7, ఏప్రిల్ 2025, సోమవారం

కర్పూరం గురించి సంపూర్ణ వివరణ - 1 .

 కర్పూరం గురించి సంపూర్ణ వివరణ  -  1 . 


    కర్పూరం అనేది ఒక చెట్టు జిగురు. ఈ జిగురుని శుభ్రపరచగా కర్పూరం తయారగును . కర్పూరం నందు అనేక రకాలు ఉన్నవి. వాటిలో ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో అతి ముఖ్యమైన 13 రకాల గురించి చాలా చక్కగా వివరించారు .  


  ఇప్పుడు మీకు ఆ 13 రకాల కర్పూరం పేర్లు తెలియచేస్తాను .  అవి 

 

   *  పోతాస కర్పూరం . 


   *  భీమసేన కర్పూరం . 


   *  సితకర కర్పూరం . 


   *  శంకరావాస కర్పూరం . 


   *  పాంశు కర్పూరం . 


   *  పింజ కర్పూరం . 


   *  అబ్దసారక కర్పూరం . 


   *  హిమాదాలుకాక కర్పూరం . 


   *  యూతికా కర్పూరం . 


   *  హిమ కర్పూరం . 


   *  తుషార కర్పూరం . 


   *  శీతల కర్పూరం . 

  

   *  ప్రత్త్రికా కర్పూరం .   


           ఇలా అనేక రకాలు కలవు . ఇదియే కాకుండా కర్పూరం చెట్టు యొక్క సారము మరియు జిగురు లక్షణాన్నిబట్టి కూడా 3 రకాలుగా వర్గీకరిస్తారు . అందు చెట్టు యొక్క పైభాగము నుండి తీయు కర్పూరమును "శిరోజం " అని పిలుస్తారు . ఇది మిక్కిలి తెల్లగా ఉండి అద్దము వలే ప్రతిబింబించబడును. మ్రాని మధ్యభాగము నందలి పుట్టునది  " మధ్యమం " అనబడును. ఇది పైభాగములో ఉన్న అంత తెల్లగా ఉండక సామాన్యముగా ఉండును. కొంచం గౌరవర్ణములో ఉండును. చెట్టు మిగిలిన భాగములలో లభ్యం అగునది సాధారణముగా ఉండును. ఇప్పుడు మనకి బజారులలో లభ్యం అయ్యేది ఈ సాధారణ రకము. కర్పూరం చెట్టు మధ్య మాను ( కాండం ) నుంచి తీసినది కొంచం పసుపు రంగుతో ఉండును. ఇది కర్పూరములన్నింటిలోను ఉత్తమం అయినది.  


               సరైన అవగాహన లేకుండా వైద్యులు అని చెప్పుకునేవారు హారతి కర్పూరమును పచ్చ కర్పూరముగా చూపించి భ్రమింపచేయుచున్నారు . పచ్చ కర్పూరం లేత పసుపు రంగుతో సువాసనగా ఉండును. తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డు ప్రసాదం నందు ఈ పచ్చకర్పూరం విరివిగా వాడుతారు . హారతికర్పూరం విషతుల్యము. ఒక్కోసారి ప్రాణాలు తీయును . లోపలికి ఇవ్వడం నిషిద్దం. 


               తరవాతి పోస్టుల యందు మరింత వివరణాత్మకంగా కర్పూరం లోని రకాలు ఉపయోగాల గురించి వివరిస్తాను. నేను రచించిన గ్రంథాల యందు. మరింత వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది. చదవగలరు.. 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

తిరుపతి బాలాజీని దర్శించుకునే

 తిరుపతిలో *చంద్రబాబు నాయుడు* గారి *మొదటి సంస్కరణ*...!!!

  తిరుపతి బాలాజీని దర్శించుకునే *వయోవృద్ధులకు* శుభవార్త,

 *65 ఏళ్లు* దాటిన వృద్ధులకు తీపి వార్త.   సీనియర్ సిటిజన్లకు *శ్రీ వేంకటేశ్వర తిరుమల ఉచిత దర్శనం*.  

 రెండు స్లాట్‌లు కేటాయించారు.   ఒకటి *10 AM* మరియు మరొకటి *3 PM*.   మీరు *ఫోటో ID*తో పాటు *వయస్సు రుజువు* సమర్పించాలి మరియు *S1 కౌంటర్*కి నివేదించాలి.   వంతెన దిగువన ఉన్న గ్యాలరీ నుండి ఆలయం యొక్క కుడి గోడకు రహదారిని దాటండి.   మీరు *ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు*.   ఉత్తమ * సీట్లు అందుబాటులో ఉన్నాయి.   కూర్చున్న తర్వాత, వేడి వేడి సాంబార్ అన్నం, పెరుగు, అన్నం* మరియు *వేడి పాలు*.  

 ఇదంతా *ఉచితం*.   ఆలయ నిష్క్రమణ ద్వారం వద్ద *కార్ పార్కింగ్* ప్రాంతం నుండి, *కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు* అందుబాటులో ఉంది.   వీక్షించినప్పుడు అన్ని ఇతర పంక్తులు నిలిపివేయబడతాయి.   ఎటువంటి ఒత్తిడి లేదా బలవంతం లేకుండా *సీనియర్ సిటిజన్లు మాత్రమే సందర్శించడానికి అనుమతించబడతారు*.   దర్శన క్యూ తర్వాత *మీరు 30 నిమిషాలలోపు దర్శనం నుండి నిష్క్రమించవచ్చు*.

   *TTD హెల్ప్‌లైన్ తిరుమల 08772277777*


 ప్రత్యేక గమనిక: దయచేసి షేర్ చేయండి చాలా ఉపయోగకరంగా ఉంది.   అన్ని సమూహాలకు చేరువ చేయండి!!

మకుట ధారణ సర్గ*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

 *శ్రీరామ నవమి -మకుట ధారణ సర్గ*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*శ్రీ రామనవమి నాడు మకుట ధారణ సర్గ లేదా కనీసం మకుటధారణకు సంబంధించిన ఈ శ్లోకములనైనా పారాయణ చేయడం విధి*


*శ్రీ వాల్మీకి రామాయణం - యుద్ధకాండ లోని పట్టాభిషేక సర్గ నుండి మకుట ధారణ ఘట్టానికి సంబంధించిన శ్లోకాలు(64 - 67)*


*బ్రహ్మణా నిర్మితం పూర్వం*

*కిరీటం రత్నశోభితమ్౹*

*అభిషిక్తః పురా యేన*

*మనుస్తం దీప్తతేజసమ్!*


*తస్యాన్వవాయే రాజానః* 

*క్రమాద్యేనాభిషేచితాః౹*

*సభాయాం హేమక్లుప్తాయాం* 

*శోభితాయాం మహాధనైః!*


*రత్నైర్నానావిధైశ్చైవ*

*చిత్రితాయాం సుశోభనైః౹*

*నానారత్నమయే పీఠే*

*కల్పయిత్వా యథావిధి!*


*కిరీటేన తతః పశ్చాత్*

*వసిష్ఠేన మహాత్మనా*

*ఋత్విగ్భిర్భూషణైశ్చైవ*

*సమయోక్ష్యత రాఘవః!*


*పూర్వము బ్రహ్మ నిర్మించిన రత్నమయమైన, తేజస్సుతో ప్రకాశించుచున్న కిరీటమును సభామధ్యములో ఉన్న వివిధరత్నములు పొదిగిన పీఠముపై యథావిధిగా ఉంచెను. పట్టాభిషేక సమయమునందు పూర్వము మనుచక్రవర్తి, తరవాత క్రమముగా ఆయన వంశమునకు చెందిన రాజులందరు ఆ కిరీటమును ధరించెడివారు. ఆ మహాసభా భవనము బంగారము చేత అలంకరింపబడెను, చాల విలువైన వస్తువులతో శోభించుచుండెను. అనేక విధములైన చాలా అందమైన రత్నములతో అది చిత్రవర్ణమై ఉండెను. పిదప రత్నపీఠముపై ఉంచిన ఆ కిరీటముని తీసి వసిష్ఠుడు రాముని శిరస్సుపై అలంకరించెను. అనంతరము ఋత్విక్కులు రామునకు ఇతరాలంకారములు అలంకరించిరి.*


*జై శ్రీరామ్౹*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

*శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(98వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

             *శ్రీకృష్ణ లీల*

          *గోవర్థగిరిధారి*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*యాదవులంతా ఇంద్రయాగం చేయాలనుకున్నారు. సంభారాలు సమకూర్చున్నారు. హడావుడి పడసాగారు.*


*గమనించాడది కృష్ణుడు.‘‘ఎందుకిదంతా’’ అడిగాడు.*


*‘‘ఇంద్రుడు మేఘాలకు అధిపతి. ఆ దేవుడు సంతృప్తి చెందితే వర్షాలు బాగా పడతాయి. వర్షాలు బాగా పడితే కరువు కాటకాలు ఉండవు.’’ అన్నారు నందాదులు.*


*‘‘అలాగా’’ అన్నాడు కృష్ణుడు. నవ్వుకున్నాడు. ఇంద్రుడే వర్షం కురిపిస్తున్నట్టూ, అతని దయాదాక్షిణ్యాలతోనే బతుకుతున్నట్టుగా ఉన్న యాదవులందరికీ కళ్ళు తెరిపించాలనుకున్నాడు కృష్ణుడు. అలాగే ఇంద్రుడికి కూడా గర్వభంగం చేయాలనుకున్నాడు.*


*జగద్రక్షకుడు తనకంటే వేరొకరు లేడనీ, ఉండడనీ లోకానికీ తెలియజేప్పేందుకు నడుము బిగించాడు. ఇంద్రయాగం చేయవద్దని చెప్పాడు కృష్ణుడు.*


*‘‘యాగం చేయకపోతే ఇంద్రునికి కోపం రాదూ?’’ అడిగారు.*


*‘‘వస్తే రానీ, ఏం చేస్తాడు? వర్షాలకీ ఇంద్రుడికీ ఎలాంటి సంబంధమూ లేదు. సత్వరజస్తమో గుణాలే లోకకారకాలు. ఈ జగత్తు ఇలా ఆవిర్భవించిందంటే దానికి రజస్సే కారణం. మేఘాలు రజోగుణ కారణంగానే ఉద్భవిస్తాయి. వాటి స్వభావసిద్ధంగా వర్షిస్తాయి. ఇంద్రుడికి ఇందులో సంబంధం ఏముంది?’’ అడిగాడు కృష్ణుడు.*


*‘‘అవును ఏముంది? లేదు లేదు.’’ అనుకున్నారు పెద్దలు.*


*‘‘సర్వం కర్మవశం. ఆ కర్మ దైవాధీనం. ఎవరి కర్మానుసారంగా వారు సుఖదుఃఖాలు అనుభవిస్తారు.’’ అన్నాడు కృష్ణుడు. ఇంద్రయాగం అనవసరం అన్నాడు.‘‘మనకూ మన గోగణాలకూ, బృందావనాది ఈ అడవులకూ గోవర్థనగిరి ప్రాణాధారం. సమస్త ఓషధులను అందజేస్తూ ప్రాణాధారంగా ఉన్న ఆ గోవర్థనగిరిని పూజించండి. పుణ్యం పురుషార్థం లభిస్తాయి, అంతేగాని ఇంద్రుడికెందుకు యాగం?’’ అడిగాడు కృష్ణుడు. సంభారాలన్నీ గోవర్థనోత్సవానికి తరలించమన్నాడు. ఎంత వైభవంగా గోవర్థనోత్సవం జరిపిస్తే అంత వైభవంగా శుభాశీస్సులు అందుకోవచ్చన్నాడు.*


*కృష్ణుడు చెబితే తిరుగేముంది. అలాగేనన్నారు యాదవులు. ఇంద్రయాగం మానుకున్నారు. వైభవంగా గోవర్థనోత్సవాన్ని జరిపేందుకు పూనుకున్నారు. అంతా బళ్ళు కట్టుకుని, బయల్దేరారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కావిళ్ళకెత్తారు. ఉప్పు, పప్పు, బియ్యం, కూరలు బళ్ళకెత్తారు. వేదమంత్రాలు బ్రాహ్మణులు పఠిస్తోంటే, మంగళవాద్యాలు మోగుతోంటే గోవర్థనపర్వతాన్ని సమీపించారంతా. హోమాలు చేశారు. పూజించారు. బ్రాహ్మణులకు భూరిదక్షిణలూ, దానాలూ ఇచ్చారు. గోపూజ చేశారు. తర్వాత గోవర్థనగిరిని పూజించారు. బలులిచ్చారు.*


*కృష్ణుడప్పుడు తన దేహాన్ని పెంచి, గోవర్థనగిరి తానేనన్నట్టుగా ఆ బలులన్నింటినీ స్వీకరించాడు. గోవర్థనగిరికి ప్రదక్షిణ చేశారు యాదవులు. నృత్యగానాలతో, క్రీడలతో ఆనందించారు. గోవర్థనోత్సవం ముగిసింది.*


*తనకు యాగం తలపెట్టి, యాగం చెయ్యలేదు. పైగా గోవర్థనగిరికి పూజలు చేశారు. కృష్ణుడు చెబితే తలలూపారంతా. సహించలేకపోయాడు ఇంద్రుడు. యాదవుల పొగరణచాలనుకున్నాడు. జ్ఞానాన్ని కోల్పోయాడతను. కృష్ణుణ్ణి సామాన్య మానవునిగా తలచి, గోకులాన్ని సర్వనాశనం చేసేందుకు కోపంతో పిడికిలి బిగించాడు.*


*అతని వద్ద సంవర్తక మేఘగణాలు ఉన్నాయి. జగత్తును అంతం చేసే మేఘాలవి. వాటిని ప్రళయేతర సమయాల్లో విజృంభించకుండా బంధిస్తారు. కట్లు విప్పితే వాటిని పట్టశక్యం కాదు. జగత్తంతా అల్లకల్లోమయిపోతుంది. కావాల్సింది అదే అనుకున్నాడు ఇంద్రుడు. ఆ మేఘగణాలను పిలిచాడు.*


*‘‘మీరు వెళ్ళి గోకులంపై వర్షించండి. గోపాలురనూ, గోగణాలనూ సర్వనాశనం చేసేయండి. నేనీలోపు ఐరావతం అధిరోహించి వస్తాను.’’ అన్నాడు. సరేనన్నాయి సంవర్తకమేఘాలు. గోకులం మీద విరుచుకుని పడ్డాయి.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                *విరచిత*

         *”శివానందలహరి”*

            *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శంకరులు ఈ శ్లోకంలో తనను రక్షింపుమని ఈశ్వరుణ్ణి కోరారు.*


*శ్లోకం : 66*


*క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః*


*యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ ।*


*శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం*


*తస్మాన్మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా ।।*


*తాత్పర్యము :-*


*ಓ పరమేశ్వరా !  ಓ పశుపతీ !  నీవు నీ వినోదము కొరకే, ఈ సర్వ ప్రపంచాన్నీ సృష్టిస్తున్నావు.  ఈ జనమంతా  నీ వినోదం కోసం ఏర్పడ్డ జంతువులు. వారి వారి పెంపుడు జంతువుల నడవడులు, వారికి ప్రేమాస్పదములు కావడం జగత్ప్రసిద్దమే.  కాబట్టి నేను చేసే సత్కర్మలు గానీ, దుష్కర్మలు గానీ, ఏ చేష్టలయినా, నీకు అవి తృప్తికరములే అవుతాయి. కాబట్టి నీవు నన్ను రక్షింపవలసిన వాడవు అవుతున్నావు.  (పిల్లలు తమ ఆట బొమ్మలను తాము రక్షించుకొనే విధంగా నీవే నా రక్షణమును చేయవలసి యుంది ) అది నీ కర్తవ్యం.*


*వివరణ :-*


*శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుడికి ఇలా నివేదించారు*


*" ಓ శంభూ ! పశుపతీ ! ఈ ప్రపంచాన్ని సర్వమునూ నీవే నీ ఆట కోసం పుట్టిస్తూ వున్నావు. నీవు సర్వ వాంఛలూ తీరినవాడవు. అలాటప్పుడు  ఈ పంచభూతాలు అనే ముడి పదార్థాలతో నీవు నిర్మించే ఈ ప్రపంచం, నీవు సరదాగా ఆడుకోవడం కోసమే. ఈ ప్రపంచములోని జనులంతా నీ చేతిలోని కీలుబొమ్మలు*. *వీరంతా నీ విలాసం కోసం సృష్టించబడ్డ మృగాలు.  వీరు నీవు ఆడించినట్లల్లా ఆడుతారు.* *నీవు తిప్పేవాడవు, వారు తిరిగేవారు. నీవు జగన్నాటక సూత్రధారివి. ఈ ప్రపంచానికీ దీనిలోని ప్రజలకు ఏమాత్రం స్వతంత్రత లేదు* 


*కాబట్టి నాతప్పేమీ లేదు . నేను చేసిన తప్పేదైనా వుంటే నేను ఒకడిని ఉన్నానని అనుకోవడం మాత్రమే. ప్రపంచములో ఉన్నదంతా నీవే. అందువల్ల నేను మంచి చేసినా ,చెడు చేసినా అది నీకు ప్రీతికరంగా ఉండాలి .  నేను చేసిన చేష్టలన్నీ నీ వేడుకకు సాధనములు.  కాబట్టి నన్ను రక్షించడం నీ కర్తవ్యం.*


*తోలుబొమ్మలాటలో బొమ్మలన్నీ సూత్రధారుని ఇష్టానుసారంగా తిరిగి వినోదాన్ని కల్పిస్తాయి. అదేవిధంగా జగన్నాటక సూత్రధారుడైన పరమాత్మ ఇచ్ఛాను సారంగా నడిపే మన జీవితరూపమైన ఈ జగన్నాటకం, పరమేశ్వరుని కి వినోదాన్నే కల్పిస్తుంది.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

రామాయణం సంబంధ 55 పుస్తకాలు

 🙏 *శుభోదయం*🙏


*రామాయణం సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో!. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

                    🌼🌼🌼


🌞సంపూర్ణ వాల్మీకి రామాయణం(వచన) www.freegurukul.org/g/Ramayanam-1


🌞వాల్మీకి సంపూర్ణ రామాయణం(పద్య+తాత్పర్యం) www.freegurukul.org/g/Ramayanam-2


🌞వాల్మీకి రామాయణం-బాల,అయోధ్య,సుందర,ఉత్తర కాండ-అంతరార్ధం www.freegurukul.org/g/Ramayanam-3


🌞చిత్ర రూపంలో సంపూర్ణ వాల్మీకి రామాయణం www.freegurukul.org/g/Ramayanam-4


🌞రామ కథాసుధ-1,2 భాగాలు www.freegurukul.org/g/Ramayanam-5


🌞రామచరిత మానసము www.freegurukul.org/g/Ramayanam-6


🌞సుందర కాండ-పారాయణము www.freegurukul.org/g/Ramayanam-7


🌞సంపూర్ణ ఆంధ్ర శ్రీ మద్రామాయణము www.freegurukul.org/g/Ramayanam-8


🌞రామచరిత మానస్-తులసీ రామాయణం www.freegurukul.org/g/Ramayanam-9


🌞రామాయణం www.freegurukul.org/g/Ramayanam-10


🌞తులసీ రామాయణము www.freegurukul.org/g/Ramayanam-11


🌞యోగ వాసిష్ఠ సారము www.freegurukul.org/g/Ramayanam-12


🌞యోగ వాశిష్ఠ సంగ్రహము www.freegurukul.org/g/Ramayanam-13


🌞రామాయణ రహస్య రత్నావళి www.freegurukul.org/g/Ramayanam-14


🌞రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-15


🌞బాలల బొమ్మల సంపూర్ణ రామాయణం www.freegurukul.org/g/Ramayanam-16


🌞రామాయణం పాత్రల ఆదర్శం www.freegurukul.org/g/Ramayanam-17


🌞రామాయణంలో విశిష్ట పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-18


🌞బాలానంద బొమ్మల రామాయణం www.freegurukul.org/g/Ramayanam-19


🌞వాల్మీకి రామాయణం-సంబంధాలు www.freegurukul.org/g/Ramayanam-20


🌞రామాయణ పరమార్ధం www.freegurukul.org/g/Ramayanam-21


🌞శ్రీ రామాయణ రహస్యం www.freegurukul.org/g/Ramayanam-22


🌞రామాయణ తరంగిణి-1 www.freegurukul.org/g/Ramayanam-23


🌞రామాయణ తరంగిణి-2 www.freegurukul.org/g/Ramayanam-24


🌞శ్రీరామాయణ కథా సుధ www.freegurukul.org/g/Ramayanam-25


🌞వాల్మీకి రామాయణము-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-26


🌞వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము www.freegurukul.org/g/Ramayanam-27


🌞చిత్రరూపంలో రామాయణం www.freegurukul.org/g/Ramayanam-28


🌞వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ www.freegurukul.org/g/Ramayanam-29


🌞వాల్మీకి రామాయణము-అయోధ్య కాండ www.freegurukul.org/g/Ramayanam-30


🌞వాల్మీకి రామాయణము-అరణ్య కాండము www.freegurukul.org/g/Ramayanam-31


🌞వాల్మీకి రామాయణము-కిష్కింద కాండ www.freegurukul.org/g/Ramayanam-32


🌞వాల్మీకి రామాయణము-యుద్ధ కాండ-2 వ భాగము www.freegurukul.org/g/Ramayanam-33


🌞వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ-2 వ భాగము www.freegurukul.org/g/Ramayanam-34


🌞శత శ్లోకి వాల్మీకి రామాయణం www.freegurukul.org/g/Ramayanam-35


🌞జాతి జీవనంపై  రామాయణ ప్రభావం www.freegurukul.org/g/Ramayanam-36


🌞రామాయణమంటే www.freegurukul.org/g/Ramayanam-37


🌞రామాయణ సారస్వత దర్శనము www.freegurukul.org/g/Ramayanam-38


🌞అంతరార్ధ రామాయణము www.freegurukul.org/g/Ramayanam-39


🌞రామాయణ విశేషాలు www.freegurukul.org/g/Ramayanam-40


🌞శ్రీమద్వాల్మీకి రామాయణోపన్యాసములు-అయోధ్య,అరణ్య,కిష్కింద కాండ www.freegurukul.org/g/Ramayanam-41


🌞శ్రీరామ కథామృతము - సమగ్ర సమీక్ష www.freegurukul.org/g/Ramayanam-42


🌞శ్రీరామ కథామృతము www.freegurukul.org/g/Ramayanam-43


🌞జీవన చిత్రాలు-రామయణ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-44


🌞రామాయణ పాత్రలు www.freegurukul.org/g/Ramayanam-45


🌞లక్ష్మణుడు www.freegurukul.org/g/Ramayanam-46


🌞లక్ష్మణుడు www.freegurukul.org/g/Ramayanam-47


🌞భరతుడు www.freegurukul.org/g/Ramayanam-48


🌞కళ్యాణ రాముడు www.freegurukul.org/g/Ramayanam-49


🌞కాళిదాసు రామకథ www.freegurukul.org/g/Ramayanam-50


🌞బాలానంద కుశలవుల కథ www.freegurukul.org/g/Ramayanam-51


🌞రావణ రాజ్యము-రామ రాజ్యము www.freegurukul.org/g/Ramayanam-52


🌞రామాయణోపన్యాస మంజరి www.freegurukul.org/g/Ramayanam-53


🌞వాల్మీకి వచన రామాయణము-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-54


🌞వాల్మీకి రామాయణోపన్యాసములు-బాల కాండము www.freegurukul.org/g/Ramayanam-55


🌞రామాయణం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


🌞ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

సోమవారం🕉️* *🌹07, ఏప్రిల్, 2025🌹* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

*🌹07, ఏప్రిల్, 2025🌹*  

   *ధృగ్గణిత పంచాంగం*

 

  *స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - శుక్లపక్షం*

*తిథి : దశమి* రా 08.00 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం : పుష్యమి* ఉ 06.25 ఉపరి *ఆశ్లేష*

*యోగం  : ధృతి* సా 06.19 వరకు ఉపరి *శూల*

*కరణం : తైతుల* ఉ 07.36 *గరజి* రా 08.00 ఉపరి *వణజి*

 *సాధారణ శుభ సమయాలు*

         *ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*

అమృత కాలం : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.45 - 12.34*


*వర్జ్యం : రా 08.01 - 09.43*

*దుర్ముహూర్తం : మ 12.34 - 01.24 & 03.03 - 03.53*

*రాహు కాలం : ఉ 07.31 - 09.04*

గుళికకాళం : *మ 01.42 - 03.15*

యమగండం : *ఉ 10.37 - 12.10*

సూర్యరాశి : *మీనం* చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.58* 

సూర్యాస్తమయం :*సా 06.21*

*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం          :  *ఉ 05.58 - 08.27*

సంగవ కాలం         :      *08.27 - 10.55*

మధ్యాహ్న కాలం  :      *10.55 - 01.24*

అపరాహ్న కాలం   : *మ 01.24 - 03.53*

*ఆబ్ధికం తిధి        : చైత్ర శుద్ధ దశమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.21*

ప్రదోష కాలం         :  *సా 06.21 - 08.40*

రాత్రి కాలం : *రా 08.40 - 11.46*

నిశీధి కాలం          :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.24 - 05.11*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*

*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం*

*జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదమ్ ।*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

ధర్మరాజ దశమి విశిష్టత

 *ధర్మరాజ దశమి విశిష్టత తెలుసా? యముడిని ఎలా పూజించాలి?*

*యమ బాధలు, మరణ భయాన్ని పోగొట్టే ధర్మరాజ దశమి*

యముడు అంటే అందరికీ భయం. యముడి పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్టే అని భావిస్తారు అంతా. అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైనవాడు. చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే. అలాంటి యమధర్మరాజును పూజించే సందర్భాలు అతి తక్కువగా ఉంటాయి. అందులో ఒకటి ధర్మరాజ దశమి. ఈ కథనంలో ధర్మరాజ దశమి ఎప్పుడు జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటారు?


> ఏమిటీ ధర్మరాజ దశమి?

చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. శ్రీరామనవమి మరుసటిరోజు వచ్చే ధర్మరాజ దశమి రోజు యముడిని పూజిస్తే మరణభయం తొలగిపోతుందని పెద్దలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ధర్మరాజ దశమి రోజు నచికేతుడి కథ వినడం వలన మరణ భయం తొలగిపోతుందని శాస్త్రవచనం. ఏప్రిల్ 7 వ తేదీ సోమవారం ధర్మరాజ దశమి సందర్భంగా ఆ విశేషాలు తెలుసుకుందాం.


> ఎవరీ నచికేతుడు?

పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈయన కొడుకే నచికేతుడు.


> నచికేతుని కథ!

పూర్వం వజాశ్రవుడు ఒక యాగం చెయ్యాలి అనుకున్నాడు. ఆ యాగంలో తన దగ్గరున్న సంపదలు అన్నీ దానం చేసేయ్యాలి. కానీ వాజశ్రవుడు యాగం అయిపోయిన తరువాత అక్కడికి వచ్చిన వాళ్లకు తన దగ్గరున్న ఆవులలో పాలు ఇవ్వలేని, ఒట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నాడు.


> తండ్రికి అడ్డు చెప్పిన నచికేతుడు

తండ్రి చేసిన పని నచికేతుడికి నచ్చలేదు. అప్పుడు నచికేతుడు తన తండ్రితో "ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏంటి? ఒకపని చెయ్యండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి" అని అన్నాడు నచికేతుడు. నచికేతుని మాటలను పిల్ల చేష్టలుగా భావించి వాజశ్రవుడు తనను విసిగించవద్దని మందలిస్తాడు.


> పట్తు వదలని నచికేతుడు

వాజశ్రవుడు మందలించినా నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చివరకు విసిగిపోయిన వాజశ్రవుడు "నిన్ను యముడికి ఇస్తాను" అని చిరాకుగా అంటాడు. ఆ తరువాత తప్పు తెలుసుకుని తాను తొందరపాటులో అన్నానని ఆ మాటలు పట్టించుకోవద్దని చెబుతాడు.


> యముని వద్దకు వెళ్లిన నచికేతుడు

పవిత్రమైన యాగస్థలంలో తండ్రి వాజశ్రవుడు అన్న మాట వృధా కాకూడదని నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళాడు. కానీ అతనికి యముడి దర్శనం తొందరగా దొరకలేదు. ఆ తరువాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక "మీ నాన్న ఏదో మాటవరుసకు అంటే నువ్వు వచ్చేసావా వెళ్లిపో! నీకు మూడు వరాలు ఇస్తాను" అన్నాడు.



> నచికేతునికి యముడు ఇచ్చిన మూడు వరాలు!

యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మూడు వరాలు కోరుకుంటాడు.

మొదటి వరం: నేను తిరిగి వెళ్తే మా నాన్న నామీద కోపం చేసుకోకూడదు అని అడుగుతాడు.

రెండో వరం: స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పమని యముని కోరుతాడు.

మూడో వరం: మరణం తరువాత ఏమి జరుగుతుంది? అని అడుగుతాడు.


> మొదటి రెండు వరాలు అనుగ్రహించిన యముడు

నచికేతుడు కోరిన మొదటి వరానికి యముడు ఒప్పుకుంటాడు. రెండో దానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అనే పేరు పెడతాడు.


> మూడో వరానికి నిరాకరించిన యముడు

మూడో వరంగా నచికేతుడు మరణానంతరం ఏమి జరుగుతుందో చెప్పమని అడిగాడు. యముడు నచికేతుడు చిన్న పిల్లవాడు అని అతనికి ఇప్పుడే ఇవన్నీ అవసరం లేదని అంటాడు.


> మొండి పట్టు పట్టిన నచికేతుడు

నచికేతుడు మొండిపట్టు పట్టడంతో యముడు అతనికి బ్రహ్మజ్ఞానం భోదిస్తాడు. అదే ఆత్మజ్ఞానంగా పెద్దలు చెబుతారు. ఆత్మజ్ఞానం కలిగినవాడు మరణాన్ని గురించి భయపడడు.


> మరణ భయాన్ని తొలగించే నచికేత యజ్ఞం

ధర్మరాజ దశమి రోజు నచికేత యజ్ఞం చేసినవారికి మరణ భయం ఉండదని శాస్త్రవచనం. యజ్ఞం చేయలేకపోయినా కనీసం ఈ కథ విన్నాసరే మరణభయం ఉండదని పెద్దలు అంటారు. అందుకే ఈ ధర్మరాజ దశమి ఎంతో ప్రాముఖ్యం పొందింది. ఒకసారి స్వామి వివేకానంద నచికేతుడి లాంటి పదిమంది శిష్యులను నాకు ఇస్తే ఈ దేశాన్ని మార్చేస్తాను అని అన్నాడు. అంటే నచికేతుడు గుణంలోనూ, పట్టుదలలోనూ ఆలోచనల్లోనూ ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని ప్రత్యేకంగా చెప్పాలా? రానున్న ధర్మరాజ దశమి రోజు నచికేతుని కథను చదువుకుందాం. మరణ భయాన్ని తొలగించుకుందాం. 

శుభం భూయాత్!


ధర్మరాజ దశమి

 *ధర్మరాజ దశమి విశిష్టత తెలుసా? యముడిని ఎలా పూజించాలి?*

*యమ బాధలు, మరణ భయాన్ని పోగొట్టే ధర్మరాజ దశమి*

యముడు అంటే అందరికీ భయం. యముడి పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్టే అని భావిస్తారు అంతా. అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైనవాడు. చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే. అలాంటి యమధర్మరాజును పూజించే సందర్భాలు అతి తక్కువగా ఉంటాయి. అందులో ఒకటి ధర్మరాజ దశమి. ఈ కథనంలో ధర్మరాజ దశమి ఎప్పుడు జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటారు?


> ఏమిటీ ధర్మరాజ దశమి?

చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. శ్రీరామనవమి మరుసటిరోజు వచ్చే ధర్మరాజ దశమి రోజు యముడిని పూజిస్తే మరణభయం తొలగిపోతుందని పెద్దలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ధర్మరాజ దశమి రోజు నచికేతుడి కథ వినడం వలన మరణ భయం తొలగిపోతుందని శాస్త్రవచనం. ఏప్రిల్ 7 వ తేదీ సోమవారం ధర్మరాజ దశమి సందర్భంగా ఆ విశేషాలు తెలుసుకుందాం.


> ఎవరీ నచికేతుడు?

పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈయన కొడుకే నచికేతుడు.


> నచికేతుని కథ!

పూర్వం వజాశ్రవుడు ఒక యాగం చెయ్యాలి అనుకున్నాడు. ఆ యాగంలో తన దగ్గరున్న సంపదలు అన్నీ దానం చేసేయ్యాలి. కానీ వాజశ్రవుడు యాగం అయిపోయిన తరువాత అక్కడికి వచ్చిన వాళ్లకు తన దగ్గరున్న ఆవులలో పాలు ఇవ్వలేని, ఒట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నాడు.


> తండ్రికి అడ్డు చెప్పిన నచికేతుడు

తండ్రి చేసిన పని నచికేతుడికి నచ్చలేదు. అప్పుడు నచికేతుడు తన తండ్రితో "ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏంటి? ఒకపని చెయ్యండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి" అని అన్నాడు నచికేతుడు. నచికేతుని మాటలను పిల్ల చేష్టలుగా భావించి వాజశ్రవుడు తనను విసిగించవద్దని మందలిస్తాడు.


> పట్తు వదలని నచికేతుడు

వాజశ్రవుడు మందలించినా నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చివరకు విసిగిపోయిన వాజశ్రవుడు "నిన్ను యముడికి ఇస్తాను" అని చిరాకుగా అంటాడు. ఆ తరువాత తప్పు తెలుసుకుని తాను తొందరపాటులో అన్నానని ఆ మాటలు పట్టించుకోవద్దని చెబుతాడు.


> యముని వద్దకు వెళ్లిన నచికేతుడు

పవిత్రమైన యాగస్థలంలో తండ్రి వాజశ్రవుడు అన్న మాట వృధా కాకూడదని నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళాడు. కానీ అతనికి యముడి దర్శనం తొందరగా దొరకలేదు. ఆ తరువాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక "మీ నాన్న ఏదో మాటవరుసకు అంటే నువ్వు వచ్చేసావా వెళ్లిపో! నీకు మూడు వరాలు ఇస్తాను" అన్నాడు.



> నచికేతునికి యముడు ఇచ్చిన మూడు వరాలు!

యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మూడు వరాలు కోరుకుంటాడు.

మొదటి వరం: నేను తిరిగి వెళ్తే మా నాన్న నామీద కోపం చేసుకోకూడదు అని అడుగుతాడు.

రెండో వరం: స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పమని యముని కోరుతాడు.

మూడో వరం: మరణం తరువాత ఏమి జరుగుతుంది? అని అడుగుతాడు.


> మొదటి రెండు వరాలు అనుగ్రహించిన యముడు

నచికేతుడు కోరిన మొదటి వరానికి యముడు ఒప్పుకుంటాడు. రెండో దానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అనే పేరు పెడతాడు.


> మూడో వరానికి నిరాకరించిన యముడు

మూడో వరంగా నచికేతుడు మరణానంతరం ఏమి జరుగుతుందో చెప్పమని అడిగాడు. యముడు నచికేతుడు చిన్న పిల్లవాడు అని అతనికి ఇప్పుడే ఇవన్నీ అవసరం లేదని అంటాడు.


> మొండి పట్టు పట్టిన నచికేతుడు

నచికేతుడు మొండిపట్టు పట్టడంతో యముడు అతనికి బ్రహ్మజ్ఞానం భోదిస్తాడు. అదే ఆత్మజ్ఞానంగా పెద్దలు చెబుతారు. ఆత్మజ్ఞానం కలిగినవాడు మరణాన్ని గురించి భయపడడు.


> మరణ భయాన్ని తొలగించే నచికేత యజ్ఞం

ధర్మరాజ దశమి రోజు నచికేత యజ్ఞం చేసినవారికి మరణ భయం ఉండదని శాస్త్రవచనం. యజ్ఞం చేయలేకపోయినా కనీసం ఈ కథ విన్నాసరే మరణభయం ఉండదని పెద్దలు అంటారు. అందుకే ఈ ధర్మరాజ దశమి ఎంతో ప్రాముఖ్యం పొందింది. ఒకసారి స్వామి వివేకానంద నచికేతుడి లాంటి పదిమంది శిష్యులను నాకు ఇస్తే ఈ దేశాన్ని మార్చేస్తాను అని అన్నాడు. అంటే నచికేతుడు గుణంలోనూ, పట్టుదలలోనూ ఆలోచనల్లోనూ ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని ప్రత్యేకంగా చెప్పాలా? రానున్న ధర్మరాజ దశమి రోజు నచికేతుని కథను చదువుకుందాం. మరణ భయాన్ని తొలగించుకుందాం. 

శుభం భూయాత్!


కసాయి తల్లి....*

 *కవిత శీర్షిక:*

     *కసాయి తల్లి....*


మాజీ ప్రియుడి మోజులో పడి తన కామ కేళికి అడ్డుగా ఉన్నారని ప్రియుడి ఆజ్ఞను అమలు చేసింది.....

దైవం లాంటి ముగ్గురి పసి బిడ్డలను కడతేర్చిన ఓ కసాయి తల్లి....

కనీసం కన్నీరైనా పెట్టని పాషాణపు హృదయురాలు....

కంటేనే అమ్మ అని అంటే ఎలా? అని, 

మన సి.నా.రే అన్నట్టు. కన్న పేగు చచ్చి, కామ వాంచ పెరిగి, బిడ్డలకు విషమిచ్చి చంపింది. 

ఇది మాతృ ప్రేమకే మహా కళంకం....

ఆ ముగ్గురి పిల్లల మృతదేహాలను చూసి కన్నతండ్రి మనసు తల్లడిల్లింది, మాతృమూర్తులు, మానవతావాదులు, కవులు, గాయకులు మౌనంగా ఉంటున్నారే తప్ప తలలు ఎత్తి ఖండించ లేకపోతున్నారు....

వద్దమ్మా వద్దు, ఏ బిడ్డలకు ఇలాంటి తల్లి వద్దు, ఇలాంటి గతి ఏ బిడ్డలకు రావద్దు...

మోజు తీరాక నీ మాజీ ప్రియుడు నీ ఆస్తి అంతా హస్తగతం చేసుకొని, నిన్ను ఒంటరి చేయడమో, ఈ లోకం నుండి పంపించమో ఖాయం...

మాతృమూర్తులారా, మాతృ ప్రేమలను కాపాడండి, మానవజాతి మనుగడకు ప్రాణం పోయండి....


 *గరిడేపల్లి శోభనాద్రి, కవి, ఖమ్మం, T G. చరవాణి: 8897785495*

సీతారాముల కళ్యాణము*

 *****************************

*సీతారాముల కళ్యాణము*

*చూచెదము రారండి జనులార*

*****************************

సీస పద్యము.

శ్రీరాముడు వరుడు శ్రేయస్కరము

గను

    సీతమ్మ వధువు సౌశీల్యవతిగ

చైత్ర మాసము,అభిజిత్ సుము హూర్తము

     శుక్లపక్ష నవమి శుభ ఘడియలు

కళ్యాణము జరిగె కమనీయముగ

దేవ

   తలు,ఋషుల్ దీవించె తనివితీర

ముల్లోకములు మెచ్చెముచ్చటగా

ను,హ

     ర్షించె భూసురులు,వర్షించె 

     మేఘ

తే.గీ.

మాల చక్కగాసకల ప్రామాణికంబు

గాను,శోభాయమానంబుగాను పెండ్లి

జరిగె భూలోకమంతటా యరుగు లాక

స సమమూ పందిరీ తోడ సందడిగను.

2.తే.గీ.

నిండు సత్య వాక్పరిపాలకుండు 

నిజము,

హితము ఏకపత్నీవ్రతుం తోడు

నిజము,

కూర్మి పితృవాక్పరీపాలకుండు

నిజము,

మంచి జనుల పాలిట దైవ మతడు

నిజము.

3.ఆ.వె.

రాము డంత మంచి రాజు భూ

మండల

మందు లేడు, మరియు మంచి పాల

కుండు,ప్రజలహితము కూర్మి 

వాంఛించెడీ

చక్రవర్తి ఇతడె జగతి నందు.

4.తే.గీ.

రామ శ్రీరామ జయరామ రక్ష!రక్ష!

రామ దశరధ తనయుడారక్ష!రక్ష!

రామ కౌసల్య కొమరుడా రక్ష!రక్ష!

రామ జానకీ నాధుడా రక్ష!రక్ష!

5.కందము.

శ్రీరామ జయ జయ మనో

హరా సకల సద్గుణాభి హాసా రామా

శ్రీరామ మమ్ము బ్రోవుము

ఓ రామా చక్కగాను ఓరిమి

తోడన్!

*****************************

రచన.దామర్ల నాగేశ్వరరావు.

           9908568099.

విల్లా నెం.24.

     గోల్డెన్ పామ్స్ ,మోడి కాంప్లెక్స్.

లింగమయ్య విగ్రహం వద్ద

రామాలయం వద్ద

అమీన్ పూర్ 

హైదరాబాద్-502032.

*****************************

శ్రీరాముని చరితం

 శీర్షిక :  శ్రీరాముని చరితం


సుతుల కోసం చేసేను

దశరధుడు పుత్రకామేష్టి యాగం

ఆ యాగ ఫలంగా

రామ లక్ష్మణ భరత శతృఘనుల జననం!


నలుగురు మాతల ప్రియపుత్రులై

అల్లారు ముద్దుగా పెరిగిరి

అన్ని విద్యల్లో అరితేరిరి

గురువుల ఆజ్ఞలను నెరవేర్చిరి!


విశ్వామిత్రుని యాగ సంరక్షణకై

దశరధుని ఆనాతి మేరకు

రామ లక్ష్మణులు కానల కేగిరి

రాక్షసి తాటకిని సంహరించిరి!


జనకుని సీతా స్వయంవరం

రామ లక్ష్మణుల ఆగమనం

విశ్వామిత్రుని ఆశీస్సుల ఫలం

రాముడు విరిసెను శివధనుస్సును వేగిరం!


జరిగెను సీతారాముల కళ్యాణం

విరిసెను జగతిన సంతసం

తండ్రి ఆజ్ఞ పాలనకై

సీతా సామేతంగా అడవుల కేగిరి రామ లక్ష్మణులు సత్వరం!


రావణునిచే సీతాపహరణం

రామునిచే రావణ సంహారం

అయోధ్య కు శ్రీరామ పట్టాభిషేకం

ఇదియే మారుతి గానామృత శ్రీరాముని చరితం!


*************************-**********-**

రచన :

ఆళ్ల నాగేశ్వరరావు

కవి... రచయిత... ఆర్టీసీ కండక్టర్

నాజరుపేట

తెనాలి....522201

గుంటూరు.... జిల్లా

ఆంధ్రప్రదేశ్.... రాష్ట్రము

చరవాణి '7416638823


************************************


హామీ పత్రం :


ప్రజాశక్తి సంపాదకులకు నమస్సులు!


ఆర్యా!


చిన్నారి శీర్షికలో ప్రచురణ కొరకు పంపుచున్న

పై బాలగేయం నా స్వీయరచనేనని, ఇది ద

పునరుత్పత్తి

 పునరుత్పత్తి!!!

     డా ప్రతాప్ కౌటిళ్యా.


అర్థం కానిదేదైనా 

తికమకగానే ఉంటుంది!!?


అర్థం కానిదేదైనా 

అస్పష్టంగానే ఉంటుంది!!?


అది భాష అయినా భావమైనా 

భావోద్వేగమైన ఏదైనా!!?


అర్థం కానిదేదైనా 

జ్ఞాపకంగా మారదు!!!


జ్ఞాపకం గా మారకుంటే ప్రతిభ లేదని కాదు 

దాని పునరుత్పత్తి ఉండదు.!!!


నీకు అర్థమైన  దాన్నే 

నీ మెదడు అంగీకరిస్తుంది!!

జ్ఞాపకం గా మారుస్తుంది.!!


అది భాష అయినా భావమైన 

భావోద్వేగమైన ఏదైనా!!!?


అర్థం చేసుకోవడానికి ఏది 

అడ్డు కాకుంటే 

ప్రజ్ఞా ప్రతిభా కావాలి!!!!!!?

కానీ 


జ్ఞాపకంగా మారాలంటే 

మెదడు ఆజ్ఞ కావాలి అది ప్రజ్ఞా కాదు ప్రతిభా కాదు.


కేవలం పునరుత్పత్తి!!!?


డా ప్రతాప్ కౌటిళ్యా 👏

ఇంటింటా శ్రీ‌రామాయ‌ణ*

 *ఇంటింటా శ్రీ‌రామాయ‌ణ*

*దివ్య‌క‌థా పారాయ‌ణం*

          *9 వ రోజు*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీరామ పట్టాభిషేక మ‌హోత్స‌వం*


 శ్రీ సీతా ల‌క్ష్మ ణ స‌మేతంగా శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి అయోధ్య‌లో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌జ‌లు సంబ‌రాల‌లో మునిగితేలుతున్నారు.

శ్రీరామ పట్టాభిషేకానికి సుముహూర్తం నిశ్చయమయ్యింది. సుగ్రీవాజ్ఞతో జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు సుషేణుడు, గవయుడు, నలుడు నదీనద సముద్ర జలాలు తెచ్చారు. వసిష్ఠ మహర్షి ఋత్విక్కులతో కలిసి సీతారాములను రత్న సింహాసనంపై కూర్చుండబెట్టారు. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, తరువాత ఋత్విక్కులు, బ్రాహ్మ ణులు, కన్యలు, యోధులు వారిని పుణ్యనదీ జలాలతో అభిషేకించారు. వారితోబాటే లోకపాలకులు, దేవతలు శ్రీరామచంద్రుడిని అభిషేకించారు. వాయుదేవుడు స్వయంగా బంగారు తామరపూల మాలికను రాముని మెడలో వేశాడు.  వేద వేత్తలు మంత్ర పఠనం సాగిస్తున్నారు. శ్రీ  సీతారామచంద్రమూర్తి కీ జై అంటూ జనం జేజేలు పలుకుతుండగా,ర‌త్న కిరీటాన్ని వ‌శిష్ఠుల‌వారు రాముడి శిర‌స్సుపై అలంక‌రింప చేశారు .

 దేవతలు పుష్ప వర్షం కురిపించారు. రాముడు బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడు. సుగ్రీవ, విభీషణ, జాంబవంతాది మహావీరులకు అనేక బహుమతులిచ్చి సత్కరించాడు.

శ్రీరాముడు సీతకు నవరత్నాలూ పొదిగిన ఒక ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత ,శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ,ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. రాముని వ‌ద్ద‌ సెలవు తీసికొని విభీషణుడు లంకకు, వానరులు కిష్కింధకు తరలిపోయారు.

యువరాజుగా ఉండమ‌ని రాముడు,లక్ష్మణుడిని కోరాడు. ల‌క్ష్మ‌ణుడు  అందుకు సమ్మతించలేదు. భరతునకు యువరాజ్యాభిషేకం చేశాడు రాముడు. తరువాత శ్రీరాముడు అశ్వమేధం, పౌండరీకం, మరెన్నో క్రతువులు చేశాడు. లక్ష్మణుడు తనకు సాయపడుతూ ఉండగా రాముడు జనమనోభిరాముడై రాజ్యపాలన చేశాడు. శ్రీరాముని రాజ్యంలో జనులు సుఖసంతోషాలతో ఉన్నారు.

ప్రజలు  ధర్మపరాయణులై ఉండేవారు. ఎవ‌రి నోట విన్నా  రామ‌, రామ , రామ అన్న మాట త‌ప్ప మ‌రో మాట లేదు.

 ******

                *ఉత్తర కాండ*

******

శ్రీ రామ పట్టాభిషేకం తరువాత అయోధ్యలో అంతటా సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి. శ్రీ రాముని పాలనలో ప్రజలు ఏ కష్టం లేకుండా సుఖంగా జీవనం సాగించేవారు. ఇలా ఉండగా ఒక రోజు రాముడు ఏకాంతసమయంలో సీతను చేరి" దేవీ! నీవు తల్లివి కాబోతున్నావు. నీ మనస్సులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు. " అని అడిగాడు. అందుకు సీత " నాధా, గంగా తీరంలో ఉన్న ముని ఆశ్రమాలలో పళ్ళు, కందమూలాలు ఆరగిస్తూ ఒక్కరోజు గడపాలని ఉంది. ": అంటుంది. అందుకు సరే నంటాడు రాముడు. కానీ సీత కోరిక వినగానే  రాముడు   బాధపడతాడు.

*సీత గురించిన నింద*

 ఒక రోజు  రాముడు తన పరిపాలన ఎలా సాగుతున్నదో తెలుసుకోవడానికసన్నిహితుడైన భద్రునితో" భద్రా! నా పరిపాలన ఎలావున్నది? ప్రజలకు ఎలాంటి సమస్యలూ లేవుగదా? నిజం చెప్పు.?" అని అడుగుతాడు. అందుకు భద్రుడు" మహారాజా! సత్యసంధుడివైన నీకు నిజం చెప్తున్నాను. ప్రజలు నీ పరాక్రమాలను, రావణ సంహారాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. అయితే, రావణ చెరలో కొన్నాళ్ళు ఉన్న సీతమ్మను తిరిగి మీరు భార్యగా స్వీకరించడం గురించి మాత్రం రక రకాలుగా చెప్పుకొంటున్నారు. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి" అన్నాడు. రాముడు సరేనని వారినందరిని పంపించి విషాదచిత్తుడై తమ్ముళ్ళను పిలిపిస్తాడు. వారు రావడంతోనే రాముని వదనం చూసి నిశ్చేష్టులవుతారు. రాముడు వారిని కూర్చోమని జరిగిన సంగతి అంతా వివరిస్తాడు. " లక్ష్మణా! సూర్య చంద్రులు, అగ్ని,ఇంద్రాది దేవతలు కూడా ఆమె సౌశీల్యాన్ని శ్లాఘించారు. కానీ అయోధ్యలో ఇంకా అపవాదు తొలగలేదు. జనం తమ తప్పు తెలుసుకునే వరకు , ఆమెను పరిత్యజించడం తప్ప వేరు మార్గం కనపడడం లేదు. కొద్ది సమయం కిందటే సీత తనకు ముని ఆశ్రమాలు చూడాలని కోరికగా ఉన్నదని కోరగా ఆమెకు సరే అని అనుమతిచ్చాను. నువ్వు మారు మాటాడక ఆమెను గంగానదీ తీరంలోని ఆశ్రమాల వద్ద వదిలిరా. ఇది నా ఆజ్ఞ" అంటాడు.

*సీతమ్మను*

 *ముని ఆశ్రమాలవద్ద*

 *వదిలిన లక్ష్మణుడు*

రాముడి ఆదేశం మేరకు, లక్ష్మణుడు మారుమాటాడక ఉదయాన్నే రథం సిద్ధం చేసి సీతమ్మవారిని ముని ఆశ్రమాల వద్ద వదలి  వస్తాడు.ముని బాలకుల ద్వారా ఈసంగతి తెలుసుకొన్న వాల్మీకి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి" అమ్మాయీ! నీవు జనకుని కూతురువు. దశరధుని కోడలివి. రాముని ఇల్లాలువు. నీవు అతి పవిత్రురాలివి. నేను నా తపశ్శక్తితో సర్వం గ్రహించాను. నీవు నిశ్చింతగా ఉండు. ఇక్కడి మునిసతులందరూ నిన్ను కన్న కూతురివలె చూసుకొంటారు. అని పలికాడు.  అక్కడ కొంతకాలానికి జానకీ దేవి ఇద్దరు బాలలకు జన్మనిస్తుంది. వారు లవ కుశలనే పేరుతో దినదిన ప్రవర్దమానులౌతూ అటు వేద విద్యలోనూ, ఇటు క్షాత్ర విద్యల్లోనూ తిరుగులేని బాలురుగా ప్రకాశిస్తుంటారు.

*అశ్వమేథయాగం*

రాముడు  అశ్వమేథయాగం తలపెట్టాడు.  ఆ యాగ సమయంలోనే సీతామాత పాతివ్రత్యాన్ని సామాన్యులకు తెలియజేయాలని వాల్మీకి మహర్షి నిర్ణయించుకుని అక్కడకు శిష్యసమేతంగా విచ్చేసాడు. వాల్మీకి లవకుశలను కూర్చోపెట్టుకొని" చిరంజీవులారా! మీకు నేర్పిన రామాయణాన్ని రాజమార్గాల్లోనూ, ముని వాసాల్లోనూ, యజ్ఞవాటిక దగ్గర రాముని మందర శ్రావ్యంగా, శ్రుతి బద్ధంగా మధురంగా ఆలపించండి అని చెప్పాడు. వారు రామాయణ గానం చేశారు. రాముడు కూడా విని ఆనందించాడు. మరునాడు సభకు చేరిన వాల్మీకి, సీతమ్మ పరమ సాధ్వి అని,లోకనిందకు భయపడి రాముడు ఆమెను పరిత్యజించాడని, ఇందులో ఏదైనా అసత్యం ఉంటే నా వేల ఏళ్ల తపస్సు వ్యర్థమైపోవుగాక అని పలికాడు. వెంటనే రామచంద్రమూర్తి లేచి లోకానికి మీవంటి మహర్షులు సత్యం తెలిపే రోజువస్తుందనే తాను వేచి చూస్తున్నానని చెప్పాడు.

మునీంద్రా! దివ్యజ్ఞాన సంపన్నులైన తమ వాక్యములు సత్యభూషణములు. నా దేవేరి శీలమును గురించి నాకు ఏమాత్రమూ సందేహము లేదు. ఆమె మహా సాధ్వి అని నాకు తెలియును. మరి లోకులకు కూడా తెలియడం అవసరమని నేనట్లు నడుచుకోవలసి వచ్చింది అని అన్నాడు. వాల్మీకి మహర్షి తన తపో నిష్టతో సీతమ్మవారిని అక్కడికి వచ్చేలా చేశాడు.

.సీత కాషాయాంబరాలు ధరించి  సభా మందిరంలో ప్రత్యక్షమైంది." నేను రాముడ్ని తప్ప అన్యుల్ని తలచనిదాననే అయితే భూదేవి నా ప్రవేశానికి వీలుగా దారి తీయుగాక. త్రికరణ శుద్ధిగా నేనెప్పుడూ రాముని పూజించేదానను అయితే భూదేవి నా ప్రవేశానికి మార్గం చూపుగాక అని ప్రార్ధించింది. సీతా దేవి ప్రార్థన ముగించీ ముగించగానే భూమి బద్దలు అయింది. నాగరాజులు మోస్తున్న దివ్య సింహాసనమొకటి పైకి వచ్చింది. భూమాత రెండు చేతులతో సీతను తీసుకొని పక్కన కూర్చోపెట్టుకొంది. ఆకాశం నుంచి పూల వాన కురుస్తుండగా సింహాసనం పాతాళంలోకి దిగిపోగా అక్కడ ఏమీ జరగనట్టు మళ్ళీ మామూలుగా అయిపోయింది.

సభాసదులు దీనులై విలపిస్తూ రాముడి వంక చూడసాగారు. రాముడి దుఃఖానికి అంతే లేదు. "నా కన్నుల ముందే నా భార్య మాయమయింది. లంకలో నుంచి తీసుకొని వచ్చిన ఆమెను భూమినుండి తెచ్చుకొనలేనా? భూదేవీ! అత్తగారివైన నిన్ను మర్యాదగా అడుగుతున్నాను. తక్షణం సీతను తెచ్చి ఈయకుంటే జగత్ప్రళయం సృష్టిస్తాను." అన్నాడు. 

అప్పుడు బ్రహ్మ వారించి "రామా ! ఇది నీకు తగదు. నిన్ను స్వర్గధామంలో తప్పక కలుసుకొంటుంది. నీ చరిత్ర ఇతిహాసంగా ఉండిపోతుంది.  మీ అవతరణ కార్యం పరిసమాప్తమవుతున్నది అని చెప్పాడు.

*లక్ష్మణునికి ధర్మ సంకటం*

కాలం భారంగా నడుస్తున్నది. ఒక నాడు ఒక ముని వచ్చి రాముడిని చూడాలని లక్ష్మణుడిని కోరాడు. రామాజ్ఞతో లక్ష్మణుడు ఆ మునిని రాముడి మందిరంలోకి ప్రవేశపెట్టాడు. వచ్చిన ముని కాలపురుషుడు. " రామా! మనం మాటాడే విషయాలు పరమ రహస్యాలు. ఇతరులు ఎవరూ వినరాదు.వారికి తెలియరాదు. ఒక వేళ అలా మన మాటల మధ్యలో ఎవరైనా ప్రవేశించినా  మన మాటలు విన్నా వారికి నువ్వు మరణదండన శిక్ష విధిస్తానని మాట ఇస్తేనే, నీతో ముచ్చటిస్తాను" అన్నాడు. రాముడు సరేనని లక్ష్మణుడిని ద్వారం వద్ద కాపలాగా ఉండమన్నాడు. ఆ తరువాత ఆ వచ్చిన ముని ఇలా అన్నాడు," రామ చంద్రా! నేను మునిని కాదు. కాల పురుషుడిని. నీవు ఈ లోకానికి వచ్చిన కార్యం ఎప్పుడో నెరవేరింది. బ్రహ్మ మిమ్మలను, తిరిగి పుణ్యలోకాలకు వచ్చి ఈ జగత్తును పరిపాలించమని కోరాడు. " అన్నాడు. 

దీనికి రాముడు నవ్వి " కాలపురుషా! నిజమే, భూలోకానికి వచ్చిన పని ఎప్పుడో ముగిసింది. ముల్లోకాలను రక్షించడమే నా బాధ్యత. నా స్వస్థానానికే రావడానికి నేను సిద్ధమౌతున్నాను." అన్నాడు. ఇలా వీరు సంభాషించుకొంటున్న వేళ దుర్వాసుడు రాముడి దర్శనానికి వచ్చాడు. లక్ష్మణుడు లోపలికి వెళ్లడం కుదరదన్నాడు. కాస్త ఓపికపట్టి ముని వెళ్లిన తర్వాత వెళ్లవచ్చన్నాడు.. ముక్కోపి అయిన దుర్వాసుడు "ఓరీ! ఈ.. రామ దర్శనానికి నేను వేచివుండాలా? తక్షణం నేను రాముడ్ని కలవాలి. లేకుంటే నీ దేశం, వంశం , మీ అన్నదమ్ములు నాశనం కావాలని శపిస్తాను " అన్నాడు. దుర్వాసుని కోపం ఎంత ముప్పు కలిగిస్తుందో ఎరిగిన వాడైన లక్ష్మణుడు, తన వంశం దేశం నాశనమయ్యే కంటే ,తాను రాముడి ఆజ్ఞను ధిక్కరించి తానొక్కడూ మరణశిక్ష పొందడమే మేలని తలచి వెంటనే , దుర్వాసుడు బయట వేచి ఉన్న విషయం చెప్పేందుకు లోపలకు వెళ్లాడు. అలా లక్ష్మణుడు, యముడు– రాముడు మధ్య సాగుతున్న సంభాషణకు అంతరాయం కలిగిస్తూ " అన్నా! నీకోసం దుర్వాసుల వారు వచ్చారు" అని అన్నాడు. కాలపురుషుడు, ఇదేమిటి; మనం మాట్లాడుకునేటపుడు మధ్యలో ఎవరూ రావద్దని షరతు విధించాను కదా అని రాముడివైపు చూశాడు.

*లక్ష్మణుడి యోగ సమాధి*

రాముడు కాలపురుషుడిని  వడి వడిగా పంపేసి, దుర్వాసునికి ఎదురేగి స్వాగతించాడు. అయితే తాను కాలపురుషుడికి ఇచ్చిన మాటను గుర్తుతెచ్చుకొని  రాముడు విచారంలో మునిగిపోయాడు. కలపురుషుడికి ఇచ్చిన మాట ప్రకారం మధ్యలో వచ్చిన వ్యక్తి ప్రాణాలు తీయాలి.. లక్ష్మణుడు వచ్చి" అన్నా! నీవు మాట తప్పవద్దు. ఏ సంకోచమూ లేకుండా నాకు శిక్ష విధించి ధర్మాన్ని నిర్వర్తించు" అని ధైర్యంగా చెప్పాడు. రాముడు నిలువెల్లా కుంగిపోతూ వశిష్ట, భరత, శతృఘ్నులను సమావేశ పరచి విషయం వవరించాడు. వశిష్ఠుడు " రాజా! ఆడి తప్ప రాదు. నీవు లక్ష్మణుడికి దేశ బహిష్కరణ విధించు అది మరణ సమానమే." అన్నాడు. " సాధు పరిత్యాగం మరణశిక్ష తో సమానమవుతుంది కనుక నిన్ను బహిష్కరిస్తున్నాను." అన్నాడు. వెంటనే లక్ష్మణుడు తన ఇంటి వైపు కూడా చూడకుండా సరాసరి సరయూ నది ఒడ్డువద్దకు చేరి యోగసమాధి అయ్యాడు. ఇంద్రుడు తన విమానంలో అతన్ని అమరావతికి తీసుకుకుపోయాడు. విష్ణు అంశలో నాల్గవభాగం దేవలోకం చేరినందుకు  దేవతలు సంతోషించారు. లక్ష్మణుడికి దేశ బహిష్కారం చేసాక భరతుని రాజుగా చేసి తాను కూడా వెళ్ళి పోతానని ప్రకటించాడు శ్రీ రాముడు..

*అవతార సమాప్తి*

మరునాడు తెల్లవారింది. బ్రాహ్మణులు అగ్ని హోత్రాలు, వాజపేయచ్చత్రాన్ని పట్టుకొని ముందుకు నడుస్తుండగా రాముడు సన్నని వస్త్రాలు ధరించి, మంత్రోచ్చారణ చేస్తూ వెడుతునాడు.. శ్రీ రాముడు అర్ధ యోజన దూరం నడచి, పడమట దిక్కుగా ప్రవహిస్తున్న సరయూ నది చేరుకొన్నాడు. అప్పటికే దేవతలతో ముని బృందాలతో బ్రహ్మదేవుడు అక్కడ వేంచేసి ఎదురుచూస్తున్నాడు. ఆకాశం దివ్య విమానాలతో నిండిపోయింది. వేదవేత్తలు మంత్రోచ్చారణలుచేస్తున్నారు. దేవతలు దుందుభులు మోగించారు. పరిమళాలతో గాలి చల్లగా వీస్తోంది. పూలవాన కురవడం మొదలయింది. అప్పుడు సరయూ నదిలోకి పాదాన్ని పెట్టాడు రాముడు. బ్రహ్మ అప్పుడు రామునితో ఇలా అన్నాడు"

 మహావిష్ణూ ! నీకు శుభమగుగాక! 

నీ తమ్ముళ్ళతో కూడా స్థూల శరీరాలు విడిచి దివ్యశరీరాన్ని ధరించు. నీకు కావలసిన రూపం అందుకో తండ్రీ! సకల భువనాలకూ నువ్వే ఆధారం."

అనగానే రాముడు తన అవతార కార్రక్రమం పరిసమాప్తమైనందున, విష్ణుమూర్తి రూపం స్వీకరించాడు. అక్కడ చేరినవారంతా విష్ణుమూర్తి దర్శనంతో తరించి,జయజయ ధ్వానాలు చేసి విష్ణువుకు భక్తిగా మొక్కారు. అప్పుడు బ్రహ్మతో విష్ణువు "నావెంట వచ్చిన వారంతా నా భక్తులు. సర్వం త్యజించి నన్ను అనుసరించినవారు. వారికి పుణ్యలోకాలు ప్రసాదించు" అని అజ్ఞాపించాడు.  

హనుమ చిరంజీవిగా ఉంటాడని ,రామభక్తులను కంటికి  రెప్పలా కాపాడుతుంటాడాని   చెప్పి రామచంద్రమూర్తి, విష్ణువుగా విష్ణులోకానికి పయనమయ్యాడు.

*ఫలశ్రుతి*

మహర్షి వాల్మీకి రచించిన  శ్రీ‌రామాయ‌ణాన్ని చదివినవారు,విన్నవారు కూడా పాపవిముక్తులై ధనధాన్య సంపదలను పొందుతారు.

వారికి కీర్తి, విజయం లభిస్తాయి.

 కష్టాలను అధిగమిస్తారు.  

వంశ వృద్ధి కలుగుతుంది.

దీర్ఘాయుష్మంతులౌతారు. స‌క‌ల శుభాలూ పొందుతారు. ధర్మబద్ధ జీవనం సాగిస్తారు. రామాయణాన్ని శ్రద్ధతో  పారాయణం చేసే వారి యందూ, వినేవారియందు  శ్రీరాముడు దయాపరుడై ఉంటాడు.

రామాయణ పారాయణ చేస్తున్న వారి ఎదురుగా కూర్చుని,హనుమ  అదృశ్యరూపంలో  ఆనంద పార‌వ‌శ్యంతో రామకథను వింటుంటాడని భక్తుల విశ్వాసం. అలా ఈ 9 రోజులూ హనుమ మీ ప్రాంగణాన్ని పావనం చేసివుంటారు. 

మీ మనసు నిండా శ్రీసీతారామచంద్రులు,హనుమ ఉండగా, మీరు శ్రద్ధతో సాగించిన ఈ శ్రీ రామాయణ దివ్య కథా పారాయణం మీకు,మీ కుటుంబసభ్యులకు

సర్వశుభాలను కలుగజేస్తుంది. ధర్మబద్ధ జీవనానికి వీలు కల్పిస్తుంది.

 మీ పిత్రు దేవతలు సంతోషిస్తారు.

 శుభ వర్తమానాలు అందుతాయి. 

శుభకార్యాలు చేస్తారు .సర్వత్రా జయం లభిస్తుంది. సదా రామభక్తులను కంటికి రెప్పలాకాపాడే హనుమ ఈబాధ్యత తీసుకుంటాడు.

*మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే,*

*చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్.*            

*వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే,*

*పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్*   

                       **

*ఆంజనేయం మహావీరం*  *బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ !*

*తరుణార్క ప్రభం శాన్తం* *రామదూతం* *నమామ్యహమ్ !!*

*****

  *హనుమంతుని ద్వాదశనామాలు*

హనుమా, అంజనాసుతః, వాయుపుత్రో, మహాబలః

రామేష్టః, ఫల్గుణ సఖః, పింగాక్షో మిత విమహాబలఉధధిక్రమణశ్చ్చైవ, 

సీతాశోక వినాశకః

లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః

 స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః,

 తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్

                             **

*( ఈ 9 రోజులూ సంక్షిప్త శ్రీ రామాయణాన్ని పఠించిన వారికి, విన్నవారికి  ప్రత్యేక ధన్యవాదాలు)*                      *జై శ్రీసీతారామ్‌*

             *సర్వే జనా*  

        *సుఖినోభవంతు*

      *సమస్త సన్మంగళాని భవంతు*

  🪷*స్వస్తి* 🪷

శ్రీ రామ పద్యార్చనమ్*

 *విశ్వావసు నామ సంవత్సర శ్రీ రామ పద్యార్చనమ్*

*4*

*చం*

అవనిన రావణాసురుని యాగడముల్చెలరేగి వేగగన్

భువిజని రామభద్రునిగ భూజనిసీతను పెండ్లి యాడి తా

నవనిన రామరాజ్యమను నాకము జూపిన దేవదేవుడౌ

దివిపతి విష్ణుమూర్తి కి వె ధీజన పూజలునిత్య(దివ్య) హారతుల్.

*భావం*:-- భూలోకంలో రావణాసురుని ఆగడాలు చెలరేగి బాధలు పడుతున్న తరుణంలో భూలోకంలో రామభద్రునిగా పుట్టి భూజనియైన సీతామహాలక్ష్మి అమ్మవారి ని పెండ్లాడి భూలోకులకు రామరాజ్యం అనబడే స్వర్గమును జూపిన దేవదైన శ్రీ మహావిష్ణువు కు ఇవియే గొప్ప పూజలు నిత్య ( గొప్ప) హారతులు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఏకాక్షర సర్వ గురు కందము...

 ఏకాక్షర సర్వ గురు కందము...


కాకా కేకీ కేకే

కూకూ కాకైకాంకా కాంకాం కాంకా

కీకాకేకీ కేకే

కూకూ కూకూ కంకం కంకం కౌకే



 కాకా=కాకి, కేకీ=కోకిల,

కేకే= ఎవరు?ఎవరు?,

కూకూ=కోకిలధ్వని,

ఏకాంకా=ఒక పార్శ్వపు,

కాకా=కాకి, కాంకాం=ఎవరినెవరని

కాంకా=ఎవరెవరను,

కీకా=గాఢంగా, కేకీ=నెమలి, కేకే=ఎవరెవరన, 

కూకూ=కోకిల,

కూ కూ=మధురాలాపన,  

కంకం=నీటిబొట్టులవలె, కంకం=ఎవరెవరినయినా,  కౌకే=ఎటుల ౙతచేయునో...

పునాదులు లేని ఇల్లు

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏         🏵️ *పునాదులు లేని ఇల్లు గాలి వానకి ఎలా కూలిపోతుందో చెప్పుడు మాటలు విన్న మనిషి జీవితం కూడా అలాగే నాశనం అవుతుంది..పుకార్లు ఎప్పుడు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకీ మూర్కుల ద్వారా అంగీకరించ బడతాయి.. ఈ మూడింటి లోనూ మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది* 🏵️మూర్కులతో వాదన పెట్టుకోకూడదు.. ఎందుకంటే ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజార్చుతారు.. ఆ తరువాత వారి కున్న అనిభవంతో మిమ్మల్ని వారి దారికి తెచ్చుకొని మిమ్మల్ని నాశనం చేస్తారు🏵️కంటి చూపు లేని వాడు గుడ్డి వాడు కాదు.. తన తప్పులను తెలిసికోకుండా ఉంటున్నాడే వాడే నిజమైన గుడ్డివాడు..నమ్మకం కోల్పోయిన తరువాత ఎంత నాటించినా ప్రయెజనం ఉండదు.. అందుకే ప్రాణం పోతున్నా నమ్మకాన్ని మాత్రం కాపాడుకోవాలి.. నమ్మకం, ప్రాణం రెండు ఒక్కటే.. ఒక్క సరి పొతే తిరిగి రావు.. నమ్మిన వారిని మోసం చేయకూడదు.. మోసం చేసిన వారిని తిరిగి నమ్మకూడదు🏵️🏵️మీ *అల్లంరాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D .N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు లేదా కొత్త వారికి రాలేనివారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును * 🙏🙏🙏

విలువలనొందుట కన్నను

 

*

*కం*

విలువలనొందుట కన్నను

విలువలు కాపాడుకొనుట విలువగు నెపుడున్.

విలువలకాచుకొనేందుకు

విలువెరుగని వారి నుండి వెలివడు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! విలువలు పొందటం కన్నా విలువలు కాపాడుకోవడం చాలా విలువైన పని. విలువలు కాపాడుకోవడం కోసం నీ విలువ తెలియని వారి నుండి దూరంలో ఉండుము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

*

*కం*

విలువీయని వారల కడ

విలువల నొందెడి వశమున వెంబడకుము నీ

విలువెరిగెడి దినము కొరకు

నలుపెరుగని శ్రమలకోర్చి నెగడుము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నీకు విలువ ఇవ్వని వారి వద్ద విలువలు పొందాలనే ఆశతో వెంపర్లాడవద్దు. నీ విలువ లు గుర్తించగలిగే విధంగా అలుపెరగని కృషి చేయుము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


గీతామకరందము

 గీతామకరందము:

16-01,02,03-గీతా మకరందము

  దైవాసురసంపద్విభాగయోగము 

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


శ్రీ భగవద్గీత 

అథ షోడశోఽధ్యాయః 

పదునాఱవ అధ్యాయము 

దైవాసురసంపద్విభాగయోగః

దైవాసురసంపద్విభాగయోగము 


శ్రీ భగవానువాచ :-


అభయం సత్త్వ సంశుద్ధిః

జ్ఞానయోగ వ్యవస్థితిః | 

దానం దమశ్చ యజ్ఞశ్చ 

స్వాధ్యాయ స్తప ఆర్జవమ్ || 


అహింసా సత్యమక్రోధః

త్యాగశ్శాన్తిరపైశునమ్ | 

దయా భూతేష్వలోలత్వం* 

మార్దవం హ్రీరచాపలమ్ ||  


తేజః క్షమా ధృతిశ్శౌచం

అద్రోహో నాతిమానితా | 

భవన్తి సమ్పదం దైవీం

అభిజాతస్య భారత ||   


తాత్పర్యము:- శ్రీ భగవానుడు చెప్పెను - ఓ అర్జునా! (1) భయములేకుండుట (2) అంతఃకరణశుద్ధి (3) జ్ఞానయోగమునందుండుట (4) దానము (5) బాహ్యేంద్రియనిగ్రహము (6) (జ్ఞాన) యజ్ఞము (7) (వేదశాస్త్రాదుల) అధ్యయనము (8) తపస్సు (9) ఋజుత్వము (కపటము లేకుండుట) (10) ఏ ప్రాణికిన్ని బాధగలుగజేయకుండుట (అహింస) (11) సద్వస్తువగు పరమాత్మ నాశ్రయించుట, లేక, నిజముపలుకుట (సత్యము) (12) కోపము లేకుండుట (13) త్యాగబుద్ధిగలిగియుండుట (14) శాంతస్వభావము (15) కొండెములు చెప్పకుండుట (16) ప్రాణులందు దయగలిగియుండుట (17) విషయలోలత్వము లేకుండుట, అనగా విషయములందాసక్తి లేకుండుట, వానిచే చలింపకుండుటయు (18) మృదుత్వము (క్రౌర్యము లేకుండుట) (19) (ధర్మవిరుద్ధకార్యములందు) సిగ్గు (20) చంచల స్వభావము లేకుండుట (21) ప్రతిభ (లేక, బ్రహ్మ తేజస్సు) (22) ఓర్పు (కష్టసహిష్ణుత) (23) ధైర్యము (24) బాహ్యాభ్యంతర శుచిత్వము (25) ఎవనికిని ద్రోహముచేయకుండుట, ద్రోహచింతనము లేకుండుట (26) స్వాతిశయములేకుండుట (తాను పూజింపదగినవాడనను అభిమానము, గర్వము లేకుండుట) - అను ఈ సుగుణములు దైవసంపత్తియందు పుట్టిన వానికి కలుగుచున్నవి. (అనగా దైవసంపత్తిని పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవని భావము).


వ్యాఖ్య:- గీతా గ్రంథమున 'సాధన’కు విశేషప్రాముఖ్యత నొసంగబడినది. చిత్తము నిర్మలముగానున్నచో, అత్తఱి పారమార్థికలక్ష్యము చేరువనేయుండును. కావున అట్టి చిత్తశుద్ధిపరికరము లనేకములు గీతయం దొసంగబడినవి. ఈ అధ్యాయప్రారంభమునగల దైవీసంపద్వివరణము వానిలో చేరినదే అయియున్నది. ఇఱువదియాఱు సుగుణములను భగవాను డిచట తెలియజేసిరి. వానినన్నింటిని ముముక్షువు - విద్యార్థి పాఠములను వలె - క్షుణ్ణముగ నభ్యసించి హృదయమును పరిశుద్ధ మొనర్చుకొనినచో ఇక మోక్షలక్ష్యము సన్నిహితమైనట్లే యగును. కావున సాధకు లీసద్గుణరాశిని ప్రయత్నపూర్వకముగ నవలంబించి కడు జాగరూకతతో వానిని కాపాడుకొనుచుండవలెను.

సంపద యనగా ధనము, ఐశ్వర్యము. దైవసంపదయనగా దైవధనము. శ్రీకృష్ణపరమాత్మ దైవధనము నిపుడు లోకులముందు వెదజల్లుచు " ఓ జీవులారా! నశ్వర ప్రాపంచికధనములతో క్రీడించుచు, వానియందే అమూల్యకాలమంతయు వినియోగించుచు దుఃఖపరంపరలను, జన్మపరంపరలను బొందకుడు! ఇవిగో తీసికొనుడు దైవసంపద్రాసులను, పారమార్థిక రత్నచయములను - అని వచించుచున్నారు. ఈ దైవధనము ముందు ప్రాపంచిక సంపదలు, వజ్రవైఢూర్యాదులు ఏపాటి విలువగలవి? కావున వివేకవంతు లీ దైవసంపదను శీఘ్రముగ హస్తగతమొనర్చుకొని జ్ఞానధనులై బ్రహ్మసాయుజ్యము నొందెదరుగాక!


“అభయమ్" - శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు అనేక సుగుణములను చెప్పదలంచిన వారై మొట్టమొదట "సుగుణరాట్”అనదగు, "సుగుణసింహ” మనదగు “అభయము"ను పేర్కొనెను.ఇది గమనింపదగినవిషయమైయున్నది. ఏలయనిన, ఎన్నియో ఇతర సుగుణములుండ ఈ "భయరాహిత్యము”నే తొలుదొల్త చెప్పనేల? దీనికి కారణములు కలవు - (1) అన్ని దుర్గుణములకును భయమే పునాది: భయమునుండియే తక్కిన అవగుణములన్నియు నంకురించును. కావున విజ్ఞులద్దానిని మొట్టమొదట పారద్రోలినచో, అనగా నిర్భయత్వము నవలంబించినచో ఇక తక్కిన సుగుణము లన్నియు అవలీలగా వచ్చి చేరగలవు. ఇక్కారణమున నయ్యది మొదట చేర్చబడి యుండవచ్చును. మఱియు (2) త్రాడులాగు పందెము (Tug of War) లో మొదటివానిని చివఱివానిని మహాబలశాలులుగ నుండునట్లుచూచి పెట్టుదురు. అట్లే అసురగుణములు గావింపబడుచున్న పందెమున దైవగుణములపక్షమున "అభయం" - అను సుగుణరాజమును ఏరి భగవాను డద్దానిని నాయకునిగ (Captain) జేసి రణరంగమున నిలబెట్టెను. దీనిని బట్టి అది యెంతటి మహత్తర సుగుణమో వ్యక్తము కాగలదు. (3) ‘అభయం వై జనక ప్రాప్తోసి’ - అని ఉపనిషత్తు లా యభయమును సాక్షాత్ బ్రహ్మపదముగనే వర్ణించి చెప్పినవి. కాబట్టి గీతయందు భగవానునిచే నెంతయో ప్రముఖముగ నెంచబడినట్టి ఈ నిర్భయత్వమను గుణరత్నమును సర్వులును లెస్సగ నభ్యసించి దైవసంపత్తిని బాగుగ కూడబెట్టుకొనవలెను.


'సత్త్వసంశుద్ధిః’ - "శుద్ధిః” అని చెప్పక "సంశుద్ధిః” అనిచెప్పుటవలన చిత్తము అత్యంత నిర్మలముగా నుండవలెనని భావము. మనస్సునం దేలాటి ప్రాపంచిక సంకల్పములకు, మలినసంస్కారములకు, పాపములకు చోటీ యరాదు. నిర్మలదర్పణమందే ప్రతిబింబము స్పష్టముగ గోచరించునట్లు నిర్మలచిత్తముననే ఆత్మ చక్కగ స్ఫురించగలదు.


“జ్ఞానయోగ వ్యవస్థితిః” - భగవానుడు గీతలో అనేక యోగములనుగూర్చి బోధించినను, అచటచట జ్ఞానయోగాధిక్యతను వెల్లడించుచునేయున్నారు. (ఆత్మజ్ఞానానుభూతియే అన్నిటియొక్క పరమావధిగనుక). కనుకనే దైవసంపదలో ప్రారంభములోనే దానినిగూర్చిన ప్రస్తావనను లేవనెత్తిరి. ‘సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే' అనునట్లు అన్ని కర్మలు, అన్ని యోగములును తుదకు జ్ఞానమందే పర్యవసించుచున్నవి. కాబట్టి అట్టి జ్ఞానయోగమందు దృఢస్థితిని సంపాదించవలసినదిగా భగవాను డిచట నాదేశించుచున్నారు.


'దానం’ - భూదానము, సంపద్దానము, అన్నదానము, జలదానము, శ్రమదానము, విద్యాదానము, జ్ఞానదానము - ఇవియన్నియు దానములలో జేరినవే.


‘దమశ్చ’ - "శమ" మను అంతరేంద్రియనిగ్రహము ‘సత్త్వసంశుద్ధిః’ అను పదము ద్వారా ఇదివఱకే పేర్కొనబడియుండుటవలన ఇచట “దమ" మను బాహ్యేంద్రియ నిగ్రహముమాత్ర మిపుడు చెప్పబడినది. ఇంద్రియనిగ్రహములేనిది పరమార్థరంగమున ఎవరును ముందునకు పోజాలరని ఘంటాపథముగ చెప్పవచ్చును. కనుకనే గీతలో శమ, దమములకు సముచితస్థాన మొసంగబడుచునున్నది.


"యజ్ఞశ్చ” ఇచట యజ్ఞమనగా తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయయజ్ఞము, జ్ఞానయజ్ఞము మున్నగునవిమాత్రమేయని గ్రహించవలెను.

"స్వాధ్యాయః” - గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, యోగవాసిష్ఠము, భారత, భాగవత, రామాయణములు - ఇత్యాది ఆధ్యాత్మిక ఉద్గ్రంథములను పఠించి అందలి సారమును మననముచేయుట స్వాధ్యాయ మనబడును.


“తపః” - తపస్సనగా తల క్రిందబెట్టి కాళ్లు పైనబెట్టుకొనియుండుట కాదు. గీత 17వ అధ్యాయమున చెప్పబడిన శారీరక, వాచిక, మానసిక తపస్సులని భావము. 


"ఆర్జవమ్” - శరీరము, వాక్కు, మనస్సు - అను మూడింటితోను ఏకరీతిగా వర్తించుట - అనగా త్రికరణశుద్ధి గలిగియుండుటయని అర్థము. విషజంతువులగు సర్పాదులు వక్రగతి గలిగియుండును. కావున వక్రస్వభావము గలిగియుండు మానవులున్ను విషజంతువులతో సమానులే యగుదురు.


‘అహింసా’ - శరీరముతో, వాక్కుతో, మనస్సుతో, ఏ ప్రాణికి హింస చేయకుండుట, ఏ ప్రాణిని బాధింపకుండుట.


"సత్యం” - (1) శరీరవాఙ్మనంబులతో అసత్యమాడకుండుట.

(2) సత్యవస్తువగు పరమాత్మయందు నిలుకడ గలిగియుండుట.


“అక్రోధః” — క్రోధము చాల చెడ్డగుణము. పరమార్థసాధకునకే కాదు. ప్రతి మానవునికిని అది యెంతయో కీడొనర్చగలదు. అది ఆవహించినపుడు మనుజుడు కల్లు త్రాగినవాని చందమున నుండును. ఆ ‘కైపు’ లో యుక్తా యుక్తములను విస్మరించి యతడు అధఃపతనమునొందును. కాబట్టియే ‘క్రోధాద్భవతి సమ్మోహః …. ప్రణశ్యతి’ - అని దీని ఆగడమును గూర్చి భగవాను డిదివఱకే విపులముగ తెలిపియుండెను. క్రోధము రజోగుణసంబంధమగు దుర్గుణము. కావున అది మనుజుని యావేశించునపుడతని కండ్లెఱ్ఱబడును. దేహమంతయు చెమటబట్టును. తుదకు వికృతరూపుడై, దాదాపు రాక్షసునివలె మారిపోవును. ఇక్కారణమున పరమార్థోన్నతికి క్రోధరాహిత్యము (అక్రోధము) ఒక గొప్ప ఆవశ్యకతయైయున్నది. కనుకనే యది దైవసంపదయందు పేర్కొనబడినది.


“త్యాగః” - ‘త్యాగేనైకే అమృతత్వమానశుః’ - త్యాగమువలననే మోక్షము సిద్ధించును అని ఉపనిషత్తు లుద్ఘోషించుచున్నవి. దృక్స్వరూపమగు ఆత్మను, భగవంతుని అవలంబించి, దృశ్యవస్తువులగు విషయసమూహములయం దాసక్తిని త్యజించుటయే త్యాగము. దుర్గుణములను, దుస్సంస్కారములను, దుష్టసంకల్పములను, విషయవ్యామోహమును, కర్మఫలమును త్యజించుటయే వాస్తవమగు త్యాగము. ఇదియే అంతరత్యాగము. బాహ్యత్యాగముకంటె అంతరత్యాగము శ్రేష్ఠమైనది.


"శాంతిః” - చిత్తము శాంతియుతముగ నుండవలెను. కల్లోలసముద్రమువలె నుండరాదు. సంకల్పములచే కొట్టుకొనుచుండరాదు. చిత్తము పరమాత్మయందు లయించినపుడే పూర్ణశాంతి సంభవిం చును. శాంతిలేనివానికి సుఖము యుండదు (అశాంతస్య కుతస్సుఖమ్). భగవదాశ్రయము, దృశ్యవిషయసంకల్ప వివర్జనము శాంతికి ఉపాయములు.


‘అపైశునమ్' - ఇతరులదోషములను లెక్కింపకుండుట, చాడీలు చెప్పకుండుట. పరులగుణములతో మనకు పనియేకాని పరులదోషములతోగాదు. జనులు తమ తమ హృదయములందు దాగియున్న కోటానుకోట్ల దోషములను ముందు నిర్మూలించుకొనిన చాలును. ఇతరులదోషములను లెక్కింపవలసినపనిలేదు.


“దయా భూతేషు” - ‘సమస్తప్రాణికోట్లయెడల దయగలిగియుండుట’ సాధకునకొక అత్యవసరమైన సుగుణముగనుక దానినిగూర్చి గీతయం దనేకచోట్ల ప్రస్తావించబడెను. బ్రహ్మజ్ఞానమను మందుకు భూతదయయను పథ్యము ఉండియే తీరవలెను. అపుడే ఆ మందు చక్కగ పనిచేయును. కాబట్టి భక్తి, జ్ఞాన, వైరాగ్యాదులతోబాటు భూతదయనుగూడ సాధకులు బాగుగ నభ్యసించవలయును.

         'అలోలత్వమ్’- ఇంద్రియలోలత్వము లేకుండుట, విషయచాపల్యము వదలి యుండుట;

ఇంద్రియములయొక్క శక్తియంతయు విషయభోగములందు వ్యర్థమైపోయినచో ఆత్మచింతనాదులం దది సమర్థమైయుండజాలదు. కావున ప్రత్యాహారముచే ఆ యా యింద్రియములను విషయములనుండి మఱలించి, ఆత్మయందు స్థాపించవలెను. మనస్సు చపలత్వము లేకయుండవలెను.


'మార్దవమ్' - మాటయందు, చేష్టయందు కాఠిన్యముచూపక మృదుత్వము గలిగి యుండవలెను. పరుషత్వమును వీడవలెను. ఇది సాత్త్వికగుణసంపన్నుని లక్షణము.


“హ్రీః” - (సిగ్గు) - (1) పాపకార్యములు చేయుటయందు సిగ్గు గలిగి యుండవలెను. (అనగా వానిని చేయరాదు).

(2) "నేనింతవఱకు పరమార్థక్షేత్రమున ఏమియున్నతిని బొందితిని?' అని

ప్రశ్నించుకొని, ఉన్నతినిబొందనిచో సిగ్గుపడవలెను.

(3) మహనీయులను, అనుభవజ్ఞులను సాధుమహాత్ములను, భక్తులను గాంచి, తన సాంసారిక అవనతిని తలంచుకొని సిగ్గునొందవలెను. మఱియు వారివలె ఉన్నత పారమార్థిక శిఖరము నధిరోహించుటకు పట్టుదలతో ప్రయత్నించవలెను.


“అచాపలమ్” - చంచలత్వము రజోగుణస్వభావము - అట్టిది లేకుండవలెను. మనస్సును ఆత్మనుండి (దైవమునుండి) చలింపజేయరాదు.


"తేజః” - బ్రహ్మతేజస్సుగలిగి యుండవలెను.


"క్షమా” - ఓర్పు, సహనము; ద్వంద్వములందు నిర్వికారుడై పృథివివలె , ఫలవృక్షమువలె క్షమాశీలుడై యుండవలెను. శుకుడు, యేసుక్రీస్తు మున్నగువారి క్షమాశీలత్వమును, సహనత్వమును అపుడపుడు తలంచుకొనుచుండవలెను.


"ధృతిః” - ధైర్యముగలిగి యుండవలెను. నిజరూపమగు ఆత్మను గూర్చి చింతించుచుండినచో, మఱియు ప్రపంచమిథ్యాత్వమును గూర్చి మననము చేయుచుండినచో మనుజునకు గొప్పధైర్యము చేకూరుచుండగలదు. ఎన్ని విపత్తులు తటస్థించినను మేరు సమానముగ గంభీరుడై యుండవలెను.

'శౌచమ్' - (1) బాహ్యశౌచము (శరీర, గృహాదులశుద్ధి) (2) అభ్యంతర శౌచము (ఇంద్రియ మనంబుల శుద్ధి, అపవిత్రసంకల్పములు లేకుండుట).


‘అద్రోహః’ - ఎవరికిని ద్రోహము, బాధ కలుగజేయకుండుట, మనస్సునందును ద్రోహచింతన లేకుండుట.


"నాతిమానితాః” - తాను గొప్పపూజ్యుడనని ఎన్నడును విఱ్ఱవీగరాదు. తనను పరులు గౌరవించవలె నను అభిమానమున్ను గలిగియుండరాదు. ఇది సాధకులకు అత్యంతావశ్యకమగు సుగుణము. ఇది లేనికారణమున అనేకుల దంభ అభిమానాదులచే పతనమొందిపోయిరి.

ఆంజనేయునకు గల్గియున్నటువంటి వినయవిధేయతలు, నిరభిమానము, దైవభక్తి కలవాడే పరమార్థమార్గమున సముత్తీర్ణుడుకాగలడు.

ఈ యిరువదియాఱు సుగుణములు దైవసంపత్తియందు జన్మించినవారికి కలుగుచుండును. ఇవిలేనివారు అట్టి దైవసంపదకై యత్నించి అద్దానిని పొందవలెను. మోక్షమున కీ సద్గుణములన్నియు అత్యావశ్యకములు.


ప్రశ్న:- శ్రీకృష్ణభగవానునిచే దైవగుణము లెన్ని పేర్కొనబడెను? అవి యేవి?

ఉత్తరము:- ఇరువదియాఱు. అవి క్రమముగ (1) భయరాహిత్యము (2) చిత్తశుద్ధి (3) జ్ఞానయోగస్థితి (4) దానము (5) బాహ్యేంద్రియనిగ్రహము (6) (జ్ఞాన) యజ్ఞము (7) శాస్త్రాధ్యయనము (8) (జ్ఞాన) తపస్సు (9) ఋజుత్వము (10) అహింస (11) సత్యము (12) క్రోధరాహిత్యము (13) త్యాగము (14) శాంతి (15) కొండెములు చెప్పకుండుట (16) భూతదయ (17) విషయలోలత్వము లేకుండుట (18) మృదుత్వము (19) సిగ్గు (20) చపలత్వము లేకుండుట (21) ప్రతిభ (బ్రహ్మ తేజస్సు) (22) ఓర్పు (23) ధైర్యము (24) శుచిత్వము (25) ద్రోహబుద్ధిలేకుండుట (26) అభిమానరాహిత్యము - ఈ సద్గుణములే దైవీసంపద యనబడును.

~~

* ‘భూతేష్వలోలుప్త్వం’ - పాఠాన్తరము.

తిరుమల సర్వస్వం 201-*

 *తిరుమల సర్వస్వం 201-*

*కపిల తీర్థం -6*

 *జంధ్యాలపౌర్ణమి* 


 ప్రతి సంవత్సరం శ్రావణపౌర్ణమి నాడు జంధ్యాలపండుగ ఆడంబరంగా జరుగుతుంది. ఆనాడు శ్రీగోవిందరాజస్వామి, శ్రీకృష్ణస్వామి, శ్రీసుదర్శన భగవానుడు, గోవిందరాజస్వామి ఆలయం నుండి వేర్వేరు పల్లకీలపై కపిలతీర్థం లోని వేణుగోపాలస్వామి ఆలయానికి వేంచేస్తారు. తదనంతరం వారికి శాస్త్రోక్తంగా యజ్ఞోపవీతాలు ధరింపజేసి; ఘనంగా హారతి, నివేదన ఇస్తారు.


 కార్తీకపౌర్ణమి నాడు కూడా శ్రీగోవిందరాజుల వారు తన దేవేరులతో కలిసి వేణుగోపాలస్వామి ఆలయానికి విచ్చేసి, అభిషేకాలు, నివేదన జరిగిన తరువాత, తిరిగి గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు.


 *శ్రీఆండాల్ (గోదాదేవి) ఆస్థానం* 


 ప్రతి సంవత్సరం కనుమపండుగ నాడు, గోవిందరాజస్వామి ఆలయం నుండి శ్రీగోదాదేవి ధరించిన పూల మాలలు తిరుమలలోని శ్రీవెంకటేశ్వరునికి పంపబడతాయి. తదనంతరం గోదాదేవి, గోవిందరాజస్వామి ఆలయం నుండి బయలుదేరి, కపిలతీర్థం వేంచేస్తుంది. అక్కడ గోదాదేవి ముత్తయిదువులకు వాయనదాన మిచ్చిన తరువాత, గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి ఆస్థానోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి. 


[పన్నెండు మంది ఆళ్వార్లలో మరో ప్రముఖ ఆళ్వారైన 'గోదాదేవి' లేదా 'ఆండాళ్' గురించి కూడా మరో ప్రకరణంలో విస్తారంగా తెలుసుకుందాం!]



 *కపిలేశ్వర స్వామి వారి త్రిశూల స్నానం* 


 మహాశివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అనగా ఫాల్గుణ అమావాస్య నాడు కపిలేశ్వరస్వామి వారి ప్రధానాయుధమైన త్రిశూలస్వామి వారికి కపిలతీర్థం పుష్కరిణిలో త్రిశూల స్నానం జరుగుతుంది. ఈ స్నానాన్ని కాంచినవారికి త్రిశూలాయుధం సర్వకాల సర్వావస్థలయందు రక్షగా ఉంటుందని, అరిషడ్వార్గాలను అదుపులో ఉంచి, కైలాసప్రాప్తికి దోహద పడుతుందని భక్తులు నమ్ముతారు.


 *కార్తీకదీపం లేదా ఆకాశదీపం* 


 కార్తీకపౌర్ణమి నాడు, ఆలయం పై భాగాన, కొండశిఖరాలవద్ద అర్చకస్వాములు జ్యోతులను ప్రజ్వలింప జేస్తారు. అదే సమయంలో ఆలయానికి అనుసంధానింపబడి ఉన్న కొండ పైభాగాన గల పెద్దగూటిలో, తిరుపతి వాసులైన గాండ్ల కులస్థులు అఖండజ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతి తిరుపతి పట్టణ వాసులందరికీ దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. తరువాత, స్వామి, అమ్మవార్లను పల్లకీలో కపిలతీర్థం వద్దకు ఊరేగింపుగా తెచ్చిన అనంతరం జ్వాలాతోరణం జరుగుతుంది. ఆ సందర్భంగా కపిలతీర్థం పుష్కరిణిలో వేలాది భక్తులు అసంఖ్యాకమైన ప్రమిదలను వెలిగిస్తారు.


 *తెప్పోత్సవాలు* 


 ధనుర్మాసంలో ఆరుద్రానక్షత్రం ముందు రోజు పూర్తయ్యే టట్లుగా, ఐదురోజుల పాటు ప్రతిరోజు ప్రదోష వేళలో తెప్పోత్సవాలు జరుగుతాయి.


 *చందనోత్సవసేవ* 


 సౌర్యమానపు మకరమాసంలో (చంద్రమానపు పుష్యం లేదా మాఘం) పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారికి చందనాలంకార సేవ జరుప బడుతుంది.


 *బ్రహ్మోత్సవాలు* 


 ప్రతి సంవత్సరం మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా పది రోజులపాటు మహావైభవంగా బ్రహ్మోత్సవాలు

జరుగుతాయి.


 *అన్నాభిషేకం* 


 కపిలతీర్థంలో అత్యంత వైభవంగా, విలక్షణంగా జరిగే ఈ అన్నాభిషేక మహోత్సవం, సౌరమానం ప్రకారం తులామాసంలో, పౌర్ణమి రోజున సంపన్న మవుతుంది. ఈ రోజును 'కపిలతీర్థముక్కోటి పేర్కొంటారు. ఆరోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో, 250 కిలోల బియ్యంతో వండిన అన్నంతో కపిలేశ్వరలింగానికి అభిషేకం చేస్తారు. లింగాకృతి అంతా, పూర్తిగా అన్నమయమై పోతుంది. మిగిలిన అన్నంతో ఒక చిన్న శివలింగాన్ని తయారుచేసి తాత్కాలికంగా ప్రతిష్ఠ చేస్తారు. పోళీలు, కుడుములు, మురుకులు, సుఖియం, వడలు వంటి ఐదురకాల పిండివంటలను లవణరహితంగా తయారుచేసి అన్నలింగం యొక్క పానవట్టంపై అలంకరిస్తారు. తదనంతరం పొట్లకాయ, వంకాయ, అరటికాయ, సీమవంకాయ, బూడిద గుమ్మడికాయలను ముక్కలు కాకుండా పూర్తికాయలు గానే, ఉప్పు లేకుండా ఉడికించి; వీటిని అన్నలింగం పై సర్వాభరణాలుగా, చంద్రవంకగా, ఢమరుకంగా, త్రిశూలంగా అలంకరిస్తారు. పంచవాద్య సమ్మేళనంతో, మంగళధ్వనులతో మహా దీపారాధన జరుగుతుంది. తరువాత అన్నలింగాన్ని ఉద్వాసన చేసి, కర్పూరహారతి నిచ్చి, జలనిమజ్జనం చేస్తారు. తదుపరి, శివలింగంపై అమర్చిన అన్నాన్ని, పులుసు, కూరలతో కలిపి ప్రసాదంగా భక్తులకు పంచుతారు.


 అన్నాభిషేక మహోత్సవంలో పాల్గొని, అన్నలింగ దర్శనం చేసుకొన్నట్లయితే సమస్త గ్రహదోషాలు, పూర్వజన్మల పాపాలు సంపూర్ణంగా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. 


[ రేపటి భాగంలో ... *శ్రీవారి సేవకులు* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*340 వ రోజు*


*భీమసేనుడి విజృంభణ*


సాయంసమయం అయింది. సాత్యకి సోమదత్తుని ఒక నిశితశరముతో కొట్టాడు. ఘటోత్కచుడు సోమదత్తుడిని ముద్గర అనే ఆయుధముతో కొట్టాడు. ఆ దెబ్బలకు సోమదత్తుడు సోలిపోయాడు. తన కుమారుడు సోమదత్తుడు సోలిపోగానే బాహ్లికుడు సాత్యకితో యుద్ధముకు తలపడ్డాడు. భీముడు బాహ్లికునితో తలపడి బాణప్రయోగం చేసాడు. బాహ్లికుడు శక్తి ఆయుధంతో భీముని కొట్టాడు. ఆ శక్తిఆయుధ ఘాతానికి భీముడు మూర్చిల్లినా వెంటనే తేరుకుని బాహ్లికుని ముద్గర అను ఆయుధముతో కొట్టాడు. ముద్గర దెబ్బకు వయోధికుడైన బాహ్లికుడు తలపగిలి చనిపోయాడు. పాండవసేనలు జయజయధ్వానాలు చేసాయి.


*భీమసేనుడి చేతిలో కురురాజకుమారులు మరణించుట*


బాహ్లికుని మరణం చూసి దుర్యోధనుడి తమ్ములు పది మంది భీముడితో తలపడ్డారు. తనను చుట్టుముట్టిన పది మంది రాకుమారులను భీముడు పది బాణములతో సంహరించాడు. అది చూసి కర్ణుని తమ్ముడు వృకరధుడు భీమునితో తలపడ్డాడు. తనను సమీపించిన వృకరధుని భీముడు ఒకే దెబ్బతో చంపాడు. తరువాత భీమునితో శకుని తమ్ములు పన్నెండు మంది తలపడ్డారు. భీముడు వారిని అవలీలగా సంహరించాడు. భీముని పరాక్రమానికి ఎదురు లేక పోయింది. భీముని ఎదుర్కొన్న వారు ప్రాణాలతో బయటపడటం కష్టమైంది. ఆ తరువాత త్రిగర్త, బాహ్లిక, శూరసేన, మాళవ, వసాతి సేనలు ఒక్కుమ్మడిగా భీమసేనుని చుట్టుముట్టాయి. అది చూసి ధర్మరాజు తన సేనలతో భీమసేనుడిని చేరి కౌరవ సేనలను చీలి చెండాడటం మొదలు పెట్టారు. కౌరవ సేన క్రమంగా సన్నగిల్ల సాగింది.


*ద్రోణుడు పాండవులను ఎదుర్కొనుట*


కురుసేన క్షీణించడం చూసి సుయోధనుడు ద్రోణునికి జరిగిన విషయం వివరించగానే ద్రోణుడు వెంటనే ధర్మరాజును ఎదుర్కొని అతడి మీద దివ్యాస్త్రప్రయోగం చేసాడు. ధర్మరాజు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ద్రోణుడు ధర్మరాజు మీద ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు తిరిగి ఇంద్రాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. ద్రోణుడు దర్మజునిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయగా ధర్మరాజు అదే అస్త్రాన్ని ప్రయోగంచి దానిని నిర్వీర్యం చేసాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు అతడిని లక్ష్యపెట్టక పాంచాలసేనను సంహరిస్తూ వారిని తరిమి కొట్టాడు. అదే సమయంలో మత్స్య కేకయ సేనలు కురుసేనను చుట్టుముట్టాయి.


*కృపాచార్యకర్ణుల వాదం*


సుయోధనుడు కర్ణుని వద్దకు వెళ్ళి తన పరాక్రమం చూపమని అర్ధించాడు. కర్ణుడు " అర్జునా! అర్జునుడు, భీముడు నాకు ఒక లెక్కా ! నేను ఒక్కడినే వారిరువురిని సంహరించి నీకు ఆహ్లాదం కలిగిస్తాను " అన్నాడు. కర్ణుని మాటలు విన్న కృపాచార్యుడు " కర్ణా ! చాలా బాగా పలికావు ఈ రోజుతో పాండవులను చంపి సుయోధనుడికి పట్టం కట్టేలా ఉన్నావు. ఈ పరాక్రమం ఘోషయాత్ర సమయాన, ఉత్తర గోగ్రహణ సమయాన ఏమైంది. ప్రగల్భములు వదిలి కార్యశూరత్వం చూపించు. అయినా నీవు ఇంత వరకు పాండవులను ఎదుర్కొన్నదే లేదు వారిని ఎలా గెలుస్తావు. మనమందరం అర్జునుడి చేత ఎన్ని సార్లు ఓడిపోయాము. ఇప్పుడు అతడికి ధర్మరాజు, భీముడు, ఘటోత్కచుడు ఉన్నారు. సాత్యకి విషయం సరేసరి. వీరినందరిని నీవు ఒక్కడివే గెవడం సాధ్యమేనా ! " అన్నాడు. ఆమాటలకు కర్ణుడు రోషపడి " కృపాచార్యా ! నేను ఆడిన మాట తప్పను పాండవులను జయించి అన్న మాట నెరవేర్చుకుంటాను. మీరంతా ఎప్పుడూ పాండవులను పొగిడి కౌరవసేనలో ఉత్సాహం తగ్గిస్తున్నారు. మన సైన్యంలో నేను, ద్రోణుడు, అశ్వత్థామ, శల్యుడు మొదలైన అతిరధ మహారధులు లేరా నీ మాటలు వారిని కాని వారిని చేస్తున్నాయి. నీవు బ్రాహ్మణుడివి కనుక నీ అధిక ప్రసంగం సహించాను. ఇక ఒక్క మాట మాట్లాడినా నీ నాలుక కోస్తాను జాగర్త " అన్నాడు. తన మేనమామను దూషించడం చూసి అశ్వత్థామ క్రుద్ధుడై కత్తి తీసుకుని కర్ణుని మీదకు లంఘించాడు. సుయోధనుడు అశ్వత్థామను వారించగా కృపాచార్యుడు అశ్వత్థామను గట్టిగా పట్టుకుని " నాయనా అశ్వత్థామా ! అంతకోపం పనికి రాదు శాంతం వహించు " అని అనునయించాడు. సుయోధనుడు అశ్వత్థామను చూసి " గురుపుత్రా ! మీ అందరి లక్ష్యం పాండవులను జయించి నన్ను ఈ భూమండలానికి పట్టాభిషిక్తుడిని చేయడం. మనలో మనం కలహించుకుంటే విజయం ఎలా ప్రాప్తిస్తుంది. కర్ణుడి బదులుగా మీ అందరిని నేను క్షమాపణ అడుగుతున్నాను అతడిని క్షమించండి " అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు, అశ్వత్థామ శాంతించి తిరిగి యుద్ధసన్నద్ధమైయ్యారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో*𝕝𝕝 *కాచే మణిర్మణౌ కాచో*

            *యేషాం బుద్ధిర్వికల్పతే*।

            *న తేషాం సన్నిధౌ భృత్యో*

            *నామమాత్రోఽపి తిష్ఠతి*॥


                  -- *పఞ్చతన్త్రమ్*--


*తా𝕝𝕝 ఎవరిబుద్ధికి (ఏ రాజుల బుద్ధికి) గాజుముక్క మణిగాను, మణి గాజుముక్కగాను.., భ్రాంతిగా తోస్తుందో అట్టి రాజులవద్ద నామమాత్రానికైననూ సేవకులు ఉండరు....*


 ✍️🌹💐🪷🙏