26, ఆగస్టు 2020, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*



*652 నామ మంత్రము*

*ఓం వేద్య వర్జితాయై నమః*

తెలుసుకోవలసిన, తెలుసుకోబడని విషయములు ఏవియు లేని సర్వజ్ఞ, విజ్ఞాత్రి అయిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వేద్య వర్జితా* అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం వేద్య వర్జితాయై నమః* అని ఉచ్చరిస్తూ విజ్ఞానస్వరూపిణి అయిన జగన్మాతను భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులు తల్లి కరుణచే   అఖండ విద్యాసంపన్నులై చక్కని జీవితంలో మంచి అధికారహోదాలో రాణిస్తారు

జగన్మాత  *సర్వజ్ఞా (అన్నియు తెలిసి ఉన్నది), జ్ఞానదాయని (జ్ఞానమును ప్రసాదించునది),  జ్ఞానవిగ్రహా (జ్లానమే తనరూపము),   జ్ఞానముద్రా (చూపుడు,బొతన వ్రేళ్మను కలుపగా ఏర్ఫడు జ్ఞానమద్రా స్వరూపిణి), జ్ఞానగమ్యా (జ్ఞానమునకు మార్గమయినది) జ్ఞానజ్ఞేయ (జ్ఞానము, జ్ఞానముచే తెలియదగునది)* అయినది పరాశక్తి. ఇంక తల్లికి తెలియవలసినది ఇంక ఏదియు లేదు అని భావము. అందుకే శ్రీమాత *వేద్యవర్జితా* అని వశిన్యాదులే నామ మంత్రమును అమ్మ నామావళిలో ఉంచారుఅమ్మకు ఇంక తెలియ వలసింది లేదు. *సర్వవేదాంత సంవేద్య* అనగా వేదాలలోను వేదాంగాలలోనూ  తెలియబడుచున్నది. అంటే తల్లి అన్నిటికీ అతీతమైనది, తల్లికి తెలియవలసినది ఇంక  ఏమియు లేదు గనుకనే జగన్మాత *వేద్య వర్జితా* యని స్తుతింపబడుచున్నది

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వేద్య వర్జితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతోవివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యముఅను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును.
************************


*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*75 నామ మంత్రము*

*ఓం మంత్రిణ్యంబా  విరచిత విషంగ వధ తోషితాయై నమః*

విషంగుడు, విశుక్రుడు అను భండాసురుని సోదరులలో విషంగుని తన మంత్రిణి అయిన శ్యామలాదేవి (రాజశ్యామలా) సంహరించుటతో సంతోషించిన దేవి లలితాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా* యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితాయై నమః* అని ఉచ్చరిస్తూ లలితాంబను ఉపాసించిన సాధకుడు తల్లికరుణచే విషయలోలత్వానికి, ఐహికసుఖములకు, ప్రాపంచిక విషయములయందు ఆసక్తికి, అజ్ఞానమునకు దూరముగలవాడై, బ్రహ్మజ్ఞానసంపన్నుడై తరించును.

మహిషాసురుడు, నరకాసురుడు, భండాసురుడు, రావణుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారు విషయాసక్తులు ఐహికభోగ లాలసులు, అజ్ఞానులు అరిషడ్వర్గములకు ప్రతిరూపులు. ఇలాంటి ప్రవృత్తులచేత అసురలయారు. లేకుంటే తపోబల సంపన్నులు, మహాబలవంతులు. బలానికీ, తపోబలానికీ కూడా దేవతలతో సమానులు. భండాసురుడు అతని పుత్రులు విషంగుడు, విశుక్రుడు కూడా అంతటివారే. రాక్షస ప్రవృత్తి గలవారు నేడుకూడా ఉన్నారుమహామాయావులుకూడా. భండాసుడైన  విషంగుని రూపంలో ఉన్న అజ్ఞానాన్ని, విషయాసక్తిని, అరిషడ్వర్గం పైకి తన  మంత్రిణీ అయిన శ్యామలను జగన్మాత పంపినది. శ్యామలాదేవీ విషంగుని వధించినది. వార్త వినిన తోడనే శ్రీమాత సంతోషించింది

విషంగుడు అంటే మనలో విషయలంపటాన్ని రెచ్చగొట్టేవాడు. విషయ లంపటం అనేది అరిషడ్వర్గము(కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యము) లకు సంబంధించినదే. అటువంటి విషయలంపటాన్ని నాశనంచేయగల సమర్థత శ్యామలాదేవికి గలదు గనుకనే శ్రీమాత విషంగ సంహారానికీ శ్యామలాదేవిని పంపింది. శ్యామలాదేవిని రాజశ్యామలా అంటారు. శ్యామలామంత్రోపాసన వలన అరిషడ్వర్గములు నశిస్తాయి. అజ్ఞానం పటాపంచలవుతుంది. విషంగుని వధించినది మంత్రిణి శ్యామలాదేవి. విషంగ సంహారంతో జగన్మాతలో సంతోషం కలిగింది.
అందుకే జగన్మాతను *మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా* యను నామ మంత్రంతో వశిన్యాదులు జగన్మాతను ప్రస్తుతించారు

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మంత్రిణ్యంబా విరచిత  విషంగ వధ తోషితాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతోవివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. *శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ* (శ్రీలలితా సహస్రనామములకు భాష్యముఅను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻 రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు రోజు  చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదిహేడవ అధ్యాయము*

*భగవంతుడు ప్రత్యక్షమై అదితికి వరమును ప్రసాదించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.10 (పదియవ శ్లోకము)*

*ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీర్ద్యోర్భూరసాః సకలయోగగుణాస్త్రివర్గః|*

*జ్ఞానం కేవలమనంత భవంతి తుష్టాత్త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః॥6967*

అనంతా! నీవు ప్రసన్నుడవైనచో మానవులకు బ్రహ్మదేవునియంతటి దీర్ఘాయువు, అతనితో సమానమైన దివ్యశరీరము కూడా ప్రాప్తించును. అంతేగాదు, వారు కోరుకొనిన వస్తువులు, అనంత సంపదలు, స్వర్గమర్త్యపాతాళలోకములు, యోగసిద్ధులు, ధర్మార్థకామములు, ఇంకను ఆత్మజ్ఞానము గూడ ప్రాప్తించును. ఇంక శత్రువులపై విజయము, మొదలగు చిన్న చిన్న లాభములు కలుగునని చెప్పవలసిన పనియే లేదు".

*శ్రీశుక ఉవాచ*

*17.11 (పదకొండవ శ్లోకము)*

*అదిత్యైవం స్తుతో రాజన్ భగవాన్ పుష్కరేక్షణః|*

*క్షేత్రజ్ఞః సర్వభూతానామితి హోవాచ భారత॥6968*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! అదితి విధమగా కమలాక్షుని స్తుతింపగా, సకల ప్రాణుల హృదయములలో నిలిచి వారి గతులను, స్థితులను ఎరిగిన భగవానుడు ఆమెతో ఇట్లనెను-

*శ్రీభగవానువాచ*

*17.12 (పండ్రెండవ శ్లోకము)*

*దేవమాతర్భవత్యా మే విజ్ఞాతం చిరకాంక్షితమ్|*

*యత్సపత్నైర్హృతశ్రీణాం చ్యావితానాం స్వధామతః॥6969*

*శ్రీభగవానుడు పలికెను* "దేవమాతా! అదితీ! నీ చిరకాలవాంఛను నేను ఎరుగుదును. శత్రువులు నీ సుతుల  సంపదలను లాగికొనిరి. వారి స్థానములనుండి వారిని వెళ్ళగొట్టిరి.

*17.13 (పదమూడవ శ్లోకము)*

*తాన్ వినిర్జిత్య సమరే దుర్మదానసురర్షభాన్|*

*ప్రతిలబ్ధజయశ్రీభిః పుత్రైరిచ్ఛస్యుపాసితుమ్॥6970*

యుద్ధమునందు నీ పుత్రులైన దేవతలు బలగర్వితులైన అసురులను జయించివిజయలక్ష్మిని పొందవలెనని నీవు అభిలషించుచున్నావు. నీవు నీ పుత్రులతో కలిసియుండుటకు కోరుచున్నావు.

*17.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఇంద్రజ్యేష్ఠైః స్వతనయైర్హతానాం యుధి విద్విషామ్|*

*స్త్రియో రుదంతీరాసాద్య ద్రష్టుమిచ్ఛసి దుఃఖితాః॥6971*

ఇంద్రుడు మొదలగు నీ పుత్రులు శత్రువులను వధింపవలెననియు దుఃఖితులైన అసురుల భార్యలు ఏడ్చుచుండవలెననియు దానిని నీవు చూడవలెననియు కోరుచున్నావు.

*17.15 (పదునైదవ శ్లోకము)*

*ఆత్మజాన్ సుసమృద్ధాంస్త్వం ప్రత్యాహృతయశఃశ్రియః|*

*నాకపృష్ఠమధిష్ఠాయ క్రీడతో ద్రష్టుమిచ్ఛసి॥6972*

అదితీ! నీ పుత్రులు తమ సంపదలను, శక్తిని పొందవలెననియు, వారు కీర్తిని, ఐశ్వర్యములను తిరిగి పొందవలెననియును, వారు స్వర్గముపై ఆధిపత్యములను పొంది, మునుపటివలె విహరింపవలె ననియు నీవు కోరుచున్నావు.

*17.16 (పదునారవ శ్లోకము)*

*ప్రాయోఽధునా తేఽసురయూథనాథా  అపారణీయా ఇతి దేవి మే మతిః|*

*యత్తేఽనుకూలేశ్వరవిప్రగుప్తా విక్రమస్తత్ర సుఖం దదాతి॥6973*

కాని, దేవీ! ఇప్పుడు అసుర సేనాపతులను జయించుట సాధ్యముకాదని నా అభిప్రాయము. ఏలయన, కాల స్వరూపుడైన పరమేశ్వరుడు, భృగువంశ బ్రాహ్మణులు వారికి అనుకూలముగా ఉన్నారు. సమయమున వారితో యుద్ధము చేసినను మనకు జయము లభింపదు.

*17.17 (పదిహేడవ శ్లోకము)*

*అథాప్యుపాయో మమ దేవి  చింత్యః సంతోషితస్య వ్రతచర్యయా తే|*

*మమార్చనం నార్హతి గంతుమన్యథా శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్॥6974*

దేవీ! ఐనను విషయము ఏదేని ఒక ఉపాయమును ఆలోచింపవలసియున్నది. నీవు పయోవ్రతమును ఆచరించుటవలన నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని. నా ఆరాధన ఎన్నడును వృథాకాదు. శ్రద్ధకు తగినట్లుగా ఆరాధనకు తప్పక ఫలము లభించును.

*17.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*త్వయార్చితశ్చాహమపత్యగుప్తయే పయోవ్రతేనానుగుణం సమీడితః|*

*స్వాంశేన పుత్రత్వముపేత్య తే సుతాన్ గోప్తాస్మి మారీచతపస్యధిష్ఠితః॥6975*

నీవు పుత్ర రక్షణ కొరకే విధ్యుక్తముగా పయోవ్రతము ద్వారా నన్ను పూజించి స్తుతించితివి. కనుక నేను నా అంశతో కశ్యపుని తపస్సునందు ప్రవేశింతును. నీకు పుత్రునిగా జన్మించి, నీ సంతానమును రక్షించెదను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*******************