--------------------------భగవద్గీత. ------------------------
షష్ఠమోధ్యాయః
ధ్యాన యోగము
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।। 5 ।।
ప్రతిపదార్థ:
ఉద్ధరేత్ — ఉద్ధరించుకోనుము; ఆత్మనా — మనస్సు ద్వారా; ఆత్మానం — నిన్ను నీవే; న — కాదు; ఆత్మానం — నిన్ను; అవసాదయేత్ — పతనం చేసుకొనుట; ఆత్మా — మనస్సు; ఏవ — ఖచ్చితంగా; హి — నిజముగా; ఆత్మనః — మన యొక్క; బంధు: — మిత్రుడు; ఆత్మా — మనస్సు; ఏవ — నిజముగా; రిపుః — శత్రువు; ఆత్మనః — మన యొక్క.
తాత్పర్యము:
నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకోనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు.
వివరణ:
అంతర్గత ఉపకరణాన్ని సూచిస్తున్నాయి, వీటిని కలిపి అంతఃకరణ లేదా మనస్సు అంటారు. ఉదాహరణకి:
పంచదశీ, ఈనాలుగింటిని కలిపి మనస్సు అంటుంది, ఇదే భౌతిక బంధానికి మూల కారణం అని పేర్కొంటుంది.
భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు ఎన్నో సార్లు మనస్సు, బుద్ధి రెండు భిన్నమైనవని అని, మరియు ఆ రెండింటినీ కూడా భగవంతునికి శరణాగతి చేయాలి అని అంటున్నాడు.
యోగ దర్శనములో, ప్రకృతి యొక్క వివిధ మూలతత్త్వములను విశ్లేషించేటప్పుడు, అది మూడు అస్తిత్వాలను పేర్కొంటుంది: మనస్సు, బుద్ధి, మరియు అహంకారము.
శంకరాచార్యులు, ఆత్మకు అందుబాటులో ఉన్న సూక్ష్మ ఉపకరణాలను విశదీకరిస్తూ, మనస్సుని నాలుగు రకాలుగా విభజించారు - మనస్సు, బుద్ధి, చిత్తము, మరియు అహంకారము.
కాబట్టి, శ్రీ కృష్ణుడు, మనము మనస్సుని ఉపయోగించుకొని ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలి అన్నప్పుడు, దాని అర్థం ఏమిటంటే, ఉన్నత మనస్సుని ఉపయోగించుకొని, నిమ్న మనస్సుని ఉద్ధరించుకోవాలి, అని. వేరే మాటల్లో చెప్పాలంటే, బుద్ధిని ఉపయోగించుకొని మనస్సుని నియంత్రించాలి. ఇది ఎలా చేయాలి అన్న విషయాన్ని 2.41 నుండి 2.44 శ్లోకాలలో మరియు 3.43 శ్లోకంలో విశదంగా వివరింపబడింది.