8, మే 2022, ఆదివారం

కపిలుడి తత్త్వబోధ

 🙏🌹జయ గురు దత్త🌹🙏

🙏🌹శ్రీ మాత్రే నమః🌹🙏



🙏తల్లికి కపిలుడి తత్త్వబోధ🙏


ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. 

భర్త సన్యసించి మోక్షగామియై

తపోవనాలకి వెళ్ళిపోయాడు. 

ఇక నా గతి ఏమిటి?’ 

అని చింతించిన 

దేవహూతి ఒకనాడు. 


ధ్యాననిష్ఠుడై వున్న 

కపిల మహర్షిని సమీపించింది. 

తల్లి రాకలోని 

ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు 

ప్రసన్న మందహాసం చేసి

”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న 

సంక్షోభాన్ని గుర్తించాను. 

స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. 

కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని

భర్తగా పొంది లోటులేని

సంసారజీవనం సాగించావు. 

పదిమంది సంతానానికి జన్మనిచ్చి

మాతృమూర్తిగా, గృహిణిగా

గృహధర్మాన్ని నిర్వర్తించావు. 

నీలాంటి ఉత్తమ జన్మ 

అనునది కోటికి ఒక్కరికి వస్తుంది.

‘లేదూ…’ అన్నది లేకుండా 

చక్కటి జీవితాన్ని గడిపిన నీకు

యీ దిగులు దేనికమ్మా?” 

అని అడిగాడు.


”నాయనా… నువ్వన్నది నిజమే.

నా తండ్రి స్వాయంభువ మనువు

అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. 

ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో 

నా బాల్య జీవితం గడిచింది.

అటుపై గృహస్థాశ్రమంలో 

నా భర్త చాటున ఏ కొరతా లేకుండా 

నా వైవాహిక జీవితం గడిచింది. 

తొమ్మిది మంది ఆడపిల్లలకి, 

ఒక సుపుత్రుడికి తల్లినైనందున

నా గృహస్థజీవితం కూడా

సంతృప్తిగా గడిచింది. 

నా అంతటి భాగ్యశాలి 

లేదనుకొని సంతోషిచాను. 


కానీ, నాయనా… 

నాకు వివాహం చేసి 

తన బాధ్యత తీరిందనుకున్నాడు 

నా తండ్రి. 

నన్ను సంతానవతిని చేసి,

వారి వివాహాలు చేసి 

తన బాధ్యత తీరిందని

తపోవనాలకి వెళ్ళిపోయాడు 

నా భర్త. 

వివాహాలుకాగానే భర్తలవెంట నడిచి 

తమ బాధ్యత తీర్చుకున్నారు. 

నా కూతుళ్ళు… ఒక్కగానొక్కడివి, 

దైవాంశ సంభూతడివైన 

నీ పంచన నా శేషజీవితం గడపవచ్చనుకుంటే …

నువ్వు పుడుతూనే యోగివై,

విరాగివై, అవతార పురుషుడివై,

సాంఖ్యయోగ ప్రబోధకుడివై 

నా ఆశల మీద నీళ్ళు చల్లావు. 

నా తండ్రి, నా భర్త, 

కుమార్తెలు, కుమారుడు… 

ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకొని

నన్ను ఒంటరిదాన్ని చేశారు.

నన్ను కన్నందుకు నాతల్లిదండ్రులకి 

కన్యాదాన ఫలం దక్కింది. 

నన్ను వివాహమాడినందుకు 

నా భర్తకి గృహస్థాశ్రమ ధర్మఫలం, 

కన్యాదానఫలం దక్కింది. 

వివాహాలైన నా కూతుళ్ళకీ,

కుమారుడివైన నీకూ

పితృఋణఫలం దక్కుతుంది. 

ఏ ఫలం, ఫలితం ఆశించకుండా 

బాల్య, యవ్వన, కౌమార దశలు

గడిపి మీ అందరికీ సేవలు చేసిన

నాకు దక్కినఫలం ఏమిటి నాయనా? 

ఇక ముందు నా గతి ఏమిటి?”

అని వాపోయింది 

దేవహూతి గద్గద స్వరంతో.


కపిలుడు మందహాసం చేసి

”అమ్మా! నువ్వేదో భ్రాంతిలో

యిలా మాట్లాడుతున్నావు.

ఇలాంటి భ్రాంతికి కారణం

నిరాహారం కావచ్చు. 

నువ్వు ఆహారం తీసుకుంటే

ఉపశమనం లభిస్తుంది కదమ్మా”

అన్నాడు కపిలుడు. 


దేవహూతి విస్మయంగా

కుమారుడి వైపు చూచి

"నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? 

నీ మాట కాదనలేక

నాలుగు కదళీఫలాలు

భుజించాను కదయ్యా” అంది.


”అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా?” 

ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. 


దేవహూతి మరింత విస్తుబోతూ

”అదేమిటయ్యా … 

మన ఆశ్రమంలో రకరకాల

ఫలవృక్షాలను నాటాము. 

వాటికి కాసిన పళ్లని ఆరగిస్తున్నాము. 

ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో

కాసే పళ్ళు ఆ ఋతువులో

పండుతున్నాయి కదయ్యా” అంది. 


కపిలుడు తలపంకించి 

”ఓహో… ఋతుధర్మమా?” అన్నాడు. 


‘అవునన్నట్లు’ తలవూపింది దేవహూతి. 


కపిలుడు 

తల్లి కళ్ళలోకి చూస్తూ 

”ఋతుధర్మం అంటే…?” అనడిగాడు. 


ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది

దేవహూతి.


”అమ్మా… 

ఋతువుకొక ధర్మం వుంది. 

అది ఏ కాలంలో ఏవి ఫలించాలో

వాటిని ఫలింపజేస్తుంది. 

అలా ఒక్కొక్క ఋతువులో

అందుకు తగ్గ ఆహారాన్ని 

మనకి ప్రసాదిస్తున్న ఋతువు

తన ధర్మానికి ప్రతిఫలంగా

మననించి ఏమాశిస్తోంది? 

కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం?” 

అని ప్రశ్నించాడు కపిలుడు. 


ఆ ప్రశ్నలకి తెల్లబోతూ 

”ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? 

ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయడం 

ఋతుధర్మం కదా?” 

అని ఎదురు ప్రశ్నించింది.


కపిలుడు మందహాసం చేసి

"అంటే, ఋతువు 

ఎలాంటి ఫలం, 

కృతజ్ఞత ఆశించకుండా తన

ధర్మాన్ని నెరవేరుస్తోందన్న మాట!

మరి, అరటి సంగతేమిటి?

అరటిచెట్టు కాయలిస్తోంది. 

పళ్లు యిస్తోంది. 

అరటి ఊచ యిస్తోంది. 

ఈ మూడూ మనకి ఆహారంగా

ఉపయోగపడుతున్నాయి. 

అలాగే అరటి ఆకులు మనకి

ఆరోగ్యానిస్తున్నాయి. 

శుభ కార్యాల సందర్భాల్లో 

అరటి పిలకలు తెచ్చి 

ద్వారాల ముందు నిలుపుతున్నాం. 

ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న 

అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? 

దాని ఆకులు నరుకుతున్నాం. 

కాయలు నరుకుతున్నాం. 

అరటిబోదె నరుకుతున్నాం. 

చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం.

మనం ఇన్ని విధాలుగా హింసించి

కృతఘ్నులం అవుతున్నా

అరటిచెట్టు తన ధర్మాన్ని 

తాను నెరవేరుస్తుంది… 

మననించి ప్రతిఫలం, కృతజ్ఞత

ఆశించకుండా ఋతువులు, 

చెట్లు వాటి ధర్మాన్ని అవి

నెరవేరుస్తున్నాయి. 

మరి, ఇన్నింటి మీద ఆధారపడిన 

యీ దేహం తన ‘దేహధర్మం’ నిర్వర్తిస్తోందనీ, 

ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం 

ఆశపడేది కాదని గ్రహించలేవా 

తల్లీ…” 

అని ప్రశ్నించాడు కపిలుడు సూటిగా.


నిశ్చేష్ఠురాలైంది దేవహూతి. 


కపిలుడు మందహాసం చేసి "అమ్మా… 

నువ్వు బాల్య, యవ్వన, కౌమార

దశలు గడిపి సేవలు చేశానన్నావు. 

‘నువ్వు’ అంటే ఎవరు? 

ఈ నీ దేహమా? 

దేహం ఎప్పటికైనా

పతనమైపోయేదే కదా!

నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు? 

ఒక శరీరాన్ని నీ ‘తండ్రి’ అన్నావు. 

మరొక శరీరాన్ని నీ ‘భర్త’ అన్నావు. 

మరికొన్ని దేహాలని ‘సంతానం’ అన్నావు. 

ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? 

లేదే! నీ తల్లి, తండ్రి అనే దేహాలని 

ఎవరు నిర్మించారో నీకుతెలియదు. 

నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో 

నీకు తెలియదు. 

నీ ఈ దేహం ఎలా తయారైందో, 

నీ సంతానంగా చెప్పుకుంటున్న 

ఆ దేహాలు నీ గర్భవాసంలో

ఎవరు తయారుచేశారో 

నీకు తెలియదు. 

నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు 

నీది కాని పరాయి దేహాలపై

వ్యామోహం ఎందుకమ్మా?” 

అని అన్నాడు. 


దేవహూతి నిర్విణ్ణురాలైంది. 


కపిలుడు మందహాసం చేసి ఆమెకు...

సాంఖ్యయోగమును ఉపదేశించసాగాడు.


”అమ్మా… మనస్సు అనేది 

బంధ – మోక్షములకు కారణం. 

ప్రకృతి పురుష సంయోగం చేత 

సృష్టి జరుగుతుంది. 

ఆ పురుషుడే ప్రకృతిమాయలో పడి 

కర్మపాశం తగుల్కొని దుఃఖ భాజనుడవుతాడు. 

నేను, నాది, నావాళ్ళు 

అన్న ఆశాపాశంలో చిక్కుకొని

జనన మరణ చక్రంలోపడి

అలమటిస్తూ అనేక జన్మలెత్తుతాడు. 

జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు.

ఏ జన్మకి ఆ జన్మలో 

‘ఇది నాది, ఈ దేహం నాది, 

నేను, నా వాళ్ళు’ 

అన్న భ్రమలో 

మునిగివుంటాడే గాని, 

నిజానికి ఏ జన్మా, 

ఏ దేహం శాశ్వతం కాదు. 

తనది కాదు. 

దేహంలోని జీవుడు

బయల్వెడలినప్పుడు,

మృత్యువు సంభవించినప్పుడు 

ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. 

ఇంక, ‘నా వాళ్ళు’ అనుకునే 

దేహాలు ఎందుకు అనుసరిస్తాయి?

దేహ త్యాగంతోటే 

దేహం ద్వారా ఏర్పడ్డ

కర్మబంధాలన్నీ తెగిపోతాయి. 

ఆఖరికి ఆ దేహంతోటి

అనుబంధం కూడా తెగిపోతుంది. 

ఇలా తెగిపోయే దేహబంధాన్ని,

నశించిపోయే దేహ సంబంధాన్ని

శాశ్వతం అనుకుని దానిపై

వ్యామోహం పెంచుకునేవారు 

ఇహ-పర సుఖాలకి దూరమై, 

జన్మరాహిత్య మోక్షపదాన్ని

చేరలేక దుఃఖిస్తుంటారు. 


కానీ ఆ జీవుడే తామరాకు మీది

నీటి బిందువువలె

దేహకర్మబంధాలకి అతీతుడై,

దేహధర్మానికి మాత్రం తాను 

నిమిత్తమాత్రుడై ఉండి,

ఆచరించినట్లయితే

కర్మబంధాలకు, దేహబంధాలకు

అతీతంగా, ఆత్మరూపుడై 

ద్వందాతీతుడవుతాడు.


అరటి పిలక మొక్క అవుతుంది. 

ఆకులు వేస్తుంది. 

పువ్వు పుష్పిస్తుంది. 

కాయ కాస్తుంది. 

కాయ పండు అవుతుంది. 

అది పరుల ఆకలి తీర్చడానికి

నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. 

అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. 

దానిస్థానంలో మరొక మొక్క పుడుతుంది. 


ఈ పరిణామక్రమంలో 

ఏ దశలోనూ ‘తనది’ అనేదేదీ

దానికి లేదు. 

పుట్టడం, పెరగడం, పుష్పించడం, 

పరులకి ఉపయోగపడడం,

రూపనాశనం పొందడం… 

ఇది దాని సృష్టి ధర్మం.


"మానవజన్మ కూడా అంతే… 

దేహాన్ని ధరించడం... 

దేహానికి వచ్చే పరిణామ దశలను 

నిమిత్తమాత్రంగా అనుభవించడం…

దేహియైనందుకు 

సాటి దేహాలకి 

చేతనైనంత 

సేవ చెయ్యడం… 

చివరికి జీవుడు త్యజించాక

భూపతనమై, శిధిలమై నశించిపోవడం… 

ఇంతకు మించి ‘నేను… నాది…

నావాళ్ళు’ అన్న బంధం 

ఏ దేహానికీ శాశ్వతం కాదు.


ఇక దేహంలోకి వచ్చిపోయే

‘జీవుడు’ ఎవరంటే …. 

పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం 

అను పంచభూతముల

సూక్ష్మరూపమే జీవుడు. 

ఈ జీవుడు ‘జ్యోతి’ వలె ప్రకాశిస్తూ 

‘ఆత్మ’ అనే పేరిట భాసిస్తుంటాడు.

ఇలాంటి కోట్లాది 

‘ఆత్మ’ల ఏకత్వమే 

‘పరమాత్మ’… 

ఈ పరమాత్మ తేజస్సులా

ప్రకాశించే నిరాకారుడు. 

ఇతడే ‘భగవంతుడు’. 

ఆది, అనాది అయినవాడు 

ఈ ‘భగవంతుడు.’ 

ఈ భగవంతుడు 

‘ఆత్మ’గా ప్రకాశిస్తుంటాడు. 

ఇతడు ఇఛ్ఛాపూర్వక సృష్టికి

సంకల్పించినప్పుడు… 

అప్పటి వరకు నిరాకారమైన

తాను ‘సాకారం’గా తనని తాను

సృష్టించుకుంటూ ‘దేహం’ ధరిస్తాడు. 

ఆ ‘దేహం’లోపల ‘జీవుడు’ 

అన్న పేరిట ‘ఆత్మ’గా 

తాను నివసించి 

ఆ దేహాన్ని నడిపిస్తాడు…. ఆడిస్తాడు… 

ఒక్కదేహం నించి 

కోట్లాది దేహాలు 

సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో

‘ఆత్మపురుషుడిగా’ తానుంటూ, 

ఆ దేహాల ద్వారా 

ప్రపంచనాటకాన్ని 

నడిపి వినోదిస్తాడు. 


ఒక్కొక్క దేహానిది 

ఒక్కొక్క కథ… 

కధకుడు

తానైనా ఏ కథతోనూ 

తాను సంబంధం పెట్టుకోడు. 

తామరాకు మీది నీటిబొట్టులా 

తాను నిమిత్తమాత్రుడై 

దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు… 

ఏ దేహి కధని ముగిస్తాడో, 

ఆ దేహం రాలిపోతుంది. 


దేహం పతనమైనప్పుడు

అందులోని ఆత్మ బయటికి వచ్చి

తను నివసించడానికి

అనుకూలమైన మరో దేహం

దొరికేవరకూ దేహరహితంగా 

సంచరిస్తూ వుంటుంది.


ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు 

కనుకే ఆ పరమాత్మని

 ‘దేవుడు’ అన్నారు. 

ఈ దేవుడినే పురుషుడు అంటారు. 


ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు. 

కనుక ఇతడిని...

‘నిర్గుణ పరబ్రహ్మము’ అంటారు. 

ఇతడిలో అంతర్గతంగా వుండి 

సృష్టికి సహకరించేది ప్రకృతి.

ఈ జీవసృష్టి పరిణామక్రమంలో

భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో 

తానే సృష్టి, స్థితి, లయములను

నిర్వర్తిస్తున్నా… ఏదీ ‘తనది’ అనడు… 

ఏ దేహంతోనూ సంబంధం కలిగి వుండడు. 

అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి

నశించిపోయే ఈ దేహం ఎవరిది? 

ఎవరికి దేనిపై హక్కు, 

అధికారం ఉంటుంది?”


కపిలుడు 

అలా వివరంగా ఉపదేశించి 

”అమ్మా… దేహం ఉన్నంతవరకే

బంధాలు – అనుబంధాలు. 

అట్టి దేహమే అశాశ్వతం అన్నప్పుడు 

దానితోపాటు ఏర్పడే భవబంధాల

కోసం ప్రాకులాడి ఏమిప్రయోజనం? 

తల్లీ, అందుకే జ్ఞానులైన వారు

తమ హృదయ మందిరంలో

శ్రీహరిని నిలుపుకొని 

నిరంతరం ధ్యానిస్తారు. 


అమ్మా! మనస్సే 

బంధ మోక్షములకు కారణం.

అరిషడ్వార్గాలను జయించగలిగితే 

మనస్సు పరిశుద్దమవుతుంది.

పరిశుద్దమైన మనస్సులో వున్న

జీవుడే... పరమాత్ముడు 

అన్న విశ్వాసం కలిగితే 

అది భక్తిగా మారుతుంది. 

భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. 

‘దేహముతో సహా కనిపించే

ప్రపంచమంతా’ మిధ్య అని,

అంతా వాసుదేవ స్వరూపమే నన్న 

దృఢభక్తితో సర్వ వస్తువులలో, 

సర్వత్రా పరమాత్మమయంగా

భావించి, అంతటా ఆ పరంధాముడిని 

దర్శించగలిగితే… దేహం ఎక్కడ? 

దేహి ఎక్కడ?  నేను – నాది 

అనే చింత నశించి … 

భక్తిమార్గంద్వారా అతిసులభంగా

మోక్షం లభిస్తుంది … 

అమ్మా, 

‘మోక్షం’ అంటే ఏమిటో తెలుసా? 

ఏ ‘పరమాత్మ’నించి 

అణువుగా, ఆత్మగా విడివడ్డామో… 

ఆ ‘పరమ – ఆత్మ’లో 

తిరిగి లీనమైపోవడం.


తప్పిపోయిన పిల్ల తిరిగి 

తల్లిని చేరుకున్నప్పుడు 

ఎలాంటి ఆనందాన్ని

పొందుతుందో… 

అలాంటి బ్రహ్మానందాన్ని

అనుభవించడం” 

అని ఉపదేశించాడు.


దేవహూతికి ఆత్మానందంతో

ఆనందభాష్పాలు జాలువారాయి.


అప్పటివరకూ తనపుత్రిడిగా

భావిస్తున్న కపిలుడిలో ఆమెకి 

సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు

దృగ్గోచరమయ్యాడు.


”నారాయణా… 

వాసుదేవా… 

పుండరీకాక్షా…

పరంధామా… తండ్రీ… 

నీ దివ్యదర్శన భాగ్యం చేత 

నా జన్మధన్యమైంది.

లీలామానుష విగ్రహుడివైన 

నీ కీర్తిని సృష్టికర్తయైన

బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. 

సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన

చతుర్వేదాలు సహితం 

నీ మహాత్తులను వర్ణించలేవు. 

పరబ్రహ్మవు, ప్రత్యగాత్మవు, వేదగర్భుడవు 

అయిన నీవు నా గర్భమున

సుతుడవై జన్మించి నా జన్మను

చరితార్థం చేశావు.

సృష్టిరహస్యాన్ని బోధించి, 

నా అహంకార, మమకారాలను

భస్మీపటలం గావించి... నాకు 

జ్ఞానబోధ గావించావు. 

తండ్రీ…  ఈ దేహముపైన, 

ఈ దేహబంధాలపైన నాకున్న

మోహమును నశింపజేసి

అవిద్యను తొలగించావు. 

ఇక నాకే కోరికలు లేవు.

పరమాత్ముడివైన నీలో ఐక్యం కావడానికి, 

జన్మరాహిత్యమైన తరుణోపాయాన్ని 

ఉపదేశించి అనుగ్రహించు తండ్రీ…” 

అని ప్రార్థించింది దేవహూతి ఆర్థ్రతతో.


కపిలుడు మందహాసం చేసి 

”తల్లీ! సర్వజీవ స్వరూపము

శ్రీమన్నారాయణుడు ఒక్కడే. 

కన్పించే యీ సృష్టి సమస్తం

శ్రీమన్నారాయణ స్వరూపం. 

చరాచర జీవరాసులు

అన్నిటియందు

శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని 

‘సర్వం వాసుదేవాయమయం’గా

భావించు. నీకు జీవన్ముక్తి లభిస్తుంది”

అని ప్రబోధించి తానే స్వయంగా

ఆమెకు మహామంత్రమైన 

”ఓం నమో నారాయణాయ” 

ఉపదేశం చేశాడు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

భూప్రదక్షణ

 శ్లోకం:

*భూప్రదక్షణ షట్కేన*

    *కాశీ యాత్రాయుతేన చ |*

*సేతుస్నాన శతైర్యశ్చ*

    *తత్ఫలం మాతృవందనే ||*


భావం: ఆరు సార్లు సంపూర్ణ భూప్రదక్షణము, నూరు సార్లు సముద్ర స్నానము, పదివేల సార్లు కాశీయాత్ర చేసిన ఫలము, ఒక్క సారి తల్లికి నమస్కరించిన దానితో సమానము.🙏

పెద్దన్నయ్య

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

     *🌷జీవితం మంచికధ🌷*        

              *పెద్దన్నయ్య*       

              

"దివాకర్. మీ అన్నయ్య వస్తున్నాడు" పక్కసీట్లోని అక్కౌంటెంట్ వేణు మాటలు విని తలెత్తి చూశాడు దివాకర్.

బ్యాంకు గేటునుంచి శివరాం లోపలికి రావడం కనిపించింది అతనికి.

బ్యాంకు స్టాఫ్ కొంతమంది శివరాంను చూసి గౌరవంగా లేచి నమస్కరిస్తున్నారు.  కొంతమంది పలకరిస్తున్నారు.  శివరాం తన దగ్గరికి రాగానే "కూర్చో అన్నయ్యా" అన్నాడు దివాకర్.

శివరాం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని చేతిరుమాలుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు.  అతని ముఖం వాడిపోయి ఉంది.

"ఏమిటి.. ఇలా వచ్చావు..? బ్యాంకులో ఏమైనా పనిబడిందా?" దివాకర్ అడిగాడు.

"మీ వదిన చాలారోజులుగా కడుపునొప్పితో బాధపడుతూంది. ఈరోజు స్పెషలిష్ట్ దగ్గరకు తీసుకెళ్ళాను.  ఆపరేషన్ చేయాలన్నారు" అన్నాడు శివరాం దిగులుగా చూస్తూ.

"ఎంతవుతుందట..?"

"యాభైవేలు అవుతుందని చెప్పారు"

కాసేపు చెక్కులు పాస్ చేస్తూ ఉండిపోయాడు దివాకర్.  తర్వాత తలెత్తి శివరాం వైపు చూసి "చూద్దాం అన్నయ్యా., నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు.  వాళ్ళు మంచి సర్జన్లు కూడా.  వాళ్ళు కాస్త తక్కువలో చేస్తారేమో కనుక్కుంటాను" అన్నాడు.

"ఇప్పుడు కన్సల్ట్ చేసిన డాక్టర్ ఆలస్యం చేయకూడదన్నారు"

దివాకర్ ఇబ్బందిగా చూసి "ఇలా బ్యాంకులో ఉన్నప్పుడు చెబితే నాకు ఏమీ తోచదన్నయ్యా.  పనిలో ఉంటే ఆలోచనలు రావు నాకు. సాయంత్రం నేను ఇంటికొచ్చి మాట్లాడుతాను" అన్నాడు.

"అలాగే.. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు., మనం తర్వాత మాట్లాడుకుందాం.." అంటూ లేచాడు శివరాం.

అంతలో అటుగా వెళ్తున్న మెసెంజర్ శివరాంని చూసి "నమస్తే సార్., నేను కుమార్ ని. సంతపేట హైస్కూల్ లో మీ శిష్యుణ్ణి" అన్నాడు రెండుచేతులూ జోడించి.

"నీ పేరు గుర్తులేదుగానీ నువ్వు గుర్తున్నావు..  బాగున్నావా..?" ఆప్యాయంగా అడిగాడు శివరాం.

"బాగున్నాను సార్..! ఈమధ్యే అనంతపూర్ నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకుని వచ్చాను.  రాగానే దివాకర్సార్ ని మీ గురించి అడిగాను., కూర్చోండి సార్.. టీ తాగి వెళుదురుగాని" అంటూ బాయ్ ని పిలిచి టీ తెమ్మని చెప్పాడు కుమార్.

"ముందు కాస్త మంచినీళ్ళు ఇప్పించు కుమార్" అభ్యర్థనగా అడిగాడు శివరాం.  కుమార్ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు.

టీ తాగుతున్న శివరాం వైపే చూస్తూండిపోయాడు దివాకర్.

"టీ ఆఫర్ చేయాలని ఆ పాత శిష్యుడికి తోచిందిగానీ, తనకెందుకు తోచలేదు? ఎండనపడి వస్తే కాస్త మంచినీళ్ళు ఇవ్వాలని తనకెందుకు అనిపించలేదు?" అని తనను తాను ప్రశ్నించుకున్నాడు.  అయితే సమాధానాలు మాత్రం అతనికి స్ఫురించలేదు.

     *          *          *           *

ఆరోజు సాయంత్రం మారుతీ కారు షోరూం నుంచి వచ్చిన రిప్రెజెంటేటివ్ దివాకర్ ని కలిశాడు.

"రేపు మీరు డ్రాఫ్ట్ సిద్దం చేసుకున్నారంటే, ఎల్లుండి కారు మీ ఇంట్లో ఉంటుంది" అన్నాడు దివాకర్ తో.

"అదేం పెద్ద పని కాదు., బ్యాంకు లోన్ తీసుకుంటున్నాను.  కాబట్టి ఓచర్లు నింపడమే నా పని.  నా మార్జిన్ ఎలాగూ సిద్దంగా ఉంది" అన్నాడు దివాకర్.  రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయాక అక్కౌంటెంటు వేణు వచ్చి "ఎప్పుడు కొంటున్నావు కారు?" అని అడిగాడు, ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.

"రేపు లోన్ కోసం ఆప్లై చేస్తాను. ఎల్లుండి కారు డెలివరీ చేస్తారు"

కాసేపు కారు రంగు, మోడల్, రేటు గురించి మాట్లాడుకున్నాక

"మీ అన్నయ్య ఈరోజు ఎప్పటిలా ఉత్సాహంగా కనిపించలేదు.  చాలా డల్ గా కనిపించారు" అన్నాడు వేణు.

"అవును. మా వదినకు ఆపరేషన్ చేయాలట.  అందుకు యాభైవేలు"

దివాకర్ మాట పూర్తికాకముందే "మీ అన్నయ్య వస్తున్నారు. నూరేళ్ళు ఆయుస్సు ఆయనకు..!" అన్నాడు వేణు గేటువైపు చూస్తూ!

దివాకర్ తలెత్తి చూశాడు. శివరాంని చూడగానే అతనికి విసుగుతో కూడిన కోపం వచ్చింది.

"నువ్వు కారు విషయం ఆయన ముందు ఎత్తకు" అన్నాడు

వేణుతో.

"నేనెందుకు ఎత్తుతాను" అంటూ వేణు తనసీటుకు వెళ్ళిపోయాడు. అతనికి దివాకర్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది.

దివాకర్ ని చూసి శివరాం నవ్వుతూ "ఈ రోజు పని పూర్తయిందా?" అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

"పని ఇంకా పూర్తికాలేదు. నేను ఇంటికొచ్చి మాట్లాడతానన్నాను కదా.. మళ్ళీ నువ్వు రావడం ఎందుకు..? వదిన ఆరోగ్యం గురించి నాకూ కన్సర్న్ ఉంది.  కానీ, నాకు కాస్త ఆలోచించే సమయమన్నా ఇవ్వాలి కదా నువ్వు?"

దివాకర్ ముఖంపై నవ్వు పులుముకుని ఆ మాటలు అన్నా, అతని మాటల్లో అసహనం, విసుగును గ్రహించాడు శివరాం..

"సారీరా..! నువ్వన్నట్లు ఇవి బ్యాంకులో మాట్లాడుకునే విషయాలు కావు. ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం...!"  శివరాం కుర్చీలోంచి లేచి బయటకు నడిచాడు.  వెళుతున్న అతని కంట్లో నీరు తిరగడం వేణు చూశాడు.  అతని మనసు శివరాం పట్ల జాలితో నిండిపోయింది.

    *         *         *           *

దివాకర్ ఇంటికి రాగానే భార్య స్వప్న ఎదురొచ్చి "శివరాం బావగారు ఫోన్ చేశారు" అని చెప్పింది.

"ఎన్ని గంటలకు చేశాడు"        విసుగ్గా అడిగాడు దివాకర్.

"ఏడు గంటలకు చేశారు. అక్కయ్యకు ఆపరేషన్ అని చెప్పారు.  మీరు బ్యాంకునుంచి వచ్చారా?  అని అడిగారు. ఇంకా రాలేదని చెప్పాను."

"బ్యాంకుకు వచ్చి మాట్లాడాడ్లే. వదిన ఆపరేషన్ కు యాభైవేలు కావాలని అడిగాడు.."

"మీరేమని చెప్పారు?"

"ఆలోచించి చెబుతానన్నాను"

"బాగా ఆలోచించండి.  ఆయనకు పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు. కూతుర్ల దగ్గర ఆయన డబ్బులు తీసుకోరు.  యాభైవేలు మరి ఆయన ఎలా తీరుస్తారు?"

"అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు?"

"అయిదో, పదో ఆయన చేతికిచ్చి మన దగ్గర ఉన్నది ఇంతేనని చెప్పండి.."

"కానీ మనం కారు కొంటున్నాం"

"కాబట్టే డబ్బుకు ఇబ్బందని చెప్పండి.  ఆపరేషన్ విషయం తెలియదు కాబట్టి కారుకు ముందే డబ్బులిచ్చేశామని చెప్పండి"

"అలాగే చెప్తా.  నాకు కాస్త త్రాగడానికి మంచినీళ్ళివ్వు" అంటూ సోఫాలో కూలబడ్డాడు దివాకర్..

       *           *         *         *

మరుసటి రోజు బ్యాంకు లోన్ తీసుకోవడం, డ్రాఫ్ట్ షోరూంలో ఇవ్వడం, తర్వాతి రోజు కారును ఇంటికి తీసుకురావడం, గుడికి తీసుకెళ్ళి పూజ చేయించడం లాంటి పనులతో బిజీగా ఉండిపోయాడు దివాకర్.

ఆరోజు ఆదివారం కావడంతో క్రొత్తకారు డ్రైవ్ చేసుకుంటూ శివరాం ఇంటికి వెళ్ళాడు.  శివరాం ఇల్లు తాళంవేసి ఉండటంచూసి ఆశ్చర్యపోయాడు.  శివరాం ప్రక్కింట్లో ఉంటున్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు.

దివాకర్ ని చూసి ఎంతో సంతోషించాడు రామకృష్ణ.  అతడు దివాకర్ పనిచేసే బ్యాంకులోనే మరో బ్రాంచిలో పనిచేస్తున్నాడు.

"చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు.  నాకు చాలా అనందంగా ఉంది" అన్నాడు రామకృష్ణ.

"నాకూ అలాగే ఉంది.  కొత్తకారు కొన్నాను.  నీకూ, అన్నయ్యకూ చూపిద్దామని తెచ్చాను"

"అలాగా...కంగ్రాట్స్"

"అన్నయ్య ఇల్లు లాక్ చేసి ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా..?"

"నీకు తెలుసో, తెలియదో నాకు తెలియదుగానీ... మీ వదినగారికి ఈమధ్య అనారోగ్యం చేసింది. ఆపరేషన్ చేయించుకోవడానికి చెన్నై వెళ్ళారు వాళ్ళు."

"ఆపరేషన్ విషయం అన్నయ్య నాతో చెప్పాడు.  చెన్నైలో చేయించుకుంటున్న విషయం మాత్రం చెప్పలేదు"

"ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు.  మీ అన్నయ్య స్టూడెంటు ఒకరు మొన్న మీ అన్నయ్య ఇంటికి వచ్చారు.  ఆవిడ చెన్నైలో పెద్ద డాక్టరట. మీ వదినకు వచ్చిన సమస్య తెలుసుకుని, తను ఆ కేసులో స్పెషలిష్టుననీ, తన హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకోమనీ, మందులూ ఇతర ఖర్చులూ భరిస్తే ఆపరేషను తను ఫ్రీగా చేస్తాననీ చెప్పి, వాళ్ళను ఒప్పించి, తనతోపాటే కారులో చెన్నై పిలుచుకెళ్ళారు.  మీ అన్నయ్య తరచూ అంటూండేవాడు "బీ గుడ్.., డూ గుడ్.., హి విల్ డూ గుడ్..," అని..! ఆ మాట ఆయన విషయంలో నిజమైంది.  ఆ భగవంతుడే అలా స్టూడెంట్ రూపంలో వచ్చాడనిపించింది నాకు" అన్నాడు.  రామకృష్ణ కూతురు తెచ్చిన కాఫీకప్పు అందుకుంటూ "మీ ఆవిడ ఇంట్లో లేరా?" అని రామకృష్ణని అడిగాడు దివాకర్. "లేదు.  మీ వదినకు తోడుగా ఉండమని నేనే పంపాను. ఉదయమే తను ఫోన్ చేసి ఆపరేషన్ విజయవంతమైందనీ, మీ వదిన బాగున్నారనీ చెప్పింది.."

"తను ఊర్లో ఉండీ వాళ్ళకు ఏ సహాయం చేయనందుకు రామకృష్ణ ఏమనుకున్నాడో..?" అనుకున్నాడు దివాకర్.  ఆ తర్వాత "అన్నయ్య ఆపరేషన్ కు డబ్బు అడిగాడు. రెండురోజుల్నుంచీ రావాలని ప్రయత్నిస్తున్నా కానీ సమయం దొరకలేదు.  ఈరోజు డబ్బు తీసుకుని వచ్చాను.  వాళ్ళు లేరు" అన్నాడు నిరుత్సాహంగా.

"రాలేకపోయానని చెప్పు, ఒప్పుకుంటాను, కానీ సమయం దొరకలేదంటే నేను ఒప్పుకోను. రోజూ షేవింగ్ చేసుకుంటున్నావా., స్నానం చేస్తున్నావా., భోజనం చేస్తున్నావా., కరెంట్ బిల్లు., టెలిఫోన్ బిల్లు డ్యూ డేట్ చూసుకుని కడుతున్నావా..? ఇంటికి కావలసిన సరుకులు, కూరగాయలు తెస్తున్నావా., నీ భార్యకు, పిల్లవాడికి కావలసినవి అమర్చి పెడుతున్నావా..? మరి., వీటికి సమయం ఎక్కడనుంచి వచ్చింది నీకు..?  అవి నీకు అవసరం కనుక టైం దొరుకుతుంది. మిగిలినవి నీకు అవసరం లేదు కనుక టైం దొరకడంలేదు.  నీకు గుర్తుందా?  మనం నెల్లూరులో ఉన్నప్పుడు నాకుచిత్తూరుకు ట్రాన్స్ ఫర్ అయితే నువ్వు నాకు మంచి ఇల్లు చూపించమని మీ అన్నయ్యకు ఉత్తరం రాసిచ్చి నాతో పంపావు.  అదృష్టవశాత్తూ ఆయన పక్క ఇల్లే ఖాళీగా ఉండటంతో అందులో చేరిపోయాను. అప్పట్నుంచి మీ అన్నయ్యతో సాన్నిహిత్యం ఏర్పడింది.  ఆయన్ను చూస్తూంటే నాకేమనిపించేదో తెలుసా?

"మనుషులు-నా బిడ్డ ఇంజనీర్ కావాలి., డాక్టర్ కావాలి., ఇంకోటి కావాలి. అని కోరుకుంటారు కానీ.. నా బిడ్డ మంచి పొరుగువాడు కావాలి.. అని ఎందుకు కోరుకోరు..?' అనిపించేది.  మంచి పొరుగువారివల్ల ఇరుగుపొరుగు వాళ్ళకు ఎంత లాభమో మీ అన్నావదినలద్వారా సహాయాలు పొందిన మాకు అనుభవపూర్వకంగా తెలుసు. మరి., వారికి ఆప్తుడుగా నీకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉండాలి., కాకపోతే అవన్నీ ఇప్పుడు నువ్విప్పుడు మరచిపోయినట్లున్నావు దివాకర్., ఒకప్పుడు మీ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి..? ఈరోజు ఆయన కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా టైం లేదంటున్నావు. ఈ మూడేళ్ళలో ఎంత మార్పు నీలో..?  దీనికి కారణం ఏమై ఉంటుంది..? నీ ప్రొమోషనా..? లేక పెరిగిన నీ ఆర్థిక స్థితా..? మీ అన్నయ్య కూడా నీలాగే "నేనూ, నా భార్యాపిల్లలూ" అని గిరిగీసుకుని ఉండుంటే, మీరంతా ఎక్కడుండేవారో అలోచించు."

దివాకర్ మౌనంగా వింటూ ఉండిపోయాడు.

ఉన్నట్టుండి రామకృష్ణ లేచి బెడ్రూంలోకి వెళ్ళాడు.  ఐదునిమిషాల తరువాత చేతిలో ఓ కవరుతో వచ్చాడు.

"నేను మీ అన్నయ్యవాళ్ళ ప్రక్కింట్లో చేరానని నెల్లూరులో ఉన్న నీకు ఫోను చేసి చెప్పగానే, నువ్వు నాకు రాసిన ఉత్తరం ఇది.  ఇంటికెళ్ళి ఓసారి తీరికగా చదువు.  ఇది నీ గతాన్నీ, మీ అన్నయ్యతో నీ అనుబంధాన్నీ, ఆయన నీకు చేసిన సహాయాల్నీ గుర్తుకుతెస్తుందేమో ప్రయత్నించు."

దివాకర్ ఉత్తరాన్ని అందుకుని లేచి నిలబడ్డాడు.  రామకృష్ణ కారువరకూ వచ్చి "దివాకర్, డబ్బు ఎంత సంపాదించినా... అది మనకు సంతోషాన్నీ, ధైర్యాన్నీ ఇవ్వగలదేమో గానీ, తృప్తిని ఇవ్వలేదు. ఎదుటి మనిషికి ఆనందాన్నివ్వడం, కష్టాల్లో ఉంటే సహాయపడటంవల్ల కలిగే తృప్తి ఇంకెందులోనూ దొరకదు.  నిన్ను నొప్పించి ఉంటే సారీ.. గుడ్ నైట్" అన్నాడు..

"గుడ్ నైట్" అంటూ కారు స్టార్ట్ చేశాడు దివాకర్..

    *          *          *          *

"రామకృష్ణా..

నువ్వు మా అన్నయ్య ప్రక్కింట్లో చేరావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. ఈ శుభసందర్భంలో నీకు మా అన్నయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తోంది. అందువల్ల ఆయనతో గడిపిన నా బాల్యాన్ని నెమరువేసుకునే అవకాశం నాకు కూడా కలుగుతుంది.

శివరాం నా సొంత అన్నయ్య కాదు. మా పెదనాన్న కొడుకు. మాది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం. నాన్నావాళ్ళు నలుగురు అన్నదమ్ములు. వారిలో ఇద్దరివి మంచి ఉద్యోగాలు., ఇద్దరివి చిరుద్యోగాలు. అందువల్ల ఒకరి సంపాదనపై మరొకరు ఆధారపడేవారు.  ఇది ఆడవాళ్ళకు నచ్చేది కాదు.  క్రమంగా వాళ్ళ మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఉమ్మడికుటుంబం నాలుగు కుటుంబాలుగా విడిపోయింది. మనుషులు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు.  పెద్దల మధ్య విభేదాలు, పిల్లల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి.,

అటువంటి సమయంలో మా పెద్దన్నయ్య కాలేజీనుండి ఇంటికి వచ్చాడు.  ఆయనకు ఈ వాతావరణం నచ్చలేదు.  నలుగురు అన్నదమ్ముల కుటుంబాల మధ్య సఖ్యత లేకపోతే, దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఎలా ఉంటారని అతనికి అనిపించింది.  ఆయన ముందుగా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని కథలు, జోక్స్ చెప్పి నవ్విస్తూ.. ఆటలాడిస్తూ మా అందరికీ దగ్గరయ్యాడు.  పెద్దలమధ్య కూర్చుని, వాళ్ళు చెప్పుకునే చాడీలు వింటూ, విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదనీ, చదువు చెడితే జీవితాంతం బాధపడాలనీ మాకు చెప్పేవాడు.  అందరూ బాగా చదువుకుని, ఉద్యోగాలు తెచ్చుకుని ఆర్థికంగా బాగుంటే ఒకరిపై ఒకరు ఆధారపడకుండా స్వతంత్రంగా బతకొచ్చనీ, అందువల్ల తమ మధ్య విభేదాలు రావనీ, అందరూ ఐకమత్యంగా ఉండొచ్చనీ చెప్పాడు.  మా అదృష్టం బాగుండి మేము ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం.  ఆయన చెప్పినట్లే చేశాం., తర్వాత ఆయన పెద్దల దగ్గర చనువు పెంచుకున్నాడు.  వాళ్ళు ఏ పనిచెబితే ఆ పని చేశాడు. చదువుకోని ఆడవాళ్ళకు మాటలతోనే అన్ని విషయాలు వివరంగా తెలియజేసి, వాళ్ళలో సంస్కారాన్ని పెంచాడు.  త్వరలోనే అందరికీ తలలో నాలుకలా తయారయ్యాడు.  పిల్లల చదువుల్లో అభివృద్ధి చూసి పెద్దలు ఎంతో ఆనందించారు.  అన్నయ్యను అభినందించారు. క్రమంగా పెద్దలమధ్య విభేదాలు దూరమయ్యాయి.  కాపురాలు వేరైనా పండుగల్ని కలసి జరుపుకునేవారు.  అంత చిన్న వయసులో అన్నయ్య సాధించిన అతి పెద్ద విజయం ఇది.

"తనొక్కడు చదివి బాగుపడితే చాలు" అనుకోలేదు అన్నయ్య. మేమందరం కూడా చదువుకుని బాగుండాలని కోరుకున్నాడు. ఆయన తర్వాత మేము ఆరుగురం అన్నదమ్ములం. మాతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు. అమ్మాయిలతో సహా అందరం చదువుకున్నాం.  అందరం ఉద్యోగాలు చేస్తున్నాం.  ఇది అన్నయ్య సాధించిన రెండో విజయం., మా అందరి పెళ్ళిళ్ళ బాధ్యత తన భుజాన వేసుకుని, దగ్గరుండి మరీ జరిపించాడు అన్నయ్య.

మా అన్నయ్యను బడిలో ఎవరు చేర్చారో నాకు తెలియదుగానీ, తర్వాత హైస్కూల్ చదువు దగ్గర్నుంచి ఎం.ఎస్.సి.వరకు, తర్వాత ఉద్యోగంకోసం ఇంటర్వ్యూలకు తనొక్కడే వెళ్లేవాడు.  పెదనాన్నకు ఆఫీసు పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు.  తన స్నేహితులకు తోడుగా వచ్చిన తండ్రుల్నీ, సోదరుల్నీ చూసి తన తండ్రి కూడా తనతోపాటే వచ్చిఉంటే తనకు మానసికంగా ధైర్యంగా ఉండేది కదా..! అనుకునేవాడు.  ఆ లోటు మాకుండకూడదని మేము ఉద్యోగాలకోసం పోటీపరీక్షలకు, ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మాతోపాటుగా వచ్చి మాకు ధైర్యం చెప్పేవాడు.  ఒకరకంగా నాకు జీవితాన్నిచ్చింది మా అన్నయ్యే. నేను ఇంటర్ ఫస్టియర్ లో ఓ పరీక్ష తప్పాను. ఇంట్లో అందరూ బాగా తిట్టారు.  నేను హర్ట్ అయి, ఇల్లు వదలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని రైల్వేస్టేషన్ చేరుకున్నాను.  అప్పుడే వచ్చిన ఓ ట్రైన్ ఎక్కబోతూంటే.. ట్రైన్ దిగుతున్న అన్నయ్య కంట్లో పడ్డాను.

"ఎక్కడికి పోతున్నావ"ని అడిగాడు. సమాధానం చెప్పలేదు నేను.,

"పరీక్ష ఏమైందని" అడిగాడు. చెప్పాను.

"ఫరవాలేదులే., ఫస్టియరే కదా., సంవత్సరం వృధాకాదు.  ఈసారి ఇంకా బాగా చదివి రాయి" అన్నాడు.  నాకు ఎంతో ఆశ్చర్యంవేసింది.  చదువు ప్రాముఖ్యంగురించి అంతగా చెప్పే అన్నయ్య, నా ఫెయిల్యూర్ ని అంత తేలికగా తీసుకుంటాడని నేను ఊహించలేదు..  అన్నయ్య నా భుజంపై చెయ్యివేసి నన్ను ఇంటికి పిలుచుకెళుతూ అన్నాడు, "మనం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తే ఫలితాల గురించి ఆందోళన పడనవసరం లేదు. ఫలితాలు ఎప్పుడూ మనం కోరుకున్నట్లే ఉండవు.  ఒక్కోసారి తారుమారవుతాయి కూడా. అయితే అది మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు."

ఆ మాట నేను ఏనాటికీ మర్చిపోలేదు.  నాకు ఎంతో ఓదార్పునూ, ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చిన మాట అది.  తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్ లోనూ, డిగ్రీ డిస్టింక్షన్లో పాసయ్యాను.  ఆరోజు అన్నయ్య స్టేషన్లో కనబడకపోయి ఉంటే.. నేను ఎక్కడికి వెళ్ళి ఉండేవాడినో..? ఏమయ్యేవాడినో..? ఈరోజు ఇలా బ్యాంకులో ఆఫీసరుగా ఉన్నానంటే, ఇది ఆయన పెట్టిన బిక్షే...!

అన్నయ్య ఎం.ఎస్.సి. చదివినా., మమ్మల్ని విడిచి వెళ్ళడం ఇష్టంలేక చిత్తూరులోనే టీచరు పోస్టులోనే   స్థిరపడిపోయాడు.  పైగా టీచరు పోస్టంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఆ ఉద్యోగాన్ని పూర్తి కమిట్మెంట్ తో చేశాడు.  మా గురించి ఎలా పట్టించుకునేవాడో, తన విద్యార్థుల బాగోగుల గురించి కూడా అంతే పట్టించుకునేవాడు. తన పూర్తి సమయాన్ని వాళ్ళకోసం వెచ్చించి, వారి ఎదుగుదలకు కృషి చేసేవాడు.  మా వదిన కూడా ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పనిచేసేది.  ఇద్దరూ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్ ' లా ఉంటారు.

మనం బ్యాంకులో కొంతమంది కస్టమర్లకు పదిసార్లు సర్వీస్ చేసి, ఓసారి పనిఒత్తిడిలో సర్వీస్ చేయకపోతే అలిగిపోయిన వాళ్ళున్నారు., అరిచిపోయిన వాళ్ళున్నారు., కానీ, వాళ్ళిద్దరికీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా పాదాభివందనాలే., అభిమానపు పలకరింపులే., సినిమాకెళ్ళినా, గుడికెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీసుకు వెళ్ళినా...వాళ్ళ శిష్యులే కనపడతారు.  కావలసిన పని చేసిపెడతారు.

అన్నయ్య మాతో, ఆయన విద్యార్థులతో ఓ మాట తరచుగా అంటూండేవాడు - "ప్రతి మనిషీ ఓ అబ్దుల్ కలాం, ఓ రెహమాన్, ఓ తెందూల్కర్ కాలేరు.  కానీ, ప్రయత్నిస్తే ప్రతి మనిషీ ఓ మదర్ థెరెసా కాగలరు.  ఇందుకు మేధస్సు, ప్రతిభ అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టంపట్ల స్పందించే హృదయం ఉంటే చాలు!".అని.  ఈ మాట అనడమే కాదు, ఆచరించి చూపించాడు కూడా., ఊర్లో ఎవరికి ఎలాంటి సహాయం కావలసి వచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవాడు.  అందుకోసం అయ్యే వ్యయప్రయాసల్ని గురించి అస్సలు పట్టించుకునేవాడు కాడు.

మనం బ్యాంకులో కూర్చుని డెబిట్లు, క్రెడిట్లు, టార్గెట్లు.. ఇవే జీవితం అనుకుంటాం., అన్నయ్యలాంటివాళ్ళను చూస్తే మనుషులుగా మనం చెయ్యవలసినది చాలా చాలా ఉందనిపిస్తుంది.  ఆయన మా అన్నయ్య అయినందుకు నేను గర్వపడుతుంటాను.  అన్నయ్య గురించి నేను ఇందులో చెప్పింది కొంతే.  ఇకపై ఆయన గురించి నువ్వు నాకు చెబుతావు. ఉంటాను.

నీ...దివాకర్.

ఉత్తరం చదవడం పూర్తిచేసిన దివాకర్ కంటిచివర నుంచి రాలిన కన్నీటిచుక్క ఆ ఉత్తరంలోని అతని సంతకంపై పడి, అందులోంచి అతని పేరు మరింత పెద్దదిగా కనపడసాగింది.

     *        *         *         *

ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు దివాకర్ కు రామకృష్ణ నుంచి ఫోన్ వచ్చింది.

"దివాకర్, మీ అన్నయ్య, వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు.." అని చెప్పాడు రామకృష్ణ.

"అలాగా.. నేను వచ్చి చూస్తాను. రామకృష్ణా..! నీవిచ్చిన నా ఉత్తరం చదివాను. 'పని ఒత్తిడి ' అంటూ నాకు నేనే ఓ కారణం కల్పించుకుని, నామీద నేనే సానుభూతి చూపుకుంటూ, భార్య చెప్పిందే వేదమనుకుంటూ, ఆమె ఆలోచనలే నా ఆలోచనలుగా భావిస్తూ, అనుబంధాలకు దూరంగా ఓ ఇరుకుప్రపంచంలో ఉండిపోయాను ఇన్నాళ్ళూ.  ఆ ఉత్తరం చదివాక,  అనుబంధం ఎంత తియ్యగా ఉంటుందో, అనురాగం ఎంత హాయిగా ఉంటుందో., ఐకమత్యం ఎంత ధైర్యాన్నిస్తుందో., మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను.  నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు"

"మీ అన్నయ్యతో నువ్వు ఇదివరకు ఎలా ఉండేవాడివో అలాగే ఇకపై కూడా ఉంటే చాలు.  నాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదు"

"తప్పకుండా.  నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఉంటాను.."

తర్వాత భార్యకు విషయంచెప్పి, వెంటనే బయలుదేరి శివరాం ఇల్లు చేరుకున్నాడు దివాకర్.

హాల్లోకి అడుగుపెట్టబోతూ అన్నావదినల మాటలు వినిపించి, గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు.

"మీరు కార్యసాధకులని మరోసారి నిరూపించారండీ..!

నాకు ఆపరేషన్ అన్న విషయం బంధువులకుగానీ, స్నేహితులకు గానీ, ఆఖరికి కన్నబిడ్డలకు కూడా తెలియనివ్వకుండా దాచారు. బాధ, భయం, కష్టం, నష్టం అన్నీ మీరే భరించి, చివరికి విజయం సాధించారు..!" జానకి శివరాంతో అంటూంది.

"ఎక్కడో ఉన్నవాళ్ళకు ఈ విషయం చెప్పి ఆందోళన కలిగించడం ఎందుకని చెప్పలేదు.  అయితే రామకృష్ణ దగ్గర మాత్రం ఈ విషయం దాచడం సాధ్యం కాలేదు. అతనూ తనవంతు సాయంచేసి తన మంచితనం నిరూపించుకున్నాడు"

"కానీ మీరు దివాకర్ దగ్గరకు వెళ్ళడమే నన్ను ఆశ్చర్యపరచింది. ఈమధ్య మన ఇంటివైపే రాని అతనితో మాత్రం ఈ విషయం చెప్పాలని మీకెందుకు అనిపించింది?" "డాక్టరుగారు నీకు ఆపరేషన్ చెయ్యాలని చెప్పగానే నాకు ఎంతో భయమేసింది.  నా భయం నీతో చెప్పుకోలేను., నువ్వే పేషంట్ వి కాబట్టి., ఊర్లో ఉన్న ఒకే ఒక తమ్ముడు వాడు.  వాడితో చెప్పుకుంటే నన్ను ఓదార్చి, ధైర్యం చెబుతాడని నిన్ను ఇంటిదగ్గర వదిలి, వెంటనే బ్యాంకుకు వెళ్ళాను.  వాడు బిజీగా ఉండటంతో మళ్ళీ సాయంత్రం వెళ్ళాను.  పాపం, వాడు అప్పుడూ బిజీనే!"

"అన్నయ్య బ్యాంకుకు వచ్చింది.. నన్ను డబ్బులు అడగటానికి కాదా?" అనుకుని ఆశ్చర్యపోయాడు దివాకర్.

"కానీ, అక్కడికెళ్ళి అవమానం తప్ప ఏం పొందారు మీరు?  మీరు దివాకర్ కు ఎంత చేశారు? అతని అభివృద్ది కోసం ఎంతగా తపించారు?  అతను ఈరోజు అవన్నీ మర్చిపోయాడు" జానకి అంది.

"తప్పు జానకీ, అలా అనకు!  నేను ఏదో ఆశించి వాళ్ళకు చెయ్యలేదు., ఏదో విధంగా వాళ్ళకు ఉపయోగపడితే చాలనుకున్నాను. దివాకర్ స్వతహాగా మంచివాడే., పనిఒత్తిడిలో అలా మాట్లాడాడు. ఆ క్షణంలో అతని ప్రవర్తన నన్ను బాధపెట్టినా.. తరువాత ఆలోచిస్తే, పనిఒత్తిడివల్ల అతనిలో ఏర్పడిన అసహనం బయటపడేందుకు నేను ఒక అవుట్లెట్ గా ఉపయోగపడ్డానన్న విషయం స్ఫురించి, ఎంతో ఆనందించాను" అన్నాడు శివరాం.

దివాకర్ ఇక నిలబడలేకపోయాడు. పరుగునవెళ్ళి శివరాం చేతులు పట్టుకుని, ఆ చేతుల్లో తన ముఖం దాచుకున్నాడు ఏడుస్తూ...!

            🌷🌷🌷

*(2009 లో ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచికలో ప్రచురితమైన ఇంతటి హృద్యమైన, మానవ విలువలు కలిగిన కధను అందించిన రచయిత శ్రీచంద్రశేఖర్ గారు,*

నిజంగా అభినందనీయులు!

*(చివరివరకూ పూర్తిగా చదివినందుకు మీరు కూడా అభినందనీయులే!)*

*ధన్యవాదములతో!*

🙏🙏⚘🌺

*ఇది చాలా కాలం క్రితం పంపినదే ఐనా మరోసారి పంపడమైనది.

_ఆధునికత - అరాచకత్వం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*_ఆధునికత -  అరాచకత్వం*_ 

   

తరగతిగదిలో ముద్దుపెట్టుకుంటున్న విద్యార్థులు!

పెళ్ళిపీటలపై ముద్దులాడుకుంటున్న వధూవరులు !!

వివాహవేదికపై నాట్యం చేస్తున్న వధువు  !

కల్యాణమండపంలో వధువును కొడుతున్న వరుడు!!

పబ్బులో పోట్లాడుకుంటున్న యువతీయువకులు !

నడివీధిలో నవ్వులపాలవుతున్న మద్యపాన ప్రియులు !!

పట్టపగలు ప్రాణం తీస్తుంటే పట్టించుకోని పౌరులు!

ఫోను నొక్కుకుంటూ నాకెందుకనుకుంటున్న ప్రజలు!!

ప్రియురాలిని పొడిచి చంపుతున్న ప్రియుడు !

ప్రియుడి గొంతుకోస్తున్న ప్రియురాలు!!

భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త !

ప్రియుడితో భర్తను చంపిస్తున్న భార్య!!

నెలలపిల్లను నేలకేసి కొడుతున్న తండ్రి!

ఆడపిల్లని చెత్తకుప్పలో వేస్తున్న తల్లి !!

తల్లితండ్రులను తరిమికొడుతున్న తనయులు!

ఆస్తిలేదని వెళ్లగొడుతున్న వారసులు !!

వేరేకులంవాడిని వివాహమాడిందని

సోదరిని సంహరిస్తున్న సహోదరులు!

మరోమతంవారిని మనువాడాడని

మట్టుబెడుతున్న బంధువులు !!

వెల్లువవుతున్న విడాకులు!

వీచేనా విలువల వీచికలు !!

పేట్రేగిపోతున్న పదవీకాంక్ష!

ఫలించేనా ప్రజల ఆకాంక్ష!!


ఆధునికత అవధులు దాటిపోతుంది!

అనుభవం  పరిధులు మించిపోతుంది!!

వ్యక్తిగత స్వేచ్ఛ విశృంఖలమయ్యింది!

విశృంఖలత వెర్రి తలలు వేస్తుంది !!


అన్యాయం న్యాయం చెబుతోంది!

అక్రమాలు అంబరమంటాయి!!

నేరాలు నింగిని తాకాయి!

ఘోరాలు గొప్పలుపోతున్నాయి !!


అలుముకుంటున్న అరాచక రీతులు !

ఆందోళనకలిగిస్తున్న ఆటవికతాగమన సూచికలు!!

విశృంఖలత  సోపానాలపై జీవనగతులు !

వికారం కలిగిస్తున్న వ్యవహార తీరులు!!


స్వేచ్చాజీవనమని సంబరపడుతున్నాం!

సరదాగా ఉంటున్నామని సంతోషపడుతున్నాం!!

ఆటవికత ఆవరిస్తోందని

అరాచకత్వం అలుముకుంటోందని

అవగతంకాని అయోమయంలో ఉన్నాం !!


   - Satya Murthy Tikka

సేకరణ:  వాట్సాప్ సందేశం యథాతథంగా

ఆరోగ్య చిట్కాలు.*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.*

🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏


🏵️1.*అజీర్ణే భోజనమ్ విషమ్.*

➖➖➖➖➖➖➖➖➖

మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజనం చేయడం, విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు.


🏵️2. *అర్ధరోగహరి నిద్రా*

➖➖➖➖➖➖➖➖➖

సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, శారీరక శ్రమ వల్ల కాళ్ళు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఉపకరిస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించి వేస్తుంది అని ఈ సూక్తికి అర్థం.


🏵️3. _*ముద్గధాలి గధవ్యాలి*_

➖➖➖➖➖➖➖➖➖

అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ *పెసలు* (Greengrams) ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ,

 ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.


🏵️4. *బాగ్నస్తి సంధనకరో రాసోనాహా*

➖➖➖➖➖➖➖➖➖

వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి.


🏵️5. *అతి సర్వత్రా వర్జయేత్*

➖➖➖➖➖➖➖➖➖

అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి.


🏵️6. *నాస్తిమూలం అనౌషాధం*

➖➖➖➖➖➖➖➖

శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు.


🏵️7. *నా వైద్యా ప్రభుయుయుషా*

➖➖➖➖➖➖➖➖➖

ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి.


🏵️8. *చింతా వ్యాధి ప్రకాషయ*

➖➖➖➖➖➖➖➖➖

చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.


🏵️9. *వ్యాయమాశ్చ సనైహి సనైహి*

➖➖➖➖➖➖➖➖➖

ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది.


🏵️10. *అజవత్ చార్వనం కుర్యాత్*

➖➖➖➖➖➖➖➖➖

మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది.


🏵️11. *స్నానమ్ నామా మనఃప్రసాధనకరం దుస్వప్న విధ్వంసకం*

➖➖➖➖➖➖➖➖➖

స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. ఇది చెడ్డ కలలనును దూరం చేస్తుంది.


🏵️12. *న స్నానం ఆచరేత్ భుక్త్వా.*

➖➖➖➖➖➖➖➖➖

ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.


🏵️13. *నాస్తి మేఘసమం తోయం.*

➖➖➖➖➖➖➖➖➖

స్వచ్ఛతలో వర్షపునీటికి, ఏ నీరు సాటి రాదు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ వర్షపు నీటిని పట్టి వడకట్టి త్రాగుతారు. కాని నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలి. ఇంటి చూరుల మీదనుంచి కారిన నీరుకాదు.


🏵️14. *అజీర్నే భేజాజం వారీ*

➖➖➖➖➖➖➖➖➖

మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు.


🏵️15. *సర్వత్ర నూతనం శాస్త్రం సేవకన్న పురాతనం.*

➖➖➖➖➖➖➖➖➖

తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, తొలగించవద్దు.)


🏵️16. *నిత్యామ్ సర్వ రసభ్యాసహా.*

➖➖➖➖➖➖➖➖➖

ఉప్పు, తీపి, చేదు, పులుపు, (Astringent మరియు pungent) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి.


🏵️17. *జఠరామ్ పూరైధార్ధమ్ అన్నాహి*

➖➖➖➖➖➖➖➖➖

మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి.


🏵️18. *భుక్త్వోపా విసస్థాంద్ర*

➖➖➖➖➖➖➖➖➖

ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం 100 అడుగులు అయినా నడవండి.


🏵️19. *క్షుత్ సాధూతం జనయతి*

➖➖➖➖➖➖➖➖➖

ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)


🏵️20. *చింతా జరానామ్ మనుష్యానమ్*

➖➖➖➖➖➖➖➖

చింతించడం 😭అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. కనుక అనవసరపు చింతలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.


🏵️21. *సతం విహయ భోక్తవ్యం*

➖➖➖➖➖➖➖➖➖

ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని అసలు భోజనమే మానివేయడం చాలా అనర్థదాయకం.


🏵️22. *సర్వ ధర్మేశు మధ్యమామ్.*

➖➖➖➖➖➖➖➖➖

ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు, నిత్య ఆరోగ్యం  తప్పక లభిస్తాయి.


స్వస్తి.....

భగవద్గీత

 "Establishment of Supreme Court Bench in AP for South India is our prime aim"👍


🌹భగవద్గీత🌹


పదునాల్గవ అధ్యాయము

గుణత్రయవిభాగయోగము

నుంచి 8 వ శ్లోకము


తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ౹

ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ౹ (8)


తమః , తు , అజ్ఞానజం , విద్ధి ,

మోహనమ్ , సర్వదేహినామ్ ౹

ప్రమాదాలస్యనిద్రాభిః , తత్ ,

నిబధ్నాతి , భారత ౹౹ (8)


భారత ! = ఓ అర్జున ! 

సర్వదేహినామ్ = దేహాభిమానము గలవారినందరిని 

మోహనమ్ = మోహింపజేయు 

తమః , తు = తమోగుణమయితే 

అజ్ఞానజమ్ = అజ్ఞానము నుండి ఉత్పన్నమైనదానినిగా

విద్ధి = తెలిసికొనుము 

తత్ = అది (ఆ తమోగుణము)

(దేహినమ్) = (జీవాత్మను) ప్రమాdha

ఆలస్, నిద్రాభిః =     ప్రమాదాలస్య నిద్రాదులతో

నిబధ్నాతి = బందించును 


తాత్పర్యము:- అర్జున ! తమోగుణము సకల దేహాభిమానులను మోహితులనుగా చేయును. అజ్ఞానము వలన జనించును. అది జీవాత్మను ప్రమదాలస్య నిద్రాదులతో బందించునu.(8)

   

         ఆత్మీయులందరికి శుభ శుభోదయం

                    Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi