19, ఏప్రిల్ 2022, మంగళవారం

తండ్రికి కొడుకు నుండి ఒక సందేహం....

 "లిమిటెడ్ ఎడిషన్ మోడల్"


ఒక తండ్రికి కొడుకు నుండి ఒక సందేహం....


మీ కాలంలో.....


1. ఇంత టెక్నాలజీ లేదు..


2.విమానాలు లేవు..


3.. ఇంటర్నెట్ లేదు..


4.. Tv లు లేవు..


5.. కంప్యూటర్ లు లేవు.


.6.. ఏసీ లు లేవు..


7.. లగ్జరీ కార్ లు లేవు..


8.. మొబైల్ ఫోన్ లు లేవు...


మీరెలా బతికారు...             


 దానికి ఆ తరము తండ్రిగారు ఇచ్చిన జవాబు అందరూ చదవ వలసిందే...........వి. ఎస్. మూర్తి


 మీ తరము ఈరోజు కాలంలో ఎలాగైతే


 1.. ప్రార్ధన లేకుండా..


2.. మర్యాద లేకుండా


3.. ప్లానింగ్ లేకుండా


 4.. క్రమశిక్షణ లేకుండా..


5.. పెద్దల ఎడ గౌరవం లేకుండా..


6.. మన చరిత్ర పై అవగాహన లేకుండా..


7.. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా..


8.. Morals లేకుండా...


ఎలాగైతే హాయి గా రోజులు గడిపేస్తున్నారో...


మేము వాటిని పాటిస్తూ ఆనందముగా జీవించాము...


మేము మీలాగా...


1..వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు..


2.. పాఠశాల వేళలు అయినా తదుపరి చీకటి పడేదాకా ఆడుకున్నాము tv లు చూడలేదు...


3.. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితుల తో గడిపాము..


4..దాహము వేస్తె కుళాయి నీరు తాగాము.. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు..


5..ఒకేగ్లాస్ లో నలుగురం జ్యూస్ తాగినా మాకెప్పుడూ జబ్బులు రాలేదు..


6..మూడు పూటలా అన్నం తిన్నా మాకు ఊబకాయం రాలేదు...


7.. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా మాకు కీళ్ళ నొప్పులు రాలేదు..


8..సొంత ఆట వస్తువులు తయారు చేసి ఆడుకున్నాము,,....


బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము, పండుగలు కలిసి చేసుకున్నాము..


9.. పిలవకపోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము..


10.. మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు....


. మాది జీవితాన్ని చదివిన తరము..


బహుశా మాతల్లి దండ్రులు చెప్పినది ఆచరించిన చివరితరం...


 మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు.....


 అయినప్పటికీ..


 మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము...


 మేము ఒక limitted ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము.....


 అందుకే మా విన్నపము ఏమంటే..


మీ జీవితాలనుండి,.....


ఈరోజు భూమి పైనుండి మేము వెళ్ళిపోకముందే.....


 ఎంతో అంత మానుండి మీరు నేర్చుకోండి...


(నేను చూసిన ఒక ఆంగ్ల వాట్సాప్ message కి తెలుగు సేత.. మాత్రమే )....


 ఏ తండ్రి అయినా...


 ఈ తరం పిల్లలకు ఇంతకు మించి......


 ఏం చెప్పగలడు...

*దేవుడి ఇంటికి సరైన దారి*

 *దేవుడి ఇంటికి సరైన దారి* - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

〰〰〰〰〰〰〰〰

🔼 *'రామాపురం'* అనే ఊళ్ళో రైలు దిగండి.

⏺  *'నమ్మకం'* అనే రిక్షాని మాట్లాడుకోండి. 

🔼 *భక్తి* అనే పేటలోకి తీసుకెళ్ళమనండి.

 ⏺ *పాపం* అనే డెడ్‌ ఎండ్‌ వీధి వస్తుంది. 

🔼 *పుణ్యం* అనే దాని ఎదురు సందులోకి ముందుకి సాగండి.

 ⏺ *ప్రార్ధన* అనే వంతెనని దాటండి. 

🔼 *కర్మ* అనే సర్కిల్‌ వస్తుంది. 

⏺ *దుష్కర్మ* అనే రెడ్‌లైట్‌ అక్కడ వెలుగుతూండవచ్చు.

 🔼 *సుకర్మ* అనే పచ్చలైటు వెలిగాక ముందుకి సాగండి. 

⏺ *భజనమండలి* అన్న బోర్డున్న కుడి రోడ్డులోకి మళ్ళండి. 

🔼అక్కడ రోడ్డు నాలుగు రోడ్లుగా చీలుతుంది.

 ⏺మొదటి మూడిటి పేర్లు - *అసూయ స్ట్రీట్‌, ద్వేషం సందు, ప్రతీకారం వీధి.* 

🔼వాటిని వదిలి నాలుగో సందులోకి తిరగండి. దానిపేరు *సత్సంగం* వీధి. 

⏺పక్కనే కనబడే *వదంతుల* వీధిలోకి వెళ్ళకండి. అది వన్‌వే రోడ్డు. 

🔼కాస్తంత ముందుకు వెళ్ళాక ఓ జంక్షన్‌ వస్తుంది. 

అక్కడ ఎడమవైపు రోడ్డు పేరు *వ్యామోహం.* 

⏺కుడివైపు రోడ్డు పేరు *వైరాగ్యం.* వైరాగ్యం వీధిలోకి వెళ్ళండి. 

🔼ఎదురుగా మీకు *కైవల్యం* అనే మరో చౌరస్తా కనిపిస్తుంది.

 ⏺ *దయగల హృదయం -  భగవన్నిలయం* అన్న బోర్డున్న తెల్లరంగు ఇల్లు కనిపిస్తుంది. 

☯గేటు దగ్గరున్న *ముక్తి* అనే తలుపు మిమ్మల్ని చూడగానే తెరుచుకుంటుంది. 

ఇది  *దేవుడి ఇంటికి సరైన దారి.* 


మీరు మీ బంధుమిత్రులకి కూడా ఈ దారిని తెలపండి.  లేదా సరైన దారి తెలియక వారు దారి తప్పిపోవచ్చు.


ఆధ్యాత్మిక మార్గంలో భక్తి, మంత్రం, ధ్యానం  ఇలా...రకరకాల సాధన ఏదైనా గాని, చేసేవారు ఎవరైనా గాని తెలుసుకోవలసిన సూక్ష్మ విషయం ఇదే!

🙏🙏🙏🙏☯🙏🙏🙏🙏

పాదాభివందనం

 * పాదాభివందనం :-  "భారతీయ  సాంప్రదాయము"

"జ్ఞాన వృద్ధులైన వారి పాదాలకు, మనకంటే పెద్ద వారి పాదాలకు చేసే నమస్కారమే "పాదాభివందనం".


*అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః !*

*చత్వారితస్యవర్ధంతే ఆయుర్విధ్యా యశోబలం !!*


అంటే వయసువల్ల కాని , విద్యవల్ల కాని అధికులైనవారికి ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తే , మనకి ఆయువు, విద్య, కీర్తి, బలం, ఐశ్వార్యాభివృద్ధి లభిస్తాయని మనుధర్మశాస్త్రంలో మనువు చెప్పిన మాట ఇది.


'నమస్కారం' మన సంస్కారానికి చక్కని పురస్కారం. ఇక యోగభ్యాసంలో మొదటి భంగిమ "నమస్తే." వినయానికి ప్రతీక నమస్తే. రెండు చేతులు జోడించి నమస్తే చెప్పడం మంచిది. 'నమస్తే ' భార్య భర్తల ఆదర్శ దాంపత్యానికి కూడా ప్రతీకగా నిలిచే విధంగా "పాణిగ్రహణం " చేయిస్తున్నాము. దీనినే "కరచాలనం" అని కొందరంటారు."కరచాలనం" ఒక విధమైన నమస్కార పద్ధతి. కరచాలనం భారతీయ సంస్కృతికి సంబంధించినది కాకపోయినా, అతి సులువుగా, సౌకర్యాంతంగా చేసే నమస్కారంగా, మన జీవితంలో భాగమయిపోయింది. అయితే, పెద్దలకు, గురువులకు "ఏకహస్తాభివందనం" చెయ్యకూడదని హితవచనం. 


ఇటువంటి వారికి కరచాలనం చేసే సంధర్భం వచ్చినపుడు, వారి చేతులను , మన రెండు చేతులలోకి తీసుకొని, నమస్కరించడం ఉత్తమం. అయితే, అసలు శరీరంలో ఏ ఇతర అవయవాలకీ కాకుండా కేవలం పాదాలకు మాత్రమే ఎందుకు నమస్కరించాలి? అన్న విషయానికి వస్తే, యోగులలోను, మహాత్ములలోను, మన మంచిని కోరే పెద్దలలోను అభివృద్ధిని కోరే సద్గుణం ఉంటుంది. 


అటువంటి సాత్వికాభివృద్ధి యొక్క భావనాశక్తి, వారి శరీరంలో ప్రవహించి, వారి అరచేతులలోనూ, పాదాలలోను నిలిచి ఉంటుంది. అందుకే వారి పాదాలకు నమస్కరిస్తే, 

తమ అరచేయిని మన శిరస్సుపై ఉంచి ఆశీర్వదిస్తే , వారి సాత్విక శక్తి మనలో ప్రవేశించి, మనకు ప్రతిస్పందన కలుగుతుంది. ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది.!

 నిన్న శ్రీనాథుడి గ్రంథాల్లో ప్రస్తావించిన కొన్ని వంటకాల్ని చూశాం కదా. వాటిలో కొన్నిటిని కష్టపడి పోల్చుకోగలిగాం. అలా గాకుండా ఫలానాది ఫలానా అని పోల్చుకునేలా దాని రెసిపీ గాని కనీసం రూపురేఖలు గానీ ఎవరైనా చెబితే ఎంత బాగుండును! అని అనిపిస్తే, ఆ లోటు తీర్చిన కవి ఒకాయన వున్నాడు. ఆయనే జైమినీభారతకర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు. 


ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నాడు. భోజనాలకి మునుల్ని గూడా పిల్చాడు. రావడ మంటే వచ్చారు గాని, వాళ్ళకి ఆ రాజభోజనాల్లో 'డెలికసీ' ఏమీ అంతు బట్టలేదు. వడ్డించే అమ్మాయిల్తో గొడవకి దిగారు


"తెగిన జందెము లేల తెచ్చెదరన, కావు

వినుడివి ‌సన్న సేవియలు గాని

చింపి వల్కము లేమి చేసెడిదన, కావు

నెరవైన కండమండెగలు గాని

ఔదుంబరము లనర్హములొల్లమన,కావు

నమలి చూడుడు, మోదకములు గాని

ఫేనపుంజము లేల పెట్టెదరన, కావు నీ పాద మాన ఫేనికలు గాని

అంచు వాచంయములు వల్క నబ్జముఖులు

నగుచు నొడబడి చెప్పనందరు యథేష్ట

రుచుల భుజియించి వార్చి కర్పూరవీటి

కా సుగంధప్రసూన సౌఖ్యముల దనిసి"


- ( జై.భా 8 - 204)


ఒక వంటకం చూసి," ఏంటివి? జంధ్యం తుంపులు తెచ్చి విస్తట్లో వేశారు. తమాషాగా వుందా?" అని హుంకరించారు. అప్పుడు వడ్డించే వయ్యారి నెత్తి బాదుకుని " అవి సేవియలు సంయమీంద్రా" అంది. ఇప్పుడు మనకి ఏ మాత్రం సందిగ్ధత లేకుండా ' సేవియలు' అంటే‌ ' సేమ్యాలు' అని తెలిసి పోయింది.


అలాగే గుడ్డపేలిక లని భ్రమపడ్డం వల్ల అవి 'కండమండెగలు' (పూతరేకు) అని తెలుస్తుంది. కర్ణాటకలో జైనులు దీనిని ' కట్టమండిగె' అంటారట. ఇది వారి సంప్రదాయ వంటకమట. పూతరేకుని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరిస్తే గుడ్డపేలికల్లా, అంటే అంత పల్చగా వుంటాయి.

 

అలాగే మేడిపండ్లు (ఔదుంబరములు) అని అనుమానపడడం వల్ల అవి లడ్డూలనీ సులభంగా బోధపడుతుంది. మేడిపండు ( అత్తిపండు) గుండ్రంగా లడ్డూలా వుంటుంది. బాగా పండిన పండు లడ్డూ రంగు లో వుంటుంది.


ఇక, ఫేనం అంటే నురుగు. 'నురుగు వడ్డించారేంటి?' అని అడిగితే ' కాదు, స్వామీ! అవి ఫేనికలు' అంటారు.

ఫేనికలంటే పేణీలు . అవి పాలనురగ లాగేవుంటాయి. 


ఇంకో అవకాశం గూడా వుంది. ఫేనిక అంటే ' పీచు మిఠాయి' అయినా కావచ్చు. ఎందుకంటే అది అచ్చం పాల నురగలాగే వుంటుంది, రంగెయ్యకపోతే.  


నవ్వకండి. పీచుమిఠాయికి (Cotton candy) చాలా చరిత్ర వుంది. 15 శతాబ్దంలోనే ఇటలీలో వుందంటారు. అదే సమయంలో భారతదేశంలోనూ వుండే అవకాశం వుంది. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్సు వంటి అనేక దేశాల్లో పిల్లలు యిష్టంగా తినే స్వీట్ అది.  


. పద్యాలు యింకా దొరకాలి. మన సాహిత్యం సుసంపన్నం కావాలి.

రామాయణానుభవం_ 35

 🌹రామాయణానుభవం_ 35


పదమూడవ రోజు చేయవలసిన పితృకార్యాలు అన్నీ నిర్వర్తించి అంతఃపురం చేరారు భరత శతృజ్ఞులు.


శత్రుఘ్నుడికి  తూర్పు ద్వారం వద్ద  మంథర కనిపించింది. సర్వాభరణాలు ధరించి, విలువైన వస్త్రాలు దాల్చి, సుగంధద్రవ్యాలు పులుముకుని, మెడనిండా హారాలతో తాళ్ళతో కట్టిన కోతిలా కనిపించింది భరతుడు ఒక్క ఉదుటున వెళ్ళి పట్టుకున్నాడు. దీని మూలంగా ఇదంతా జరిగింది అంటూ శత్రుఘ్నుడికి అప్పగించాడు మంథర ఏడుపులకు అంతఃపురమంతా పోగయ్యింది. శత్రుఘ్నుడి కోపం చూసి మళ్ళీ అందరూ ఎటు వాళ్ళు అటు పారిపోయారు దాన్ని జుట్టుపట్టుకొని బరబరా లోపలికి లాక్కువచ్చాడు. విడిపించమని కైకేయి భరతుణ్ణి

అభ్యర్థించింది. 


భరతుడు మండిపడ్డాడు. శత్రుఘ్నా! ఎంత పాపం చేసినా స్త్రీలను సంహరించడం సమంజసం కాదు. క్షమించి వదిలెయ్, నేను ఈపాటికినేను  ఈ దుష్టచారిణి కైకేయిని సంహరించే ఉందును. ధర్మస్వరూపుడు రాముడు ఇటువంటి పనులు అంగీకరించడు. నువ్వు ఇప్పుడు ఈ కుబ్జను చంపితే, అది తెలిసిందంటే రాముడింక మనిద్దరితోనూ మాట్లాడనైనా మాట్లాడడు. ఇది నిశ్చయం. అందుచేత వదిలిపెట్టెయ్- అన్నాడు భరతుడు. శత్రుఘ్నుడు ఒక్క తోపుతో వదిలేసాడు. కైకేయీ పాదాల మీద పడింది. ఆవిడ ఓదార్చింది


పద్నాల్గవరో జు తెల్లవారింది. రాజాధికారులు భరతుడి దగ్గరికి వచ్చారు. ఆమాటా ఈమాటా చెప్పి, అరాజకం ఏర్పడింది పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధంగా ఉందని విన్నవించారు. రాజ్యం స్వీకరించి రక్షించమని ప్రాధేయపడ్డారు. భరతుడు అభిషేక భాండానికి ప్రదక్షిణం చేసాడు. అధికారులారా ! రాజ్యం జ్యేష్ఠుడికే దక్కాలి. ఇది మా వంశాచారం. మీరంతా ఎరుగుదురు. మరి ఇలా మాట్లాడుతున్నారేమిటి? ఇది మీకు తగదు, రాముడు నాకు అగ్రజుడు. అతడే రాజు అవుతాడు. నేను వెళ్ళి పధ్నాలుగేళ్ళు వనవాసం చేస్తాను. చతురంగసైన్యాలను సమాయత్తం చెయ్యండి నేను వెళ్ళి రాముణ్ని పిలుచుకువస్తాను. ఈ అభిషేకసంభారాలతోనే

బయలుదేరి వెడతాను. అక్కడే పట్టాభిషేకం చేసి నగరానికి తీసుకువస్తాను. యజ్ఞంనుంచి యాగాగ్నిలాగా తీసుకువస్తాను.


తెల్లవారింది. వందిమాగధులు స్తోత్రపాఠాలు చెయ్యబోయారు. మంగళవాద్యాలు మ్రోగాయి. అన్నింటినీ భరతుడు ఆపేసాడు. నేను మహారాజును కాను. ఈ రాజలాంఛనాలు ఆపండి అన్నాడు. తండ్రిని తలుచుకుని మళ్ళీ దుఃఖించాడు.


సభ ఏర్పాటు చేశారు సభలో అందరూ మంత్రి వర్గం పురోహితులను ఉద్దేశించి భరతుడు.....


మనమందరమూ రాముణ్నే అనుసరిద్దాం. అతడే మనకు రాజు. పురుషోత్తముడు. ముల్లో కాలకూ అతడే అర్హుడైన పరిపాలకుడు- అని భరతుడు పలుకుతోంటే విన్నవారంతా సంతోషించారు. రాముణ్ని వెనక్కి తీసుకురాలేకపోతే నేనూ లక్ష్మణుడిలాగే రామునితో ఉండిపోతాను. అన్ని ఉపాయాలూ ఉపయోగిద్దాం. అందరం కలిసి వెడదాం. మీ సమక్షంలోనే మాట్లాడతాను. రాముణ్ని తీసుకువద్దాం. బయలుదేరండి. సుమంత్రా! ప్రయాణానికి ఏర్పాట్లు చేయించు- అన్నాడు భరతుడు


మంత్రిపురోహిత దండనాయకసామంతాదులతో చతురంగబలాలతో జనసముద్రం కదిలింది. కౌసల్య, సుమిత్ర కైకేయి- బయలుదేరారు. అందరి మనస్సుల్లోనూ రాముణ్ని చూస్తామనే సంబరం. దు:ఖం తీరిపోతుందనే విశ్వాసం. కళకళలాడుతున్న ముఖాలతో కోలాహలంగా ప్రజలు బయలుదేరారు. గంగాతీరంలో శృంగిబేరపురం దగ్గర విడిదిచేసారు. గంగాజలంతో దశరథుడికి తర్పణాలు విడిచిపెట్టాలని తన ఆంతర్యం ప్రకటించాడు భరతుడు. చతురంగబలాలు విడివిడిగా విడిదిచేసాయి.....

**


మంత్రి పురోహిత చతురంగబలాలతో  భరతుడు శృంగిభేర పురం చేరాడు.


గుహుడికి చారుల ద్వారా వర్తమానం అందింది. మహాసముద్రంలాగా ఉన్న సైన్యాన్ని చూసాడు. తన వారందరినీ త్వరగా సమావేశపరిచాడు.

కోవిదారధ్వజంతో ఉన్న రథం మీద ఉన్నవాడే భరతుడు. దుర్బుద్ధి. మనల్ని బంధించడానికో వధించడానికి లేదా అడవులపాలయిన రాముణ్ని వధించడానికి వచ్చి ఉంటాడు. సందేహం లేదు. రాముడు నాకు ప్రభువు. మిత్రుడు. అందుచేత మీరంతా అన్ని విధాలా సన్నద్ధులై గంగాతీరాన్ని కాపలా కాయండి. నావలు సిద్ధం చేసుకోండి. భరతుడు రాముడిపట్ల అదుష్టుడు అని తేలితేనే ఇవ్వేళ ఈసేన గంగను దాటగలుగుతుంది. (లేకపోతే మొత్తం సైన్యాన్ని గంగలో ముంచెంయ్యడమే మన కర్తవ్యం)


ఇలా ఆజ్ఞాపించి గుహుడు తాను వినయంతో వినీతుడై మధుమాంసాలను బహుమతిగా తీసుకుని భరతు ణ్ని సమీపించాడు.


సుమంత్రుడు చూసి భరతునికి పరిచయం చేసాడు. మేము మీకు దాసులం. మీరంతా ఈ రాత్రికి ఇక్కడే విడిదిచేసి మా ఆతిథ్యం స్వీకరించి రేపు వెడుదురుగాని- అని గుహుడు సవినయంగా విన్నవించాడు.


భరతుడు సంతోషంగా అంగీకరించాడు. ఈ ప్రాంతమంతా గహనంగా ఉంది. భరద్వాజాశ్రమానికి దారి ఎటు? అడిగాడు


గుహుడు నమస్కరించే సంభాషించాడు.


సన్నద్ధులైన మా ధనుష్కులు మీ వెంట వస్తారు. నేనూ నీ వెంట ఉంటాను. కానీ ఒక్కమాట. ఈ మహాసైన్యం ఏమిటి?

శంకించవలసివస్తోంది. రామునికి అపకారం చేద్దామని వెళ్ళడం లేదు గదా నువ్వు !


ఆకాశంలా నిర్మలంగా ఉన్న భరతుడు మెల్లగా సమాధానం చెప్పాడు. మిత్రమా ! నాకు కష్టకాలం మళ్ళీ రాకూడదు నన్ను శంకించకు. రాముడు నాకు అన్నయ్య, పితృసమానుడు. అతణ్ని వెనక్కి తీసుకురావడానికే వెడుతున్నాను. ఇది సత్యం నమ్ము. మరోలా భావించకు భరతుడా ! నువ్వు ధన్యుడివి. ఈ లోకంలో నీకు సాటి వచ్చేవారు లేరు. అప్రయత్నంగా చేతికి వచ్చిన రాజ్యాన్ని విడిచిపెడుతున్నావంటే నువ్వు సామాన్యుడివి కావు. నీ కీర్తి లోకంలో శాశ్వతంగా ఉండిపోతుంది. రాముణ్ని వెనక్కి తీసుకురావాలి

అనే నీ కోరిక దీనికి కారణం- అంటూ గుహుడు తన సంతోషాన్ని ప్రశంసాపూర్వకంగా వెల్లడించాడు సూర్యుడు అస్తమించాడు. చీకట్లు అలముకున్నాయి. సైన్యం హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. భరతశత్రుఘ్నులు గుహుడితో .

నిద్రకు ఉపక్రమించారు....

రామాయణానుభవం_ 33

 🌹రామాయణానుభవం_ 33


రాముడు అడవులకు వెళ్ళి అయిదు రాత్రులు గడిచాయి. అయిదు సంవత్సరాలు అయినట్టుగా ఉంది నా ప్రాణానికి,అని దశరథుడు అంటుండగా

సూర్యుడు అస్తమించాడు. చీకట్లు అలము కున్నాయి. రాజు విలపించి విలపించి మూర్ఛపోయాడు. నిద్రపట్టింది. అర్ధరాత్రిలో మెలకువ వచ్చింది.  కౌసల్యా ! అన్నాడు......


నిన్ను వివాహం చేసుకోకముందు, నేనప్పటికి ఇంకా యువరాజును. ఒక వర్షరుతువులో సరయూ నదీతీరానికి వేటకు వెళ్ళాను. రాత్రిపూట. ఆ నదిలోకి ఏనుగు దిగిన చప్పుడు అయ్యింది. నేను వెంటనే ఘోరశరం సంధించి ఆ శబ్దం వచ్చిన వైపు విడిచిపెట్టాను. హాహాకారాలు చేస్తూ ఒక మనిషి నీటిలోకి పడిపోయిన చప్పుడు వినిపించింది.

అయ్యో! నాలాంటి తపస్విమీద బాణం వేసింది ఎవరు? దాహం తీర్చుకోడానికి ఇటు వచ్చాను. ఇది ఎవరి బాణం నన్ను కొట్టింది ఎవరు? నేను ఎవరికి ఏమి అపకారం చేసాను? వృద్ధులైన నా తల్లిదండ్రులకు ఇంక దిక్కెవ్వరు

మాటలు వినిపించాయి. నా హృదయం క్షోభించింది. చేతిలోంచి ధనుర్భాణాలు జారిపోయాయి చాలాసేపు నిశ్చేష్టంగా ఈ నిలబడిపోయాను. నెమ్మదిగా ఆ మాటలు వినిపించిన చోటుకు చేరుకున్నాను. దెబ్బతిని పడి ఉన్న తాపసకుమారుణ్ని చూసాను అతడు నన్ను దహించివేస్తున్నట్టు చూసాడు.


రాజా! నీకు నేను ఏమి అపకారం చేసాను? నా జననీ జనకులకోసం నీళ్ళు తీసుకువెడదామని వచ్చాను. ఇలా కొట్టావు ఈ ఒకే బాణంతో నన్ను మాత్రమే కాదు, అంధులూ వృద్ధులూ అయిన నా తల్లిదండ్రుల్ని కూడా సంహరించావు. నేనిక్కడ ఇలా పడి ఉన్నాననే సంగతి మాత్రం నా తండ్రికి ఎలా తెలుస్తుంది? తెలిసిమాత్రం ఏం చెయ్యగలడు? ఓ రాజా నువ్వే త్వరగా వెళ్ళి చెప్పు. మా తండ్రి కోపించాడంటే అగ్నిలా దహించివేస్తాడు. మా ఆశ్రమం ఇక్కడికి దగ్గరే.చెప్పి బతిమాలుకో. రాజా ! ఈ బాణం నా గుండెల్లోనుండి తెసేయ్. ఇది నన్ను బాధిస్తోంది. అని ఆమునిబాలకుడు అభ్యర్థించాడు. బాణం ఉంటే బాధిస్తోంది. బాణం పెరికివేస్తే ప్రాణాలు పోతాయి. ఏంచెయ్యాలో నాకు తోచలేదు. గుండెలు చిక్కబట్టుకుని ధైర్యం తెచ్చుకున్నాను. మునికుమారా! బ్రహ్మహత్యా మహాపాతకం నుంచి నన్ను రక్షించు అని ప్రాధేయ పడ్డాను. ఓ మహారాజా ! నేను బ్రాహ్మణుడను కాను. ఒక శూద్ర స్త్రీ కి వైశ్యుని వల్ల జన్మించాను. అంటూ బిడ్డడు బాధతో విలవిలలాడిపోయాడు. నేను బాణం పెకలించాను. మునికుమారుడు నా చేతుల్లోనే ప్రాణాలు వదిలేసాడు.


నీటి కుండను తీసుకొని ఆ ముని బాలుడు చెప్పిన ఆశ్రమానికి వెళ్ళాను. ఆ వృద్ధ దంపతులు ఆలస్యానికి తగిన కారణాలు పరి పరి విధాల ప్రశ్నించారు.ధైర్యం కూడదీసుకుని నేను పెదవి విప్పాను. జరిగిపోయిన మోరం విన్నవించాను. ఇది నా అజ్ఞానంవల్ల జరిగింది. క్షమించమని వేడుకొన్నాను. నమస్కరించి నిలబడ్డాను.


వృద్ధుల దుఃఖానికి అంతంలేకుండా పోయింది. మహారాజా ! ఇంతటి పాపం నువ్వు తెలిసిచేస్తే ఈ పాటికి నీ తల ఆ వెయ్యిముక్కలై ఉండేది. తెలియక చేసావుకాబట్టే ఇంకా జీవించి ఉన్నావు. మమ్మల్ని మా కుమారుడి దగ్గరికి తీసుకువెళ్ళు అన్నాడు అంత దుఃఖంలోనూ ఆ మహర్షి. నేను ఆ ఇద్దరినీ నడిపించుకుని అక్కడకి నదీతీరానికి  తీసుకువెళ్ళాను. పరిపరివిధాల తలుచుకుని తలుచుకుని వృద్ద దంపతులు శోకించారు. వారి తపశక్తి వల్ల మునిబాలుడు దివ్యవిమానం అధిరోహించి స్వర్గస్థుడయ్యాడు. వారు తర్పణాలు విడిచిపెట్టారు. అప్పుడు ఆ వృద్ధతాపసి నన్ను శపించాడు- నాలాగానే నీకూ

పుత్రశోకం కలుగుతుంది. దానితోనే కాలంచేస్తావు - అన్నాడు.ఇలా నన్ను శపించి ఆ ఇద్దరూ చితిని పేర్చుకొని దివంగతులయ్యారు.


 కౌసల్యా! అదిగో ఆ శాపఫల-

అనుభవిస్తున్నాను. 

ఈ పుత్రశోకంతోనే నేను మరణిస్తాను. ఇదే నాకు చివరి రోజు. దేవీ! ఒక్కసారి నన్ను స్పృశించు - అంటూ దశరథుడు బోరున విలపించాడు......

**


దశరథుడు శాప వృత్తాంతాన్ని కౌసల్య తో చెప్పి బోరున విలపించాడు....


దేవీ! ఈ చివరి ఘడియల్లో నా రాముణ్ణి చూడలేకపోతున్నానే అనేది మరీ బాధగా ఉంది. అదే ప్రాణాలను పెకలించి వేస్తోంది. హా రామా! ఓ రాఘవా ! హా నాథా ! హా ప్రియపుత్రా! అని బిగ్గరగా అరుస్తూ రాముణ్ని ధ్యానిస్తూ కౌసల్యాసుమిత్రల

సన్నిధిలో దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. కౌసల్యా సుమిత్రలు మూర్ఛపోయారు.


అర్ధరాత్రి గడిచింది. తెల్లవారింది. వందిమాగధులు యథావిధిగా వచ్చారు. స్తోత్రపాఠాలూ చేసారు. మంగళవాద్యాలు మ్రోగాయి. కానీ దశరథుడు నిద్రలేవలేదు. తక్కిన అంతఃపురకాంతలు శంకిస్తూ లోపలికి వెళ్ళారు. మూర్ఛపోయిన కౌసల్యా సుమిత్రలనూ, ప్రాణాలు విడిచిపెట్టిన దశరథుణ్నీ చూసారు. ఒక్కపెట్టున రోదించారు. మూర్ఛదేరిన కౌసల్య, రాజు శిరస్సును ఒడిలో పెట్టుకుని కైకేయిని దారుణంగా తిట్టిపోసింది


వార్త నగరమంతటా గుప్పుమంది. చల్లారిన అగ్నిలాగా, ఇంకిపోయిన సముద్రంలాగా, కాంతిలేని సూర్యునిలాగా దశరథుడు పడివున్నాడు.


మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు,, గౌతముడు, జాబాలి - వీరంతా వసిష్ఠుని నాయకత్వంలో సమావేశమయ్యారు. దశరథుని పార్థివ దేహాన్ని తైల ద్రోణి లో భద్రపరచారు.


 భరతశత్రుఘ్నులు కేకయుని దగ్గర ఉన్నారు. రాజు మరణించాడు. అరాజకం వచ్చింది ఇది ప్రజలకు దేశానికీ క్షేమంకాదు. కాబట్టి తక్షణ కర్తవ్యం ఆలోచించమని అందరూ వసిష్టుణ్ణి ప్రార్ధించారు. జవనాశ్వాలపై వేగంగా వెళ్ళి రాగలిగిన దూతలను ఆహ్వానించాడు వసిష్ఠుడు


దూతలారా ! మీరు వెంటనే బయలుదేరి త్వరగా కేకయ రాజధాని చేరుకోండి. దు:ఖం ఏమా త్రమూ మీ ముఖాల్లో కనపడకూడదు సుమా. భరతుడితో నా మాటగా కుశలం అడగండి. తరవాత- అత్యవసర కార్యక్రమం ఉంది, వసిష్ఠులవారు నిన్ను వెంటనే రమ్మన్నారు, అని చెప్పండి. రామవనవాసం కానీ మహారాజు మరణం కానీ ఇవియేవీ అతడికి చెప్పవద్దు. విలువైన అభరణాలూ వస్రాలూ కేకయులకూ భరతుడికీ బహుమానాలుగా తీసుకువెళ్ళండి. త్వరగా తీసుకురండి.


వసిష్ఠుని ఆజ్ఞను శిరసావహించి ఆ దూతలు బయలుదేరారు. హస్తినా పట్టణం దగ్గర గంగను దాటి తూర్పుగా ప్రయాణించి

పాంచాలదేశాలనూ, కురుజాంగల భూముల్నీ, శరదండా నదినీ, బాహ్లీకదేశాన్నీ, సుదామ పర్వతాన్నీ, విపాశా శాల్మలీ గిరిప్రజాలనూ త్వరత్వరగా దాటి రాత్రికి కేకయ రాజధాని చేరుకున్నారు.


సరిగ్గా ఇదే సమయం లో భరతుడికి పీడకల వచ్చింది,అది  చెబుతుండగానే

భరతుడు ఇలా చెబుతుండగానే వసిష్ఠ దూతలు సభలోకి ప్రవేశించారు. రాజుకు పాదాభివందనం చేసారు. భరతుడితో మాట్లాడారు. కుశల ప్రశ్నలయ్యాయి. వసిష్ఠుడు చెప్పమన్న రెండు ముక్కలూ జాగ్రత్తగా యథాతథంగా చెప్పారు. బహుమతులు అందించారు. దశరథమహారాజు క్షేమమా అంటూ మొదలుపెట్టి భరతుడు కుశల ప్రశ్నల వర్షం కురిపించాడు.  మా తల్లి కైకేయికి కుశలమే కదా ! ఏమయినా నాకు చెప్పమన్నదా అనికూడా అడిగాడు.


భరతుడు కేకయ మహారాజు దగ్గర సెలవు తీసుకున్నాడు. నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరాడు. కేకయ మహారాజు విలువైన బహుమతులు ఇచ్చి గుర్రాలనూ, ఏనుగులనూ, రక్షణగా కొంతసైన్యాన్నీ ఏర్పాటుచేసి భరత శత్రుఘ్నులను సాగనంపాడు. మేనమామ యుధాజిత్తు దగ్గర సెలవు తీసుకొని ఇద్దరూ రథం ఎక్కారు. తూర్పు ద్వారంనుంచి రథం కదిలింది. వాయువేగంతో ప్రయాణం సాగింది. కేకయుడిచ్చిన ఏనుగులూ గుర్రాలూ సైన్యమూ వెనకబడ్డాయి. దగ్గిరదారిని ఏడురాత్రులు ప్రయాణించి అయోధ్య చేరుకున్నాడు. అల్లంతదూరంలో అయోధ్యను చూసాడు. వెలాతెలా పోతోంది. (పాండు మౌక్తికంలాగా ఉంది) మునుపటిలా కోలాహలం వినిపించడం లేదు. ఉద్యానాలు ఖాళీగా ఉన్నాయి. నగరంలాగా లేదు అరణ్యంలా భాసించింది. ఇదేమిటి సారథీ! అని భరతుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు,వీధులలో అలికిడిలేదు. నిర్మానుష్యంగా ఉన్నాయి. అపశకునాలు ఎదురవుతున్నాయి. రాజప్రాసాదం చేరుకున్నాడు. ద్వారపాలకులు లేచి నిలబడి జయం పలికారు లోపలికి రథం సాగింది. మనస్సు వికలమవుతోంది. రాజు మరణిస్తే రాజధాని ఎలా ఉంటుందో మునుపు విని ఉన్నాడు. ఇప్పుడు

అదే ఆకారం, అదే వాతావరణం కనపడుతోంది. సారథీ! ఏమిటి ఇదంతా? అన్నాడు,ఇలా అంటూనే రాజ భవనం చేరాడు .....

రామాయణానుభవం_ 32

 🌹రామాయణానుభవం_ 32


సీత రామ లక్ష్మణులు భారద్వాజాశ్రమం చేరుకొన్నారు. ఆర్ఘ్య పాద్యాలతో రామునికి స్వాగతం పలికాడు భరద్వాజ మహర్షి. వనవాసం గురించి ప్రస్తావించి ఇక్కడ ఉందా వచ్చు అని అనుమతి ఇచ్చాడు మహర్షి.అందుకు అంగీకరించ లేదు రాముడు .ఇక్కడికి దగ్గరగా జనపదాలు ఉన్నాయి మిమ్మల్ని దర్శించడానికి వస్తుంటారు కావున ఇబ్బందికరం.


అయితే నాయనా! ఇక్కడికి దశక్రోశ దూరంలో చిత్రకూట పర్వతం ఉంది. అది మీకు అనుకూలంగా సుఖప్రదంగా ఉంటుంది అక్కడా మహర్షులు

 ఎందరోముక్తిపాందారు. ఆ పర్వత శిఖరాలను చూస్తే చాలు మనస్సులు పవిత్రమైపోతాయి. పాపపుటాలోచనలే రావు,

అది మీ ఏకాంతవాసానికి తగినదని భావిస్తాను.


అంతలోకి సాయంకాలమయ్యింది. పుణ్యకథలతో చిత్రవిచిత్రమైన గాథలతో రాత్రి గడిచింది. కృతజ్ఞతలు తెలియపరచి భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకుని ముగ్గురూ చిత్రకూటానికి బయలుదేరారు. భరద్వాజుడు తండ్రిలా కొంతదూరం వెంట వచ్చాడు.


అనేక నదులు దాటుతూ నడుస్తూ భరధ్వజుడు చూపిన గుర్తులతో చిత్రకూట పర్వతం చేరారు ముగ్గురూ....మధ్యలో వల్మీకి మర్షి ఆశ్రమం దర్శనమ్ చేశారు.


వేగంగా నడిచి శిఖరం చేరుకున్నారు. నా మనస్సు పరవశించిపోతోంది - ఇక్కడే నివసిద్దామన్నాడు రాముడు. చేవగలిగిన గట్టి దూలాలు పట్టుకురా. నివాసం ఏర్పాటు చేసుకుందామన్నాడు పర్ణశాల తయారయ్యింది. లక్ష్మణుడు శ్రద్ధగా నిర్మించాడు.  


లేడి మాంసం పర్ణశాలకు బలిపూజ నిర్వహించాలన్నాడు రాముడు. లక్ష్మణుడు కృష్ణ మృగాన్ని సంహరించి తెచ్చాడు. రాముడు స్నానం చేసి వచ్చి శుచిగా అగ్నిలో హోమం చేసాడు. బలిపూజ నిర్వహించాడు. ముగ్గురూ పర్ణశాలలో ప్రవేశించారు. దేవతలు ఇంద్రసభలోకి  ప్రవేశించినట్టు ప్రవేశించారు. శుభసూచకంగా పక్షులు కిలకిలారావాలు చేసాయి. ప్రకృతి సౌందర్యానికి మైమరచి ఆ ముగ్గురూ అయోధ్యమాటనే మరచిపోయారు......


**

సీతారామలక్ష్మణులు గంగను దాటి దక్షిణ తీరం వెంట నడుచుకుంటూ అడవులలోకి వెళ్ళిపోయాక, సుమంత్రుడు ఇవతలి ఒడ్డున చాలా సేపు గుహునితో వారి కథలే చెప్పుకుంటూ నిలబడి నిలబడి, బరువెక్కిన మనస్సుతో మరింక అయోధ్యకు బయలుదేరాడు. గుహుడు శృంగిబేరపురంలో తన గృహానికి వెళ్ళిపోయాడు. మూడోరోజు సాయంకాలానికి సుమంత్రుడు అయోధ్య చేరుకున్నాడు.


పట్టణమంతా పాడుపడినట్టు (శూన్యామివ) నిశ్శబ్దంగా ఉంది. శోకాగ్నిలో దగ్ధమైపోయినట్టు ఉంది

రాముడు ఏడి, రాముడు ఏడీ అంటూ వందల వేలసంఖ్యలో ప్రజలు రథం వెంట పడ్డారు. గంగను దాటి వెళ్ళిపోయారని

చెప్పగానే అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు.


 కిటికీలలోనుంచి చూస్తున్న స్త్రీల ఏడుపులు సుమంత్రుడికి వినిపించాయి తలదించుకొని మౌనంగా రథం తోలుకుంటూ దశరథమందిరం చేరుకున్నాడు.


శోకాగ్నితో ప్రజ్వరిల్లుతున్నట్టున్న దశరథమందిరంలోకి అడుగుపెట్టాడు. ఎనిమిదవ కక్ష్యదాటాడు. దీనుడై కూర్చున్న దశరథుణ్ని చూసాడు. చేరువకు వెళ్ళి నమస్కరించాడు. రాముడు చెప్పమన్న మాటలు చెప్పాడు. నిర్వికారంగా దశరథుడు అంతావిని ఒక్కసారిగా మూర్ఛపోయాడు.


కాసేపటికి తేరుకొని దశరథుడు ఆత్రం గా అడిగాడు రాముడు ఏమన్నాడు,?లక్ష్మణుడు

ఏమన్నాడు?. సీత ఏమంది అని. ?సుమంత్రుడు యథాతథంగా విన్నవించాడు. సీతాదేవి మాత్రం ఏమీ మాట్లాడలేదనీ, బొమ్మలా నిలబడి కన్నీరు పెట్టుకుందనీ వివరించాడు. తిరిగి రావడానికి రథాశ్వాలుకూడా మొరాయించాయన్నాడు. కన్నీరు కార్చాయన్నాడు.


సుమిత్ర కూడా తీవ్ర దుఃఖం తో దశరథున్ని నిందాలాపనలు చేస్తోంది. 

మహారాజా! తండ్రివై యుండి కొడుకును చంపుకున్నావు. పధ్నాలుగేళ్ళ తరవాత తిరిగివచ్చినా నా రాముడు ఈ రాజ్యం ఏలుకుంటాడనుకున్నావా? ఏలుకోడు. పరుల తిండికి పులి ఆశపడదు. నా పుత్రుడు నరశార్దూలం. హవిస్సు, ఆజ్యం, పురోడాశం

దర్భలూ, యూపస్తంభాలు ఇవి ఎలాగయితే ఒక యజ్ఞానికి వాడినవి మరొక యజ్ఞానికి పనికిరావో అలాగే రాజ్యమూను. భరతుడు స్వీకరించాక మరి నా కుమారుడు ముట్టడు.


*గతిరేకా పతిర్నార్యాః ద్వితీయా గతిరాత్మజః* 

*తృతీయా జ్ఞాతయో రాజన్! చతుర్థీ నేహ విద్యతే*


వివాహితలకు భర్త మొదటి ఆధారం,పుత్రుడు రెండవ ఆధారం,జ్ఞాతులు మూడవ ఆధారం నాల్గవ ఆధారం లేనే లేదు.


ఈ దారుణమైన మాటలు గుండెల్లో పాడుచుకున్నాయి. దశరథుడు కుమిలిపోయాడు. తనలో తాను తర్కించుకున్నాడు.


కౌసల్యా! దయచేసి నన్ను క్షమించు. ఇదిగో నమస్కరిస్తున్నాను. నీది చాలా మృదుస్వభావం. ఇతరులను కూడా ఎప్పుడూ వాత్సల్యంతో చూస్తావు. దశరథుడు దీనుడై ఇలా ప్రార్థించే సరికి కౌసల్య కన్నులు వర్షించాయి.భర్త కాళ్ళ మీద పడి క్షమించమని ప్రార్థించింది.


*శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్|*

 *శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః*


పుత్రశోకం తట్టుకోలేక ఏదో మాట్లాడాను. శోకం అటువంటిది. అది ధైర్యాన్నీ జ్ఞానాన్నీ సమస్తాన్ని నాశనం చేస్తుంది. శోకమంతటి శత్రువు మరొకటి లేదు.

రామాయణానుభవం_ 31

 🌹రామాయణానుభవం_ 31


లక్ష్మణా ! సూర్యోదయమవుతోంది. రాత్రి గడిచిపోయింది. అదిగో విను. నల్లకోయిల కూస్తోంది. నెమళ్ళ కూతలు వినబడుతున్నాయి. సౌమ్యుడా! వేగంగా ప్రవహిస్తున్న ఈ గంగానదిని దాటుదామా!


సౌమిత్రి సూచనను అందుకుని గుహుడు క్షణంలో నావను సిద్ధం చేయించాడు. రామలక్ష్మణులు ధనుఃఖడ్గాలను

యథావిధిగా ధరించి సీతతో నావను చేరుకున్నారు.


నేను ఏమి చెయ్యను? - నమస్కరిస్తూ నిలబడి అడిగాడు సుమంత్రుడు. రాముడు తన కుడిచేతితో సుమంత్రుణ్ని స్పృశిస్తూ....


సుమంత్రా! నువ్వు శీఘ్రంగా వెనక్కి వెళ్ళు. అయోధ్య చేరుకో. రాజుగారి సన్నిధిలో అప్రమత్తుడుగా సేవచేస్తూ ఉండు రాజాజ్ఞగా ఇంతవరకూ చేయవలసింది చేశావు. ఇంక తిరిగి వెళ్ళు. రథం విడిచిపెట్టి మేము కాలినడకతో అరణ్యాలలోకి వెడతాం


రామా! నువ్వు అడవులపాలయ్యావంటే - బ్రహ్మచర్యం, వేదాధ్యయనం, ఋజుత్వం, మృదుత్వం ఇవన్నీ వ్యర్థాలని భావిస్తున్నాను. రామా! దురదృష్టమంటే మాది. రేపటినుంచి పాపాత్మురాలూ దు:ఖభాగినీ అయిన కైకేయికి వశులం కాబోతున్నాం మాటమాటకు కళ్ళు తుడుచుకుంటూ విలపిస్తున్నాడు సుమంత్రుడు. అతణ్ని ఓదార్చడానికి రాముడు మళ్ళీ మళ్ళీ

మధురంగా మాట్లాడాడు.


సుమంత్రా! ఇక్ష్వాకు వంశస్థులకు నీకంటే మిత్రుడులేడు. దశరథుడు నా విరహంతో దుఃఖించకుండా ఉండేట్టు చూడు ఆయన వృద్ధుడు. పైగా కామభారంతో ఉన్నాడు. అందుకని నీకు మరీమరీ చెబుతున్నాను. కైకేయికి ప్రియం చెయ్యడంకోసం మహారాజు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యండి. అన్నివేళల్లోనూ తమ మనోరథం నెరవేరడం కోసమే మహారాజులు రాజ్యాలను ఏలుతూ ఉంటారు. కాబట్టి ఆయన సంతోషించేట్టు ప్రవర్తించు. మహారాజుతో నా మాటగా ఇలా చెప్ప - అయోధ్యను విడిచిపెట్టామని గానీ, వనాల్లో నివసించవలసి వచ్చిందనిగానీ మా ముగ్గురిలో ఎవ్వరూ దుఃఖించడం లేదని చెప్పు. పధ్నాలుగేళ్ళు గడిచాక మళ్ళీ మమ్మల్ని చూసి సంతోషించవచ్చని చెప్పు. కౌసల్యాదేవికి మేము ముగ్గురూము పాదాభివందనాలు చేసామని విన్నవించు. 


భరతుణ్ని త్వరగా రప్పించమని మహారాజుకు చెప్పు. భరతుడు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాక నువ్వు ఈ దుఃఖాన్ని మరచిపోతావు. 

భరతుడితో ప్రత్యేకంగా చెప్పు - రాజుగారినే కాదు కౌసల్యనూ సుమిత్రనూకూడా కైకేయితో సమంగా జాగ్రత్తగా చూసుకోమను.


సుమంత్రుడు దీనంగా బహువిధాలుగా యాచిస్తున్నాడు. 


భృత్యులపట్ల దయ కలిగిన రాముడుమాత్రం చలించలేదు సుమంత్రా! నీ భక్తినీ వాత్సల్యాన్ని నేను ఎరుగుదును. అయినా ఎందుకు తిరిగి వెళ్ళమంటున్నానంటే - నిన్ను చూసి కైకేయి సంతోషిస్తుంది. రాముడు అడవులకే వెళ్ళిపోయాడులే అని విశ్వసిస్తుంది. మహారాజును అసత్యవాదిగా శంకించదు. భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి, కైకేయి కోరిక తీరాలి అనేది నా మొదటి సంకల్పం. అందుచేత నా ప్రియం కోసం, దశరథుడి ప్రియం కోసం నువ్వు రథంతో సహా అయోధ్యకు వెళ్ళు. ఎవరెవరికి ఏమేమి చెప్పమన్నానో ఆవన్నీ జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళి చెప్పు.


గుహుడా ! ఇలా జనస్థానాల్లో ఉండడం నాకు యోగ్యంకాదు. ఆశ్రమాలకు వెళ్ళిపోవడం నా కర్తవ్యం. జడలు కట్టుకుని వెళ్ళిపోతాం. మర్రిపాలు తెప్పించు

గుహుడు వెంటనే తెప్పించాడు. అవి ఇద్దరూ జుట్టుకు పట్టించుకుని జడలు కట్టించుకున్నారు. పూర్తిగా ఋషులైపోయారు రాముని ఆజ్ఞమేరకు లక్ష్మణుడు ముందుగా నావ ఎక్కాడు. సీతను ఎక్కించాడు. తరువాత రాముడు ఎక్కాడు. రాముని అనుమతితో గుహుని అజ్ఞతో నావికుడు  నావను కదిలించాడు. సుమంత్రునికీ సేనాసహితుడైన గుహునికీ రాముడు వీడ్కోలుపలికాడు.

**


గుహుడు తెప్పించిన నావలతో రాముడు సీత లక్ష్మణుడు నదీ మధ్యభాగానికి చేరుకొంది.భక్తి భావం తో సీతా దేవి గంగానదికి నమస్కరించింది.నీవు త్రిపథగవు. బ్రహ్మలోకం చూచినదానవు. సముద్రరాజుకు ఇల్లాలివి. నాభర్త క్షేమంగా తిరిగి వచ్చి రాజ్యం పొందేటు ఆశీర్వదించు. నీకు ప్రియంగా లక్షగోవులూ, అనేకవస్త్రాలూ బ్రాహ్మణులకు సమర్పిస్తాను. కల్లుకుండలతో మాంస భోజనాలతో నీకు సమర్పణ చేయిస్తాను. నిన్నేకాదు నీ తీరాలలో నివసించే సకల దేవతలను పూజిస్తాను.ముగ్గురూ అవాలిగట్టుకు చేరారు.


లక్ష్మణా! సజనమో విజనమో ఈ అరణ్యంలో రక్షణ బాధ్యతలు నువ్వే చేపట్టాలి. నువ్వు ముందు నడు. సీత నీ వెనక నడుస్తుంది. ఆ వెనక్కాల నిన్నూ సీతనూ కాపాడుతూ నేను నడుస్తాను. మనం పరస్పరం రక్షించుకోవాలి. ఇక ఇప్పటినుండి వనవాసక్లేశం ఏమిటో సీతకు తెలుస్తుంది. పల్లాలూ కనబడరు.క్షేత్రాలూ, ఆరామాలూ ఉండవు.


కొంత దూరం నడిచాక సాయత్రం అయింది సంధ్యావందనం చేసి ఆహారాన్ని స్వీకరించారు ముగ్గురు.


తమ్ముడూ ! మహారాజు ఈ పాటికి దుఃఖించి దుఃఖించి నిద్రపోయి ఉంటాడు. కోరిక తీరిందని కైకేయి సంతోషిస్తూ

ఉంటుంది భరతుడు వచ్చి ఉంటాడు. రాజ్యం కోసం కైకేయి మహారాజు ప్రాణాలను పీక్కుతినడం మానేసి ఉంటుంది. మహారాజు వృద్ధుడు. నేనుకూడా వచ్చేసా అనాథుడు. ఏమిచేస్తాడు పాపం. కామార్తుడై కైకేయికి వశుడైపోయాడు. మనకు కలిగిన ఈ కష్టాలూ, మహారాజుకు కలిగిన మతివిభ్రమముూ చూసాకనాకుకు అనిపిస్తోంది అర్ధధర్మాలకంటే కామమే గొప్పది అని. నాలాంటి అనుకూలుడైన కొడుకును దశరథుడు తప్ప మరింక ఏ తండ్రి అయినా, ఎంత తెలివి తక్కువవాడయినా వదులు కుంటాడంతావా?


*అర్థధర్మే పరిత్యజ్య యః కామ మనువర్తతే*

*ఏవ మాపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా*


అర్ధర్మాలను విడిచిపెట్టి కామాన్నే సేవించినవాడు దశరథుడిలా ఆపదలపాలు కాక తప్పదు.


లక్ష్మణా! నా కారణంగా సుమిత్రాదేవికి దుఃఖాలు కలగకుండుగాక! నువ్వు వెంటనే అయోధ్యకు వెళ్ళు. నేనొక్కణ్నే సీతతో దండకారణ్యాలకు వెడతాను. అయోధ్యలో నా తల్లికి కూడా నువ్వే దిక్కుగా ఉండు. కైకేయి క్షుద్రురాలు. ద్వేషంతో అన్యాయం చేస్తుంది. మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. ఎదిగి చేతికి అందివచ్చి సుఖపెట్టవలసిన సమయంలో విడిచి వచ్చేసాను నాలాంటి కొడుకును ఏతల్లీ కనకూడదు. మా అమ్మ దురదృష్టవంతురాలు. మళ్ళీ శోకసాగరంలోనే మునిగి పోయింది.


ఇలా రాముడు ఏవేవో మాట్లాడుతూ, ఆ రాత్రివేళ ఆ విజనారణ్యంలో దుఃఖిస్తూ ముఖమంతా కన్నీరు అలుముకొనగా కొంతసేపటికి విరమించి విశ్రమించాడు. చల్లారిన అగ్నిలా ఉన్నాడు. సద్దుమణిగిన సముద్రంలా ఉన్నాడు. లక్ష్మణుడు ఎంతగానో ఓదార్చాడు


పురుషోత్తమా! నిజమే. ఇవ్వేళ అయోధ్య వెలావెలాపోతూ ఉంటుంది. చంద్రుడు అస్తమించిన రాత్రిలా ఉంటుంది ఓ కానీ నువ్వు ఇలా దుఃఖించడం నిష్ప్రయోజనం. నన్నూ సీతనూ మరింత దుఃఖింపజేస్తున్నావు. మేము ఇద్దరం నిన్ను విడిచిపెట్టి క్షణకాలం కూడా జీవించం. ఒడ్డునపడిన చేపలం అయిపోతాం. తండ్రినిగానీ తల్లినిగానీ శత్రుఘ్నుణ్నిగానీ చూడాలనే కోరిక నాకు లేదు. నువ్వు లేనిదే స్వర్గమయినా నాకు అవసరం లేదు.


మెల్లగా తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. ముగ్గురూ అక్కడినుంచి బయలుదేరారు. గంగాయమునల

సంగమస్థలంవైపు నడకసాగించారు. ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ మధ్యాహ్నానికి ప్రయాగ చేరుకున్నారు. సమీపం లో భారద్వాజాశ్రమం....


[ *న చ సీతా త్వయా హీనా*

*నచాహ మపి రాఘవ ముహూర్త మపి జీవావో*

*జలా న్మత్స్యా వివో ధృతౌ* ||


శ్రీరామచంద్రా! నీవు లేనిదే సీతమ్మ బ్రతుకదు, నేను కూడ నీవు లేనిచో జీవించను, ఒకవేళ జీవించినచో నీటి నుండి ఒడ్డు పైకి తీయబడిన చేపలు వలె క్షణకాలము జీవింతుమేమో.


వాల్మీకి రచన లో అద్భుత శ్లోకం.పరమాత్మ పట్ల జీవుడు స్థితిని తెలిపే శ్లోకం గా పెద్దలు  విశేషం గా కొనియాడుతారు.]

కుంకుమ పువ్వు

 కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు . 


        కుంకుమ పువ్వుని సంస్కృతము నందు కాశ్మీరజము , కుంకుమము , బాహ్లీకము , శోణితము , సంకోచము , పీతనకము అనే పేర్లతో పిలుస్తారు . భావప్రకాశము అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథము నందు కుంకుమపువ్వు యొక్క నాణ్యత మరియు ఔషధగుణములు ఆయా దేశ వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది అని తెలియచేయబడినది. వానిలో కాశ్మీర దేశము నందు పుట్టెడు కుంకుమపువ్వు చిన్నచిన్న కేశరములు కలిగి కొంచం అంత ఎరుపురంగుతో కూడుకుని కమలం వంటి పరిమళము కలిగి ఉండును అనియు ఇదే అత్యంత శ్రేష్టం అని రాయబడినది.


           ద్రవ్యకోశము అనే వైద్యగ్రంధము నందు లేత ఎరుపురంగుతో , మంచి పరిమళముతో , చేతితో నలిపిన చేతికి అంటుకొని రంగువీడక యున్నచో అట్టి కుంకుమ పువ్వు శ్రేష్టం అయినది అనియు , బాగా ఎరుపు రంగుతో ఉండి నోటియందు వేసుకొనిన మిక్కిలి చేదుగా , పసుపుపచ్చ రంగుతో ఉన్నచో అట్టి కుంకుమపువ్వు తక్కువరకము అని తెలుసుకొనవలెను . 


                        కుంకుమపువ్వు సాధారణముగా కొంచం చేదు కలిగి ఉండి నాలుకకు తిమ్మిరి కలిగించునదిగా మెత్తగా ఉండును. ఇది జిగటగా ఉండును. కొంతమంది ఈ కుంకుమపువ్వుని చందనంతో అరగదీసి పైపూతగా వాడుదురు . మరికొంతమంది తాంబూలముతో లోపలికి సేవించెదరు. శరీరం నందు వేడిని పుట్టించి వీర్యవృద్ధిని , కాంతిని , బలము , ఆయుర్వృద్దిని కలిగించి విషము , శోష , మదప్రకోపము , నేత్రవ్యాదులు , శిరోవ్యాధులు , గొంతుజబ్బులు , శరీరము నందలి మచ్చలు , దురదలు , కుష్టు , చిడుము , గజ్జి మున్నగు చర్మరోగములు , రసదోషములు , మేధోరోగములు మొదలైనవానిని హరించును . రక్తశుద్ది కలిగించి శరీర దుర్బలత్వము హరించును . గడ్డలను కరిగించును . చర్మరోగములు మాన్పును . కస్తూరి వలే ఏ ఔషధమునకు అయినను అనుపానంగా ఇచ్చిన ఔషధం త్వరగా పనిచేయును . టైఫాయిడు జ్వరము , ఉన్మాదరోగము , అపస్మారము , ప్రసవించు సమయంలో సంభవించు వాతరోగములు , ఋతురక్తబద్ధం , సమస్త నేత్రరోగములు ( కంటి పైన పట్టు వేయవలెను ) , ఓడలలో ప్రయాణము చేయువారికి వచ్చు జబ్బులు , మనోచాంచల్యములు పోగొట్టును . 


  గమనిక - 


     మితిమీరిన మోతాదులో తీసుకున్నచో రక్తము విరిచి అమితమగు వేడి పుట్టించి దౌర్బల్యము కలిగించును. కొన్నిసార్లు స్త్రీల గర్భకోశము పాడుచేయును . కుంకుమపువ్వు పుచ్చుకోదగిన ప్రమాణము 5 మొదలు 15 గోధుమగింజల ఎత్తు మాత్రమే . 


          మరింత సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

గోవుతో వైద్యం .

 గోమాత గొప్పదనం  - గోవుతో వైద్యం .


    వేదకాలం నుంచి గోమాతకు ఈ భారతదేశం నందు ప్రత్యేక స్థానం కలదు. గోవు ని తల్లిలా భావించిన మన పూర్వికులు పూజించుట యే కాకుండా ఆవు కు సంబంధించిన వుత్పత్తులలోని గొప్పతనాన్ని తెలుసుకుని గ్రంధస్తం కూడా చేశారు అవి చాలా రహస్య యోగాలుగా ఉండిపోయాయి. కొన్ని పురాతన గ్రంథాల నుండి ఆ వివరాలు సేకరించాను అవి మీకు తెలియచేస్తాను .


 *  ఆవుపాలు   - 


               ఇవి మధురంగా సమ శీతోష్న్ం గా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి , దేహపుష్టి కలిగిస్తాయి . వీటిలో A B C D విటమిన్లు వున్నాయి. పగలంతా మనంచేసే శ్రమ హరించిపొయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపుట తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులని మళ్లి జీవింప చేసి ధీర్ఘాయిషుని అందించడంలో ఆవుపాలదే అగ్రస్థానం వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతల తత్వం వారు ఎక్కువుగా వాడవచ్చు.


 *  ఆవుపెరుగు  -  గర్భిణి స్త్రీకి వరం .  


             వెండి పాత్రలో తోడు బెట్టిన పెరుగు గర్భిణి స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవుపెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవుపెరుగు శ్రేష్టం అయినది.


 *  ఆవు వెన్న  - 


              ఇది చలువ చేస్తుంది శరీరంలోని వాత, పిత్త , కఫ దోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహరోగాలు , నేత్రవ్యాదులు పోగోడుతుంది . ముఖ్యంగా పిల్లలకు,వృద్దులకు ఆవువెన్న చాలా ఉపయోగపడుతుంది.


 *  ఆవునెయ్యి  - 


              ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ ధీర్ఘాయిషు ని ఇస్తుంది.ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది  సుఖవిరేచనం చేస్తుంది . ఉన్మాదం , పాండు రోగం , విషప్రయోగం , ఉదర శులలు ( కడుపు నొప్పి ) మొదలయిన వ్యాదులతో బాధపడే వారికి మంటల్లో కాలినవారికి , గాయాలు అయినవారికి మంచి పధ్యమైన ఆహారం గా ఆవునెయ్యి ఉపకరిస్తుంది. ఆవునేయ్యితో తలంటు కొని స్నానం చేస్తే తలకు, కళ్లకు అమితమైన చలువ చేస్తుంది .


 *  ఆవుపేడ  - 


              ఆవుపేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవుపాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృత పిండం బయటపడుతుంది.


 *  గుధస్తానంలో తిమ్మిరి కొరకు  - 


             ఆవుపేడ ని వేడిచేసి ఒక గుడ్డలో చుట్టి గుధస్థానం లో కాపడం పెరుగుతూ ఉంటే తిమ్మిరి వ్యాధి హరిస్తుంది .


 *   వంటి దురదలకు   - 


                అప్పుడే వేసిన ఆవుపేడతో వంటికి మర్దన చేసుకుంటూ ఉంటే ఒక గంట తరువాత వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి . 


 *   కడుపులోని క్రిములకు  - 


               20 గ్రా ఆవుపేడ పిడకల చూర్ణం 100 గ్రా మంచినీళ్ళలో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు అయిదారు రోజులలో పడిపోతాయి.


                  ఆవుపేడ లొ క్షయవ్యాధి క్రిములను చంపే శక్తి వుందని అందువల్ల కొంచం ఆవుపేడ ని మంచినీళ్ళతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ మలేరియా , కలరా వ్యాధులు హరించి పొతాయి. ఇదే విషయాన్ని ఇటలి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు .


 *   ఆవుముత్రం   - 


 

 *  ప్రతిరోజు వడకట్టిన గోముత్రాన్ని 25 గ్రా మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించి పొతాయి . 


 *  గో మూత్రంలో కొంచం కలకండ పొడి కలిపి కొంచం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రొజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం , కడుపునోప్పులు మొదలయిన వ్యాదులు అన్ని హరించి పొతాయి.


 *  వడకట్టిన గో మూత్రాన్ని 35 గ్రా మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగుతూ ఉంటే ఇరవయి నుంచి 40 రొజుల్లొ పాండు వ్యాధి హరించి పొతుంది.


 *  గో మూత్రాన్ని గోరువెచ్చగా వేడిచేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలొ చీము కారడం తగ్గిపొతుంది.


 *  ఇరవై గ్రాముల గో మూత్రం లొ పది గ్రాముల మంచి నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫిగా బయటకు వెళ్ళిపోతుంది.


 *  ప్రతిరోజు ఉదయమే గోమూత్రమును  30 గ్రా మోతాదులో  20 గ్రా పటికబెల్లం కలుపుకుని తాగుతూ ఉంటే మలబద్దకం హరించి పొతుంది.


  

         మీకు తెలిసినవారందరికి ఈ విషయం షేర్ చేయండి . మరిన్ని సులభయోగాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


      గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము  250 గ్రాములు .


      జీలకర్ర  250 గ్రాములు .


      ధనియాలు  250 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -


  పాటించవలసిన నియామాలు  -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి  -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.


        మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

వార్ధక్యం

 శ్లోకం:☝️

*అపర్యాప్తం హి బాలత్వం*

    *బలాత్పిబతి యవ్వనం |*

*యవ్వనం చ జరా పశ్చాత్*

    *పశ్య కర్కశతాం మిథః ||*

    - యోగ వాసిష్ఠం


భావం: జీవి బాల్యదశలో ఆటల మీద ఆసక్తితో వుండి, వాటి మీద ఆసక్తి ఇంకా తీరకుండా ఉన్న సమయంలోనే, యౌవనం వచ్చి మీదపడి బాల్యాన్ని మింగేస్తోంది. ఈ యౌవనంలో కామోపభోగాల ఆశ ఇంకా తీరకుండానే, వార్ధక్యం మీదపడి యౌవనాన్ని మింగేస్తోంది. చూశావా (వసిష్ఠ) మహర్షీ! ఈ బాల్య, యౌవన, వార్ధక్య దశలే ఒకదాని మీద ఒకటి ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నాయో ? ఆ తరువాత " *వార్ధకే వర్ధతే స్పృహా* " అని వార్ధక్యంలో అనుభవించే శక్తి ఉండదు కానీ కోరికలు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ వార్ధక్యం మోహాలకీ, శోకాలకీ, వియోగాలకీ, వివాదాలకీ, చింతలకూ, అవమానాలకూ ప్రముఖస్థానంగా ఉంటుందని శ్రీరాముడు నిర్ణయించాడు.🙏

మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. .

 తరతరాలుగా మనం  వింటున్న , క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. . 

1. సోమ వారం తలకు నూనె రాయరాదు.

2. ఒంటి కాలిపై నిలబడ రాదు

3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు

4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంప రాదు

5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలి

6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు

7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు

8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు, తల దువ్వ రాదు

9. పెరుగును ఉప్పును అప్పు ఈయరాదు

10. వేడి వేడి అన్నం లోనికి  పెరుగు వేసుకోరాదు

11. భోజనం మధ్యలో లేచి పోరాదు

12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు

13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు

14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు

15.  గోడలకు పాదం ఆనించి పడుకో రాదు

16. రాత్రీ  వేళలో బట్టలుతక రాదు

17. విరిగిన గాజులు వేసుకోరాదు

18. నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి

19. చేతి గోళ్ళను కొరకరాదు

20. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాడు

21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు

22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు

23. భోజనం తరువాత చేతిని ఎండ పెట్టవద్దు

24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు

25. ఇంటి గడపపై కూర్చోరాదు

26. తిన్న తక్షణమే పడుకోరాదు

27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు

28. చేతులు కడిగిన పిమ్మట ఝాడించ రాదు

29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి

30. ఎంగిలి చేతితో వడ్డించరాదు

31. అన్నం, కూర చారు వండిన పాత్రలలో తినరాదు

32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు

33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా  పంపరాదు

34. చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు

35. ఇంటి లోపలికి చెప్పులు Shoes దరించి రారాదు

36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే.

37. చిన్న జంతువులకు  (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి

38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించ రాదు

39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీపి పదార్థాలు తీసుకోవద్దు.

40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు

41. అనవసరంగా కొత్త చెప్పులను కోనరాదు

42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి

43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసివుంటే అవే వస్తాయి.

44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి

45. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి.

       

మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.


మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి.


కారు మేఘాలు కమ్ముతున్నాయి 

ఏక్షణంలో అయినా... 

వర్షం విపరీతంగా కురుస్తుంది...! 

వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !

అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !

      *అదీ..సంప్రదాయం!* 

             ....................


అంతర్జాతీయ ఖ్యాతినార్జించి

అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా 

పాఠాలు చెప్పిన పంతులుకు 

పాదాభివందనం చేస్తాడు…! 

        *అదీ .. సంస్కారం !* 

              .....................


ఖగోళ శాస్త్రాన్ని 

నమిలి మింగిన నిష్ణాతుడు.  

నిష్టగా ఉంటూ

గ్రహణం విడిస్తేగానీ... 

ఆహారం గ్రహించడు…! 

       *అదీ .. నమ్మకం  !* 🙏

             ....................


పరమాణు శాస్త్రాన్ని 

పిండి పిప్పిచేసిన పండితుడు. 

మనవడి పుట్టు వెంట్రుకలు 

పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…! 

        *అదీ .. ఆచారం !* 🙏

            ..............................


అంతరిక్ష విజ్ఞానాన్ని

అరచేతబట్టిన  అతిరధుడు. 

 అకుంఠిత నిష్ఠతో

పితృదేవతలకు 

పిండ ప్రదానం చేస్తాడు…!

 *అదీ .. సనాతన ధర్మం!* 

           ........................


అత్తింటికి వెళ్లేముందు 

ఇంటి ఆడబడుచు 

పెద్దలందరికీ 

పాదాభివందనం చేసి 

పయనమవుతుంది…! 

       *అదీ .. పద్ధతి !* 🙏

         ........................


పెద్ద చదువులు చదివినా 

పెద్ద కొలువు చేస్తున్నా 

పేరు ప్రఖ్యాతులున్నా 

పెళ్లి పీటలమీద .. వధువు

పొందికగా ఉంటుంది…!

     *అదీ .. సంస్కృతి!*🙏

       ...........................


సేకరించిన పోస్ట్..

మూడు

 🎻🌹🙏*మూడు ...మూడు ...మూడు ...*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿



💐 *మీ జీవితంలో ముఖ్యమైన ...*

*ఈ మూడు విషయాలలో జాగ్రతగా ఉండు !💐*


1. నిన్ను నీవు పొగడుకొనుట.

2. పరనింద.  3.పరుల దోషాలను ఎంచుట.


💐 *ఈ మూడింటిని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో!*💐


1. ఈశ్వర స్మరణ.  2.పరులను గౌరవించుట.

3.నీ లోని దోషాలను కనిపెట్టుట.


💐 *ఈ మూడింటిని ఆచరించు!*💐


1. సత్యము.  2.అహింస.  3. ప్రేమ తత్త్వము.


💐 *ఈ మూడింటికి దూరంగా ఉండు!*💐


1.ఇతరులగురించి చర్చ. 2.వాద వివాదాలు.

3.నాయకత్వం.


💐 *ఈ మూడింటి పట్ల దయతో ఉండు!*💐


1.అబల. 2. పిచ్చి వాడు. 3. దారి తప్పిన వాడు.


💐 *ఈ మూడింటి పట్ల దయతలచ వద్దు*💐


1. పాపము.  2. బద్దకము. 3. స్వేచ్చా ప్రవర్తన.


💐 *ఈ మూడింటిని  నీ వశము చేసుకో!*💐


1.మనసు. 2.కామేంద్రియము. 3.నాలుక.


💐 *ఈ మూడింటి పట్ల మమకారం కలిగి ఉండు!💐*


1.ఈశ్వరుడు. 2.సదాచారము. 3.పేదలు.


💐 *ఈ ముగ్గురి పట్ల వినయం కలిగి ఉండు!*💐


1.తల్లి.  2.తండ్రి. 3.గురువు 


💐 *ఈ మూడింటిని హృదయము యందు ఉంచుకో!💐*


1.దయ.  2.క్షమ. 3. వినయము.


💐 *ఈ మూడు వ్రతాలు పాటించు!*💐


1.పరస్త్రీని మోహించ కుండుట.

2.పర ధనము పట్ల ఆసక్తి లేకుండుట.

3. అసహయులకు సేవ చేయుట.


💐 *ఈ ముగ్గురిని పోషించడం నీ కర్తవ్యం!*💐


1. తల్లిదండ్రులు. 2.భార్య బిడ్డలు.

3.దుఖములో ఉన్నవారు.


💐 *ఈ ముగ్గురి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు!*💐


1.వితంతువు. 2.అనాధలు. 3.నిరాధారులు.


💐 *ఈ మూడింటిని లెక్క చేయవద్దు!*💐


1.ధర్మాన్ని పాటించే సమయంలో కలిగే కష్టాన్ని.

2.పరుల కష్టాన్ని తొలగించేటప్పుడు కలిగే ధన

నష్టాన్ని.

3.రోగికి సేవ చేయునప్పుడు శరీరానికి కలిగే కష్టాన్ని.


💐 *ఈ మూడింటిని మరిచిపో!*💐


1. నీవు ఇతరులకు చేసిన సాయం.

2. ఇతరులు నీకు చేసిన కీడు.

3.డబ్బు , గౌరవం , సాధనల వల్ల సమాజంలో

నీకు కలిగిన ఉన్నత స్థితి.


💐 *ఈ మూడు విధాలుగా మారకు!*💐


1. కృతఘ్నుడు  2. డాంబికుడు. 3. నాస్తికుడు...

🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

గోదానం

 సహస్ర గోదానం చేయుటలో ఉద్దేశ్యమేమిటి ?


ఉత్తరగోగ్రహణము తెలుసు మరి దక్షిణగోగ్రహణ మాటేమిటి ?

..........................................................

షోడశ (16) మహదానాలలో గోదానము ఎంతో విశిష్టమైంది. షోడశదానాలలో గోదానం ఎలా చేయాలో ఎందుకు చేయాలో తెలుసుకొందాము.


రైతు దేశానికి వెన్నెముకైతే, ఆ రైతుకు వెన్నెముక వంటిది గోవు. వ్యవసాయంలో గోసంపదలు లేకుండా పంటలు పండించడం దుస్సాధ్యం. గోసంపదలు ఇచ్చే పాలే లేకపోతే మనిషి దైనందిన మనుగడ ఎంత ధైన్యంగా వుంటుందో ఊహించుకోవచ్చును.

ఏ దేశములనైనా మనిషి మనుగడకు కారణమైతున్న గోవు హిందువులకు పవిత్రమైంది. నిజం చెప్పాలంటే సకల మానవాళికి కూడా ఆరాధ్యమనే చెప్పాలి.


వ్యవసాయాభివృద్ధికి పాడిని పెంపొందించడానికి గోవులు అత్యవసరము. అందుకే అప్పటి రాజులు చక్రవర్తులు భూస్వాములు,ధనవంతులు గోవులను  నిమ్నజాతివారికి, శూద్రలైనవారికి, బ్రాహ్మణులకు, రైతులకు దానంగా ఇచ్చేవారు.


గోదానాన్ని ఎలా చేయాలో  చూద్దాం.


ఒక ఎద్దును వేయిగోవులతో కలపాలి. ఆ వేయి గోవులలో శ్రేష్టమైన 10 ఆవులను ఎంచుకోవాలి. వాటిని మంచి వస్త్రాలతో అలంకరించాలి. కొమ్ములకు బంగారు కుప్పెలను తొడగాలి. కాలి గిట్టలను వెండి ఆభరణాలతో అలంకరించి చప్పరములోనికి తీసుకురావాలి. చప్పరమంటే రాతికూసాలను (స్తంభాల) నాలుగు ప్రక్కలాపాతి, పైన నలుచదరమైన కప్పులను (బండలను) పైకప్పులుగా వేయాలి. చప్పరమంటే శాశ్వతనిర్మాణము. బాటసారులు సేదతీరటానికి దారి కిరువైపులా, పుణ్యాత్ములైనవారు చప్పరాలను నిర్మించి చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారు.


అలాంటి చప్పరములో (సత్రము లేదా దద్దలము)  బంగారుతో చేసిన నందికేశ్వరుని నిలపాలి. దాత సర్వ ఔషధాలతో మిళితమైన నీటితో స్నానము చేసి, తడిబట్టలతో విడవకుండా, చేతులలో పూలను వుంచుకొని, గోమహత్మ్యమును స్మరిస్తూ నందికేశ సహిత దశ గోవులను పూజించాలి. నందికేశ్వరుడిని ధర్మదేవతగా పూజించాలి. అలా పూజించిన తరువాత ఆ పూజలను నిర్వహింపచేసిన గురువుకు రెండు ఆవులను నిమ్నులకు 2 ఆవులను, ఎద్దును, మిగిలినవాటిని రైతులకు, బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి.


మిగిలిన 990 గోవులను దేశములోని వ్యవసాయదారులకు, పాలుపెరుగులు వృద్ధిచేసే గొల్లలకు దానంగా ఇవ్వాలి. ఇలా దానంగా ఇవ్వడము వలన గోసంతతి వృద్ధి అవుతుంది. వ్యవసాయాన్ని పాడిని  అభివృద్ధిపథము

వైపు నడిపించడం జరుగుతుంది. దాత కూడా తనకు శివలోక సన్నిధి లభిస్తుందని భావిస్తాడు. గోసంతతి అభివృద్ధి కొరకు వృషభాన్ని దానంగా ఇస్తారు.


ఒకప్పుడు భారతదేశములో  రాజులు ప్రజలు తమకున్న సంపదలలో గోసంపదే గొప్పదని భావించేవారు. ఎంత గోసంపద వుంటే అంతగా ధనవంతులన్నమాట.


గతములో గోవులను  దొంగలించడము వాటిని సంతలలో రైతులకు అమ్ముకోవడము సర్వసామాన్యవిషయము. ఇప్పుడు కూడా వీధులలో నిర్భయంగా తిరుగుతున్న గోజాతిని  అపహరించి కొనుకొంటున్న సంగతి వార్తాపత్రికలలో చూశాము కదా !


పాండవుల అజ్ఞాతవాసాన్ని బట్టబయలు చేయాలన్న సంకల్పముతో దుర్యోధనుడు  రాజన్య, పరివారముతో ఆలోచించాడు. విరాటుని మత్స్య దేశము  సుఖశాంతులతో సుభిక్షంగా వుందని కనుక పాండవులు అక్కడే వుంటారని వారు అభిప్రాయపడ్డారు.


సుశర్మ అనే త్రిగర్తదేశపు రాజు అనేకసార్లు మత్స్యదేశముపై దండయాత్రచేసి కీచక విరాటుల చేతులలో పరాజితుడైనాడు. కీచకుడు గంధర్వుని చేతిలో హతమైనాడు, కనుక విరాటుని గోవులను సంగ్రహిస్తే విరాటుని రక్షించటానికి పాండవులు బయటకు వస్తారని  అప్పుడు వారి జాడను పసిగట్టి మరలా అరణ్యవాసానికి పంపవచ్చునని తెలియచేస్తాడు.


అతని ఆలోచనను  అంగీకరించిన దుర్యోధనుడు విరాటుని గోవులను గ్రహించాలని నిశ్చయించాడు. మొదటగా సుశర్మ దక్షిణదిశగా వెళ్ళి గోగ్రహణం చేస్తాడు. ఇది విన్న విరాటరాజు గోవులను  కాపాడటానికి బయలుదేరాడు.


విరాటుడు చారుల ద్వారా సుశర్మ గోగణాలతో ఎటు వెళుతున్నాడో తెలుసుకుని అటు వైపు తన సేనలను నడిపించాడు. విరాటుని తమ్ముళ్ళు శతానీకుడు, మదిరాశ్వుడు, సూర్యదత్తుడు తమతమ సేనలతో విరాటుని వెంబడించారు. విరాటుని కుమారుడు శంఖుడు కూడా తన శంఖాన్ని భయంకరంగా పూరిస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యాడు.


కంకుభట్టుగా వున్న ధర్మరాజు తన తమ్ములైన వలలుడు ( భీముడు), తామ్రగ్రంధి (నకులుడు), తంత్రీపాలుళ్ళను ( సహదేవుడు) విరాటరాజు వెంట పంపాడు. ఒకానొక సందర్భంలో విరాటుడు, సుశర్మ చేతిలో బంధీగా చిక్కుతాడు. అప్పుడు వలలుడు సుశర్మను ఓడించి బంధిగా చేస్తాడు. ధర్మజుని సోదరులు దక్షిణగోగ్రహాణాన్ని భగ్నము చేస్తారు.


విరాటుడు దక్షిణగోగ్రహణ రక్షణకై వెళ్ళినపుడు దుర్యోధన, దుశ్శాసన, భీష్మ, ద్రోణాదులు ఉత్తరగోగ్రహణం చేస్తారు. బృహన్నల రథసారధిగా ఉత్తరకుమారుడు యుద్ధానికి వెళ్ళడము ఆ తరువాత ఏమి జరిగిందో మనకు తెలుసు.


గోగ్రహణ కాలానికి ఆశ్వయుజ శుక్ల పక్ష అష్టమి తిథి నాటికే పాండవుల అజ్ఞాతవాసము ముగిసింది. ఈ సంగతి తెలుసుకోలేక సుయోధనుడు గోగ్రహణానికి పాల్పడ్డాడు.

............................................... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురము

రామలింగడి సమయస్ఫూర్తి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹


*🌷రామలింగడి సమయస్ఫూర్తి!🌷*                       

                🌷🌷🌷

తెనాలి రామలింగడంటే శ్రీకృష్ణదేవరాయలకు చాలా ఇష్టం.


ముఖ్యంగా ఆయన  హాస్య చతురత అంటే మరీనూ. ఎదుటి వారు ఎంతటి ఒత్తిడిలో ఉన్నా సరే... రామలింగడు ఇట్టే నవ్విస్తాడు. అదే సమయంలో కవ్విస్తాడు కూడా! ఎప్పుడన్నా సభకు తెనాలి రాకుంటే, ఆ రోజంతా ఏదో వెలితిగా ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ రోజు సభను తొందరగానే ముగించేవాడు.


ఇలా ఉండగా ఓ రోజు సభకు తెనాలి రామలింగడు దోషిగా వచ్చాడు. ఆయన మీద రాయలవారికి ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు చేసింది వేరెవరో కాదు.. రామలింగడి భార్యే! ఏదో విషయమై రామలింగడికి, ఆయన భార్యకు మధ్య మాటామాటా పెరిగి.. చివరికి కోపంతో ఆమె శ్రీకృష్ణదేవరాయల వారికి ఫిర్యాదు చేసింది.


ఈ ఫిర్యాదు స్వీకరించడం వ్యక్తిగతంగా రాయలవారికి ఇష్టంలేదు. అయినా రాజుగా తన విధి తాను నిర్వర్తించాలి కాబట్టి తప్పలేదు. అయిష్టంగానే శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామలింగడిని విచారణకు పిలిపించాడు.


ముందు తెనాలి రామలింగడి భార్య తన వాదనను వినిపించింది. అవన్నీ చిన్న చిన్న విషయాలే. పెద్దగా తప్పు పట్టడానికి కూడా లేదు. మొత్తం శాంతంగా విన్న రాయలవారు 'నువ్వు ఏమైనా చెప్పుకునేది ఉందా?' అని రామలింగడిని అడిగాడు.

'నా భార్య చెప్పేదంతా నిజం కాదు. నేను నా భార్యను చాలా అపురూపంగా చూసుకుంటాను. తనంటే నాకు చాలా ఇష్టం. మా ఇంటిపేరులోనే మా వంశం వారికి భార్యంటే ఎంత ఇష్టమో ఉంటుంది' అన్నాడు తెనాలి రామలింగడు. రాయలవారు, సభలో ఉన్నవారు, ఆఖరుకు తెనాలి రామలింగడి భార్య కూడా విస్మయానికి గురయ్యారు.


'అదెలాగో చెప్పగలవా?' అని రాజు మరో ప్రశ్న సంధించాడు. 'తప్పకుండా ప్రభూ..! నా భార్య తేనెలా స్వచ్ఛమైనది, మధురమైనది, శ్రేష్ఠమైనది అనే అర్థం వచ్చేలా మా ఇంటి పేరు తేనె ఆలి. అంటే తేనె వంటి భార్యను కలిగి ఉన్నా అని అర్థం. అదే రానురానూ తెనాలిగా మారింది' అని చెప్పాడు.


ఇది విన్న వెంటనే అప్పటి వరకు కోపంగా ఉన్న తెనాలి రామలింగడి భార్య ముఖంలో చిరునవ్వు, సిగ్గు ప్రత్యక్షమయ్యాయి. ఆమె ముసిముసిగా నవ్వుతూ.. 'మహారాజా! మన్నించండి. నేను నా ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నా' అంది.

సమస్య ఇంత సులువుగా పరిష్కారం కావడంతో శ్రీకృష్ణదేవరాయలు వారిద్దరికీ కానుకలు ఇచ్చి పంపించారు.


ఇంతలో రాయలవారికి ఓ అనుమానం వచ్చింది. మరుసటి రోజు ఉదయం నడకలో.. 'అవును తెనాలి రామలింగా! నీకు అంత లౌక్యం, సమయస్ఫూర్తి ఉన్నాయి కదా... మీ దంపతుల సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చుగా... నా వరకు ఎందుకు తెచ్చినట్లు' అని అడిగాడు.


'మహారాజా! భార్యభర్తల గొడవలు తాటాకు మంటల్లాంటివి. అంతెత్తున ఎగసి, చప్పున చల్లారతాయి. చిన్న చిన్న విషయాలకే ఫిర్యాదుల వరకు వెళ్లొద్దు అని లోకానికి చాటిచెప్పడం కోసమే... సమస్యను మీ వరకు రానిచ్చాను. మన్నించండి' అన్నాడు రామలింగడు. తెనాలి తెలివిని మరోసారి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శ్రీకృష్ణదేవరాయలు.

ఏంటండీ ఈ డిమాండ్స్



*ఏంటండీ ఈ డిమాండ్స్❓🤔*

_అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం కష్టమై పోతున్నందుకేగా..._


ఇద్దరి మధ్య సంభాషణ ఓసారి చదవండి.😊

వారిరువురి పేర్లు X, Y అనుకుందాం...

📲ఫోన్లో


X : సార్ ఇది Y గారి ఇల్లేనా?

Y : అవును మీరు....?

X : మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడాలి.

Y : ముందు మా కండిషన్స్ విన్నాక మాట్లాడండి.

X : అది కాదు సర్, మీ అమ్మాయి పెళ్లి?

Y : ఏదైనా సరే ముందు మా కండిషన్స్ విన్నాకే పెళ్లి గురించి మాట్లాడండి.

X : ఏం కండిషన్స్ సర్?

Y : మా అమ్మాయికి 654321 ఉన్న వరుడే కావాలి.

X : అంటే ఏంటి సర్?

Y : 6 అంకెల జీతం... అంటే లక్ష జీతం అయినా ఉండాలి.

    5 లక్షల కారు ఉండాలి, అది కూడా అబ్బాయి పేరుమీదే ఉండాలి.

    4 లక్షలు విలువ చేసే బంగారం అమ్మాయికి వెయ్యాలి.

3 బెడ్ రూములు కలిగిన ఇల్లు ఉండాలి, అది కూడా అబ్బాయి పేరుమీదే ఉండాలి.

2 ట్రిప్పులు అయినా నెలకు బయట తిప్పాలి. 

1 ఒక్కడే కొడుకు అయ్యుండాలి.

X : 🤔🤔🤔🤔🤔

Y : ఇంతే కాదు

అబ్బాయి తల్లితండ్రులు పెళ్లవగానే విడిపోవాలి,

అమ్మాయికి వంట రాదు.. అయినా మీరు అడగకూడదు,

అమ్మాయి ఆలస్యంగా నిద్రలేస్తుంది, 

ఆదివారాలైతే ఇంకా ఆలస్యం.

అవన్నీ మీరు పట్టించుకోకూడదు.

ఇక ఇల్లు & కారు డాక్యుమెంట్స్ మాకు చూపించాలి.

ఆఫీస్ సంబంధిత శాలరీ సర్టిఫికెట్ తీసుకురావాలి.


మా అమ్మాయిని మేము చాలా గారాభంగా పెంచాము,

తను ఇబ్బంది పడకూడదు కదా! అందుకే ఇన్ని జాగ్రత్తలు.

ఇవన్నీ మీకు నచ్చాక అప్పుడు మా అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడుదాం.  ఏమంటారు మీరు? 

X : నేను ఏమనాలి సర్???

Y : నువ్వే కదయ్యా మా అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడాలన్నావు!

X : సర్, నేను పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.

మీ అమ్మాయి మీ వీధిలో ఓ స్కూటర్ గారేజ్ లోని అబ్బాయిని ప్రేమించి 

ఈ రోజు ఉదయం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పెళ్లి చేసుకుందట.!

మీరు ఒప్పుకోరని,

వారిని విడదీస్తారని

ఆమె ఇప్పుడు మేజర్ అని మిమ్మల్ని ఒప్పించమని మా స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

అందుకే మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడాలన్నాను.

వచ్చి మాట్లాడండి అని ఫోన్ పెట్టేశాడు.

Y : 😭😭😭😭😭😭


_ఎవరినీ బాధ పెట్టాలని, చులకన చేయాలని కాదండీ._

_అమ్మాయిలకు, అబ్బాయిలిద్దరికి విలువలను నేర్పించి ప్రేమను పంచి పెంచడం లేదండీ..._

_వారు అడగగానే... లేదనకుండా కొనిపెట్టి వాటి విలువలను తెలియకుండా చేసేస్తున్నారు._

_బంధాలతో కలిసి ప్రేమ విలువ నేర్పించడం లేదు._

_ఇకనైనా ఆలోచించండి._

వివిధ కావ్యాల్లో పేర్కొన్న వంటకాల జాబిత

 సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో శ్రీనాథుడు  వివిధ కావ్యాల్లో పేర్కొన్న వంటకాల జాబితా ఆరుద్ర యిస్తే, అది ఆరు పేజీలొచ్చింది. వాటిలో  పేర్లు కొత్తగా, ఆసక్తికరంగా వున్నవి కొన్ని.


1. ఒలుపు పప్పు 

2. మంచున బిసికిన పంచదారలు

3. బేసము

4.బిడము

5. తోరుండలు

6. పండ్యారము    

7.పూరగము

8. కమ్మని తాలింపు సొజ్జెపిండి

9.తింత్రిణీ కరసోపదేహ దుర్ధురములు

10.జంభీరరసం 

11.తాటిపండు

12.ఇప్పట్లు 

13.గొల్లెడలు

14.అంగారపొలియలు 

15. సారసత్తలు

16.బొత్తరలు

17. మణుగు బూవులు

18.మోరుండలు

19.బిసకిసలయములవరుగులు

20.ఉక్కెర

21.బలుపలు

22.ఇలిమిడి


పై వంటకాలను ఎవరైనా ఎప్పుడైనా విన్నారా.


పై పిండివంటల గురించి నేను విన్నది ఇదిగో. 


1. ఒలుపుపప్పులు


ఒలుపు పప్పులంటే మామూలుగా పొట్టుతీసిన పప్పులైతే వాటిని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన పని లేదు గదా! ఒలుపుపప్పులంటే nuts అయిండొచ్చని నా ఉద్దేశం. ఆ రోజుల్లో ఏ యే నట్స్ లభించేవో తెలీదు. బహుశా ఒల్చిన గుమ్మడిగింజలు, చారపప్పు, బాదం, వేరుసెనగపప్పు లాంటివి అయివుండొచ్ఛు.


2. మంచున పిసికిన పంచదార


ఇది బహుశా ice cream అయి వుండొచ్చు. అంటే పాలు లేకుండా వట్టి రంగువేసిన ఐస్ క్రీం అన్నమాట. పల్లెటూర్లలో పెరిగిన వారికి తెలిసి వుండొచ్చు. విందు అయి చేతులు కడుక్కున్నాక, తాంబూలానికి ముందు యిది యిచ్చేవారేమో!


3. బేసము‌ 


బేసము అంటే బ్రౌను దొర గారు sap  అనే అర్థం యిచ్చాడు. చిన్నప్పుడు యిప్పటిలా అన్నం బిరుసుగా ఉండి మునివేళ్ళతో కలిపేవాళ్ళం కాదు. శుభ్రంగా అరిచెయ్యి తగలేట్లు ముద్దచేసి తినేవాళ్ళం. అప్పుడు గుజ్జువంటిది ఒక పల్ఛటిపొరగా అరిచేతికి అంటుకుని వుండేది. దాన్ని కంచం అంచు మీద గీస్తే వచ్చేదాన్ని 'బేసం' అనేవాళ్ళు. 

మరి, విందుల్లో పెట్టే బేసం ఏంటో! బేసన్ అంటే మన ఇతర భారత భాషలలో సెనగపిండి.  బేసిన్ లడ్డూ పేరిట తెలుగు వాళ్ళూ ఒక పిండివంట చేస్తారు. అలాంటి దేదైనా కావచ్చునేమో మరి.


4.బిడము 


ఇది అట్టుప్పు, a cake of salt, అయిండొచ్చు. ఇప్పుడు స్వగృహా షాపుల్లో అమ్మే 'చెక్కలు' లాంటివి కావచ్చును.


5. తోరుండలు


తెలియదు. ఇదేదో కొత్తగా ఉంది. 


6.పణ్యారము. 


రాయలసీమ వాళ్ళు  'పొంగణాలు', కోస్తా ప్రాంతం వాళ్ళు ' పులిబొంగరాలు' అనే యీ snack ని తమిళులు 'పణ్యారం' అంటారు. శ్రీనాథుడి కాలంలో ఆ పదం తెలుగువాళ్ళు గూడా వాడేవారేమో!


7. పూరగము. తెలియదు. 


8. కమ్మని తాలింపు సొజ్జెపిండి


రవ్వని రాయలసీమలో ' సొజ్జె' అంటారు. ( హిందీ ' సూజీ'). కనుక  'కమ్మని తాలింపు సొజ్జెపిండి' అంటే ఉప్మా అన్నమాట. దీని మరాఠీ counterpart సాంజా.


9.తింత్రిణీక రసోపదేహ దుర్ధురములు


అయ్య బాబోయ్! ఇది తినడం మాట దేవుడెరుగు! బంతిలో కూర్చున్నవాడు యిది కావాలని అడిగేసరికి వడ్డించేవాడు చివరికి వెళ్ళిపోయి వుంటాడు. ఇది పేరులా లేదు

పేరాగ్రాఫులా వుంది. ఏ పులిహోరకో ('తింత్రిణీక రసం' అంటే చింతపండురసం అనే ఒక్కమాట అర్థమయింది లెండి) description లా వుంది.


10. జంబీరరసం


జంబీరం అంటే నిమ్మ. జంబీరరసం అంటే నిమ్మషర్బత్. Welcome drink అయివుంటుంది


11.తాటిపండు


నిజంగా తాటిపండో, లేక ఆ పేరు గల ఏదైనా స్వీటో! నిజంగా తాటిపండైతే శిష్టులకు నిషిద్ధం మరి!!


12.ఇప్పట్లు


 గిరినులు ఇప్పపువ్వుల్ని పిండిలో కలిపి రొట్టెలు చేసుకుంటారట.అవే ఇప్పట్లు కావచ్చు. ఇప్పపూలు   శిష్టులకీ నిషిద్ధం  కాదను కుంటాను.


13. గొల్లెడలు - తెలియదు


14. అంగారపొలియలు


అంగార దొల్లెలు అంటే fried wheat cakes అన్నారు బ్రౌను దొర గారు. అవే యివేమో! 'అంగార' అని ఉంది కనుక నిప్పులమీద కాల్చిన పుల్కాలేమో!


15.సారసత్తలు 


సారసత్తలు అంటే ఉప్పువేసి బియ్యం పిండిని బాగా ఉడికించి, ఉండలుగా చేసి వాటిని ఇడ్లీకుక్కర్లో ఆవిరికి పెట్టి బైటికి తీసి చక్కిలాల్లా ఒత్తుకోవచ్చు.  లేక పోతే పాకంలో వేసుకుని తియ్యగానూ తినొచ్చు. ఇవేనేమో. 


16.బొత్తరలు - తెలీదు


17. మణుగుపూవులు - జంతికలు


18.మోరుండలు


గారెలపిండిని ఉండలుగా చేసి కాల్చి మజ్జిగపులుసులో వేస్తే అవి మోరుండలని  విన్నాను.


19. బిసకిసలయమ్ముల వరుగులు


అన్ని కూరలూ అన్ని seasons లో దొరకవు. అందుకని వాటిని ఉప్పులో నానేసి ఎండబెట్టి అవి దొరకని season లో వేయించుకుని తింటారు. వాటిని ' 'వరుగులు' అంటారు. 'బిసము' అంటే తామర. తామర తూడులు తింటారట. ఆ తామర తూడుల వరుగులే 

'బిసకిసలయమ్ములవరుగులు  


20.ఉక్కెర


చిన్నప్పుడు బియ్యప్పిండిలో పంచదార వేసి ఉడికించి పిల్లలకి పెట్టేవారు. అంటే అది ఆనాటి farex అన్నమాట. దాన్ని 'ఉక్కెర' అనేవారు. పెద్దవాళ్ళ విందుల్లో ఉక్కెర అంటే ఏ హల్వా వంటిదో అయి వుండొచ్చు


21 బలుపలు. -. తెలియదు

22. ఇలిమిడి - తెలియదు. చలిమిడి కావొచ్చేమో


ఇందులో కొన్ని snacks  లా వున్నాయి. కొన్ని breakfast items గూడా(ఇడ్లీ, దోసె లాంటివి) వున్నాయి. అవన్నీ భోజనంలో ఎలా తింటారు అని మనకి అనుమానం రావచ్చు. వాళ్ళు ప్రాతస్సంధ్య, మధ్యాహ్నసంధ్యా అయ్యాక ఏకంగా భోంచేసేవారనుకుంటా. అందుకే అన్నీ అన్నంలోనే!

 

మన తెలుగులో ' నిఘంటు కమిటీ' వంటిదేమైనా వుంటే వాళ్ళు పూనుకుని యీ వివరాలు నిఘంటువుల్లోకి ఎక్కిస్తే మన పూర్వులు ఏం తినేవారో తెలుస్తుంది.వారు ఎంత నాగరికంగా బ్రతికారో అర్థమౌతుంది.


సేకరణ