20, జులై 2022, బుధవారం

మాధుర్యాన్ని

 శ, ష, స  అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ.


    *యద్యపి బహునాధీషే*

        *తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |*

    *స్వజనః శ్వజనో మా భూత్*

        *సకలం శకలం సకృత్ శకృత్ ||*


భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన అనగా  (మన వాళ్ళు) 

అన్న శబ్దాన్ని శ్వజన అంటే (కుక్కలు) అనకుండా


, సకలం అనగా (సర్వం) అన్న శబ్దాన్ని శకలం అంటే (ముక్కలు) అని పలకకుండా, 


సకృత్ అనగా (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ అంటే (మలము) అని పలకకుండా ఉండడానికే కాక 


తదితర పదాలను కూడా సక్రమముగా పలకడానికి  ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.  


నాగరిక ప్రపంచం -కళ్ళని -కల్లు ట

                               శిరీష-షిరీష ట

                                 వేళ-వేల ట

                                 కళ-కల ట

                               పళ్ళు-పల్లు ట

                               కాళ్ళు-కాల్లు ట

ఇంకా ఎన్నెన్నో.....అపస్వర శబ్దాలు.....వినలేని అపస్వరాలు..ముఖ్యంగా టీవీల వల్ల..


విదేశాలలో ఉన్న తెలుగు వారు ..చక్కటి భాషా

ప్రావీణ్యతతో రాణిస్తున్నారు..


కొంతమంది తెలుగువారే.. సగం తెలుగు -సగం ఆంగ్లము మాట్లాడడంలో మాతృభాషకు ఇచ్చే విలువలు వారికే తెలియాలి


వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్ఛచరించాలో తెలుసుకోలేరు. ఉచ్ఛారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.


అందుకనే, వ్యాకరణ సిద్ధి ఉంటేనే,వాక్‌ సుద్ధి

వస్తుంది .మన నాలుక శుభ్ర పడుతుంది.

వాగ్దేవి కరుణా ప్రవాహం అపారంగా లభ్యమవుతుంది.


అందుకేనేమో పవన సుతుడు శ్రీ హనుమ ,

శ్రీ సూర్య నారాయణుని సన్నిధి లో సకల విద్యలు 

నేర్చుకొని ,నవ వ్యాకరణ విద్యను అభ్యాసానికి

వివాహముచేసుకొని (వివాహితుడే అర్హుడు కనుక) నవ వ్యాకరణ పండితుడై  ,భవిష్యత్‌

బ్రహ్మ గా ప్రకటించ బడ్డాడు.


మాతృభాషలో మాధుర్యాన్ని నింపండి🙏

కేన్సరు వ్యాధి నివారణ శ్లోకం

 ॐ           కేన్సరు వ్యాధి నివారణ శ్లోకం 

           (Shloka for Cure of Cancer)


    ఇది "శ్రీమద్ నారాయణీయం" లోని ఎనిమిదవ దశకంలోని పదమూడవ శ్లోకం. అత్యంత శక్తివంతమైనది. 

    కేన్సర వ్యాధిని నిర్మూలించేదిగా, కంచి పరమాచార్య సూచిస్తూ అనుగ్రహించినది. 

    ఇది రోజూ 108 సార్లు, 45 రోజులు క్రమం తప్పక చదివితే, 

    కేన్సర వ్యాధి నుండీ, పూర్తిగా కోలుకొంటారు. 


    This shloka from Srimad Narayaneeyam (Dasakam 8, Sloka 13) is a very powerful shloka that has been advised by HH Sri Sri Sri Kanchi Maha Periyava for curing cancer. 

    One who recites this sloka 108 times continuously for 45 days gets completely cured from cancer. 


अस्मिन् परात्मन् ननु पाद्मकल्पे

त्वमित्थमुत्थापितपद्मयोनि: ।

अनन्तभूमा मम रोगराशिं

निरुन्धि वातालयवास विष्णो ॥१३॥ 


అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే 

త్వమిత్థముత్థాపిత పద్మయోనిః 

అనన్తభూమా మమ రోగరాశిం 

నిరున్ధి వాతాలయవాస విష్ణో! 

          8/13 


వాతాలయ నివాసా! కృష్ణా! 


   "పద్మ"మనబడు ఈ మహాకల్పమున, 

    "పద్మజన్ముడు" అని పేర్కొనబడు చతుర్ముఖని వెలువరించిన పరమాత్ముడవు నీవు. 

    నీవు సర్వవ్యాపివి. 

    నీ మాహాత్మ్యము అనూహ్యమైనది నాయనా! 

    అట్టి నిన్ను నన్నావరించియున్న రోగరాశి వేదనలనుండి నాకు ముక్తిని ప్రసాదించవలసినదిగ వేడుకొనుచున్నాను తండ్రీ! 


O Vishnu Dweller of Guruvaayur! 

O Supreme Lord of incomprehensible powers, in this age known as the Paadma Kalpa! 


    Thou thus brought into existence the Creator Brahmaa. 


O Lord Vishnu, who has manifested in the temple of Guruvaayur! 

    please eradicate my ailments. 


                    =x=x=x= 


సేకరణ : 

రామాయణం శర్మ 

     భద్రాచలం

వారణాసి వెళ్లేవారికి

*🕉️కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు...!* 

వారణాసి వెళ్ళే వాళ్ళు  ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి.  

సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300 నుంచి ఛార్జ్ చేస్తారు.  తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150 నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా మనిషికి 20ఛార్జ్ చేస్తారు.  మధ్యాహ్నం భోజనం, ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది.
               
ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం ఆరు గంటలకు మీరు బయటకి వచ్చి మొదటగా కాల భైరవ స్వామి దర్శనం చేసుకొని, అక్కడ నుంచి వారాహి అమ్మ దర్శనానికి వెళ్ళండి. ఉదయం 9 గంటలలోపే వారాహి అమ్మ దర్శనం.  ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు. వారాహి అమ్మ గ్రామ దేవత.  

అక్కడ నుంచి విశాలాక్షి అమ్మ గుడి దగరలో ఉంటుంది.  అమ్మ దర్శనం చేసుకొని, విశాలాక్షి అమ్మ గుడి దగర నుంచి విశ్వనాథుని గుడికి 
2 నిముషాలలో కాలి నడకన వెళ్లొచ్చు. 

1వ నంబర్ గేట్ నుంచి వెల్లినట్లైతే సాక్షి గణపతినీ దర్శించుకోవచ్చు.  డుంది గణపతి గుడి  లోపల ఉంటుంది.  స్వామి వారి దర్శనం 4 వ నంబర్ గేట్ నుంచి త్వరగా అవుతుంది. స్వామి దర్శనం చేసుకొని వచ్చాక లోపల అన్నపూర్ణమ్మ అమ్మ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పూజారికి 100 ఇస్తే అమ్మ వారిని తాకనిస్తారు.  

అన్నపూర్ణమ్మ గుడి లోపలి నుంచి అన్న ప్రసాదానికి దారి ఉంటుంది.  కచ్చితంగా అక్కడ భోజనం చేయాలి.  గుడిలో మనకి అమ్మ ప్రసాదంగా ఒకతను, కొంచెం బియ్యం, ఒక coin (కాసు) ఇస్తారు.  100 రూపాయలు ఇవమంటారు.  50 రూపాయలు ఇచ్చినా కొందరు తీసుకుంటారు.  ఆ కాసు మన ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలి.  బియ్యం మన  ఇంట్లో మనం తెచుక్కున్న బియ్యం బస్తాలలో కొంచెం వేసుకొని మిగతాది బీరువాలో దాచుకోవాలి.  

ఫోన్స్, వాల్లెట్స్ అనుమతించరు.  ఒకవేళ తీసుకు వెళ్తే 4 వ నంబర్ గేట్ దగర దేవస్థానం వారి  ఫ్రీ లాకర్ ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు.  సాయంత్రం 6 నుంచి 7 వరకు స్పర్శ దర్శనం ఉంటుంది.  7 కి హారతి సేవ ఉంటుంది.  స్వామి దర్శనం ఆదివారాలు సోమవారాలు బాగా రద్దీగా ఉంటుంది. 

దర్శనాలు అయిపోయాక మధ్యాహ్నం 1 నుంచి లోకల్ టెంపో మాట్లాడుకొని అన్ని చూసుకోవచ్చు.  దుర్గమ్మ గుడి, గవ్వలమ్మ,  మందిరం, బెనారుస్ యూనివర్సిటీలో టెంపుల్స్ హనుమాన్ టెంపుల్  ఇవన్నీ లోకల్ టెంపుల్స్ కి మనం మాట్లాడుకునే ఆటో వాళ్ళు చూపిస్తారు.   మనిషికి 300 వరకు ఛార్జ్ చేస్తారు.  అవి అన్నీ చూసుకునే సరికి సాయంత్రం 6 అవుతుంది.  అక్కడ కు దగ్గర్లో ఉండే ఏదైనా ఘాట్ లలో గంగ హారతి చూసుకోవచ్చు.  దశాశ్వమేధ ఘాట్, కేదార్నాథ్ ఘాట్ ఆశ్రమానికి దగ్గర్లోనే ఉంటాయి.
              
రెండవ రోజు ఘాట్లలో స్నానాలు చేసి పడవలు మాట్లాడుకుని 64 ఘాట్లు వెళ్ళటానికి,12 గంటలకి మణికర్ణిక ఘాట్ లో స్నానాలు చేయవచ్చు.   

మణికర్ణిక ఘాట్లో స్నానాలు చేస్తే పితృ దేవతలకి మోక్షం లభిస్తుంది అంటారు.  స్నానం చేసే సమయంలో మనసులోని కోరికలు నెరవేరుతాయి అంటారు.  

మణికర్ణిక ఘాట్ విశ్వనాథ గుడి 4 వ నంబర్ గేట్ నుంచి కొంచెం ముందుకి నడుస్తూ వెళ్తే కుడి చేతి వైపు  పెద్ద అర్చ్ కనిపిస్తుంది. దానిలో నుంచి నడుచు కుంటు వెళ్తే ఘాట్ కి వెళ్తాం.  దాదాపు ఘాట్లు అన్ని పక్క పక్కనే ఉంటాయి. 

వీలైతే కాలభైరవ టెంపుల్ నుంచి వచ్చేప్పుడు మహా మృత్యుంజయ గుడి, ఓంకారేశ్వర మకరేశ్వర్, ఆకరేశ్వర గుడులు చూసుకోవచ్చు.  జంగం బాడీ మఠం దాటాక తిలబందేశ్వర్ గుడి ఉంటుంది.  కుదిరితే లోలార్కు కుండ్ చూసుకోండి.  హిందువులు అక్కడ ఎక్కువగా పుణ్య స్నానాలు ఆచరిస్తారు. 

 సూర్య భగవానుడు గుడి చిన్న గుడులు అక్కడ పక్కనే ఉంటాయి.  దర్శనం చేసుకోండి. తర్వాత శివుని దర్శనం చేసుకోండి.
సదా మీ సేవలో....

ప్రయాణికుడు:

 

ప్రయాణికుడు

(గమనిక: ఇది కేవలం 60 సం. దాటిన పురుషుల కోసం వ్రాసిన  వ్యాసంఇతరులు  చదవటం నిషిద్ధం. )

60 సంవస్త్సరాలు దాటాయి అంటే మీరు ఒక ప్రయాణికుడు అని అనుకోవాలిమీరు పూర్తిగా ప్రయాణసన్నాహాలలోనే ఉండాలి. కొంతమంది అప్పుడే రైల్వేస్టేషనుకి వచ్చి వున్నారుకొంతమంది స్టేషనుకు  వెళ్లే మార్గంలో వున్నారు, కొంతమందికి ఎక్కవలసిం రైలు స్టేషనులో ప్లాటుఫారం మీదకు వచ్చి వున్నట్లే, కొంతమంది రైల్లో కూర్చొని రైలు సిగ్నలుకోసం వున్నట్లుగా భావించాలి. ఏక్షణంలో నయినా మీరు కూర్చున్న రైలుకు జెండా ఊపటం ప్రయాణం మొదలుకావడం జరగవచ్చుమీరు ఇంకా ఇల్లు, సంసారం, సంఘం అంటు కూర్చుంటే ప్రయోజనం లేదుఎప్పుడైతే స్టేషనుకు ప్రయాణం అయ్యామో అప్పుడు ఇంటికి తాళం వేశామా, అన్ని తలుపులు వేశామా, చిన్నవాడు వంటరిగా వున్నాడు వాడు తిండి ఎలా తింటాడో ఇలాంటి అనేక సందేహాలు ఎలా వస్తాయో ఇప్పుడు ప్రయాణంలో కూడా రావచ్చుకానీ ఇప్పుడు వెళ్లే ప్రయాణం ఒకవైపే అంటే నిష్క్రమణే మరల తిరిగి రావటం అనేది ఉండదుకాబట్టి ప్రయాణం పూర్తిగా సాఫీగా జరగాలంటే ఒక్కటే మార్గం

ఈశ్వరానుగ్రహం

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారుఅది ఎంతవరకు నిజమో కానీ  నేను ఒక్కటి మాత్రం సంపూర్ణంగా విశ్వసిత్తాను దైవానుగ్రహం కోసం ప్రార్ధించటానికి కూడా దైవానుగ్రహం కావలి అదేంటి అని అనవచ్చు కానీ ఇది నిజం మనకు దైవానుగ్రహం లేకుంటే మనస్సు ఎప్పుడు కూడా దేముడిమీదకు వెళ్ళదుఅందుకేనేమో మన మహర్షులు వినాయక చవితి నాడు సిద్ది వినాయకుడిని పూజించటానికి ముందు పసుపు గణపతి పూజ చేయాలని నియమము పెట్టారు అని నాకనిపిస్త్తుందినిజానికి మనం పూజించేది వినాయకుడినే కదా ఆయనే విఘ్నధిపతి కదా మరి ఇంకా పసుపు వినాయకుడిని ఎందుకు పూజించాలి అనే సందేహం మనకు వస్తుందికానీ అందులోని మర్మం ఏమిటంటే చేసే సిద్ది వినాయక పూజ అనే దైవ కార్యం కాబట్టి దైవకార్యం నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా విఘ్నాధిపతి అయిన విగ్నేశ్వరుని అనుగ్రహం కావాలని మన మహర్షులు సూచించారు. కాబట్టి ఆయన పూజ కూడా నిర్విఘ్నంగా సాగటానికి మనం పసుపు గణపతి పూజ చేస్తాం.  అలానే మనం దైవానుగ్రహం కోసం ప్రార్ధించటానికి దేముడిని ప్రార్ధించాలి, భగవంతుడా నేను నిత్యం నిన్ను మరువకుండా ఉండేటట్లు నాకు అనుగ్రహాన్ని ఇవ్వు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వు అని కోరాలి. మనం ఏదైనా పరీక్ష వ్రాసేటప్పుడు చివరి గంటకు ముందుగా చివరిగుంట మోగుతుందని తెలపటానికి ఒక సన్నిద్ధ గంటను మ్రోగిస్తారు. అప్పుడు అభ్యర్థి తానూ వ్రాసిన జవాబు పత్రాన్ని పూర్తిగా చూసుకొని సరిచేసుకునే వీలుంటుందికానీ ఇక్కడ ఎప్పుడు ప్రయాణం మొదలవుతుందో తెలియనే తెలియదుకాబట్టి సదా మనం మన చివరి మజిలీకోసం సన్నద్ధులం కావాలి. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ఎప్పుడు సన్నిద్ధంగా వుండే విద్యార్థి ఏవిధంగానయితే పరీక్ష చక్కగా వ్రాయగలడో అదేవిధంగా సాధకుడు ఎల్లప్పుడూ పరబ్రహ్మ జ్యాసలోనే ఉండాలి. సదా నిధి జాసలో వుండే సాధకునికి మోక్షం తప్పనిసరి. నిత్యానందుడైన సాధకునికి  భూమి మీద కావలసింది ఏమి ఉండదుకేవలం కైవల్యం మినహాకాబట్టి మిత్రమా ఇప్పుడే లే నీ నిరంతర సాధన మొదలుపెట్టు

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 

విలువయిన పుస్తకాలను

 https://rb.gy/bnqgio

📖


*అత్యంత  విలువయిన పుస్తకాలను ఈ క్రింద ఉన్న లింక్ లో భద్రపరచడం జరిగినది...*


ఇంకనూ ఏవయినా పుస్తకాలు కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి... 


వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తాము...


*ధన్యవాదములు*


https://rb.gy/bnqgio



🛕

ప్రక్కటెముకలలో ( side ribs ) నొప్పి

 ప్రక్కటెముకలలో ( side ribs ) నొప్పి  - 


        జిల్లేడు ఆకు రసం , గొధుమ పిండితో కలిపి మెత్తగా పిసికి ఆ ముద్దను రొట్టెలాగా వెడల్పు చేసి ప్రక్కటెముకల పైన పట్టు వేయాలి . 


                  ఈ విధంగా చేయడం వలన నిమోనియా వలన కలిగే ప్రక్కటెముకల నొప్పి కాని , వాతం వలన కలిగే నొప్పి కాని బహుత్వరగా తగ్గిపోతుంది . 


         

ముఖ్యమైన విషయాలు

 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻


🌹 *ముఖ్యమైన విషయాలు*.🌹


*పూజ:-*

పూర్వ జన్మ వాసనలను నశింపచేసేది, జన్మ మృత్యువులను లేకుండా చేసేది, సంపూర్ణ ఫలాన్నిచ్చేది.


*అర్చన:-*

అభీష్ట ఫలాన్నిచ్చేది, చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.


*జపం:-*

అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది. పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం, ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది.


*స్తోత్రం:-*

నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


*ధ్యానం:-*

ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.


*దీక్ష:-*

దివ్య భావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.


*అభిషేకం:-*

అభిషేకం చేస్తే చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి, అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని అందిస్తుంది.


*మంత్రం:-*

తత్త్వం గురించి మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం, అఖండ శక్తిని ఇస్తుంది.


*ఆసనం:-*

ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్త సిద్ధిని లేదా నవ సిద్ధులను కల్గించేది ఆసనం.


*తర్పణం:-*

పరివారంతో కూడిన పర తత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


*గంధం:-* 

గంధంలో పరదేవత కొలువై ఉన్నారు. *”మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ” అని దేవతలంతా అమ్మవారిని కోరారు. అప్పుడు అమ్మవారు “మీరు గంధంలో కొలువై ఉందురుగాక” అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.*


*అక్షతలు:-*

కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ, నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.


*పుష్పం:-*

పుణ్యాన్ని వృద్ధి చేసి, పాపాన్ని పోగొట్టేది మంచి బుద్ధిని ఇచ్చేది. *అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.* *మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.* *(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగా తొడిమలను తప్పకుండా తుంచి వేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.*


*ధూపం:-*

చెడు వాసనల వల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. *భూత, ప్రేత, పిశాచాలు పారిపోతాయి.*


*దీపం:-*

సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పర తత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. పూజ గదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. “అగ్ని” శివుడి కుమారుడైన కుమారస్వామికి ప్రతీక.


*నైవేద్యం:-*

మధుర పదార్థాలను నివేదన చేయుటయే నైవేద్యం.


*ప్రసాదం:-*

భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం. ప్రకాశానందాలనిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ప్రసాదం భగవదనుగ్రహ సంకేతం. అత్యంత పవిత్రమైన పదార్థం. *ఏ రూపంలోని ప్రసాదాన్నైనా “ప్రసాదం” అని మాత్రమే వ్యవహరించాలి. ఇటీవల అందరూ ‘పులిహోర’, ‘కొబ్బరి’ అని అనడానికి అలవాటు పడ్డారు. అలా అనకూడదు. “పులిహోర ప్రసాదం”, “కొబ్బరి ప్రసాదం” అనవచ్చు.*


*వందనం:-* అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. చేతులు జోడించి కూడా వందనం చేయవచ్చు. సాష్టాంగ ప్రణామం అంటే వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకు తాకించి చేసేది వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి ఇది స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళపై భగవంతుడికి వందనం చేయొచ్చు.


*ఉద్వాసన:-*

దేవతలను, ఆవరణ దేవతలను పూజించి, పూజను ముగించడాన్ని ఉద్వాసనమని అంటారు. చివర్లో ప్రార్థన, దోష క్షమాపణ చెప్పి తీర్థ, ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయవలసి ఉంటుంది.......


సేకరణ...🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻


కోమలాంగా - శీతలాంగా

 కోమలాంగా - శీతలాంగా


1958వ సంవత్సరం. పరమాచార్య స్వామివారు చాతుర్మాస్యం తరువాత మాంబళం శ్రీ జి.వి. కళ్యాణరామ అయ్యర్ గారి ఇంట్లో ఎంతోకాలం బస చేశారు. అప్పుడు మైలాపూర్ లో ఒక ప్రముఖ ప్రవచనకారులు రోజూ ప్రవచనం చెప్పేవారు. ఒకరోజు నేను కూడా ప్రవచనానికి వెళ్లాను. ఆయన అప్పయ్య దీక్షితుల శ్లోకాన్ని ఇలా చెప్పాడు.


మౌళౌ గంగాశశాంకౌ కరచరణతలే కోమలాంగా భుజంగా 

వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహితా చందనం సర్వగాత్రే, 

ఇత్థం శీతం స్రభూతం కసక సభా నాథ! సోఢుం క్వశక్తిః ? 

చిత్తే నిర్వేదతప్తే యది భవతి న తే నిత్యవాసో మదీయే.


దాన్ని ఇలా వివరించారు.


నీ తలపై గంగ మరియు చంద్రుడు. కాళ్ళు చేతులపైన చల్లని సర్పాలు. నీ ఎడమవైపేమో దయాసముద్రుని అయిన హిమవంతుని కూతురు, నీవేమో ఒళ్ళంతా చల్లని చందనం పూసుకున్నావు. ఓ కనకసభాపతీ! అంత చల్లదనాన్ని ఎలా భరిస్తున్నావు? నేను చేసిన తప్పుల వల్ల వెచ్చగా ఉండే న హృదయ కుహరంలో శాశ్వతంగా నివసించు తండ్రీ.


నాకు శ్లోకంలో ఎందుకో కాస్త తప్పు అనిపించింది. కోమలమైన సర్పాలకు చల్లని వస్తువులపైన ఉండడమెందుకు? ఇన్ని చల్లని వస్తువుల మధ్యన కోమలమైన సర్పములు ఎందుకు? చల్లదనం ఉంటే కోమలత్వం ఎందుకు పోతుంది?

కోమలాంగా భుజంగా - కాదు కాదు; బహుశా శీతలాంగా భుజంగా అనునదే ఇక్కడ సరైన ప్రయోగమేమో?


మరుసటిరోజు మహాస్వామి వారితో మాట్లాడడానికి సమయం దొరికినప్పుడు, చూచాయగా నా అభిప్రాయాన్ని తెలిపాను. ‘శీతలాంగా’ అన్న పద ప్రయోగాన్ని పరమాచార్య స్వామి వారు మెచ్చుకున్నారు.


ఆ ఉపన్యాసకుణ్ణి రమ్మని కబురుచేసి, వారి ఉపన్యాసాన్ని ఎంతో మెచ్చుకున్నారు స్వామివారు. “మౌళౌ గంగా శ్లోకాన్ని అద్భుతంగా వివరించారని తెలిసింది. ఈ పిల్లవాడు కూడా దాన్ని విన్నాడు . . .” అని మొదలుపెట్టి రాత్రి తొమ్మిది గంటల నుండి మధ్యరాత్రి దాకా వివిధ కోణాల్లో ఈ శ్లోకం గురించిన వివరణ ఇచ్చారు స్వామివారు.


“కోమలాంగా అన్న పదం కాకుండా శీతలాంగా అన్న పదం సరిగ్గా కుదురుతుంది అని ఈ అబ్బాయి ఆలోచన. అదే సరి అయినది అని నాకు కూడా అనిపించింది. ఇప్పటినుండి దాన్ని శీతలాంగా భుజంగా అని అచ్చు వేయిద్దాము” అని తమ నిర్ణయాన్ని తెలిపారు స్వామివారు.


నాకు మరియు ఇతర విద్వాంసులకు కలిగిన ఆనందం వర్ణనాతీతం. నేను చెప్పిన ఒక పదాన్ని స్వామివారు గుర్తించి దాన్ని ఆచరణలో పెట్టిన విధానాన్ని తలచుకుంటేనే నాకు ఒళ్ళు పులకిస్తుంది.


--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, కంచి శ్రీమఠం విద్వాన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మంచి పురాణ గాధ ..

మనలో చాలామంది కి తెలియని ఒక మంచి పురాణ గాధ ..మీకోసం..
చాలా  మంచి పోస్టు  . అందరూ చదవండి .
ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం
రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.
'14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు.
ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.
నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,' అని అడిగారు.
''మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,'' అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. ''లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!'' అని పరిహాసంగా అడిగారట రాములవారు.
''అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,'' అని బదులిచ్చాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. ''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!'' అన్నారట రాములవారు.
రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.
''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.      🙏🙏🙏🙏🙏
 సేకరణ :  *@SatyaDeva Medicals-VPM*

ఆధిక్యత కులం..(

 :-ఆధిక్యత కులం..(M.N.Srinivas) :-

ప్రతీ చోటా ఏదో ఒక కులం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో ఆధిపత్యం ప్రదర్శించడం అనే దృగ్విషయం పై ప్రముఖ సోషియాలజిస్ట్ M.N.శ్రీనివాస్ తన

 'సోషియల్ ఛేంజ్ ఇన్ మాడరన్ ఇండియా'  మరియు ఇతర పుస్తకాలలో చర్చించాడు.  'ఆధిక్యత కులం' భావనను తన  కర్ణాటక లోని గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలన తరువాత ఆయన రూపొందించారు.

     M. N. శ్రీనివాస్ కర్ణాటక లోని 'రాంపూర్ 'అనే గ్రామంలో  జరిపిన అధ్యయనంలో 'ఆధిక్యత కులం ' అనే భావనను  గ్రహించి ప్రతిపాదించారు. ఆయన ఉద్దేశ్యం లో  గ్రామీణ ప్రాంతంలో ఈ 'ఆధిక్యత కులం 'అనేది ప్రముఖ పాత్ర వహిస్తోంది.ప్రతి గ్రామంలోనూ ఒక ఆధిక్య కులం ఉంటుంది.ఆ ఆధిక్య కులం ఆ గ్రామం లోని అన్ని వ్యవహారాలను కంట్రోల్ చేస్తూ ఉంటుంది .

ఆధిక్య కులం లక్షణాలను  M.N.శ్రీనివాస్ గారు  తెలియచేశారు.

*ఆ గ్రామంలో అధిక వంతు భూములు కలిగి ఉండడం.

*రాజకీయ ఆధిక్యత.

*ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండడం.

*ఇంగ్లీష్ చదువు/పాశ్చాత్య విద్య.

*అవసరమైతే హింసను ఉపయోగించగలగడం.

*ప్రభుత్వ ఉద్యోగాలలో అధిక భాగం సంపాదించడం.

     పై లక్షణాలను M.N . శ్రీనివాస్ గారు విపులంగా తెలియజేశారు.

వారు చెప్పిన విషయాలను మనం నిత్య జీవితంలో చూడగలం.ఏ గ్రామం, ప్రదేశం, రాష్ట్రంలో చూసినా మనకు ఈ విషయాలు స్పష్టంగా అర్థం అవుతాయి.

ప్రతీ చోట ఏదో ఒక కులం ఆధిపత్యం లో ఉంటుంది.ఉదాహరణకు 

గ్రామ  వార్డు మెంబర్ , సర్పంచి ,సింగిల్ విండో చైర్మన్, ఎమ్.పి.టి.సి,జెడ్.పి.టీ.సీ.,మండలాధ్యక్షుడు,ఎమ్.ఎల్.ఏ,ఎమ్.పి.,ఇంకా ఆ పై స్థాయి పోస్ట్ లు అన్నింటిలో ఆయా ఆధిపత్య కులం వారే ఉంటారు. అన్నింటిలో కాకపోయినా చాలా వాటిలో వారే ఉంటారు.వీటిలో కొన్ని, రిజర్వేషన్లు, రాజకీయ పరిస్థితుల వలన ఇతరులకు లభించినా , తమకు అనుకూలమైన వారిని నియమించుకోవడం, లేదా నియామకం అయిన వారిని నయానో భయానో  తమకు అనుకూలంగా మలచుకొంటారు.అధికారులను కూడా తమకు అనుకూలంగా మలచుకుంటారు. వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. వీరు తమకన్నా పై స్థాయి రాజకీయ నాయకులను కూడా ప్రభావితం చేస్తారు. వీరి మద్దతు లేకపోతే భవిష్యత్తు లో తాము ఎన్నికలలో గెలవలేమని పైస్థాయి నాయకులకు తెలుసు. ఇక అధికారుల పోస్టింగ్ లలో తమ కులపు వారికి ప్రాధాన్యత ఇస్తారు.ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రకాల కాంట్రాక్టులు, సబ్సిడీ లు,రాయితీలు  వీరు చేజిక్కించుకుంటారు. తమకు పోటీకి వచ్చిన వారిని ఏదోవిధంగా ప్రభావితం చేసి పక్కకు తప్పిస్తారు. అలాగే ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రభావ వర్గాలలో కూడా పట్టు సంపాదిస్తారు. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వీరి ముందస్తు అనుమతి తప్పనిసరి.ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైన వారికి ఓట్లు వేసే విధంగా ప్రజలను ప్రభావితం చేస్తారు.


ఇకపోతే గ్రామీణ సమాజంలో భూమికి  ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. భూమి చుట్టూ అన్ని వ్యవహారాలు, జీవనోపాధి ఉంటుంది. వ్యవసాయ కూలీలు, వృత్తి పని వారు,పశు పోషకులు  భూమి పైనే ఆధారపడతారు.ఎక్కువ భూమి ఉన్న వాడు ఆ గ్రామంలో మోతుబరి కావడం సహజం. హరిత విప్లవం వచ్చిన తరువాత భూమి కల వర్గం సహజంగానే అత్యున్నత స్థాయి కి చేరిపోయింది.ఈ వర్గం ఆర్థిక పరిస్థితి కూడా ఉన్నత స్థాయికి చేరిపోయింది.రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో కూడా ఆధిక్యత కలిగి ఉండడం, భూముల ధరలు పెరగడంతో వీరు  మరింత లబ్ధి పొందారు.

ఇక మిగిలిన అంశాలన్నీ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా సహజంగా ఏర్పడతాయి.

కర్ణాటక లో ఒక్కలిగ, లింగాయతులు, కేరళలో నాయర్ లు మొదలైనవి  'ఆధిక్య కులాలు 'గా‌ చెప్పవచ్చును. ఉత్తర భారతం లో కుల పార్టీలు హవా చూపిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని కులాలకు ప్రాధాన్యత ఉంది.

ఐతే ఇటీవల కాలంలో రిజర్వేషన్లు, జనాభా పెరుగుదల, చట్ట పరమైన మద్దతు ,విద్య ,రాజకీయ చైతన్యం, తదితర కారణాల వల్ల వెనకబడిన తరగతులు, తదితర కులాలలో కొన్ని ఆయా ప్రాంతాల్లో ఆధిక్య కులాల రూపం పొందుతున్నాయని చెప్పవచ్చును.

  ఇక బ్రాహ్మణుల విషయంలో రాజరికం కాలంలో ఉన్నత స్థాయి అనుభవించిన బ్రాహ్మణులు కాలక్రమేణా అటువంటి ఆధిక్యతను ప్రస్తుత ప్రజాస్వామ్య కాలంలో క్రమక్రమంగా కోల్పోయినారని చెప్పవచ్చు.

        (సమాప్తం)

కనువిప్పు

 కనువిప్పు కలిగించే యదార్ధ గాథ. 🙏


‘  ఓమ్ భూర్భువస్సువః –తత్సవితు ర్వరేణ్యం


భర్గో దేవస్య థీమహి– థియో యోనః ప్రచోదయాత్-‘


 అని తాతగారి గదిలోంచి వినిపిస్తున్న’ గాయత్రీ మంత్రా’ న్ని విని వినోద్, వనజా  నవ్వుకున్నారు.


“తాతగారికి ! చాదస్తం ఎక్కువలా ఉంది..ఇలా రోజూ మూడు వేళలా మూడు  గంటల సమయం వృధా చేసుకుంటున్నారు.  దీని బదులు వాకింగ్ కానీ, మరేదైనా ఎక్సర్ సైజ్ చేస్తే మేలు కదా!” అన్నాడు వినోద్. వంటగదిలోంచి  వీరి మాటలు వింటున్న బామ్మ భవాని ” ఏరా! తాతగారిని విమర్శించేంత  గొప్పవారా మీరు!  మీకేం తెల్సురా ‘ గాయత్రీ ‘ మాత  ప్రభావం ? “అంది కోపంగా.


“ఏంటర్రా!  పిల్లలూ! మీ బామ్మ ఏదో చెప్తున్నట్లుంది ? ఏదైనా కధా?” అని అడిగాడు తాత  తారకరామయ్య.


“వీరికి కాస్త గాయత్రి గురించి చెప్పండి .’గాయత్రీ మాత ‘మహత్వం తెలీక ఏదో అనుకుంటున్నారు . పైకి అనలేదు కానీ వీరి మనస్సుల్లో ‘ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ?’ అనే సందేహం మాత్రం ఉంది .” అంటూ బామ్మ వంట గదిలోకి  వెళ్ళింది.


తారకరామయ్య తన వాలు కుర్చీలో కూర్చున్నాక,  పిల్లలిద్దరూ  వెళ్ళి ఆయన కిరువైపులా  స్టూల్స్ లాక్కుని కూర్చుని ” తాతగారూ చెప్పరూ! ప్లీజ్ ! ” అని అడిగారు.


ఆయన గొంతు సవరించుకుని చెప్పసాగారు. “ఇది  నిజంగా జరిగిన సంఘటన, కల్పనా కాదు, ఎవరో రాసిన కధా కాదు. యదార్ధగాధ.  అది ఆంగ్లేయులు మన దేశంలో ఉన్నప్పటి విషయం,  అప్పటి ఒక ఆంగ్ల దొర ‘ధామస్ మన్రో ’ అనే ఆయన పేరని గుర్తు. క్యాంప్ మీద కన్నడదేశానికి వచ్చి, ఒక రోజున తన గుఱ్ఱం మీద   తుంగభద్రా నది ఒడ్డున షికారుకు బయల్దేరాడు . ఆయన తోటి షుమారుగా  అరడజను మంది జవాన్లు గుఱ్ఱంతో పాటుగా పక్కనే పరుగెడుతూ  అనుసరించ సాగారు.


” మన గురించీ  ఏమనుకుంటున్నారు జనం?” ధామస్ తన వెంట ఉన్న వారిని అడిగాడు.                                                                         ” “చాలామంచివారనుకుంటున్నారు దొరా!” వారిలో ఒక ముఖ్య సేవకుడు, బాపన్న చెప్పాడు.


” మీరంటే  అందరికీ భయమే దొరా!”  ముఖప్రీతికై మరో జవాన్ చెప్పాడు.


” సరి, సరి.ఈ రోజు విశేషాలేంటి?” ధామస్ మళ్ళీ అడిగాడు.


“ఏమున్నాయ్ దొరా! మీరీ  సమయంలో  షికారుకు వస్తున్నారు కదా ఈ వారంగా ఒక్కపిట్టా ఈ దారంట రాదు.”


“ఓహ్! అక్క డ చాలామంది జనం ఉన్నారు? ఏంటి విశేషం! ” ఆశ్చర్యంగా అడిగాడు ధామస్ .


” దొరా! అక్కడ నది ఒడ్డున ‘ శృంగేరి పీఠాధిపతులు’  కొలువు చేసి ఉన్నారు , ఆయన శిష్యులూ , స్వామి వారి ప్రవచనం ఆలకించను ఊరి జనమూ చేరి ఉన్నారు దొరా!”


“శృంగేరీ పీఠమా! అదేంటీ ఎన్నడూ విన లేదే?”


” దొరా ! మీరిక్కడికి ఎప్పుడూ రాలేదు కదా ! అంచేత విని ఉండరు. ఈ కన్నడదేశంలోని , చిక్క మగళూరు దగ్గరే శృంగేరి ఉంది. ఆది శంకరాచార్యులు  ధర్మ ప్రచారం కోసం మొదటి మఠాన్ని ఇక్కడ శృంగేరీ లో స్థాపించారు.”


” శృంగేరి అంటే అర్ధమేంటి ? దానికా పేరు మఠస్థాపన తర్వాత వచ్చిందా ? లేక ముందు నుంచే ఉందా? “    “శృంగేరి తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది దొరా!. తుంగభద్ర నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం , తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉన్నాయి . శృంగేరి అనే పేరు ‘ఋష్యశృంగగిరి ‘నుండి వచ్చిందని అంటారు దొరా! శృంగేరికి సమీపంలో  ’ శృంగపర్వతం’ ఉన్నది .  విభండక మహర్షి కుమారు డు  ‘ ఋష్యశృంగ ‘ మహర్షి.  ఈ యోగి మహానుభావుడు  ఒకసారి ‘రోమపాదు’ డనే రాజు పాలిస్తున్న ‘అంగ రాజ్యం’ క్షామానికి  గురై , జనం బాధపడసాగారుట. ఆ సమయంలో, ఋష్యశృంగుడు  అడుగు పెట్టగానే  వర్షాలు పడి, క్షామ నివారణ ఐనదని అంటారు . ఈ గ్రామములో శంకరాచార్యులు అద్వైతాన్ని వ్యాప్తి చేయ టానికై  స్థాపించినదే ఈ శృంగేరీ శంకరమఠం. ”


” ఎంతైనా మీ భారతదేశం చాలా గొప్పదోయ్ ! మహాను భావులు ఎంతోమంది ధర్మస్థాపనకై కృషి చేసిన ‘పుణ్యభూమి’ మీది. నాకెంతో ఇష్టం  మీ దేశమంటే , నేనిక్కడ పుట్టకపోతినే అని బాధపడుతుంటాను అప్పుడప్పుడూ.”  ధామస్ మనస్పూర్తిగా అన్నాడు.


“ఔ దొరా! మాదేశం మహా గొప్పది!” మురిసిపోతూ  తన దేశాన్ని గురించీ చెప్పుకున్నాడు మరో జవాన్  రొప్పుతూ వెంట నడుస్తూ.


” శంకరాచార్యుల వారు మఠాన్నిఇక్కడే ఎందుకు  స్థాపించాలనుకున్నారో తెల్సా?” థామస్ అడిగాడు.


“శంకరాచార్యుల వారు, తన పరివార శిష్యులతో ధర్మ ప్రచారం కోసం దేశాటన  జరుపుతూ ఇక్కడ పర్యటిస్తూన్నప్పుడు, ఆయన ఒక చిత్రం చూశారు దొరా! ఒక సర్పం ప్రసవిస్తున్నఒక కప్పకు ఎండ పడకుండా తన పడగ నీడ పడుతున్న దృశ్యం , ఆయన చూసి ఆశ్చర్యపడ్డారు , ఈ స్థల మహత్యం గొప్పదని గమనించారు .  అంతే కాక ఇక్కడ వరకు వచ్చేసరికి మండన మిశ్రుడి భార్య ఐన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారి పోతుంది. ఆ కధ చాలాపెద్దది ఇంకోమారు చెప్తాను దొరా! ఈ రెండు సంఘటనలు చూసిన  ఆయన  ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మఠాన్ని స్థాపిస్తారు . ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపారని చెప్తారు. అంత గొప్ప పుణ్యక్షేత్రం  ఈ శృంగేరి.”


“మరి ఆ మహాపురుషుడేనా ఈయన? ”


” కాదు దొరా అది జరిగి చాలా ఏళ్ళైంది . ఈయన ఆ గురు పరంపరలోనివారే ! వీరంతా బాల్యంలోనే  పీఠాన్ని చేరి వేద వేదాంగాలూ , శంకరాచార్యుల వారు ప్రవచించిన విశేషాలన్నీ అధ్యయనం చేస్తారు దొరా ! వీరంతా బ్రహ్మచారులు, ఎవ్వరూ వారిని ముట్టుకోడం కాదుగదా! దరిదాపులకు వెళ్ళనే ఝడుస్తారు , స్త్రీలైతే బహు దూరం నుంచీ దర్శించవలసినదే! వారు అనుగ్రహ భాషణంలోని ఆధ్యాత్మిక విషయాలు చాలా గొప్పవి దొరా! ఒక్కటి  ఆచరిస్తే  చాలు జన్మ సార్ధకమవుతుంది.”                                                                                                                                   దూరం  నుంచీ ఆ ఆచార్యులను గమనించిన ధామస్ ” ఆహా! ఆ ముఖ వర్చస్సెంత గొప్పగా ఉంది! వెయ్యి వాల్టుల బల్బు వెలుగుతున్నట్లుంది వారి తేజస్సు! మరి బాపన్నా! ఆచార్యుల చెంతగా ఉన్న ఆ స్త్రీ మూర్తి  ఎవరు? స్త్రీలకు ప్రవేశమే లేదన్నట్లు చెప్పావు ? మరి వారికి అంత దగ్గరగా ఉన్న ఆ అందమైన ,  అద్భుతమూర్తి, టీనేజ్ గాళ్  !ఎవరు బాపన్నా! వెళ్ళి తెల్సుకుని వస్తావా? ఈజ్ షీ హిజ్ సిస్టర్ !”                                                                                                                          ” దొరా! మాకక్కడ ఎవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే! మీకెవరు కనిపిస్తున్నారు?”


” అదో బాపన్నా! అంత బాగా కనిపిస్తుంటే లేదంటావేం? వెళ్ళి అడిగిరాపో?” అన్నాడు ధామస్ దొర .


దొర ఆదేశం మేరకు బాపన్న  చేతులు కట్టుకుని  దగ్గరగా వెళ్ళి వినయంగా , ఆచార్య శిష్యులకు తమ దొర సందేహం విన్నవించాడు .


ఆ శిష్యుడు ఆశ్చర్యంగా ”  అక్కడ మాకెవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే ! అసలిక్కడ స్త్రీలకు ప్రవేశమేలేదే?” అన్నాడు.                                                                                                                                                        బాపన్న” ఔ  స్వామీ! మాకూ కనిపించడంలేదు . కానీ మా దొరకు కనిపిస్తున్నదిట! అడిగి వివరం తెల్సుకు రమ్మన్నారు. పీఠాధిపతులకు విన్నవించండి”అన్నాడు.


ఆ శిష్యుడు పీఠాధిపతులను సమీపించి , ఆ దొరగారి సందేహాన్ని  చెప్పగానే  , ఆశ్చర్యంగా ఆయన తలెత్తి దూరంగా గుఱ్ఱం దిగి తననే దీక్షగా చూస్తున్న ఆ దొరను చూసి,” నాయనా! నా సమీపంలో ఉన్నది శారదా మాత! ఆ తల్లి దర్శనం ఎవరికో నిష్టగా గాయత్రి  చేసే వారికి కానీ లభించదు . నేను ఇక్కడ ప్రవచిస్తున్నప్పుడంతా ఆ మాత  నా సమీపంలో ఉండి సద్వాఃక్కులను నా నోట పలికిస్తుంటుంది . నాశిష్యులైన మీరే కాంచలేని  ‘అమ్మ’ను  ఆ దొర దర్శించాడంటే  ఆయన పూర్వజన్మలో భారతదేశంలో జన్మించి , గాయత్రీ జపం సంపూర్ణంగా , నిష్టగా  గావించి  ఏదో ఒక కారణాంతరంవల్ల ఆంగ్లేయుడై , ఆ ప్రాచ్యదేశంలో జన్మిం చాడు. నేను  పీఠాధిపతిని కనుక ఆయనకు నమస్కరించరాదు .  లేనిచో  ఆయన  నమస్కార అర్హుడని వెళ్ళి చెప్పిరా!” అని శృంగేరీ  పీఠాధిపతి  చెప్పిపంపారు. ‘


“అదిరా గాయత్రీ మంత్ర మహత్యం  అర్ధమైందనుకుంటా ! నియమంగా భక్తితో  జపించిన వారికి  ఈ జన్మలోనే కాక మరు జన్మలోనూ రక్షణ నందిస్తుంది.” అని తాతగారు వివరంగా చెప్పారు. .


పిల్లలిద్దరూ ” మన్నించండి  తాతగారూ!! మాకివన్నీతెలీక తేలిగ్గా మాట్లాడాము. మాకూ ’ గాయత్రి’ ఉపదేశించండి.. ఈ వేసవిలో ఇక్కడ ఉన్నన్నాళ్ళూ మీతో పాటు  రోజూ  గాయత్రి  చేస్తాము . మా ఊరువెళ్ళాక వీలున్నంత సేపు నిత్య గాయత్రీ చేసేందుకు ప్రయత్నిస్తాము.”  అన్నారు.🕉🚩🕉️

ఆదివారం

 *వద్దు* వద్దు *వద్దు* వద్దు *వద్దు* వద్దు *ఎందుకు*

👇👇👇👇👇👇👇👇👇👇

 *💥ఆదివారం సెలవువద్దు💥*


*ఆదివారం పవిత్ర దినం, ఇకనైనా మేల్కొందాం!* 

*ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం మీకోసం.* 

*అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |* 


*సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||*


*స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |*


*న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||*


*💥తాత్పర్యం:* 


*మాంసం తినడం..!* 

*మద్యం తాగడం..!*

*స్త్రీతో సాంగత్యం..!* 

*క్షవరం చేసుకోవటం..!*

*తలకు నూనె పెట్టుకోవడం..!*


*ఇలాంటివి ఆదివారం నాడు  నిషేధించారు,* 

*కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..!* 

*ఈ కర్మలు చేసినవాడు  జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు* 

*అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే* *డబ్బు లేకపోవడం* 

*ఒక్కటే కాదు..* 

*కుటుంబ సౌఖ్యం లేకపోవటం..*

*ఆనారోగ్యం కూడా..!!*


*ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి,* 

*తిండిపోతులకి* 

*ఇష్టమైన రోజు అయింది..!!*


*మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!*


*ఎందుకంటే..* 

*అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు..* 

*సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!!* 

*సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!*


*అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!*


*ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!*


*ఇలాంటి ఆదివారం మనకి* 

*చాలా పవిత్రమైన రోజు..* 


*అలాంటి ఆదివారాన్ని వీకెండ్* 

*పేరుతో ఆదివారం సెలవు అనే* 

*పేరుతో అపవిత్రం పాలు చేశారు..!!* 

*చేస్తున్నాము..!!*


*మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ..*

*ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!*


*అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు (Thomas Babington Macaulay, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు..* 

*మన హిందువులే మన సంస్కృతిని*

*నాశనం చేసేలా చేశారు..!!* *ఆదివారం నాడు మన హిందూ* 

*దేవాలయాలు వెలవెల బోతాయి.!!*


*పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.!* 

*ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!*


*మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు..* 

*ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు..* 

*మధ్యాన్ని తాగేవారు కాదు..!!*


*కానీ ఇప్పుడు సీన్ అంతా* 

*రివర్స్ అయ్యింది!!*


*ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.!* 

*ఇప్పటికైనా కళ్ళు తెరవండి.!* 

*విదేశీ సంస్కృతిని విడనాడండి.!* 

*స్వదేశీ_సాంప్రదాయాలను పాటించండి..!*


*యోగ చేయండి.!* 

*ప్రాణాయామం చేయండి.!* 

*సూర్య_నమస్కారాలు చేయండి.!*  

*సూర్యోపాసన చేయండి.!!* 

*ఆయురారోగ్య ఐశ్వర్యాలను* 

*పొందండి..!!*


*ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!!* 

*కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!*


*ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.🙏 ఓం నమః శివాయ 🌞

శ్రీ శివానన్దలహరీ

 ॐ                 श्री शिवानन्दलहरी    

                     శ్రీ శివానన్దలహరీ    

      SREE SIVAANANDALAHAREE      


              (श्रीमच्छंकरभगवतः कृतौ)   

           (శ్రీ శంకరాచార్య విరచితమ్)  

        (BY SREE AADI SANKARA)            


                                  శ్లోకం :89/100

                           SLOKAM :89/100     


नतिभिर्नुतिभिस्त्वमीशपूजा-

     विधिभिर्ध्यानसमाधिभिर्न तुष्टः ।

धनुषा मुसलेन चाश्मभिर्वा

     वद ते प्रीतिकरं तथा करोमि ॥ ८९॥


నతిభిర్నుతిభిస్త్వమీశ! పూజా 

విదిభిర్ధ్యానసమాధిభిర్నతుష్టః I 

ధనుషా ముసలేన చాశ్మభిర్వా 

వద తే ప్రీతికరం తథా కరోమి ॥          -89    


పరమేశ్వరా!  

    నమస్కారాలచేత, 

    స్తుతులచేత,  

    పూజావిధులచేత,  

    ధ్యానసమాధులచేత నీవు సంతోషించలేదు.    


ధనస్సుచేగానీ,     

రోకలిచేగానీ,     

రాళ్లతోగానీ ఎదుర్కొంటే నీకు ఇష్టమవుతుందా? చెప్పు. 

    ఆ ప్రకారంగానే స్పందిస్తాను.   

    

Hey, Lord, who rules over the universe! 


    You seem to become more pleased with bow or with pestle or with stones 

    than with prostrations or singing of your praise  or worship, 

Or meditation  or Samadhi. 


    Please tell me  which you like most and I will do the same.  


    అర్జునుడు పాశుపతాస్త్ర సంపాదనకోసం తపస్సుచేస్తూ కొండదొర రూపంలో ఎదిరించిన పరమేశ్వరుణ్ణి వింటితో కొట్టినట్లు భారతంలో స్పష్టంగా వర్ణింపబడింది.      

    రోకలితోనూ, రాళ్లతోనూ పరమశివుణ్ణి ఎదిరించిన భక్తుల చరిత్ర పురాణాలలో ఎక్కడో ఉండియుంటుంది.  


    ఈ శ్లోకం వైరభక్తి తత్త్వాన్ని నిరూపిస్తోంది.  

    వైరభక్తితో గూడ పరమాత్మని ఆరాధింపవచ్చు అని ఉపదేశిస్తోంది.    

    భక్తితో కొందరు పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందగా, మరికొందరు శత్రుత్వంతో పొందినట్లు పురాణాలలో ప్రసిద్ధం. అది వైరభక్తి అనిపించుకొంటుంది.    

    హిరణ్యాక్ష హిరణ్యకశిపులు,    

    రావణ కుంభకర్ణులు మొదలైనవారు ఆ కోవకు చెందుతారు.  

    చిరకాలం భక్తితో సేవించడం కంటే శత్రుత్వంతో సులభంగా పరమాత్మ సాయుజ్యాన్ని పొందవచ్చు అని శ్రీమహాభాగవతంలో  చెప్పబడింది. 


వైరానుబంధనంబునఁ 

జేరిన చందమున విష్ణుఁ జిరతర భక్తిం    

జేరఁగ రాదని తోఁచును    

నారాయణ భక్తి యుక్తి నా చిత్తమునన్ .


* భక్తుల తనయెడ జేసిన అకార్యాలని వాత్సల్యాన భగవానుడు క్షమిస్తాడు. 


https://youtu.be/h8qlcoPKG5o


                            కొనసాగింపు.. 


                         =x=x=x= 


సేకరణ, కూర్పు :                         

 రామాయణం శర్మ 

      భద్రాచలం

బ్రాహ్మణత్వము

 బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి...ధర్మరాజు ఇలా అడిగాడు...!💐శ్రీ💐


పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! అని తన సందేహం వెలిబుచ్చాడు. 


భీష్ముడు ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం.ఎన్నోజన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. 


ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు. 


దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో  అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది. 


గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు. 


గాడిద విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో  తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. 


ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.


మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి  అని అడిగాడు. మతంగుడు దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని అడిగాడు. 


ఇంద్రుడు కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. మతంగుడు అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు. 


ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. 


ఇంద్రుడు కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ! 


ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు. 

దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు. 

దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. 

దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. 

దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. 


అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా ! చెప్పు అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టము.


 ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు. 


తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు. 


మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు. 


అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు అన్నాడు. 


మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల. పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు. 

కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.

(భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ).


అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం మన బ్రాహ్మణులదే.

జై బ్రాహ్మణ్...జై జై బ్రాహ్మణ్..స్వస్తి..!!


లోకా సమస్తా సుఖినో భవంతు..!!💐

                         💐శ్రీ మాత్రే నమః💐