17, ఆగస్టు 2026, సోమవారం

దాంపత్యం

 *దాంపత్యం*

               ➖➖➖✍️


▪️దాంపత్యం అంటే ఫోటోలలో నవ్వుతూ కనిపించే రెండు ముఖాల కథ కాదు. ఒకే ఇంట్లో వేలసార్లు మనస్పర్థలు వచ్చినా, బయటివారికి తెలియకుండా మళ్లీ మళ్లీ కలిసిపోయే రెండు హృదయాల ప్రయాణమే దాంపత్యం.`


`▪️ ```భార్యాభర్తల మధ్య ప్రేమ మాత్రమే ఉండదు. కోపం ఉంటుంది. అహంకారం ఉంటుంది. బాధ ఉంటుంది. రోజుల తరబడి మాట్లాడుకోని మౌనం కూడా ఉంటుంది. “ఇతను ఎప్పటికీ మారడు” అనే భార్య వేదన ఉంటుంది. “ఆమె నన్ను అర్థం చేసుకోవడం లేదు” అనే భర్త మనోవేదన కూడా ఉంటుంది.`


`▪️అయినా చూడండి... అదే భార్య, భర్త ఆలస్యంగా ఇంటికి వస్తే తలుపు తెరుచుకున్న శబ్దానికి మేల్కొంటుంది. అదే భర్త, భార్య భోజనం చేయలేదని తెలిస్తే.. కోపంలో ఉన్నప్పటికీ ఆమె ముందు భోజనం పెడతాడు.`


`అదే దాంపత్యం!`


`▪️పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు సందడిగా ఉంటుంది. వారి చదువు, పెళ్లి, ఉద్యోగం, పిల్లలు... ఇలా వారి జీవితాల్లో తల్లిదండ్రులు పూర్తిగా మమేకమైపోతారు. కానీ ఒక రోజు పిల్లలు తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్లిపోతారు. ఇల్లు క్రమంగా నిశ్శబ్దమవుతుంది.అప్పుడు మిగిలేది ఇద్దరే.`


`▪️ఒకప్పుడు చిరాకుగా అనిపించిన అదే గురక, ఒకరోజు వినిపించకపోతే కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. “ఇంకా మాట్లాడొద్దు” అని మందలించిన అదే స్వరం, ఒకరోజు శాశ్వతంగా వినిపించకపోతే ఇంటి గోడలే వెలితిగా అనిపిస్తాయి. ఒకరు దూరమైన తర్వాత చాలామంది వచ్చి ఓదార్పు మాటలు చెబుతారు. కానీ రాత్రి మంచం మీద ఖాళీగా మిగిలిన ఆ స్థలాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మందు ఇచ్చే చేయిని, “భోజనం చేశావా?” అని అడిగే స్వరాన్ని, కోపంలోనూ దాగి ఉన్న ఆప్యాయతను ఎవరూ తిరిగి తీసుకురాలేరు.`


`▪️అందుకే గుర్తుంచుకోండి... అత్యుత్తమ జంట అంటే ఎప్పుడూ గొడవపడని జంట కాదు. గొడవల తర్వాత కూడా ఒకరినొకరు విడిచి వెళ్లని జంటే నిజమైన దాంపత్యానికి నిదర్శనం.`


`▪️దాంపత్యంలో ప్రేమకంటే గొప్పది అన్యోన్యత. అన్యోన్యతకంటే గొప్పది సహనం. సహనం కంటే గొప్పది... చివరి వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలనే మనసు.`


`▪️చిలిపితనం, సిగ్గు, గొడవలు, మౌనం, కష్టాలు, సుఖాలు, కన్నీళ్లు, నవ్వులు, పరస్పర అవగాహన—ఇవన్నీ కలిసి దాంపత్యాన్ని పవిత్రంగా నిలబెడతాయి.`


`▪️ ```జీవించి ఉన్నప్పుడే జీవిత భాగస్వామి విలువను గుర్తించండి. ఎందుకంటే వారు లేనప్పుడు కార్చే కన్నీటి కంటే, వారు ఉన్నప్పుడే చూపే ప్రేమ, గౌరవం, ఆదరణ మరింత పవిత్రమైనవి.`


🔷*గుర్తుంచుకోండి......*


`▪️జీవితంలో పరిపూర్ణమైన జీవిత భాగస్వామి ఎవరూ దొరకరు. కానీ ఒకరి లోపాలను మరొకరు అంగీకరించి, చివరి వరకు చేయి విడవకుండా కలిసి నడిచే జీవిత భాగస్వామి కంటే గొప్ప అదృష్టం మరొకటి లేదు.✍️ 


🕉️*మీరు చేసుకునే పుణ్య + పాప కర్మల్ని బట్టే - మీకు భార్యగా, జీవిత భాగస్వామిగా - తల్లిగా - తండ్రిగా - సోదరుడిగా - తనయుడు గా -కుమార్తెగా -మీయింటి పశువుగా -కుక్కగా వస్తుంది. ఏరూపంలో నైనా రావచ్చు. అందుకే: మీరు చేసే పనులు సక్రమంగా -చక్కగా చెయ్యండి. అందర్నీ ప్రేమగా చూడండి. అన్నీ బాగానే జరుగుతాయి. ఇక్కడ భగవంతుడు తప్ప వేరే ఏమీలేదు+ ఎవ్వరూ లేరు. అందర్నీ భగవంతుని స్వరూపాలుగానే చూడండి. అన్నీ బాగానే జరు గుతాయి*.✍️

.

శంకరంబాడి సుందరాచారి

  ఆధునిక తెలుగు కవులలో సుందరకవి గా , భావకవిగా , ప్రసన్న కవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారి జయంతి 10 ఆగష్టు. ఆ మహానుభావున్ని గుర్తు చేసుకుంటూ.. 

హైదరాబాద్‌లో 1975 ఏప్రిల్ 12న ఉగాదినాడు తొలి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమై ఆరురోజుల పాటు వైభవంగా జరిగాయి. ఆ సభ ప్రారంభంలో మా తెలుగుతల్లికి గీతాన్ని ఆలపించడానికి టంగు టూరు సూర్యకుమారిని ఇంగ్లండ్ నుంచి పిలిపించి పాడించారు. ఆ సమయంలో సదరు గేయకర్త ఎవరు అనే ప్రశ్న అక్కడున్న వారికి వచ్చింది. అక్కడే సభలో దూరంగా వెనుకవైపు ఒక వ్యక్తి చిరిగిన బట్ట లతో, దయనీయ స్థితిలో నిలబడి ఉన్నాడు. ఆయ నెవరో కాదు శంకరంబాడి సుందరాచారి. అక్క డున్న కొంతమంది ఆయనను గుర్తించారు. వేదికపై ఉన్న మహాసభల నిర్వాహకులు మండలి వెంకట కృష్ణారావు స్వయంగా సుందరాచారిని వేదికపైకి తీసుకెళ్లి సత్కరించి, ప్రభుత్వం తరపున 250 రూపాయల జీవితకాల గౌరవవేతనం ప్రకటించింది.

ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించినధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా ఎదురు ప్రశ్నించింది శంకరంబాడి సుందరాచారి. 

తన పై ఉన్నతాధికారి తిరుపతికి వచ్చి చేతి సంచిని అందివ్వబోతే తిరస్కరించి, ఆఫీసు జవానుకు, ఇన్‌స్పెక్టరుకు తేడా తెలియని వ్యక్తి విద్యాశాఖలో ఉండటం గర్హనీయమంటూ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం ఆయనది.

 ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం ఎవరినీ యాచించని, చేయిచాపని ఈ గుణం వల్లే జాతి మాతకు మల్లెపూదండలు గుచ్చి రచించిన ఆ రసరమ్య గీతకర్త ఎవరో కూడా దశాబ్దాల పాటు కనుమరుగైపోవడం నాటి చరిత్ర.

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా 10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లె బెసెంట్ థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చదువు పూర్త య్యాక తిరుపతిలోనే ఆంధ్రపత్రిక కార్యాలయంలో చేరి ఉపసంపాదకుడి స్థాయికి ఎదిగాడు. కళావని శీర్షికతో ఆం ధ్రపత్రికలో తను రాసిన వ్యాసాలు మం చి గుర్తింపు పొందాయి. 1939 లో చిత్తూరు బోర్డు హైస్కూలులో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మధ్యలో రెండేళ్లు సెలవు పెట్టి చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో దీన బంధు చిత్రానికి మాటలు, పాటలు రాశారు. 

తర్వా త జూనియర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా లభించిన పదవిని సైతం విద్యాశాఖ డెరైక్టర్ చేతి సంచినిచ్చి అవమానించినందుకు నిరసనగా వదిలే సుకున్నారు. 

తన పన్నెండో ఏటనే తెలుగులో కవి త్వం రాయటం ప్రారంభించిన సుందరాచారి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండకావ్య, కథారచనలే కాక, వేలాది ఉపన్యాసాలు కూడా చేశారు. 

నాస్వా మి, గీతాంజలి వంటి కావ్యరచనలు, కెరటాలు, సుందర సుధాబిందువులు వంటి ఖండకృతులు, గాలిమేడలు, అరాచకం వంటి దృశ్య కృ తులలో నాటకాలు, బుద్ధగీత, ఏకలవ్యు డు వంటి ప్రబోధ రచనలు, శాంతి దూ తలు, రంగిరాస్యం వంటి జానపద రచ నలు చేశారు.

ఎన్ని రచనలు చేసినప్పటికీ వీరి ప్రతిభకు తార్కాణంగా నిలిచిన రచనే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’. భారతదేశానికి ‘జనగణమన’ జాతీయ గీతమైనట్లే, ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ తెలుగు జాతికి రాష్ట్రగీతమైంది. 1975లో జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహా సభలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి, విద్యాలయాల తరగతులు ప్రారంభించ డానికి ముందు విధిగా పాడాలని ఆదేశించింది.

 సుందరాచారి చివరిరోజులు చాలా దుర్భ రంగా గడిపారు. తిరుపతి వీధుల్లో బికారిగా తిరు గుతూ జీవించారు. చివరి దశలో తన శిష్యుడు మన్న వ భాస్కరనాయుడు ఇంట్లో ఉండేవారు. అనారో గ్యంతో 1977 ఏప్రిల్ 8న తుదిశ్వాస వదిలారు. మా తెలుగుతల్లికి మల్లెపూదండ గేయం తెలుగు ప్రజలు పాడుకుంటున్నంత కాలం ఆయన ఏనాటికైనా తెలు గువారికి చిరస్మరణీయుడే. ....,

ఎన్నడూ కీర్తి ప్రతిష్టలు ఆశించక నిరాడంబరుడిగా సాహిత్య సేవలే జీవితలక్ష్యంగా వ్యక్తిగత జీవితంతో నిరంతరం పోరాటం సాగించిన సుందరా చారి ఆయన వ్రాసిన ”మా తెలుగు తల్లికి ప్రార్థనా గీతం మన తరంతరం నిరంతరం ఆలపిస్తాము. ఆయన ప్రతి తెలుగువారి హృదయాలలో శాశ్వత స్థానం పొందారు.

నమస్కార – విధానము

  ⚘ నమస్కార – విధానము ⚘ 🙏


“నమః” అంటే ఏమిటి?


• “నమః” అనే పదానికి శరణాగతి, సమర్పణ, అహంకారత్యాగం అనే గంభీరమైన భావాలు ఉన్నాయి.


• భగవంతుని ఎదుట నమస్కరించేటప్పుడు “నేను నీ శరణు పొందాను; నీవే నా ఆధారం” అనే భావన మనస్సులో ఉండాలి.


• నమస్కారం కేవలం శరీరాన్ని వంచే శారీరక చర్య కాదు. మనస్సు, వాక్కు, శరీరం — ఈ మూడింటినీ భగవంతునికి సమర్పించే సాధన.


నమస్కారంలోని అంతరార్థం ~


• నమస్కారం ద్వారా మనిషిలోని అహంకారం తగ్గి, వినయం పెరుగుతుంది.


• “నేనే చేశాను”, “నాకే అన్నీ తెలుసు” అనే అహంభావానికి బదులుగా “నీవే కర్త, నీవే రక్షకుడు, నేను నీ శరణాగతుడను” అనే భావన కలగాలి.


• వినయం ద్వారా సేవాభావం, సేవాభావం ద్వారా భక్తి, భక్తి ద్వారా భగవంతునిపై ప్రేమ మరియు ఆరాధనాభావం పెరుగుతాయి.


🙏 నమస్కారం — మూడు విధాలు ~


• కాయిక నమస్కారం: శరీరంతో చేసే నమస్కారం. చేతులు జోడించడం, శిరస్సు వంచడం, సాష్టాంగం లేదా పంచాంగంగా ప్రణామం చేయడం ఇందులోకి వస్తాయి.


• వాచిక నమస్కారం: “నమః”, “నమస్కారం” అని పలకడం, దేవతా నామస్మరణ, స్తోత్రపఠనం మొదలైన వాటి ద్వారా భక్తిని వ్యక్తం చేయడం.


• మానసిక నమస్కారం: శరీరంతో నమస్కరించే అవకాశం లేకపోయినా, మనస్సులో భగవంతుని స్మరించి “భగవంతుడా! నీకు నా నమస్కారం” అని భావించడం.


కాయక నమస్కారంలోని నాలుగు విధానాలు ~


• అష్టాంగ నమస్కారం


• పంచాంగ నమస్కారం


• త్ర్యంగ నమస్కారం


• ఏకాంగ నమస్కారం


అష్టాంగ నమస్కారం ~


ఉరసా శిరసా దృష్ట్యా

మనసా వచసా తథా ।

పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం

ప్రణామోఽష్టాంగ ఉచ్యతే ॥


• ఈ శ్లోకంలో వక్షస్థలం, శిరస్సు, దృష్టి, మనస్సు, వాక్కు, రెండు పాదాలు, రెండు చేతులు, రెండు చెవులు — ఈ ఎనిమిది అంగాల సమర్పణతో చేసే ప్రణామాన్ని అష్టాంగ నమస్కారం అంటారు.


• కొన్ని సంప్రదాయాల్లో శరీరాన్ని నేలకు తాకించే అంగాలను శిరస్సు, వక్షస్థలం, రెండు చేతులు, రెండు మోకాళ్లు, రెండు పాదాలుగా వివరించి, దృష్టి–మనస్సు–వాక్కును అంతరంగ సమర్పణగా భావిస్తారు.


• అందువల్ల సాష్టాంగ నమస్కారం అంటే కేవలం శరీరాన్ని నేలపై ఉంచడం కాదు; సర్వాంగ సమర్పణ భావంతో భగవంతుని శరణు పొందడం.


పంచాంగ నమస్కారం ~


• శిరస్సు, చేతులు, మోకాళ్లు మొదలైన ఐదు ప్రధాన అంగాల సమర్పణతో చేసే నమస్కారాన్ని పంచాంగ నమస్కారం అంటారు.


• శారీరకంగా సాష్టాంగ నమస్కారం చేయలేని సందర్భాల్లో ఈ విధానాన్ని అనుసరించే ఆచార సంప్రదాయాలు ఉన్నాయి.


• ఇందులో శరీర భంగిమ కంటే భక్తి, వినయం, శరణాగతి భావమే ముఖ్యమైనది.


త్ర్యంగ నమస్కారం ~


• రెండు చేతులను జోడించి తలపై ఉంచి నమస్కరించడం త్ర్యంగ నమస్కారంగా కొన్ని ఆచార సంప్రదాయాల్లో వివరించబడుతుంది.


• చేతులు జోడించడం, శిరస్సు వంచడం ద్వారా భక్తి మరియు గౌరవాన్ని వ్యక్తపరుస్తారు.


ఏకాంగ నమస్కారం ~


• తలను మాత్రమే వంచి నమస్కరించడం ఏకాంగ నమస్కారం.


• సంపూర్ణంగా నమస్కరించడానికి అవకాశం లేని సందర్భంలో ఈ విధంగా గౌరవాన్ని వ్యక్తపరచవచ్చు.


• సాధ్యమైనప్పుడు చేతులు జోడించి, వినయపూర్వకంగా నమస్కరించడం శ్రేయస్కరం.


గురువుకు నమస్కారం ~


«వ్యత్యస్తపాణినా కార్యమ్

ఉపసంగ్రహణం గురోః ।

సవ్యేన సవ్యః స్ప్రష్టవ్యో

దక్షిణేన చ దక్షిణః ॥»


• మనుస్మృతిలో గురువును గౌరవించే సందర్భంలో గురువు పాదాలను విధిగా స్పృశించి నమస్కరించే సంప్రదాయం ప్రస్తావించబడింది.


• కుడిచేతితో గురువు కుడిపాదాన్ని, ఎడమచేతితో గురువు ఎడమపాదాన్ని స్పృశించే విధానం అని భావం.


• కేవలం పాదస్పర్శ మాత్రమే కాదు; “గురుదేవా! మీ జ్ఞానమే నాకు మార్గదర్శకం. మీ పాదాలే నాకు శరణు” అనే భక్తి భావమే ప్రధానమైనది.


నమస్కారంలో మనస్సు పాత్ర ~


• భగవంతునికి నమస్కరిస్తూ మనస్సు ఇతర విషయాల్లో తిరుగుతూ ఉంటే నమస్కారం యాంత్రికమైన చర్యగా మారుతుంది.


• అందుకే కాయేన — శరీరంతో, వాచా — వాక్కుతో, మనసా — మనస్సుతో భగవంతునికి సమర్పణ భావం కలిగి ఉండాలి.


• వాక్కుతో స్తుతి, మనస్సుతో ధ్యానం, శరీరంతో ప్రణామం — ఇవి కలిసినప్పుడు నమస్కారం మరింత అర్థవంతమవుతుంది.


దేవాలయంలో నమస్కారం ఎలా చేయాలి ?


• తొందరపాటుగా కాకుండా ప్రశాంతంగా నిలబడాలి.


• రెండు చేతులను సంపూర్ణంగా జోడించాలి.


• చేతులను హృదయస్థానంలో లేదా సంప్రదాయం ప్రకారం నుదుటి వద్ద ఉంచవచ్చు.


• భగవంతుని స్మరించాలి.


• “నేను నీ శరణాగతుడను” అనే వినయ భావాన్ని కలిగి ఉండాలి.


• శారీరక పరిస్థితికి, ఆచార సంప్రదాయానికి అనుగుణంగా నమస్కారం చేయాలి.


• నమస్కారం చేసిన వెంటనే లేచి వెళ్లిపోకుండా క్షణకాలం భగవంతుని ధ్యానించడం మంచిది.


స్త్రీలు, పురుషుల నమస్కార విధానం ~


• కొన్ని సంప్రదాయాల్లో పురుషులకు సాష్టాంగ నమస్కారం, స్త్రీలకు పంచాంగ నమస్కారం చేయాలని ఆచారంగా చెబుతారు.


• అయితే ఇది సంప్రదాయానుసారం మారే ఆచారం; అన్ని హిందూ సంప్రదాయాలకు ఒకే విధమైన సార్వత్రిక నియమంగా పేర్కొనడం సముచితం కాదు.


• కాబట్టి ఆయా కుటుంబ, మఠ, దేవాలయ, ఆగమ సంప్రదాయాలను గౌరవించడం ఉత్తమం.


నమస్కారానికి నిజమైన పరిపూర్ణత ~


• శిరస్సు వంగితే — అహంకారం వంగాలి.


• చేతులు జోడిస్తే — మనస్సు సమర్పించాలి.


• మోకాళ్లు వంగితే — దురభిమానం తగ్గాలి.


• భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే — శరణాగతి భావం కలగాలి.


ముగింపు ~


• నమస్కారం ఒక సాధారణ ఆచారం కాదు.


• అది అహంకారానికి నమస్కారం కాదు — అహంకారానికి సమర్పణ.


• అది శరీరం వంగడం మాత్రమే కాదు — మనస్సు వంగడం.


• అది దేవుని ఎదుట నిలబడటం మాత్రమే కాదు — దేవుని శరణు పొందడం.


🙏 “నమః” — అంటే నా అహంకారాన్ని విడిచి, నిన్ను శరణు పొందుతున్నాను అనే పవిత్ర సమర్పణ భావం. 🙏

సరైన* *పనిముట్లు*

🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥“ *జీవితానికి* *సరైన* *పనిముట్లు* ”!🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥🐦‍🔥

వంటగదిలోని కుళాయి మళ్లీ లీక్ అవుతోంది. విసుగ్గా ఒక ప్లంబర్‌కు ఫోన్ చేశాను.


కొద్దిసేపటికి మధ్యవయస్కుడైన ఒక వ్యక్తి వచ్చాడు. ప్రశాంతంగా, నిదానంగా ఉన్నాడు. చేతిలో పాతబడిపోయిన ఒక పనిముట్ల సంచి ఉంది.

అతను పని చేయడం గమనిస్తున్నాను. ఒక రెంచ్ తీసుకున్నాడు. దాని పిడికిలి భాగం పగిలిపోయి ఉంది.

“ఇలాంటి రెంచ్‌తో ఇతను ఏం బాగు చేయగలడు?” అని మనసులో అనుకున్నాను.

కానీ అతనేమీ పట్టించుకోలేదు. ఎంతో నిశ్చలంగా పైపు విప్పడం మొదలుపెట్టాడు. తుప్పుపట్టిన ఒక భాగాన్ని కత్తిరించాల్సి వచ్చింది. వెంటనే తన సంచిలో నుంచి ఒక చిన్న రంపాన్ని తీశాడు. దానిలో సగం భాగమే ఉంది!

ఇక నాకు నమ్మకం వచ్చేసింది—పని కోసం తప్పు మనిషిని పిలిచాను!


కానీ పది నిమిషాల్లోనే లీకేజీ ఆగిపోయింది. కుళాయి మెరిసిపోతోంది. ఒక్క నీటి బొట్టు కూడా బయటకు రావడం లేదు.

అతనికి ₹200 ఇవ్వబోతే, అతను తల ఊపుతూ,

“వద్దమ్మా… ఇందులో సగం చాలు” అన్నాడు.

నేను ఆశ్చర్యంగా చూశాను.

“ఈ రోజుల్లో ఎక్కువ డబ్బు ఇస్తే వద్దనేవాళ్లు ఎవరున్నారు?”

అతను ప్రశాంతంగా నవ్వాడు.

“అమ్మా, ప్రతి పనికీ ఒక న్యాయమైన విలువ ఉంటుంది. ఈ రోజు ఎక్కువ తీసుకుంటే, రేపు కూడా అంతకంటే ఎక్కువ రావాలని ఆశిస్తాను. అలా రాకపోతే అసంతృప్తి కలుగుతుంది. అందుకే నాకు న్యాయంగా అనిపించినంత మాత్రమే తీసుకుంటాను. అలా ఉంటే మనసు ప్రశాంతంగా, సంతృప్తిగా ఉంటుంది.”

నేను మెల్లగా తల ఊపాను.

“కనీసం నీకోసం ఒక కొత్త రెంచ్, కొత్త రంపం కొనుక్కో. అవి ఉంటే పని సులభంగా అవుతుంది కదా!” అన్నాను.

అతను చిన్నగా నవ్వాడు.

“అమ్మా… పనిముట్లు అరిగిపోవడమే వాటి విధి. కానీ అవి పగిలినా, చెరిగినా తమ పని మాత్రం చేస్తూనే ఉంటాయి. మనిషి జీవితంలో కూడా అంతే కదా! పెద్దవాళ్లకు కొన్ని గాయాలు, కొన్ని మచ్చలు ఉండవచ్చు. అంతమాత్రాన వాళ్లు పనికిరానివాళ్లు అయిపోరు.”

అతను కాసేపు ఆగి మళ్లీ అన్నాడు:

“మీరు ఆఫీసులో రాసేటప్పుడు ఏ పెన్ను వాడుతున్నారన్నది ముఖ్యమా? ఖరీదైన పెన్నా, సాధారణమైన పెన్నా అన్నది కాదు. రాయడం మీకు తెలిస్తే ఏ పెన్నుతోనైనా చక్కగా రాయగలరు. రాయడం రాకపోతే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్ను ఇచ్చినా ప్రయోజనం ఉండదు. అసలు నైపుణ్యం పనిముట్టులో కాదు… దాన్ని ఉపయోగించే చేతిలో ఉంటుంది.”


నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. అతని మాటలు నా మనసులో లోతుగా నాటుకుపోయాయి.

ఆ వయసు మోసిన ముఖంలో కనిపించిన సంతృప్తి, ప్రశాంతత—డబ్బుతో కొనలేనిది.

ఆలోచించాల్సిన విషయం!

సంపద, సౌకర్యాల కోసం మనం చేసే అంతులేని పరుగులో, జీవితానికి నిజమైన “పనిముట్లను” మనం తరచూ మర్చిపోతున్నాం.

అవి నిజాయితీ, కష్టపడే తత్వం, కృతజ్ఞత, సంతృప్తి.

ఇవి మనలో ఉన్నంతకాలం, పాతబడిన పనిముట్లతో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు.

కానీ ఇవే మనలో లేకపోతే, ప్రపంచంలోని ఎంతటి సంపద ఉన్నా… మనలో ఏర్పడిన లోపాలను, మన జీవి

తంలోని “లీకేజీలను” సరిచేయలేరు.



ఈ సందేశం జీవితానుభవంతో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికీ అంకితం.🙏🙏🙏🙏🙏

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 48*


*నఖాంకూరస్మేరద్యుతివిమలగంగాంభసి సుఖం*

*కృతస్నానం జ్ఞానామృతమమలమాస్వాద్య నియతమ్ ।*

*ఉదంచన్మంజీరస్ఫురణమణిదీపే మమ మనో*

*మనోజ్ఞే *కామాక్ష్యాశ్చరణమణిహర్మ్యే విహరతామ్ ॥*


*భావము :*


*అమ్మా! చిరునవ్వుతో కూడిన మొగ్గలవంటి నీ పాద నఖముల కాంతులు, మణిదీపములవలే ప్రకాశిస్తున్న నీ కాలి అందియలతో కూడిన నీ పాదములు నా హృదయములో నిత్యము వసించుగాక.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏