21, జులై 2021, బుధవారం

గౌట్

 గౌట్ గురించి సంపూర్ణ వివరణ  - 


   ఈ వ్యాధిలో కాలిబాటన వ్రేళ్లు వాచి ఉంటాయి. నడిచినప్పుడు నొప్పిని కలిగించును. ఈ వ్యాధి కొంతకాలం ఉండి ఆ తరువాత దానంతట అదే తగ్గిపోవును . మరలా వస్తుంది. రక్తములో యూరిక్ ఆసిడ్ మోతాదు పెరగటం వలన ఈ సమస్య ఎక్కువుగా వచ్చును. 


 ఈ సమస్య రావడానికి గల కారణాలు  - 


      అధిక పరిమాణం ప్రొటీన్స్ గల పదార్ధాలలో "ప్యూరిన్స్ " అనబడు పదార్థాలు ఉంటాయి. ఇది జీర్ణం అగునప్పుడు యూరిక్ ఆమ్లం తయారగును. సాధారణముగా ఇది మూత్రములో విసర్జించబడుతుంది. కాని కొన్ని సందర్భాలాలో ఇది పూర్తిగా విసర్జించబడదు . ఇది రక్తములో నిలువ ఉండిపోతుంది. ఈ విధముగా విసర్జించబడని యూరిక్ ఆమ్లం స్పటిక రూపములో ముఖ్యముగా కాలిబాటన వ్రేలి కీలు వద్ద నిక్షిప్తమై ఉంటుంది . కావున బ్రొటన వ్రేలు వాచి నొప్పి కలిగించును. 


              ఈ యురిక్ ఆమ్లము ఎక్కువుగా ఉత్పత్తి అగుటకు కారణాలు  -

   

  *  ప్యూరిన్ ఎక్కువ గల ఆహార పదార్థాలు అయిన మాంసము విపరీతముగా తినటం . 


 *  నీరు తక్కువుగా తాగుతూ మద్యము , కాఫీ , టీ మొదలైన వాటిని అధికంగా సేవించుట . 


 *  విపరీతమైన మానసిక సంఘర్షణ . 


 *  వంశపారంపర్యముగా రావడం . 


            ఈ సమస్యకు సరైన ఔషధాలు వాడుతూ ముఖ్యముగా పథ్యం పాటించవలెను . ఈ సమస్యతో ఇబ్బందిపడువారు నన్ను సంప్రదించగలరు .  సంప్రదించవలసిన నంబర్       9885030034 . 


  

       మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


 

    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

దుర్గా సప్తశతి

 *దుర్గా సప్తశతి గ్రంథ పరిచయం..*  *(మొదటి భాగం)*


అమ్మవారి భక్తులకు దుర్గా సప్తశతి ఒక ప్రధానమైన పారాయణ గ్రంధము.   ఈ పుస్తకంలో వర్ణింపబడిన అమ్మవారి చరిత్ర దేవీభాగవతానికి సంక్షేప రూపంలోనూ సార రూపంలోనూ ఉంటుంది. 


వేద వ్యాసులవారు రచించిన  మార్కండేయ పురాణంలో సావర్ణి మన్వంతర విభాగంలో దేవీ మహత్మ్యం లో 13 అధ్యాయాలలో దుర్గా సప్తశతి విస్తరించి ఉన్నది. 


*మొత్తం సప్తశతి 13 అధ్యాయాలు ప్రధానంగా మూడు భాగాలుగా ఉంటుంది. వాటిని ప్రథమ చరిత్ర మధ్యమ చరిత్ర ఉత్తర/ఉత్తమ చరిత్ర అని పిలుస్తారు..*


మొత్తం పుస్తకం యొక్క పారాయణ మే కాకుండా ఈ పుస్తకంలో అత్యంత శక్తివంతమైన  స్తోత్రాలు విడివిడిగా పారాయణ చేసుకునేవి ఉన్నాయి. ఆ స్తోత్రాలు కూడా చాలా ప్రసిద్ధమైనవి చాలామంది నిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటారు.  మొదటి అధ్యాయం లో 70 -87 శ్లోకాలు లో ఉన్న బ్రహ్మ దేవుడు చేసిన నిద్రాదేవత (కాళికా) స్తుతి. 4వ అధ్యాయం లో 3-27 శ్లోకాల లో ఉన్న దేవతలచే  చేయబడిన దుర్గా స్తోత్రం. ఐదవ అధ్యాయము లో 9-82 శ్లోకాల లో   యా దేవీ సర్వ భూతేషు అనివచ్ఛే   అపరాజిత దేవి స్తుతి . 11వ అధ్యాయములో 3-35 శ్లోకాల లో ఉన్న కాత్యాయని దేవి స్తుతి అంటే నారాయణి నమోస్తు తే అని వచ్ఛే నారాయణీ స్తోత్రము మొదలైనవి ఆ ప్రధానమైన స్తోత్రాలు. ఈ స్తోత్రాలకు వేదంలోని సూక్తాల  కున్నంత ప్రామాణ్యత గౌరవము ఉన్నాయి.  ఈ స్తోత్రాలు చాలామంది కి నోటికి వచ్చి రోజూ చదువుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళలో చాలామందికి ఈ స్తోత్రాలు  సప్తశతిలో ఉన్నాయి అన్న విషయం తెలియక పోవచ్చు.


అలాగే ఈ సప్తశతిలోని కొన్ని భాగాలను ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. అవి ప్రాధానికం రహస్యం, వైకృతికం రహస్యం, మూర్తి రహస్యం అనేవి. ఈ మూడింటినీ కలిపి రహస్య త్రయం అని ప్రత్యేకంగా పారాయణం చేస్తారు. 


పెద్దలూ గురువులూ సప్తశతిలోని కొన్ని శ్లోకాలు సిద్ధ మంత్రాలు గా గుర్తించి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఫలితాన్ని నిర్ణయించారు. అంటే ఏ కోరిక కోరుకునే వాళ్లకు దానికి సంబంధించిన ఆ మంత్రము జపం చేసుకోవాలి. ఆ సిద్ద మంత్రాల వివరాలన్నీ సాధారణంగా దేవీ సప్తశతి పారాయణ పుస్తకాలలో ఉంటాయి.


సూక్ష్మంలో మోక్షం కోరుకునే వాళ్లకోసం సప్తశతి లో నుంచి ఏడు శ్లోకాలను తీసి "సప్తశ్లోకీ దుర్గా" అని వాటిని పారాయణ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా శక్తివంతమైన పారాయణ మంత్రము. ఆ ఏడు శ్లోకాలు కూడా చదువ లేని వాళ్ళ కోసం అందులో ఉన్న "సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే" శ్లోకం ఒకటైనా చదువుకోమంటారు.


*సప్తశతి లో ఉండకపోయినా సప్తశతి పారాయణమప్పుడు పఠించే అనుబంధ స్తోత్రాలు ::  దేవీ కవచము, అర్గలా స్తోత్రము, సిద్ద కుంజికా స్తోత్రము మొదలైనవి  ఉన్నాయి.*


సప్తశతి లో 587 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలను స్వతంత్రమైన వాక్యాలు గాను మంత్రాల గాను విభజించడం జరిగింది. అలా విభజించినప్పుడు 535 పూర్తి శ్లోకాలు, 42 అర్ధ శ్లోకాలు,  66 త్రిపాన్మంత్రాలు  ఇవి కాక రాజోవాచా  వైశ్య ఉవాచ మొదలైన ఉవాచ వాక్యాలు 57 ఉంటాయి. ఇవి మొత్తం కలిపితే 700 అవుతాయి. సప్తశతి అంటే 700 అని అర్థము. సప్తశతి లో మంత్రం కానటువంటి వృధా పదం అనేది ఏదీ లేదు.


*హిందూమతంలో వేదమంత్రాలను  ఉపయోగించి మాత్రమే వివిధ రకాలైన హోమాలు చేస్తుంటారు. పురాణాలలో మంత్రాలూ స్తోత్రాలూ ఉపయోగించి హోమాలు చెయ్యరు. కానీ సప్తశతి పురాణాలలోది అయినా దీనిని ఉపయోగించి చండీ హోమం జరపడం సాంప్రదాయంగా వస్తోంది.  చండీ హోమం మొత్తం కూడా దుర్గా సప్తశతి లోపలుండే ఏడు వందల మంత్రాల తోనే జరుగుతుంది.* *ప్రధానంగా సప్తశతి ని ఆధారం చేసుకుని చండీ హోమం జరుగుతుంది.* 


అందులోఅక్కడక్కడ పైన చెప్పిన స్తోత్రాలతోనూ నవార్ణ మంత్రజపము  తో కూడిన మరికొన్ని హోమాలు ఉంటాయి. రుద్ర, గణపతి మొదలైన హోమాలు కూడా మధ్య మధ్యలో ఉపాంగాలు గా ఉంటాయి..

సప్తశతి కి వేద భాగంగా పరిగణించేటంత మంత్రశక్తి, ప్రభావము ఉన్నాయన్నమాట...


.....ఇంకా వుంది.


*పవని నాగ ప్రదీప్*

Question-- Answer Rajneesh

 A follower of Rajneesh questioned him.

 Question - Please tell what should we do when houses and property are being burnt, murders are being done by jihadis?  Should promote Hindu Muslim brother brother or take any step for security, please guide.


 Answer: Your question itself is telling your stupidity, it does not seem that you have learned anything from history.


 When Mahmud Ghaznabi attacked the temple of Somnath, Somnath was the largest and richest temple in India at that time.


 1200 Hindu priests who worshiped in that temple thought that we are engaged in meditation, devotion, worship, day and night.


 So God will protect us.

 He did not make any arrangement for protection, on the contrary, the Kshatriyas who could protect themselves were also refused.


 As a result, Mahmud killed thousands of unarmed Hindu priests, broke idols and temples and robbed them of immense wealth, diamonds, jewels, gold and silver.

 His meditation and devotional worship could not protect him.


 Today even after hundreds of years the same stupidity continues, it does not seem that you have learned anything from the lives of your great men.


 If meditation had so much power that it could change the hearts of the wicked, then why would Ramchandra ji need to always keep a bow and arrow with him.  With the power of meditation, he would have changed the hearts of demons and Ravana, explaining them as sur-asura brothers and brothers and the quarrel would have ended, but even Rama could not explain to anyone and the decision of Ram-Ravana's war was also decided by the weapon.


 If meditation had so much power that it could transform the mind of others.  So why the Purnavatar Shri Krishna would have needed to kill Kansa and Jarasangha!  Change them carefully.


 If meditation had the power to change the mind of another, then the Mahabharata war would not have happened, Krishna would have changed Duryodhana with the power of his meditation and the war would have been averted.  But on the contrary Krishna stopped Arjuna who wanted to go into meditation and engaged him in battle.


 The war of Mahabharata is the biggest war in the history in which crores of people were massacred, how many Maharishi saints were there in India in the last 1200 years, from Gorakhnath to Raidas and Kabir to Guru Nanak to Guru Gobind Singh, the power of meditation of all these also Muslim invaders and Britishers.  During this, crores of Hindus were massacred and their religion was forcibly converted at the tip of the sword.


 were killed and converted to Islam

 The teachings of those saints could not change the invaders.  Guru Nanak gave his philosophy of religion in such a way that Muslims could easily understand and assimilate him.  But in the same Guru tradition, Guru Gobind Singh had to take up the sword against the Muslims, to protect the Hindu religion, the unarmed Sikhs had to take up arms.


 It becomes clear from this that meditation can transform one's own consciousness.

 But we have to protect the matter (physical body) ourselves, for that we have to take the help of science and technology.


 Solve more than 70% of the country's problems


 * Lord Shri Krishna had asked for 5 villages!

 *We are asking for 5 laws in the interest of the country!!*


 *Equal Education*

 *uniform civil code*

 *Conversion Control*

 *Intrusion Control*

 *Population Control*


 If these five laws do not come, Sanatan will be completely destroyed like the whole world and nine states of India.


 *Save India Movement*


 *10 am, 8th August 2021*

 *Come to Jantar Mantar, Delhi*


 Contact No - 9868310740


 You have to send this message to at least 5 people.  *(I will send it to all my friends)*


 * in this way 5 people will message 5..*


 5 × 5 = 25

 25 × 5 = 125

 125 × 5 = 625

 625 × 5 = 3125

 3125 × 5 = 15,625

 15625 × 5 = 78,125

 78,125 × 5 = 390,625

 390,625 × 5 = 1,953,125

 1,953,125 × 5 = 9,765,625

 9,765,625 × 5 = 48,828,125

 48,828,125 × 5 = 244,140,626


 * you just have to add a link and,*

 * Seeing the whole country will stand with you.* 🙏🙏🚩🚩

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అప్పులు..అన్నదానం...* 


"ఏమిటోనండీ నన్ను మాత్రమే గురి పెట్టుకొని ఆ భగవంతుడు కష్టాలను సృష్టించాడేమో అనిపిస్తోంది..మూడేళ్ళ నుంచీ నలిగిపోతున్నాను..మనసుకు ఒక్క క్షణం శాంతి లేదు..తీవ్రమైన నైరాశ్యం లో కూరుకుపోయాను..చిన్నపాటి ఆశ కూడా లేకుండాపోయింది..ఇక నాకు మిగిలింది చావొక్కటే..నా అంతట నేను నా ప్రాణం తీసుకోలేను..ఆ భగవంతుడిని కోరుకునేది ఒక్కటే.."నాయనా! నన్ను కడతేర్చు తండ్రీ!..ఈ బాధలు, అవమానాలు నేను పడలేను.." అంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్న ఆ వ్యక్తిని చూస్తే..ఎంతో బాధ వేసింది..


మరి కొద్దిసేపటికి ఆయన కొద్దిగా ఊరడిల్లాడు..కళ్ళు తుడుచుకుని ఒక ప్రక్కగా కూర్చున్నాడు..మెల్లిగా ఆయన వివరాలు అడిగాను..ఆయన పేరు కామేశ్వర రావు..హైదరాబాద్ నుంచి వచ్చారు..ఒక ప్రైవేట్ కంపెనీ లో అకౌంటెంట్ గా పని చేస్తున్నారు..భార్యా ఇద్దరు పిల్లలు..ఉన్నంతలో సుఖంగానే వున్నారు..కామేశ్వరరావు గారి మంచితనాన్ని ఆసరాగా తీసుకున్న మిత్రులు..తాము చేసిన అప్పులకు ఈయనను హామీగా వుండమని కోరారు..ముందూవెనుకా ఆలోచించకుండా కామేశ్వరరావు గారు సంతకాలు పెట్టేసారు..కొన్నాళ్ళకు ఆ మిత్రులు ముఖం చాటేశారు..ఆ అప్పులను వడ్డీతో సహా ఈయన కట్టాల్సివచ్చింది..అందుకోసం వేరేవాళ్ళ దగ్గర కామేశ్వరరావు ఎక్కువ వడ్డీ కి అప్పు చేయాల్సి వచ్చింది..ఒక దశకు వచ్చేసరికి..ఈయనకు వచ్చే జీతంలో ముప్పావు భాగం తాను తెచ్చిన.. లేదా..హామీ ఉన్న అప్పుల తాలూకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నది..దానికి తోడు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికొచ్చి నానా మాటలు అనసాగారు..ఈ పరిణామాలతో కామేశ్వర రావు కృంగిపోయాడు..దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు..దేవుడి మీద భారం వేసి కాలం వెళ్లబుచ్చసాగాడు..


ఆ సమయం లో కామేశ్వర రావు కు చిన్ననాటి మిత్రుడు కలిసాడు..అతను దత్త భక్తుడు..పిఠాపురం లో ఉన్న పాదగయ క్షేత్రాన్ని దర్శించమని..అలాగే వీలుంటే మరికొన్ని అవధూతల మందిరాలను కూడా దర్శించమని..అలా దర్శిస్తే కొంత మేలు జరుగుతుందని సలహా ఇచ్చాడు..కామేశ్వర రావుకు ఈ సలహా పెద్దగా నచ్చలేదు..కానీ..స్నేహితుడి తో మాత్రం సరే అన్నాడు..ఆరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి..దూరపు బంధువు ఒకాయన ఫోన్ చేసి..తాను ఈ శనివారం నాడు మాలకొండ వెళుతున్నాననీ.. అక్కడినుండి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి కూడా వెళుతున్నాననీ చెప్పాడు..కామేశ్వర రావు కు ఎందుకో తాను కూడా వెళితే బాగుండు అనిపించింది..వెంటనే తాను కూడా వస్తానని ఆయనకు చెప్పేసాడు..అలా శనివారం నాడు మాలకొండలోని శ్రీ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి ని దర్శనం చేసుకొని సాయంత్రానికి మొగలిచెర్ల వచ్చారు..


ఆరోజు పల్లకీ సేవ లో కామేశ్వర రావు పాల్గొన్నాడు..రాత్రికి మందిరం లోనే నిద్ర చేసాడు..ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి సమాధికి జరిగిన అభిషేకమూ.. విశేష హారతులూ శ్రద్ధగా చూసాడు..తరువాత తాను కూడా అర్చన చేయించుకొని..సమాధి దర్శనం చేసుకున్నాడు.. ఇవతలికి వచ్చిన తరువాత.."మొదటి సారిగా ఒక అవధూత మందిరాన్ని దర్శించుకున్నానండీ..నా సమస్యలన్నీ స్వామివారికి చెప్పుకున్నాను..అంతా ఆయనదే భారం..అన్నీ సర్దుకుంటే మళ్లీ ఒకసారి వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాను..ఆదివారం నాటి అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు భరిస్తాను.."  అన్నాడు..


కామేశ్వర రావు హైదరాబాద్ చేరిన రెండు మూడు రోజుల్లోనే..ఢిల్లీ లో ఉంటున్న వాళ్ళ అక్కయ్య గారు హైదరాబాద్ వచ్చారు..కామేశ్వర రావు తాను అనుభవిస్తున్న బాధలు ఆవిడకు చెప్పుకున్నాడు..ఆవిడ శ్రద్ధగా విని..ఢిల్లీ లో తమకున్న అపార్ట్మెంట్ లో ఒకదానిని అమ్ముతున్నాననీ.. తనకు సుమారు రెండు కోట్లు వస్తాయని..అందులోంచి తమ్ముడి కోసం కొంత మొత్తాన్ని ఇస్తానని చెప్పారు..ఇది కామేశ్వర రావు ఏరకంగానూ ఊహించలేదు..ఆవిడ ఇవ్వబోయే మొత్తంతో తనకున్న అప్పుల్లో తొంభైశాతం తీరిపోతాయి..అవధూత మందిరాన్ని దర్శించుకుంటే మేలు జరుగుతుందని తన మిత్రుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి..ఆ దత్తాత్రేయుడు తనకు ఇలా మేలు చేశాడని నమ్మకం కలిగింది..


మరో రెండు నెలల కల్లా కామేశ్వరరావు గారి అక్కయ్య గారు నలభై లక్షల రూపాయలను తీసుకొచ్చి ఇచ్చారు..వెంటనే తనకున్న అప్పులను తీర్చివేశాడు..మరో పదిరోజుల తరువాత భార్యా పిల్లలను తీసుకొని మొగలిచెర్ల కు వచ్చాడు..ఆరోజు ఆదివారం నాటి అన్నదానానికి మొత్తం ఖర్చు తానే భరించాడు..


"ఆ దత్తాత్రేయుడే మా అక్కయ్య రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నాడు.. ఇక జన్మలో ఇంతకు ముందు చేసిన పొరపాట్లు చేయనండీ.." అని ఇప్పటికీ చెపుతుంటాడు కామేశ్వరరావు భక్తిగా..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

పదాల తేడా

 🍃🥀పదాల తేడా చదువుకోడానికి మాత్రమే..చర్చకోసం కాదు

🙂 🙂 🙂 🙂 🙂 🙂

'ఓ పల్లెటూరి కిరాణా వ్యాపారి టీచర్ దగ్గరకొచ్చి ' సింతపండు' అని రాసినందుకు నా కొడుకుని దండించారట. ' చింతపండుని సింతపండు అంటే దాని పులుపేమైనా తగ్గిపోతుందా ? ఎలా రాసినా పర్వాలేదు. కొంచెం కిరణాపద్దులు రాయడం నేర్పండి చాలు' అంటాడు. మునిమాణిక్యం వారి రచనలలోని సన్నివేశం ఇది.భాష ప్రయోజనం భావ వ్యక్తీకరణకే. కానీ కొన్ని పదాలు వాటి మూలాలు తెలుసుకుంటే చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. చూడండి.  

'వాడెదవ' అంటే తిట్టనుకునేరు .చెరకుగడ చివరిభాగం. tip of the sugar cane అన్నాడు బ్రౌన్.

'సమాజం' అనబోయి 'సమజం' అన్నారనుకోండి.ప్రజా సమూహం కాస్తా 'పశువుల మంద' అయిపోతుంది.

'రామబాణం' అంటే మనకు తెలిసిన అర్ధమే కాదు. 'తాటాకు గ్రంధాలను తొలిచే పురుగు' అనే అర్ధం కూడా ఉంది. (ఈ అర్ధం బాగుంది కదా !)

'శ్రీ' అంటే విషం అనే అర్ధం కూడా ఉందండోయ్.

'దస్తూరి' అంటే చేతిరాత అనే కాదు 'సుంకం' అని కూడా .(customary fee - బ్రౌన్)

 ఒకాయన ఉదయాన్నే ఓ పండితుడి ఇంటికి వెళ్లి అతని కుమారుణ్ణి " మీ నాన్నగారున్నారా ? " అని అడిగాడట. తండ్రికి తగ్గ ఆ కొడుకు " పెరట్లో పుష్పిక విముక్తికై నిష్టీవన కార్యక్రమంలో ఉన్నారు " అన్నాడట ఆ పెద్ద మనిషి అదేదో పూజా కార్యక్రమం అనుకుని వెళ్ళిపోయాడు పాపం. ఇంతకీ ఆ పండితుడు పళ్ళు తోముకుంటున్నాడు. పుష్పికం అంటే పళ్ళ పాచి ( దంత మలం అని శబ్దరత్నాకరం ) నిష్ఠివనం అంటే ఉమ్మేయడం.

 ఒక మీటింగులో ఓ వక్త మాట్లాడుతూ " మన మంత్రిగారు సభాజనమును బాగా ఆకట్టుకుంటారు " అన్నాడట . 'సభాజనము' అంటే చుట్టాలను కౌగాలించుకుని సంతోష పెట్టడం( శబ్దరత్నాకరం)

సొంతవిషయాలను పదేపదే చెబుతుంటే ' నీ సొద ఆపు అంటాం . విసుగెత్తించే ప్రసంగం అనే అర్ధం మాండలికాల్లో ఉంది కానీ " శవాన్ని కాల్చడానికి పేర్చిన కట్టెల పోగు " అనేది నిఘంటు అర్ధం.

ఫలానా రాజకీయ నాయకుడికి ప్రజలు 'బ్రహ్మరధం' పట్టారు అంటారు. గొప్ప సత్కారం అనే అర్ధమే తీసుకుంటాం. కానీ బ్రహ్మరథం అంటే 'చనిపోయిన సన్యాసులను తీసుకుపోయే వాహనం' అని సూర్యరాయాంధ్ర నిఘంటువు లో ఉంది. 

' గ్రామీణ ప్రాంతం' అంటున్నాం. 'గ్రామీణ' అంటే వేశ్య అనే అర్ధం కూడా ఉంది.

గందానికి లేని ఒత్తు తగిలించి 'గంధం' అని రాస్తున్నాం.

'బోగి పండుగ' ను 'భోగి పండుగ' అనకపోతే మనకి పండగలా అనిపించదు.

గొడుగు అంటే తెలుసు. మరి 'గిడుగు' అంటే? కర్ర లేని గొడుగు.

పంగనామం అంటే తెలుసు మరి 'బుంగనామం' ఏమిటి ? తెల్ల నామానికి ఎర్ర నామానికీ ఎడము లేకుండా ఉండే నామం.

బాధితులకు నష్ట 'పరిహారం' ఇవ్వాలంటారు. 'పరిహారం' అంటే విడిచిపెట్టడం అనే అర్ధం కూడా ఉంది 

'ఇలాగే ప్రయోగించండి' అని చెప్పడానికో, చర్చ కోసమో కాదు ఇది. ఆసక్తి ఉండాలే కానీ నిఘంటువులు తిరగేస్తే ఇలాంటి విశేషాలెన్నో చూడొచ్చని చెప్పడానికి.

                🍃🥀🍃🥀🍃

సేకరణ: అంతర్జాలం

శ్రీ కృష్ణుడు ఇప్పటికీ

 శ్రీ కృష్ణుడు ఇప్పటికీ సజీవంగా పూరి క్షేత్రంలో జగన్నాధుడిగా ఉన్నాడా?


శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, దహన సంస్కారాలు జరిగాయి, ఆయన శరీరమంతా ఐదు మూలకాలలో కలుపుతారు కాని ఆయన గుండె ఒక సాధారణ మనిషిలా కొట్టుకుంటుంది. ఆయన ఖచ్చితంగా సురక్షితంగా ఉన్నాడు, ఆయన గుండె ఈ రోజు వరకూ సురక్షితంగా ఉంది, ఇది జగన్నాథుని చెక్క విగ్రహం లో ఉంది. మరియు అదే విధంగా కొట్టుకుంటుంది, చాలా కొద్ది మందికే ఇది తెలుసు.


 మహాప్రభు జగన్నాథ్ (శ్రీ కృష్ణ) ను కలియుగ ప్రభువు అని కూడా అంటారు.


 ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది, ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారుతుంది. అంటే మొత్తం నగరం అంతటా లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఆపివేసిన తరువాత, crpf సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది ... ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు ...


 ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంది ... పూజారి కళ్ళు కట్టుకున్నాయి ... పూజారి చేతిలో చేతి తొడుగులు ఉన్నాయి .. పాత విగ్రహం నుండి "బ్రహ్మ పదార్ధం" తీసి కొత్త విగ్రహంలో ఉంచుతాడు ... ఈ బ్రహ్మ పదార్ధం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ... ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు. .. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతోంది ...


 ఇది అతీంద్రియ పదార్ధం, దానిని తాకడం ద్వారా, ఒక వ్యక్తి శరీరం యొక్క రోగాలు ఎగిరిపోతాయి .. ఈ బ్రహ్మ పదార్ధం శ్రీ కృష్ణుడికి సంబంధించినది .. అయితే అది ఏమిటోి, ఎవరికీ తెలియదు ... ఈ మొత్తం ప్రక్రియ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ సమయంలో భద్రత చాలా ఎక్కువగా ఉంటుoది .


 కానీ ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ్ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు ???


 కొంతమంది పూజారులు మేము అతని చేతిలో తీసుకున్నప్పుడు, అతను కుందేలు లాగా దూకుతున్నాడని ... అక్కడ కళ్ళకు కట్టినట్లు ఉంది ... చేతికి తొడుగులు ఉంటేనే మనకు ఆ అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు. ...


 ఈ రోజు కూడా, జగన్నాథ్ యాత్ర సందర్భంగా, పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో తుడుస్తాడు.


 లార్డ్ జగన్నాథ్ ఆలయ సింహ ద్వారం నుండి లోపలికి మొదటి అడుగు వేసిన వెంటనే సముద్రపు తరంగాల శబ్దం వినబడదు, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు ఆలయం నుండి ఒక అడుగు బయటకు వేసిన వెంటనే, సముద్రం యొక్క అలల హోరు వినబడుతుంది.


 చాలా దేవాలయాల శిఖరంపై పక్షులు కూర్చుని ఎగురుతూ ఉండడాన్ని మీరు చూసిఉంటారు, కాని జగన్నాథ్ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు.


 జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది


 లార్డ్ జగన్నాథ్ ఆలయం యొక్క ప్రధాన శిఖరం రోజులో ఏ సమయంలోనైనా నీడ పడదు.


 లార్డ్ జగన్నాథ్ ఆలయం యొక్క 45 అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజూ మార్చడం జరుగుతుంది, జెండాను ఒక రోజు కూడా మార్చకపోతే, ఈ ఆలయం 18 సంవత్సరాలు మూసివేయబడుతుంది.


 అదేవిధంగా, జగన్నాథ్ ఆలయం పైభాగంలో సుదర్శన్ చక్రం కూడా ఉంది, ఇది ఏ దిశ నుండి చూసినా అది మీకు ఎదురుగా ఉంటుంది.


 లార్డ్ జగన్నాథ్ ఆలయ వంటగదిలో, 7 మట్టి కుండలు ఒకదానికొకటి పైన ఉంచి ప్రసాదం ఉడికించాలి, ఇది ఒక చెక్క నిప్పుతో వండుతారు, ఈ సమయంలో పైన ఉంచిన కుండ యొక్క వంటకం మొదట వండుతారు.


 లార్డ్ జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజూ చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు, కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది.


 ఇవన్నీ ఆశ్చర్యకరమైనవి.

గురువు

 💥గురువు ??


🌹డబ్బు,  పేరు, పదవులు ఇవన్నీ అర్థాలు మాత్రమే.. పరమార్థాన్ని చేరుకోవడమే జీవన గమ్యం.. దానిని చేర్చగలిగేవాడు 'గురువు' మాత్రమే అని చెప్పే కధ ఇది.                                


💥ఓ మహానగరంలో  ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ.. ధర్మప్రబోధం చేస్తుండేవారు. మహాసంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి

“ అసలు గురువు అవసరమా?

గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?” అని ప్రశ్నించాడు. 


💥గురువుగారు నవ్వుకుని , మీరేం చేస్తుంటారని అడిగారు. నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు సంపన్నుడు.

అయితే! ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకువెళ్లండని గురువుగారు అడిగారు. 


💥ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. 


💥ఏడంతస్థుల పెద్ద భవంతి. అందులో దొరకనిదంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు.


💥అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను పెంచుతున్నాడు. ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు.


 💥కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ, తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్లింది. కడుపునిండా , తృప్తిగా మేసింది. రెండుగంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది.


💥తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ.. తిరుగుతూ.. వాసన చూస్తూ, మూడవ అంతస్థులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్లింది. తృప్తిగా తినేసింది. మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది.


💥ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చినన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు. ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి, ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్ధం కావటం లేదు. రెండు, మూడు, నాలుగు గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు.

గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు. నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్ధం కావడం లేదు. ఈ వస్తులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి. 


💥దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు. ఆవుకీ, కుక్కకీ పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి. 


*మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్ని తెలుసనుకుంటాడు*.


*పా..పం! అందుకే వీడికి గురువు కావాలి.*


💥ఎలా జీవించాలో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది.


💥పుస్తకాలు స్కూల్ లోనూ ఉంటాయి .. లైబ్రరీ లోనూ ఉంటాయి .. కాని పిల్లలు చదువుకోవాలి అంటే స్కూల్ లో చేరుస్తాము .. పిల్లలను స్కూల్ లో కాక లైబ్రరీ లో వదిలి పెడితే  ఏం చదవాలో తెలియక పిల్లవాడికి అసలు చదువంటేనే విరక్తి కలుగుతుంది .. ఆదే గురువు యొక్క. గొప్పదనం .. 


💥స్టూడెంట్ ని గమనిస్తూ  ఒక తల్లి తన బిడ్డకి ఆకలి తీర్చి పోషణ అందించినట్లు .. స్టూడెంట్ కి ఒక గురువు జ్ఞానం అనే పోషణ అందిస్తారు ...                                                                                                        

 

    🙏గురువుతోనే గమ్యం సాధ్యం🙏


     🌹సర్వేజనాః సుఖినోభవంతు 🌹


శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆 విజయవాడ🏹 7799797799