ (చర్మం) నిగ్రహం జరుగుతుంది.


21. బయటకు వచ్చిన తర్వాత 21. ఆత్మ దర్శనం తర్వాత ఆత్మస్థితుడై

ఒకచోట కూర్చొని, కళ్ళు ఆత్మానందం అనుభవిస్తూ అంతర్ముఖుడై

మూసుకొని, ధ్యానమగ్నుడై ఉండాలనే అంతరార్థాన్ని గ్రహిస్తాడు. 

ప్రశాంతచిత్తంతో లేచి వస్తాడు. కార్యాలు ఆచరిస్తున్నా బ్రహ్మభావంతో సాక్షిమాత్రంగా జీవించటం అలవర్చు కొంటాడు


ఈ విధంగా చూస్తే భక్తుడు ఆలయంలో ప్రవేశించి బయటకు వచ్చేవరకూ ఆతడు చేసే ప్రతి పనీ కూడా భగవంతుడైన అనంత చైతన్యంలో లీనమవటానికి కావలసిన ప్రతీకలుగా స్వీకరించి ఆచరించేటట్లు చేయిస్తున్నారని తెలుస్తుంది.


పరమహంస యోగానంద ఆత్మకథ అయిన ఒక యోగి ఆత్మకథలో ఒక యోగి రెండురూపాలు ధరించటాన్ని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవటానికి పరమహంస యోగానంద బయలుదేరి వెళ్తున్నప్పుడు దారిలో కనిపించిన ఆలయ విగ్రహానికి ఎందుకు నమస్కారం పెట్టాలి ? మనలోనే ఆత్మ ఉంది కదా అని అనుకొని దేవునికి నమస్కారం పెట్టకుండా ముందుకు సాగిపోతాడు. ఆయన దర్శించాలనుకొంటున్న రెండు రూపాల్లో కనిపించే ఆ యోగియే ఆయనకు దారిలో కనిపించి నువ్వు ఆలయాన్ని ఆ విధంగా తృణీకరించి వెళ్ళినందువల్లే నువ్వు దారి తప్పావు అని హితబోధ చేస్తాడు. నిరాకారంతో జీవిస్తున్నా సాకారమైన భగవంతుని, సాకార సాధకుల్ని తృణీకరించి విస్మరించి నడవకూడదని తెలియచేస్తాడు. సాధకుడు తన రూపమైన సాకారంనుంచే నిరాకారమైన తన ఆత్మవద్దకు చేరి ఆత్మ అనే బ్రహ్మంగా నిలవాలి. సాధకుడు బ్రహ్మం కావటానికి పూర్వం ఎట్లా ఉన్నాడో బ్రహ్మం అయిన తర్వాత కూడా అట్లాగే ఉన్నాడు. అద్వైతంలో గ్రహించవలసిన అతి సూక్ష్మ రహస్యమిదే. ఆత్మజ్ఞానం తెలియని వారికి, ఆత్మతో జీవించని వారికి, విగ్రహారాధకులకు తెలియని దాన్ని ఒక్కసారిగా ఎవ్వరూ నిరూపించి చూపించలేరుకదా! దాని వల్ల ఆత్మజ్ఞాని కూడా బాహిరమైన పూజలుకాదు చేయవలసింది ఆంతరికమైన అర్చనలు చేయాలని తెలిసి సాధనలో జీవించాలి. అంతేగాని అర్చనలను, దేవాలయాలను తూష్ణీభావంతో చూడకూడదు. ఆత్మజ్ఞానికి కూడా పక్వస్థితినొందిన భక్తి కావాలి. అదే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఆచరించి చూపించారు. వాళ్ళు ఆత్మతోనే జీవిస్తూ పైకి భక్తులులాగా నిలిచారు. జ్ఞానికి ఏ పూజలు అవసరంలేదు. కాని హృదయరాముని పూజించటం, ప్రేమించటం, కావాలి. హృదయమే తానై తరించాలి.


ఈ శరీరం నిజంగా ఉత్తమమైన దేవాలయం. దాన్ని శుభ్రపరిచి, దాన్ని భద్రపరిచి దానిలో ప్రవేశించి ఆనందాన్ని పొందాలి. ఈ శరీరంలో అమూల్యమైన రత్నాలున్నాయి. దానికి కావలసిన ప్రయత్నాన్ని, శక్తిని ఇచ్చే గురువు కూడా తానే అయి లోపలే ఉన్నాడు. ఆయనే ఆయనను చేరటానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే బాహిరమైన గురుదేవుని చెంతకు కూడా చేరుస్తాడు. ''గురువు తానే, సాక్షాత్కరించేది తానే గురుమూలంగా శబ్దాన్ని ఇచ్చి అనుగ్రహించేది కూడా తానే'' అని సిక్కుల ఆది గ్రంథంలో చెప్పబడి ఉంది. దానికే బుల్లేషా అనే గురువు ''నేను బాహిరమైన దేవాలయాల్లో ప్రవేశించినంత కాలం నా మనస్సులో భీతే నిలిచిపోయింది. అంతర్ముఖం అయి ఆయనను ఆరాధించి, ఆయనకోసం ప్రేమతో నిత్యం అంతర్ముఖంగా వెతికిననాడు నాదాలు వినిపించాయి. ఆయన దర్శనం లభించింది, ఆయనతో ఆనందించటం కుదిరింది. భీతి తొలగింది, ధైర్యం చేకూరింది. సుఖశాంతులు లభించాయి'' అని చెప్పాడు. కబీరు కూడా ''ఈ శరీరమనే మట్టి పాత్రలో ఉన్న అంధకారంలోనే సృష్టికర్త అయిన భగవంతుడు ఉన్నాడు'' అని చెప్పాడు. . మరి ఇంతమంది ఇన్నిరకాలుగా ప్రబోధిస్తున్నా మానవులందరూ ఎందుకు బయట వెతుకుతున్నారంటే సాకారంతో తృప్తిపడి తమ బాధ్యతను ఆ భగవంతుని మీద పడవేసి తాము తేలిగ్గా సుఖశాంతులతో గడపగలమనే భ్రమతో జీవిస్తున్నారు. మానవుని బాధ్యత ఏదో మానవుడు తెలుసుకోకుండా నడవటానికే మానవుడు ఈ విధంగా సంచరిస్తున్నాడని ఎవరికి వారికి తెలియక పోవటం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. ఆ విషయాన్నేఅనేకమంది మహాపురుషులు, అనేక గ్రంథాలు తెలియజేస్తున్నా నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. బాహిరమైన సుఖాకాంక్షతో బాల్యం అంతా ఆటల్లో గడుపుతున్నాడు, ¸°వనం అంతా కామపిపాసతో, పశుప్రవృత్తితో గడుపుతున్నాడు, వయస్సు మళ్ళే సమయానికి సంసార బాధ్యతలతో సతమతమై గడుపుతున్నాడు. పళ్ళు ఊడే సమయానికి ఎవరూ తనను లక్ష్యపెట్టనిస్థితిలో ఆ పరాత్పరుడే దిక్కని వెతకటానికి పూనుకొంటున్నాడు. అప్పుడు కూడా అంతర్ముఖం అవటానికి, సజీవ గురువును వెతుక్కోవటానికి పూనుకొంటున్నాడు. దానితో పుణ్యకాలమంతా దేవులాటల్లోనే జరిగిపోతుంది. కాన తెలిసిన జ్ఞానంతో, జ్ఞాన మార్గంలో జీవించటానికి మానవులందరూ ప్రయత్నంచేసి నేర్చుకోవాలి.


ఆధ్యాత్మిక శాస్త్రంలో పరిశోధనలు జరిపిన మహాత్ములందరూ కూడా మానవుడు ప్రత్యక్షంగా చూస్తున్న ప్రపంచం, దాని వెనక చూడటానికి వీలులేకుండా ఉన్న ఇతర లోకాలు అన్నీ కూడా ఈ శరీరంలోనే ఉన్నాయని, మానవుడు అంతర్ముఖం అయి పరబ్రహ్మం అయిన ఆత్మ అనే ఆ పరమేశ్వరుని చేరిననాడు ఆయన సృష్టించిన అణువణువుని పరికించి, తనివితీరా చూడటం సాధ్యమవుతుందని చెబుతున్నారు.అదే ఈశ్వరాలయమైన మానవదేహంలో ఉన్న ఔన్నత్యం అనే దాన్ని అందరూ గ్రహించి దాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. మానవులు ఈ శరీరమనే దేవాలయంలో ఉన్న రత్నాలను పొందలేక మేము దరిద్రులమని బాధలను అనుభవిస్తున్నారు.


ఈ శరీరంలో ఉన్న నవద్వారాలైన రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు, రెండు చెవులు, నోరు, కింది భాగంలో ఉన్న రెండు మలద్వారాలు అన్నీకూడా మానవుని ధ్యాసను, మానవుని దృష్టిని బాహ్య ప్రపంచంలోకి తీసుకుపోతున్నాయి. అట్లా బాహిరంగా పోకుండా వాటన్నిటినీ అంతర్ముఖం చేసి వాటిని మూడవ కన్ను దగ్గరకు తీసుకురావటానికే ఆత్మ మార్గంలో సాధకుడు సాధన చేస్తున్నాడు.ఆ స్థానాన్నే యోగ మార్గంలో ఆజ్ఞాచక్రం అన్నారు. సిక్కులు తీస్రతిల్‌ అన్నారు. భారతీయులు శివనేత్రం అన్నారు. కావున ఆపదవ ద్వారాన్ని తెరవటానికే గురువు కావలసి వస్తున్నాడు. ఆ పదవ ద్వారం భగవంతుడు నివాసం చేస్తున్న వైపుకు తెరుచుకొని ఉంది. కాన ఆ మూడవ నేత్రం దగ్గరకు చేరటానికి ప్రతి మానవుడు ఆత్మజ్ఞానంతో, ఆత్మమార్గంలో నిరంతరం సాధన చేసి, జీవించి ఉండగానే సుఖశాంతుల్ని అనుభవించాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కాదు చేయవలసింది. తెలివి ఉండగానే చేతులు కాలకుండా చూసుకొని, ఆకులు పట్టుకోకుండానే ఆ ఆధ్యాత్మిక అగ్నిగుండంలో ఇనుపగుండు ప్రవేశిస్తున్నట్లు గురుజ్ఞానంతో ప్రవేశించి బ్రహ్మంగా రూపొందటం నేర్చుకోవాలి. మానవుడు మరణించే స్థితిలో కూడా ఆత్మజ్ఞానంతో భృకుటి మధ్య నిలిచిననాడు ఈ ప్రపంచానికి సంబంధించినంతవరకూ మరణించినవాడయినప్పటికీ అంతర్గతంలో పూర్తిగా జాగృతితో ఉంటాడు. కాన మానవుని ఆత్మ పరమాత్మతో లీనమవుతుంది.

దేవాలయాల దగ్గర ఉన్న చెట్ల కింద నివసిస్తూ, నేలపై నిద్రపోతూ, లేడి చర్మాలే వస్త్రాలుగా ధరిస్తూ, భోగాలన్నీ వదిలిపెట్టి సంచరించేటటువంటి వైరాగ్యం కలిగినా సుఖం లభించదు. కారణం ఏమిటంటే ఇంద్రియాల్ని అంతర్ముఖం చేసి సాధన చేయాలనే అభ్యాసం లేకుండా వట్టి వైరాగ్యం కలిగి ఉన్నా ఆనందం లభించదు. అభ్యాస వైరాగ్యాలనేవి ఆత్మ మార్గానికి రెండూ రెండు కళ్ళు లాంటివి. ఈ మార్గంలో మనస్సును పరబ్రహ్మమునందు లగ్నం చేయాలి. అట్లా లగ్నం చేసి ఏ విధంగా గడిపినా అంటే యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా, ఏకాంతంలో ఉన్నా, బంధుమిత్రులతో గడిపినా ఎప్పుడూ ఆనందంతోనే ఉంటాడు. ఈ ఆత్మమార్గం ప్రపంచంలో ఉండగానే ప్రాపంచిక విషయాలకు లోనుకాకుండా ఉండేటట్లు చేస్తుంది. అదే జ్ఞాననేత్రం వల్ల లభించే ఉత్తమమైన లాభం.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

*శ్రీ విఘ్నేశ్వర విశిష్టత*

 **దశిక రాము**


 (6వ భాగం)


తారకాసురుడు రాక్షసులందర్నీ 

కూడ గట్టుకొని విజృంభించాడు. ముల్లోకాలనూ ఆక్రమించుకుని, కసితీరా దేవతలను చిత్ర హింసలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు హడలిపోయి, తమ దీనావస్థను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ‘‘శివుడికి కుమారుడు పుట్టాలి, అతని వల్లనే తారకుడు చావాలి! అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను మరి. ఇంకెరివల్లా తారకాసురుడికి ఎటువంటి హానీజరగదు.

మరోవిధంగా అతడికి చావూ లేదు!''అని బ్రహ్మ చెప్పి దేవతలను వెంటబెట్టుకుని తరుణోపాయం కోసం విష్ణువు దగ్గరికి దారి తీశాడు. ‘‘సతీదేవి హిమవంతుడికి కూతురుగా పుట్టి పార్వతిగా పెరుగుతూ ఉన్నది. శివుడికి పార్వతికి పెళ్ళిజరిగేలా చూడండి!'' అని విష్ణువు చెప్పాడు. దేవతలు నారదుణ్ణి హిమవంతుడి దగ్గరికి పంపించారు.


నారదుడి ఆదేశం ప్రకారం హిమవంతుడు సతీసమేతంగా, తపస్సులో నిమగ్నుడై ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి, పూజించి తన కుమార్తె పార్వతి అతని తపస్సుకు అనుకూలంగా పరిచర్యలు చేస్తూండడానికి అనుమతించవల సిందని కోరాడు. శివుడి మౌనాన్ని అంగీకారంగా గ్రహించి హిమవంతుడు పార్వతిని శివుడికి పరిచర్యలు చేయడానికి పురమాయించాడు.


చిన్నతనం నుంచీ పార్వతికి శివుడంటే చాలా ఇష్టం. బాలపార్వతికి నారదుడు శివుడి గురించి అనేక విషయాలు చెపుతూండేవాడు. శివుడి కథలనూ, గుణగణాలనూ, మహిమలనూ పదేపదే వినడానికి కుతూహలపడుతూ ఉండేది పార్వతి. పెళ్లాడితే శివుణ్ణే పెళ్ళాడాలని ఉవ్విళ్లూరేది. అటువంటి శివుడికి పరిచర్యలు చేయడం తరుణప్రాయంలో ఉన్న పార్వతికి మహాభాగ్యంగా తోచింది.


తెల్లవారుతూండగా శివుడు తపస్సు చేస్తున్న పరిసర ప్రాంగణమంతా నెమలిపింఛపుకట్టతో తుడిచి, హిమానీ జలాల్లో మంచిగంధం కలిపి కల్లాపుజల్లి, ముత్యాల ముగ్గులు తీర్చేది. బంగారు తీగెలతో అల్లి, రత్నాలు కెంపులు పొది గిన తట్టతో శివుడికి ఇష్టమైన ఫల పుష్పాలను, మారేడు పత్రినీ, తెల్లకలువలనూ తీసుకెళ్ళి పక్కనుంచేది. బంగారు కమండలం నిండా హిమశిఖరాల నుంచి జారే స్ఫటిక జలాలను నింపి, జప మాలతో కలిపి అమర్చిపెట్టేది.

🙏🙏🙏

సేకరణ



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

*ఆయనతో మైత్రి*



మనిషికి... పుట్టిన క్షణం నుంచి చివరి క్షణాల వరకూ ఓ నేస్తం కావాలి. నేస్తం అంటే- ఓ తోడు, ఓ ఆనందం, ఒక భరోసా. వయసుకు, డబ్బుకు, హోదాకు సంబంధం లేని అందమైన అనుబంధం స్నేహం. అందుకే దానికి పరిమితుల్లేవు. పరిధులు అంతకంటే లేవు. అవసరాల పట్ల, అంతస్తుల పట్ల ఆసక్తులుండవు. అంతరాల అంచనాలుండవు. లింగభేదాలుండవు. వయోపరిమితులంతకంటే లేవు. భార్యాభర్తలు, తల్లీ బిడ్డలు, ఇరుగు పొరుగులు, దేశాలు, దేశాధినేతలు... స్నేహానికి ఎల్లలు లేవు. కష్టంలో, సుఖంలో, అవమానంలో, ఆనందంలో... సమతూకంగా పాలుపంచుకునే నిస్సంకోచ భరోసా అయిన భాగస్వామి- మిత్రుడు. చిన్ననాటి స్నేహమైతే మరీ మధురం.


రామ సుగ్రీవులు, శ్రీరామ గుహులు, కృష్ణ కుచేలురు, కృష్ణార్జునులు, రాధాకృష్ణులు... స్నేహశీలురు, స్నేహపాత్రులు. శ్రీకృష్ణుడికి గోపికలతో ఉన్న అనుబంధంలోని రహస్యం స్నేహమే. గోవులు, గోపాలురు, గోవర్ధనగిరి, నెమలి ఈకలు, పిల్లన గ్రోవి... ఆయన స్నేహ మాధుర్యంతో తడిసి పులకించిన జాబితా పెద్దదే. రాధతో ఆయన ప్రేమలోని కీలక అంశం స్నేహమే. మేనత్త కుంతితో, బావ అర్జునుడితో, చెల్లెలు ద్రౌపదితో ఆయనకున్న బంధుత్వం కంటే స్నేహభావమే ఎక్కువ. ఆయన స్నేహమాధుర్యం వల్లే కష్టాలు వాళ్లకు నీళ్లలో నావలా అనిపించాయి. జీవితంలోని బరువును తేలిక చేసే దివ్యౌషధం- స్నేహం.


రాముడైతే రాక్షసులతోనూ స్నేహం నెరిపాడు. వానరులైతే ఆయన ఆత్మీయ మిత్రులు. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా మైత్రీ బంధాన్ని స్థాపన చేసుకున్నాడు రాముడు.


స్నేహం అంటే ఇరువురు వ్యక్తులు, అభివ్యక్తుల అందమైన అల్లిక. మనోభావాల సుమమాలిక. ఒక వృక్షం- దాన్ని అల్లుకున్న పూలతీగ. ఒక రాకా చంద్రుడు- ఆయన్ని పరివేష్ఠించిన వెన్నెల మడుగు. ఎవరు వారో, ఎవరు వీరో తెలీదు. ఎవరు ఎవరైనా కావచ్ఛు ఇటు అటైనా, అటు ఇటైనా తలకిందులైనా ఆ రెంటి కలయిక ఒక అద్భుత ఆవిష్కరణ.


బాల్యంలో అమ్మ- పుట్టిన క్షణమే దొరికే నేస్తం. నిజానికి పుట్టకముందే స్నేహహస్తం అందించేందుకు తయారుగా ఉండే ‘సిద్ధ స్నేహితురాలు’ అమ్మ. ఆపై కాస్త ఎదిగాక తన ఈడు పిల్లలు, పెళ్ళయ్యాక జీవిత భాగస్వామి, ఆ తరవాత... పిల్లలు, వృద్ధాప్యంలో వారి పిల్లలు. ఏ వయసులోనైనా, ఎవరితోనైనా స్నేహం ఒక ఆగిపోని ఆనందపు వెల్లువ. ఊపిరి సలపని ఉత్సాహపు ఉప్పెన.


దురదృష్టవశాత్తు స్నేహానికీ గండిపడే ప్రమాదం ఉంటుంది. ఆటంకాలు పొంచి ఉంటాయి. తల్లి మరణించవచ్ఛు స్నేహితులు వివిధ కారణాలతో దూరం కావచ్ఛు జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్ఛు విడిపోనూ వచ్ఛు పిల్లలు, మనవలు... కారణం ఏదైనా జీవితంలో ఏ అనుబంధమూ శాశ్వతం కాదు.


కానీ ఆ ‘ఒక్కరితో’ స్నేహం, ఆ అనుబంధం ఎప్పటికీ చెదరనిది. చెరిగిపోనిది. తరిగిపోనిది. తెగిపోనిది. మనం వద్దనుకున్నా, దూరం జరిగినా నీడలా వెన్నంటి ఉండే ప్రియమైన నేస్తమది. నీ జీవితం ఉన్నంతవరకు, నీ శరీరం నిలిచినంత వరకు. ఇంకా ఆత్మానుసంధానం చేసుకుంటే... ఎప్పటికీ. ఎన్ని జన్మలకైనా అదే అనంతుడితో అనుబంధం. సాకేత రాముడితో స్నేహం. ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన వారిలా మనకు దూరం కాని, ఆయన అమృతస్నేహం గుర్తించని వారు దురదృష్టవంతులే!

*ఇది కథ కాదు

 *శ్రీ నృసింహ సేవా వాహిణి*


*ఇది కథ కాదు యదార్థ సంఘటన మన నృసింహ సేవా వాహిణి సభ్యుడి యదార్థ ఘటన*


*"రెండు కిలోల ఆశీర్వాద్ , రాగి పిండి ప్యాక్ చేయండి...’’ అని కిరాణా షాప్ లో బిల్ పే చేయబోతుంటే...*

 

*"అన్నా కిలో బియ్యం ఎంత...?’’ అని అడుగుతోంది ముక్కుకు చెంగు చుట్టుకున్న అమ్మాయి. పాతికేళ్లు ఉండచ్చు... కాళ్లకు చెప్పులు లేవు. చేతిలో చిన్న సంచి...*


*"నువ్వు కొనలేవులే ఎల్లమ్మా...’’ అని విసుక్కున్నాడు. షాపతను.*


*"ఎక్కడుంటావమ్మా...?’’ అని అడిగాను.*

 

*"యూసఫ్ గూడ బస్తీలో అన్నా... పనిపోయింది. పైసలు లేవు.. ఇరవై రూపాయలే ఉన్నయి... రెండు రోజుల నుండి బ్రెడ్ తింటున్నాం..’’ అన్నది. ఇంకా వివరాలు అడగాలనిపించ లేదు.*


*"నీకేం కావాలో తీసుకోమ్మా...’’ అని షాపతను వైపు తిరిగి ఆమె బిల్లు కూడా నా దాంట్లో కలిపేయి.. అన్నాను.*


*"కిలో బియ్యం , కొంచెం కందిపప్పు చాలన్నా ..’’ అంది, ఆమె అమాయకంగా...*


 *ఉచితంగా తీసుకోవడానికి ఆమెకు ఆత్మాభిమానం అడ్డువస్తున్నట్టు అనిపించింది.*


*"నెలకు సరిపడా సరుకులు తీసుకొని వెళ్లమ్మా... ఇపుడు నేను పైసలు ఇస్తా... నీకు పని దొరికినపుడు, నాకు తిరిగి ఇయ్యి... ఈ షాపుతనకి నా వివరాలు తెలుసు. ’’ అని ఆమెకు కావాల్సినవి ప్యాక్ చేయించి ఆటో ఎక్కించి పంపాక,*

 

*"అమె మళ్లా ఇస్తాదంటారా సార్...?’’ అన్నాడు షాపతను.*


 *‘‘అమె ఇస్తుందా, లేదా వేరే సంగతి, మనం ఉచితంగా సాయం చేసినట్టు అమె ఫీల్ కాకూడదు. కష్ట జీవులకు ఆత్మాభిమానం ఎక్కువ. దానిని గౌరవించాలి.’’ అని, మొత్తం బిల్ పే చేశాను.*

 *షాపతను, రెండువందలు తిరిగి ఇచ్చాడు!!*


*"మీరు అంత చేసినపుడు, నేను కూడా కొంత చేయాలి కదా... వ్యాపారంలో పడిపోయి, ఏదో మిస్ అవుతున్నట్టుంది సార్.. ఇపుడు మనసుకు ఎంతో హాయిగా ఉంది..’’ అని నాకిష్టమైన లిమ్కా బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చాడు......*🙏🙏🙏


*ఎవరో మారలేదు అని అనుకునే బదులు..ఆ మార్పు అనే ముందు అడుగు మనమే వేస్తే సరిపోతుంది* 🙏🙏


*ఇలాంటి ఎందరో పేదవాళ్లకు కరోనా కష్ట కాలంలో* *నిత్యావసర వస్తువులు నృసింహ సేవా వాహిణి ద్వారా మన భక్తుల సహకారంతో అందించాము* *అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది*


*కష్టంలో ఉన్న మానవుడికి సేవ చేస్తే తప్పక మాధవుడు శంతోషిస్తాడు*


*శ్రీ నృసింహ కార్యంలో శ్రీ నృసింహ సేవా వాహిణి*

#6305811889#

మోహ ముద్గరము

 

            రచన

గోపాలుని మధుసూదన రావు 


వలదు గర్వంబు ధనజన యౌవనమున 

సర్వమును కాలము హరించు క్షణము నందు 

మాయరూపంబు యిదియని మదిని దలచి 

బ్రహ్మపదమున తరియించు బడసినీవు 11


ధాత్రి నుదయ సాయంత్రముల్ రాత్రి పగలు 

శిశిర వాసంత ఋతువులు చేరు మరల  

కాలమనయంబు క్రీడించు గడచు వయసు 

అయిన వీడడు మనుజుండు యాశ నెపుడు 12


ఇంతి ధనముల గూర్చిన చింతయేల ?

అరయ పరమాత్మ లేడె నిన్నాదుకొనగ 

జగతి " సజ్జనసంగతే " , జనుల నెల్ల 

బయటపడవేయు " భవసంద్ర " బాధనుండి 13


ఉంచితంబైన కేశాల నుండు నొకడు 

గుండు కాషాయ వసనాల నుండునొకడు 

సర్వమెరిగియు , నెరుగక సత్యపథము 

ఉదరపోషణ కొఱకునై నుందు రవని 14


వడలె యంగంబులెల్లను వణికె తనువు 

పండె కేశంబు లెల్లను పడెను పళ్ళు 

చేరె దండంబు యండగా చేతి కకట 

యైన నరునకు చావదు యాశ యపుడు. 15

*భాగవతామృతం*


ధర్మనందన రాజ్యాభిషేకము


1-231-క.కంద పద్యము


"కురుసంతతికిఁ బరీక్షి

న్నరవరు నంకురము సేసి నారాయణుఁ డీ

ధరణీరాజ్యమునకు నీ

శ్వరుఁగా ధర్మజుని నిలిపి సంతోషించెన్.

కురు = కురువంశపు; సంతతి = వారసత్వము; కిన్ = నకు; పరీక్షిత్ = పరీక్షిత; నరవరు = మహారాజును; అంకురము = వంశాకురముగ; చేసి = చేసి; నారాయణుఁడు = కృష్ణుడు; ఈ = ఈ; ధరణీ = భూ; రాజ్యమున్ = మండలము; కున్ = నకు; ఈశ్వరుఁగాన్ = అధిపతిగా; ధర్మజుని = ధర్మరాజుని; నిలిపి = నియమించి; సంతోషించెన్ = సంతోషించెను.

"పరీక్షిత్తును కురువంశాంకురంగా నిలబెట్టి, యుధిష్టిరుణ్ణి సమస్త సామ్రాజ్యానికి అధినేతగా నిలిపి శ్రీకృష్ణుడు సంతుష్టాంతరంగుడైనాడు.

1-232-వ.వచనము

ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబు గాని స్వతంత్రంబుగా దనునది మొదలగు భీష్ముని వచనంబులం గృష్ణుని సంభాషణంబులం ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును నివర్తిత శంకా కళంకుండునునై నారాయణాశ్రయుం డైన యింద్రుండునుం బోలెఁ జతుస్సాగరవేలాలంకృతం బగు వసుంధరామండలంబు సహోదర సహాయుండై యేలుచుండె.

ఇట్లు = ఈ విధముగ; జగంబు = ప్రపంచము; పరమేశ్వర = పరమమైన ఈశ్వరునికి, హరికి; ఆధీనంబు = లోబడి ఉండునది; కాని = కాని; స్వతంత్రంబు = స్వంతముగా నియత్రించుకొనగలది; కాదు = కాదు; అనునది = అన్నది; మొదలగు = మొదలగు; భీష్ముని = భీష్ముని; వచనంబులన్ = ఉపదేశములవలనను; కృష్ణుని = కృష్ణుని; సంభాషణంబులన్ = ఉపదేశములవలనను; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుండు- యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; ప్రవర్ధమాన = పెరుగుచున్న; విజ్ఞానుండును = విజ్ఞానము కలవాడును; నివర్తిత = నివృత్తి చేయబడిన; శంక = అనుమానము అను; కళంకుండును = మచ్చకలవాడును; ఐ = అయి; నారాయణ = హరి {నారాయముడు - నారములందు వసించు వానిని, హరి}; ఆశ్రయుండు = ఆశ్రయించినవాడు; ఐన = అయిన; ఇంద్రుండునున్ = ఇంద్రుడును; పోలెన్ = వలె; చతుస్ = నాలుగు; సాగర = సముద్రములు; వేల = సరిహద్దులుగా; అలంకృతంబు = అలంకరింపబడినది; అగు = అయినట్టి; వసుంధర = భూ; మండలంబు = మండలమును; సహోదర = సోదరుల యొక్క; సహాయుండు = సహాయము కలవాడు; ఐ = అయి; ఏలుచుండెన్ = పరిపాలించుచుండెను..

ఈ విధంగా భీష్మాచార్యుని ఉపదేశాలవల్ల, శ్రీకృష్ణుని ప్రబోధాలవల్ల ధర్మరాజు జగత్తు స్వతంత్ర మైనది కాదు పరమేశ్వరాధీనం మొదలైన విజ్ఞానాన్ని పెంపొందించుకొని, తన సందేహా లన్నింటిని నివర్తించుకొని, ఉపేంద్రుని సహాయంతో అతిశయించే మహేంద్రుని వలె, శ్రీకృష్ణుని అండదండలతో చతుస్సముద్ర ముద్రితమైన మహీమండలాన్ని సహచరుల సహాయంతో పరిపాలించసాగాడు.

1-233-సీ.సీస పద్యము


సంపూర్ణ వృష్టిఁ బర్జన్యుండు గురియించు;

నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు

గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు;

ఫలవంతములు లతాపాదపములు

పండు సస్యములు దప్పక ఋతువుల నెల్ల;

ధర్మ మెల్లెడలను దనరి యుండు

దైవభూతాత్మ తంత్రము లగు రోగాది;

భయములు సెందవు ప్రజల కెందు

1-233.1-ఆ.

గురుకులోత్తముండు గుంతీతనూజుండు

దాన మానఘనుఁడు ధర్మజుండు

సత్యవాక్యధనుఁడు సకలమహీరాజ్య

విభవభాజి యయిన వేళ యందు

సంపూర్ణ = సంపూర్ణమైన; వృష్టిన్ = వర్షమును; పర్జన్యుండు = మేఘుడు {పర్డన్యుడు - ఉరిమెడువాడు, మేఘుడు}; కురియించు = కురిపించును; ఇల = భూమి; ఎల్లన్ = సమస్తమైన; కోర్కులన్ = కోరికలను; ఈనుచుండున్ = పుట్టించును; గోవులు = ఆవులు; వర్షించున్ = ఎక్కువగా ఇచ్చును; ఘోషభూములన్ = గొల్లపల్లెలలో; పాలు = పాలు; ఫల = ఫలములతో; వంతములున్ = నిండి ఉండును; లతా = తీగలు; పాదపములు = చెట్లు; పండు = పండును; సస్యములున్ = ధాన్యములు; తప్పక = తప్పకుండగ; ఋతువులన్ = ఋతువులలో; ఎల్లన్ = సమస్తమును; ధర్మము = ధర్మవర్తనము; ఎల్ల = సమస్త; ఎడలను = స్థలములందును; తనరి = విస్తరించి; ఉండున్ = ఉండును; దైవ = దేవతలు; భూత = భూతములు; ఆత్మ = ఆత్మలు; తంత్రములు = హేతు భూతములు; అగు = అయినట్టి; రోగ = రోగములు; ఆది = మొదలగు; భయములు = భయములు; చెందవు = కలుగవు; ప్రజలు = లోకులు; కున్ = కు; ఎందున్ = ఎక్కడాకూడ; కురు = కురు; కుల = వంశములో; ఉత్తముండు = ఉత్తముడు; కుంతీ = కుంతియొక్క; తనూజుండు = పుత్రుడు;

దాన = దానమునందును; మాన = మానమునందును; ఘనుఁడు = గొప్పవాడు; ధర్మజుండు = ధర్మరాజు; సత్య = సత్యమైన; వాక్య = వాక్కు; ధనుఁడు = ధనముగాగలవాడు; సకల = సమస్త; మహీ = భూమియందలి; రాజ్య = రాజ్యములలోను; విభవ = (తన) వైభవము; భాజి = భజింపబడువాడు; అయిన = అయినట్టి; వేళ = సమయము; అందున్ = లో;

దానఘనుడు, మానధనుడు, సత్యధనుడు, సత్యసంధుడు, కురులాలంకారుడు, కుంతికుమారుడు ఐన ధర్మరాజు సమస్త భూమండలాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో మేఘుడు వానలు సమృద్ధిగా కురిపించాడు; పృథివి బంగారు పంటలు పండించింది; గోశాలలోని గోవులు కుండల కొద్దీ పాలిచ్చాయి; వృక్షాలూ, లతలూ సంపూర్ణంగా ఫలించాయి; ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయి; దేశమంతటా ధర్మం పాతుకున్నది; ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికాదులు అయిన తాపత్రయాలు, వ్యాధులు ప్రజలను బాధించలేదు.

1-234-వ.వచనము

అంతఁ గృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయు కొఱకును, సుభద్రకుఁ బ్రియంబు సేయు కొఱకును, గజపురంబునం గొన్ని నెలలుండి ద్వారకానగరంబునకుం బ్రయాణంబు సేయం దలంచి, ధర్మనందనునకుం గృతాభివందనుం డగుచు నతనిచే నాలింగితుండై, యామంత్రణంబు వడసి, కొందఱు దనకు నమస్కరించినం గౌఁగలించుకొని, కొందఱు దనుం గౌఁగిలింప నానందించుచు, రథారోహణంబు సేయు నవసరంబున సుభద్రయు, ద్రౌపదియుఁ, గుంతియు, నుత్తరయు, గాంధారియు, ధృతరాష్ట్రుండును, విదురుండును, యుధిష్ఠిరుండును, యుయుత్సుండును, గృపాచార్యుండును, నకుల, సహదేవులును, వృకోదరుండును, ధౌమ్యుండును సత్సంగంబు వలన ముక్తదుస్సంగుం డగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరం బగు నెవ్వని యశంబు నాకర్ణించి విడువ నోపం డట్టి హరి తోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనంబులవలన నిమిషమాత్రంబును హరికి నెడ లేని వారలైన పాండవులం గూడికొని హరి మరలవలయునని కోరుచు హరి చనిన మార్గంబు సూచుచు హరి విన్యస్త చిత్తు లయి లోచనంబుల బాష్పంబు లొలుక నంత నిలువంబడి రయ్యవసరంబున.

అంతన్ = అంతట; కృష్ణుండు = కృష్ణుడు; చుట్టాలు = బంధువులు; కున్ = కు; శోకంబు = బాధ; లేకుండన్ = లేకుండగ; చేయు = చేయుట; కొఱకును = కోసమును; సుభద్ర = సుభద్ర; కున్ = కు; ప్రియంబు = సంతోషము; చేయు = కలుగ చేయుట; కొఱకును = కోసమును; గజపురంబునన్ = హస్తినాపురములో; కొన్ని = కొన్ని; నెలలు = నెలలు; ఉండి = ఆగి ఉండి; ద్వారకా = ద్వారక అను; నగరంబున్ = నగరము; కున్ = నకు; ప్రయాణంబు = ప్రయాణము; చేయన్ = చేయ వలెనని; తలంచి = అనుకొని; ధర్మనందనున = ధర్మరాజున {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు; కున్ = కు; కృత = చేసిన; అభివందనుండు = నమస్కారము కలవాడు; అగుచున్ = అవుతూ; అతని = అతని; చేన్ = చేత; ఆలింగితుండు = కౌగలింపబడినవాడు; ఐ = అయి; ఆమంత్రణంబు = అనుమతి; వడసి = పొంది; కొందఱు = కొందరు; తన = తన; కున్ = కు; నమస్కరించినన్ = నమస్కారముచేసిన; కౌఁగలించుకొని = ఆలింగనము చేసికొని; కొందఱు = కొందరు; తనున్ = తనను; కౌఁగిలింపన్ = ఆలింగనముచేయగ; ఆనందించుచున్ = సంతోషించుచు; రథ = రథమును; ఆరోహణంబున్ = ఎక్కుట; చేయు = చేయుచున్న; అవసరంబునన్ = సమయమున; సుభద్రయున్ = సుభద్ర; ద్రౌపదియున్ = ద్రౌపది; కుంతియున్ = కుంతి; ఉత్తరయున్ = ఉత్తర; గాంధారియున్ = గాంధారి; ధృతరాష్ట్రుండును = ధృతరాష్ట్రుడును; విదురుండును = విదురుడును; యుధిష్ఠిరుండును = యుధిష్టరుడును; యుయుత్సుండును = యుయుత్సుడును; కృపాచార్యుండును = కృపాచార్యుడును; నకుల = నకులుడును; సహదేవులును = సహదేవుడును; వృకోదరుండును = భీముడును {వృకోదరుడు - వృకము వంటి పొట్ట ఉన్నవాడు, భీముడు}; ధౌమ్యుండును = ధౌమ్యుడును; సత్ = మంచివారితో; సంగంబు = కలిసి ఉండుట; వలనన్ = వలన; ముక్త = విడువబడిన; దుర్ = చెడ్డవారి; సంగుండు = చేరిక గల వాడు; అగు = ఐన; బుధుండు = జ్ఞాని; సకృత్కాల = ఎప్పుడైనా ఒకసారి; సంకీర్త్యమానంబు = స్తుతింపబడినది; ఐ = అయినను; రుచికరంబు = రుచించునది; అగున్ = అగునదై; ఎవ్వని = ఎవని యొక్క; యశంబు = కీర్తిని; ఆకర్ణించి = విని; విడువనోపండు = వదిలిపెట్టలేడో; అట్టి = అటువంటి; హరి = కృష్ణుని; తోడి = తోని; వియోగంబున్ = దూరమగుటను, విరహము; సహింపక = ఓర్చుకొనలేక; దర్శన = కనిపించుట; స్పర్శన = తాకుట; ఆలాప = కలిసి మాట్లాడుట; శయన = కలిసి పండుకొనుట; ఆసన = కలిసి కూర్చుండుట; భోజనంబుల = కలిసి తినుటలు; వలనన్ = వలన; నిమిష = నిమిషము; మాత్రంబును = మాత్రపు సమయమైన; హరి = హరి; కిన్ = కి; ఎడ = దూరముగా; లేని = ఉండలేని; వారలు = వారు; ఐన = అయిన; పాండవులన్ = పాండురాజు పుత్రులను; కూడికొని = కలిసి ఉంటూ; హరి = హరి; మరల = వెనుకకు వచ్చుట; వలయునని = చేయవలెనని; కోరుచున్ = కోరుతూ; హరి = హరి; చనిన = వెళ్ళిన; మార్గంబున్ = దారిని; సూచుచున్ = చూస్తూ; హరి = హరి యందు; విన్యస్త = ఉంచబడిన; చిత్తులు = చిత్తము కలవారు; అయి = అయి; లోచనంబులన్ = కన్నులనుండి; బాష్పంబులు = కన్నీరు; ఒలుకన్ = కారుచుండగా; అంతన్ = అక్కడే; నిలువంబడిరి = నిలుచుండిరి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమున.

ప్రియ సోదరి సుభద్ర మనస్సుకు సంతోషం సమకూర్చుటం కోసం, బంధువులైన పాండవుల శోకం పోకార్చటం కోసం, యశోదానందనుడు హస్తినాపురంలో కొన్ని మాసాలపాటు ఉండి, పిమ్మట తన నగరానికి బయలుదేరాడు. తనకు అభివందనాలు సమర్పిస్తున్న నందనందనుణ్ణి ధర్మనందనుడు ఆనందంతో అభినందించి ఆలింగనం చేసుకొని వీడ్కోలిచ్చాడు. అనంతరం శ్రీకృష్ణుడు కొందరి నుండి నమస్కారాలు అందుకొన్నాడు. కొందరిని కౌగిలించుకొన్నాడు. కొందరు తనను కౌగిలించుకొనగా వారికి శుభాకాంక్ష లందించాడు. సజ్జనసాంగత్యం వల్ల దుర్జన సాంగత్యాన్ని పరిత్యజించిన బుద్ధిమంతుడు హరి మధురగాథలు ఒక్కమాటు వింటే మళ్లీ విడిచి పెట్టలేడు. అలాగ గోవిందుడు రథం ఎక్కబోతున్న సమయంలో సుభద్రా ద్రౌపదులు, కుంతీ గాంధారులు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు, యుయుత్సుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీమసేనుడు, ధౌమ్యుడు మొదలైన వారంతా, శ్రీకృష్ణుని ఎడబాటు సహించలేనివారయ్యారు. అనుక్షణం ఆయనను చూస్తు, తాకుతు, మాట్లాడుతు, ఆయనతో కలిసి శయనిస్తు, కూర్చుంటు, భుజిస్తు ఉండే పాండవులతో పాటు శ్రీకృష్ణుడు వెనుకకు మరిలి రావాలని అభిలషిస్తు, ఆయన వెళ్లిన మార్గాన్ని అవలోకిస్తు, హరిమయాలైన హృదయాలతో, అశ్రు నయనాలతో అల్లంత దూరంలో నిలబడి పోయారు.

1-235-సీ.సీస పద్యము


కనకసౌధములపైఁ గౌరవకాంతలు;

గుసుమవర్షంబులు గోరి కురియ

మౌక్తికదామ సమంచితధవళాత;

పత్త్రంబు విజయుండు పట్టుచుండ

నుద్ధవసాత్యకు లుత్సాహవంతులై;

రత్నభూషితచామరములు వీవ

గగనాంతరాళంబు గప్పి కాహళభేరి;

పటహశంఖాదిశబ్దములు మొరయ

1-235.1-ఆ.

సకలవిప్రజనులు సగుణనిర్గుణరూప

భద్రభాషణములు పలుకుచుండ

భువనమోహనుండు పుండరీకాక్షుండు

పుణ్యరాశి హస్తిపురము వెడలె.

కనక = బంగారు; సౌధములన్ = మేడల; పైన్ = మీదనున్న; కౌరవ = కౌరవ వంశపు; కాంతలు = స్త్రీలు; కుసుమ = పూల; వర్షంబులు = వానలు; కోరి = ఇష్టముతో; కురియన్ = కురిపించగ; మౌక్తిక = ముత్యాల; దామ = దండలు; సమంచిత = అలంకరింపబడిన; ధవళ = తెల్లని; అతపత్త్రంబు = గొడుగు; విజయుండు = అర్జునుడు; పట్టుచుండన్ = పట్టుతుండగ; ఉద్ధవ = ఉద్ధవుడు; సాత్యకులు = సాత్యకియు; ఉత్సాహవంతులు = ఉత్సాహముకలవారు; ఐ = అయ్యి; రత్న = రత్నములతో; భూషిత = అలంకరింపబడిన; చామరములు = చామరములు; వీవ = వీస్తుండగా; గగన = ఆకాశముయొక్క; అంతరాళంబున్ = లోపలంతా; కప్పి = నిండిన; కాహళ = బాకాలు; భేరి = భేరీవాద్యాలు; పటహ = పెద్దడోలు / రాండోలు; శంఖ = శంఖములు; ఆది = మొదలగువాని; శబ్దములు = శబ్దములు; మొరయ = చెలరేగు చుండగ;

సకల = సమస్త; విప్ర = బ్రాహ్మణ; జనులు = ప్రజలు; సగుణ = సగుణ; నిర్గుణ = నిర్గుణ; రూప = రూపములలో; భద్ర = శుభమైన; భాషణములు = సంభాషణలు; పలుకుచు = పలుకుతూ; ఉండ = ఉండగా; భువన = లోకమును; మోహనుండు = మోహింపజేయువాడు; పుండరీకాక్షుండు = కృష్ణుడు {పుండరీకాక్షుడు - పద్మముల వంటి కన్నులవాడు / కృష్ణుడు}; పుణ్యరాశి = పుణ్యముల కుప్ప / కృష్ణుడు; హస్తిపురము = హస్తినాపురము నుండి; వెడలె = బయలుదేరెను.

భువనమోహనుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీకృష్ణుడు ఘనీభవించిన పురజనుల పురాకృత పుణ్యంలా హస్తినాపుర వీథుల వెంట సాగిపోతున్నాడు. అంతఃపుర కాంతలు బంగారు మేడలపై నిలబడి నందనందనునిపై పుష్ప వర్షాలు కురిపించారు. విజయుడు వెనుక నిలబడి ముత్యాలసరాలతో విరాజిల్లే శ్వేతచ్ఛత్రాన్ని పట్టాడు. ఉద్ధవుడు, సాత్యకి ఉత్సాహంతో అటునిటు నడుస్తు రత్మఖచితాలైన పిడులు పట్టుకొని వింజామరలు వీస్తున్నారు. బాకాలు, నగారాలు, తప్పెటలు, శంఖాలు ఆకాశం దద్దరిల్లేలా మ్రోగుతున్నాయి. వేదవేత్తలైన బ్రాహ్మణులు సగుణ నిర్గుణ స్వరూప నిరూపకంగా స్వస్తివచనాలు పలుకుతున్నారు.

1-236-వ.వచనము

తత్సమయంబునం బౌరసుందరులు ప్రాసాదశిఖరభాగంబుల నిలిచి గోపాలసుందరుని సందర్శించి, వర్గంబులై మార్గంబు రెండు దెసల గరారవిందంబులు సాచి యొండొరులకుం జూపుచుం దమలోనం దొల్లి గుణంబులం గూడక జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు బ్రవర్తింపని సమయంబున నొంటి దీపించు పురాణపురుషుం డితం డనువారును; జీవులకు బ్రహ్మత్వంబు గలుగ లయంబు సిద్ధించుట యెట్లనువారును; జీవనోపాధి భూతంబు లయిన సత్త్వాదిశక్తుల లయంబు జీవుల లయం బనువారును; గ్రమ్మఱ సృష్టికర్త యైన యప్పరమేశ్వరుండు నిజవీర్యప్రేరితయై నిజాంశ భూతంబు లైన జీవులకు మోహిని యగుచు సృష్టి సేయ నిశ్చయించి నామ రూపంబులు లేని జీవు లందు నామరూపంబులు గల్పించుకొఱకు వర్తిల్లు స్వమాయ నంగీకరించు; ననువారును నిర్మలభక్తి సముత్కంఠావిశేషంబుల నకుంఠితులై జితేంద్రియులగు విద్వాంసు లిమ్మహానుభావు నిజరూపంబు దర్శింతు రను వారును; యోగమార్గంబునం గాని దర్శింపరాదను వారును నై; మఱియును.

తత్ = ఆ; సమయంబునన్ = సమయములో; పౌర = నగరమందలి; సుందరులు = స్త్రీలు; ప్రాసాద = మేడల; శిఖర = చివరి, డాబాలపై; భాగంబులన్ = భాగములందు; నిలిచి = నిలువబడి; గోపాలసుందరుని = గోపాలురలో సుందరుని, కృష్ణుని; సందర్శించి = చూసి; వర్గంబులు = వరుసలు తీరినవారు; ఐ = అయి; మార్గంబుల = వీధులకు; రెండు దెసలన్ = రెండుపక్కల; కర = చేతులు అనే; అరవిందంబులు = పద్మములు; సాచి = చాచి; ఒండొరుల = ఒకరింకొకరు; కున్ = కి; చూపుచున్ = చూపుకొనుచూ; తమలోనన్ = తమలోతాము; తొల్లి = పూర్వము; గుణంబులన్ = గుణములు {త్రిగుణములు - సత్త్వ, రజస్, తమస్}; కూడక = కలిగి ఉండక; జీవులు = సర్వ జనులు; లీన = పరబ్రహ్మలో లీనమైన; రూపంబులు = రూపములగలవి; ఐ = అయి; ఉండన్ = ఉండగా; ప్రపంచంబు = ప్రపంచము; ప్రవర్తింపని = నడచుట ఉండని; సమయంబున = సమయములో; ఒంటిన్ = ఒంటరిగా; దీపించు = ప్రకాశించు; పురాణ = పురాతనమైన; పురుషుండు = పురుషుడు; ఇతండు = ఇతడు; అను = అనెడి; వారును = వారును; జీవులు = మానవులు; కున్ = కు; బ్రహ్మత్వంబు = బ్రహ్మత్త్వము; కలుగ = కలుగగ; లయంబు = లయము {లయము - జీవాత్మ బ్రహ్మాత్మలో లయించుట}; సిద్ధించుట = సిద్ధించుట; ఎట్లు = ఏవిధముగ సాధ్యము; అను = అనెడి; వారును = వారును; జీవన = జీవనమునకు; ఉపాధి = ఆధార; భూతంబులు = భూతములు; అయిన = అయినట్టి; సత్త్వ = సత్త్వము; ఆది = మొదలగు; శక్తుల = శక్తుల; లయంబు = లయము; జీవుల = జీవుల; లయంబు = లయము; అను = అనెడి; వారును = వారును; క్రమ్మఱ = మరల; సృష్టి = సృష్టిని; కర్త = చేయువాడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; పరమేశ్వరుండు = పరమమైన ఈశ్వరుడు; నిజ = తనయొక్క; వీర్య = వీరత్వమువలన; ప్రేరిత = ప్రేరింపబడినది; ఐ = అయి; నిజ = తన; అంశ = అంశతో; భూతంబులు = కూడినవి; ఐన = అయినట్టి; జీవులు = జీవులు; కున్ = కు; మోహిని = మోహింపజేయునది; అగుచున్ = అవుతూ; సృష్టి = సృష్టి; చేయన్ = చేయుటకు; నిశ్చయించి = నిశ్చయించుకొని; నామ = పేర్లుగాని; రూపంబులు = రూపములుగాని; లేని = లేనట్టి; జీవులు = జీవులు; అందున్ = లో; నామ = నామములు; రూపంబులు = రూపములు; కల్పించు = ఏర్పరుచుట; కొఱకున్ = కోసము; వర్తిల్లు = ప్రవర్తిల్లు; స్వ = తనయొక్క; మాయన్ = మాయను; అంగీకరించున్ = అంగీకరించును; అను = అనెడి; వారును = వారును; నిర్మల = నిర్మలమైన; భక్తి = భక్తివలన; సముత్ = మిక్కిలి; ఉత్కంఠా = ఉత్కంఠల యొక్క; విశేషంబుల = విశిష్టలతో; అకుంఠితులు = కుంటుపడనివారు; ఐ = అయి; జిత్ = జయించిన; ఇంద్రియులు = ఇంద్రియములు కలవారు; అగు = అయినట్టి; విద్వాంసులు = పండితులు; ఈ = ఈ; మహానుభావు = మహానుభావుని యొక్క; నిజ = స్వంత; రూపంబు = రూపమును; దర్శింతురు = దర్శింప కలరు; అను = అనెడి; వారును = వారును; యోగ = యోగపద్ధతి; మార్గంబునన్ = పాటించుట ద్వారా; కాని = కాని; దర్శింప = దర్శించుటకు; రాదు = వీలుకాదు; అను = అనెడి; వారును = వారును; ఐ = అయి; మఱియును = ఇంకనూ.

ఆ సమయంలో యాదవసింహుణ్ణి దర్శించడానికి హస్తినానగరకాంతలు నగరంలోని భవనాలపై కెక్కారు. మార్గానికి ఇరువైపుల గుంపులు గూడి చేతులు చాపి వాసుదేవుణ్ణి ఒకరికొకరు చూపించుకోసాగారు. సృష్టి ఆదిలో జీవులు త్రిగుణాలతో కూడక ముందు, ప్రపంచం అంతా ఆయనలో లీనమై ఉండేది అని; అద్వితీయమైన పరబ్రహ్మ స్వరూప మీయనే అని కొందరు అంటున్నారు; జీవులు పరబ్రహ్మత్వం కలిగితే లయం అనేది ఎలా కలుగుతుంది అని కొందరు అంటున్నారు; జీవనాలకి ఉపాధిభూతాలైన సత్వాది శక్తులు లయం కావటమే జీవుల లయం అని కొందరు చెప్తున్నారు; మరల సృష్టికి కారణభూతు డైన విశ్వేశుని ఆత్మ శక్తిచేత తన మాయను చేపట్టి నామరూపాలు లేని జీవులందు నామరూపాలు ఏర్పరచాడు అని కొందరు చెప్తున్నారు; నిర్మమైన భక్తిగలవారు, కుంటుపడని ఉత్కంఠభరిత యత్నులై, జితేంద్రియులైన పరమ జ్ఞానులు ఈ భగవానుని దర్శించగలరు అని మరికొందరు అంటున్నారు; యోగ మార్గం ద్వారా తప్ప పరమేశ్వర సాక్షాత్కారం అసాధ్య మని యింకొందరు అంటున్నారు.

1-237-మ.మత్తేభ విక్రీడితము


"రమణీ! దూరము వోయెఁ గృష్ణురథమున్ రాదింక వీక్షింప నీ

కమలాక్షుం బొడఁగానలేని దినముల్ గల్పంబులై తోఁచుగే

హము లం దుండఁగ నేలపోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మి నుం

దము రమ్మాయనె నొక్క చంద్రముఖి కందర్పాశుగభ్రాంతయై.

రమణీ = రమణతో కూడిన దానా, స్త్రీ; దూరము = దూరముగ; వోయెన్ = పోయెను; కృష్ణు = కృష్ణుని; రథమున్ = రథము; రాదు = వీలుకాదు; ఇంక = ఇకపైన; వీక్షింపన్ = చూచుటకు; ఈ = ఈ; కమలాక్షున్ = కృష్ణుని {కమలాక్షుడు - కమలములవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; పొడఁగాన = చూడగలగుట; లేని = లేని; దినముల్ = రోజులు; కల్పంబులు = కల్పములు {బ్రహ్మకు ఒక పగలు ఒక రాత్రి అయిన కాలము - కల్పము}; ఐ = అయి; తోఁచున్ = తోచుచుండగ; గేహములు = గృహములు; అందున్ = లో; ఉండఁగన్ = ఉండుట; ఏల = ఎందులకు; పోయి = వెళ్ళి; పరిచర్యల్ = పరిచర్యలు; చేయుచున్ = చేస్తూ; నెమ్మిన్ = చక్కగా; ఉందము = ఉండెదము; రమ్మా = రావమ్మా; అనెన్ = అనెను; ఒక్క = ఒక; చంద్రముఖి = సుందరి {చంద్రముఖి - చంద్రునివంటి మోము కలామె, స్త్రీ}; కందర్ప = మన్మథుని {కందర్పుడు - సుఖం తత్ర ద్రపో యస్య, బవ్రీ., సుఖ విషయమున గర్వము కలవాడు, మన్మథుడు}; ఆశుగ = బాణములవలన; భ్రాంత = భ్రాంతితో కూడినది; ఐ = అయి.

1-238-మ.మత్తేభ విక్రీడితము


తరుణీ! యాదవరాజు గాఁ డితఁడు; వేదవ్యక్తుఁడై యొక్కఁడై

వరుసన్ లోకభవస్థితిప్రళయముల్ వర్తింపఁగాఁ జేయు దు

స్తరలీలారతుఁడైన యీశుఁ, డితనిన్ దర్శించితిం బుణ్యభా

సుర నే నంచు నటించె నొక్కతె మహాశుద్ధాంతరంగంబునన్.

తరుణీ = తరుణ వయసు లోనున్న దానా, స్త్రీ; యాదవ = యాదవుల; రాజు = రాజు; కాడు = కాడు; ఇతఁడు = ఇతడు; వేద = వేదములవలన; వ్యక్తుఁడు = తెలియబడువాడు; ఐ = అయి; ఒక్కఁడు = ఒక్కడే; ఐ = అయి; వరుసన్ = వరుసగా; లోక = లోకముల; భవ = సృష్టి; స్థితి = స్థితి; ప్రళయముల్ = లయములను; వర్తింపఁగాన్ = ప్రవర్తించునట్లు; చేయు = చేయును; దుస్తర = దాటుటకువీలుకాని; లీలా = లీలతో; రతుఁడు = కూడినవాడు; ఐన = అయినట్టి; ఈశుఁడు = ఈశుడు, కృష్ణుడు; ఇతనిన్ = ఇతనిని; దర్శించితిన్ = చూడగలిగితిని; పుణ్య = పుణ్యముతో; భాసుర = ప్రకాశించుదానను; నేన్ = నేను; అంచున్ = అనుచు; నటించెన్ = నటించెను; ఒక్కతె = ఒకతె; మహా = గొప్ప; శుద్ధాంతరంగమునన్ = పరిశుద్ధమైన + అంతరంగముతో, అంతఃపురములో.

“చెలీ! వేదవేద్యుడైన ఆదినారాయణుడే గాని ఈ కృష్ణుడు యాదవప్రభువు కాదే. ఈ దేవాధిదేవుడు విశ్వానికి సృష్టి స్థితి లయాలు కల్పించే మహానుభావుడే. ఈయన లీలలు మనం తెలుసుకోలేం. లోకేశ్వరుణ్ణి కనులారా దర్శించిన నేను ఎంత అదృష్టవంతురాలనో” అని ఒక అంగన ఆనంద తరంగాలు పొంగిపొరలే అంతరంగంతో చిందులు వేసింది.

1-239-క.కంద పద్యము


తామసగుణు లగు రాజులు

భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ స

త్త్వామలతనుఁడై యీతఁడు

భామినివారల వధించుఁ బ్రతికల్పమునన్.

తామస = తామసమైన; గుణులు = గుణముగలవారు; అగు = అయిన; రాజులు = రాజులు; భూమిన్ = భూమిమీద; ప్రభవించి = పుట్టి; ప్రజలన్ = ప్రజలను; పొలియింపఁగ = చంపగ; సత్త్వ = సత్త్వగుణముతో; అమల = స్వచ్ఛమైన; తనుఁడు = తనువు కలవాడు; ఐ = అయి; ఈతఁడు = ఇతడు; భామిని = కాంతా; వారలన్ = వారిని; వధించున్ = సంహరించును; ప్రతి = ప్రతియొక్క; కల్పమునన్ = కల్పములోను.

“భామినీ! ప్రతికల్పంలోనూ ఈ పుడమిమీద తమోగుణ దూషితులైన భూపతులు పుట్టి ప్రజానీకాన్ని బాధించి వేధించే సమయంలో, ఆ జగత్కంటకులను సత్య స్వరూపుడై సముద్భవించి సంహరించే స్వామిని చూడవే” అన్నది ఒక కలహంసగామిని.

1-240-వ.వచనము

ఇదియునుం గాక.

ఇదియునున్ = ఇదే; కాక = కాక.

వారు ఇంకా ఈ విధంగా అనుకొన్నారు

1-241-సీ.సీస పద్యము


ఈ యుత్తమశ్లోకుఁ డెలమి జన్మింపంగ;

యాదవకుల మెల్ల ననఘ మయ్యె

నీ పుణ్యవర్తనుం డే ప్రొద్దు నుండంగ;

మథురాపురము దొడ్డ మహిమఁ గనియె

నీ పూరుషశ్రేష్ఠు నీక్షింప భక్తితో;

ద్వారకావాసులు ధన్యులైరి

యీ మహాబలశాలి యెఱిఁగి శిక్షింపంగ;

నిష్కంటకం బయ్యె నిఖిలభువన

1-241.1-తే.

మీ జగన్మోహనాకృతి నిచ్చగించి

పంచశర భల్ల జాల విభజ్యమాన

వివశమానసమై వల్లవీసమూహ

మితని యధరామృతము గ్రోలు నెల్ల ప్రొద్దు.

ఈ = ఈ; ఉత్తమశ్లోకుఁడు = కృష్ణుడు {ఉత్తమశ్లోకుడు - ఉత్తములచే స్తుతింపబడువాడు, కృష్ణుడు}; ఎలమిన్ = సంతోషముగా; జన్మింపంగ = అవతరించగా; యాదవ = యాదవులయొక్క; కులము = వంశము; ఎల్లన్ = సమస్తము; అనఘము = పాపము లేనిది; అయ్యెన్ = అయ్యెను; ఈ = ఈ; పుణ్య = పుణ్యమైన; వర్తనుండు = ప్రవర్తన కలవాడు; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడును; ఉండంగ = ఉంటుండగ; మథురా = మథుర అను; పురము = పట్టణము; దొడ్డ = మిక్కిలి; మహిమన్ = గొప్పతనమును; కనియెన్ = పొందెను; ఈ = ఈ; పూరుష = పురుషులలో; శ్రేష్ఠుని = ఉత్తముని; ఈక్షింపన్ = చూచుచుండగ; భక్తి = భక్తి; తోన్ = తో; ద్వారకా = ద్వారకలో; వాసులు = నివసించువారు; ధన్యులు = ధన్యమైనవారు; ఐరి = అయ్యిరి; ఈ = ఈ; మహా = మిక్కిలి; బలశాలి = బలముగలవాడు; ఎఱిఁగి = తెలిసి; శిక్షింపంగన్ = శిక్షించగా; నిష్కంటకంబు = కష్టములు లేనిది; అయ్యెన్ = ఆయెను; నిఖిల = సమస్త; భువనము = ప్రపంచము; ఈ = ఈ;

జగత్ = లోకములను; మోహన = మోహింపచేయు; ఆకృతిన్ = ఆకారమును; ఇచ్చగించి = ఇష్టపడి; పంచశర = మన్మథుని {పంచశర - ఐదుబాణములవాడు, మన్మథుడు}; భల్ల = బాణముల; జాలన్ = సమూహముచేత; విభజ్యమాన = బద్దలుకొట్టబడుచున్న; వివశ = వశముతప్పిన; మానసము = మనసుకలది; ఐ = అయ్యి; వల్లవీ = గోపికాస్త్రీల; సమూహము = గుంపు; ఇతని = ఇతని; అధర = పెదవి వలన; అమృతమున్ = అమృతమును; క్రోలున్ = క్రోలును; ఎల్లప్రొద్దు = ఎల్లప్పుడు.

“ ఈపుణ్యమూర్తి జన్మించటం మూలంగానే యాదవవంశం పవిత్రమైనది. ఈ సచ్చరిత్రుడు నివసిస్తు ఉండటం వలననే మధురానగరం మహిమాన్వితమై ప్రసిద్ధమైనది. ఈ పురుషోత్తముణ్ణి అనుక్షణం వీక్షించటం చేతనె ద్వారకలో ఉండే పౌరులు ధన్యాత్ములైనారు. ఈ వీరాధివీరుడు క్రూరాత్ములను ఏరి పారవేయటం ద్వార ఈ విశాల విశ్వం ప్రశాంతంగా మనగలుగుతున్నది. ఈ జగన్మోహనుని సౌందర్యాన్ని సందర్శించి, మన్మథ శరపరంపరలకు చలించిన హృదయాలతో వ్రేపల్లెలోని గోపస్త్రీలు ఎల్లవేళల ఈ నల్లనయ్య మోవి తేనియలు త్రావుచూ ఉంటారు.

1-242-ఉ.ఉత్పలమాల


ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుధిఁ బ్రాణనాథుఁగాఁ

జేకొని వేడ్కఁ గాపురము సేయుచు నుండెడు రుక్మిణీముఖా

నేక పతివ్రతల్ నియతి నిర్మలమానసలై జగన్నుతా

స్తోకవిశేషతీర్థములఁ దొల్లిటి బాముల నేమి నోఁచిరో."

ఈ = ఈ; కమలాక్షున్ = కృష్ణుని; ఈ = ఈ; సుభగు = కృష్ణుని {సుభగు - సౌభాగ్యస్వరూపుడు, కృష్ణుడు}; ఈ = ఈ; కరుణాంబుధిన్ = కృష్ణుని {కరుణాంబుధి - కరుణకు సముద్రమైన వాడు, కృష్ణుడు}; ప్రాణనాథుఁగాన్ = భర్తగా, ప్రాణము లకు అథిపతిగా; చేకొని = స్వీకరించి; వేడ్కన్ = కోరికతో; కాపురము = కాపురము; సేయుచున్ = చేస్తూ; ఉండెడు = ఉండునట్టి; రుక్మిణీ = రుక్మిణి; ముఖ = మొదలగు; అనేక = అనేకమైన; పతివ్రతల్ = పతివ్రతలు; నియతి = నియమముతో; నిర్మల = నిర్మలమైన; మానసలు = మనసు కలవారు; ఐ = అయి; జగత్ = లోకముచేత; నుత = స్తుతింపదగిన; అస్తోక = మిక్కిలి; విశేష = విశేషముగల; తీర్థములన్ = పవిత్రస్థలములలో; తొల్లిటి = పూర్వపు; బాములన్ = జన్మములలో; ఏమి = ఏమి; నోఁచిరో = (నోములు) నోచినారో.

ఈ కమలాలాంటి కళ్ళున్నవానిని, ఈ సౌందర్య రాశిని, ఈ దయాసముద్రుణ్ణి తమ జీవితేశ్వరునిగా స్వీకరించి ఆనందంగా కాపురం చేస్తున్న ఆ రుక్మిణీ, సత్యభామా మొదలైన సాధ్వీమణులు నిష్కల్మష హృదయాలతో పూర్వజన్మలో ఏ పుణ్యతీర్థాలు సేవించారో, ఏ మంచినోములు నోచారో కదా.”

1-243-వ.వచనము

అని యిట్లు నానావిధంబులుగా బలుకు పురసుందరుల వచనంబు లాకర్ణించి కటాక్షించి నగుచు నగరంబు వెడలె; ధర్మజుండును హరికి రక్షణంబులై కొలిచి నడువం జతురంగ బలంబులం బంచినఁ దత్సేనా సమేతులై దనతోడి వియోగంబున కోర్వక దూరంబు వెనుతగిలిన కౌరవుల మరలించి; కురుజాంగల, పాంచాల దేశంబులు దాటి శూరసేన యామున భూములం గడచి బ్రహ్మావర్త కురుక్షేత్ర మత్స్య సారస్వత మరుధన్వ సౌవీరాభీర సైంధవ విషయంబు లతిక్రమించి, తత్తద్దేశవాసు లిచ్చిన కానుకలు గైకొనుచు నానర్తమండలంబు సొచ్చి, పద్మబంధుండు పశ్చిమ సింధు నిమగ్నుం డయిన సమయంబునఁ బరిశ్రాంతవాహుండై చనిచని.

అని = అని; ఇట్లు = ఈవిధముగ; నానా = అనేక; విధంబులుగా = రకములుగా; పలుకు = స్తుతించుచున్న; పుర = పురమున కల; సుందరుల = అందమైన వారి; వచనంబులు = మాటలు; ఆకర్ణించి = విని; కటాక్షించి = కడగంటి చూపులతో చూసి; నగుచున్ = నవ్వతూ; నగరంబున్ = పురమునుండి; వెడలెన్ = వెలువడెను; ధర్మజుండును = ధర్మరాజుకూడ; హరి = హరి; కిన్ = కి; రక్షణంబులు = రక్షణచేయునవి; ఐ = అయి; కొలిచి = సేవించి; నడువన్ = నడుచుచుండగ; చతురంగ = నాలుగు విభాగములు కల {చతురంగబలములు - రథములు, ఏనుగులు, గుఱ్ఱములు, కాల్బలములు. - 4సైనిక విభాగములు}; బలంబులన్ = సేనలను; పంచినన్ = పంపించగా; తత్ = ఆ; సేనా = సేనతో; సమేతులు = కూడినవారు; ఐ = అయి; తన = తన; తోడి = తోటి; వియోగంబున్ = ఎడబాటు; కున్ = నకు; ఓర్వక = ఓర్చుకొనలేక; దూరంబు = దూరము; వెను = వెంట; తగిలిన = వచ్చిన; కౌరవులన్ = కౌరవులను; మరలించి = వెనుకకు పంపి; కురు = కురుభూములందు; జాంగల = మెరకప్రదేశములు; పాంచాల = పాంచాల; దేశంబులు = దేశములు; దాటి = దాటి; శూరసేన = శూరసేన; యామున = యమున ఒడ్డున ఉన్న / యామున; భూములన్ = ప్రదేశములను; గడచి = దాటి; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తము; కురుక్షేత్ర = కురుక్షేత్రము; మత్స్య = మత్స్య; సారస్వత = సారస్వత; మరుధన్వ = మరుధన్వ; సౌవీర = సౌవీర; ఆభీర = ఆభీర; సైంధవ = సైంధవ; విషయంబులు = ప్రదేశములు; అతిక్రమించి = దాటి; తత్తత్ = ఆయా; దేశవాసులు = దేశములలో నివసించు వారు; ఇచ్చిన = ఇచ్చినట్టి; కానుకలు = కానుకలను; కైకొనుచున్ = స్వీకరించుచు; ఆనర్త మండలంబు = ఆనర్తమండలము {కృష్ణుని ద్వారక ఆనర్త మండలము లో ఉన్నది}; చొచ్చి = ప్రవేశించి; పద్మబంధుండు = సూర్యుడు {పద్మబంధుడు - పద్మములకు బంధువు, సూర్యుడు}; పశ్చిమ = పడమటి; సింధున్ = సముద్రమున; నిమగ్నుండు = క్రుంకినవాడు; అయిన = అయిన; సమయంబునన్ = వేళకు; పరిశ్రాంత = అలసిన; వాహుండు = గుఱ్ఱములు కలవాడు; ఐ = అయి; చనిచని = వెళ్ళివెళ్ళి.

గోవిందుడు మున్ముందుకు సాగాడు అలా పలు విధాల సంభాషించుకొంటున్న పౌర కాంతామణుల పలుకులు వింటూ, క్రీగంటి చూపులతో కనుగొంటూ, మందహాస వదనారవిందంతో. ధర్మరాజు శ్రీకృష్ణునికి అంగరక్షకులుగ చతురంగబలాలను పంపించాడు. ఆ సైన్యంతో పాటు తన ఎడబాటుకు ఓర్వలేక సాగనంపడానికి బహుదూరం వచ్చిన పాండునందనులను వెనుకకు పంపించి, వసుదేవనందనుడు యమునాతీరంలో ఉన్న కురుజాంగల పాంచాల శూరసేన దేశాలు దాటాడు. బ్రహ్మావర్తాన్నీ, కురుక్షేత్రాన్ని గడిచాడు. మత్స్య సారస్వత మరుధన్వ దేశాల గుండా సాగి ఆభీర సౌవీర సింధుదేశాలను దాటాడు. ఆ యా దేశప్రజలు సమర్పించిన కానుకలు అందుకొంటు ద్వారకలో అంతర్భాగమైన ఆనర్తమండలాన్ని చేరుకొన్నాడు. సంధ్యాసమయం సమీపించింది. అశ్వాలు అలిసిపోయాయి. అల్లంత దూరంలో ద్వారకానగరం కనిపించింది.