5, ఆగస్టు 2021, గురువారం

నియమాలు

 పూజా నియమాలు 


జ: 1. పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.

2. నేతిదీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.

3. ఎడమచేతితో ఉద్ధరణె నీళ్ళు తీసుకుని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి.

4. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మిసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.

5. గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచరాదు.

6. పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు.

7. పూజులో వీలైనంతవరకు ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది.

8. తూర్పు - ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది.

9. పూజలకు, జపానికి వినియోగించే ఆసనం - అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీయాలి - ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు.

10. జపం చేసేటప్పుడు మాలమధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం కూడనివి.

11. నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపుల కొనలకు పసుపుపెట్టి ఇవ్వాలి.

12. అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి, ముగ్గుపెట్టి అన్న పాత్రను ఉంచాలి.

13. వట్టి నేలపై కూర్చొని జపించరాదు, పూజించరాదు, భుజించరాదు.

14. ''పూజ'' అంటే ''భోగములను ప్రసాదించునది (కలిగించునది)'' అని అర్ధం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతాశక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు.

15. మనం పలికే స్తోత్రశబ్దాలు, దీప ధూపాలు, కుసుమాలు దేవతలకు ప్రీతికరాలు. శుచిప్రియులు దేవతలు. అందుకే శుచి, శుభ్రత పూజాజప ప్రాంతాలలో ఉండాలి.

16. బహిష్టులు స్త్రీలు మసలేచోట వారి దృష్టి పడేచోట దేవతాపూజ, అనుష్ఠానం, దీపారాధన జరుగరాదు. మనకు తెలియని సూక్ష్మజగత్తులో, ఆ స్థితిలో చాలా దుష్ప్రకంపనలు జరుగుతాయి. ఈ నియమాలు వేదాలలో కూడా చెప్పబడ్డాయి.

- Subrahmanya Sharma

ధర్మం తప్పని వాడు

 *ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే…* 


ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. 


ఆయన ఆశ్చర్యపోయాడు . 

అప్పుడు ఆయన భార్య చెప్పింది. 


“నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది.” 


ఇంటి యజమాని పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు. 


మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది. 


ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. 


అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. 

బంగారు ముద్దలు పొందారు. 


ఒక్క అర్క సోమయాజి తప్ప. 


 *“యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం.* 


 *బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు” అన్నాడాయన.*              

ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.


          ఆయన భార్యకు ఇది నచ్చలేదు.


 “మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం” 


అని నచ్చచెప్పింది. 


అర్కసోమయాజి ససేమిరా అన్నాడు. చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది. ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు. ఊరి పొలిమేర దాటాడో లేదో… ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నై. మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.


అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప. అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురు వచ్చాడు. “ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసంచేశాను.” అన్నాడు కలిపురుషుడు… …


 *ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే…* 


ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు అయినప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రక్షాసానందం పొందుతారు..


కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది...


💐💐🚩🙏🏻🚩💐💐

శరీరము వంటి పదాలకి అర్థాలు

 ॐ శరీరము వంటి పదాలకి అర్థాలు 


    మనం తఱుచు మనలోనున్న జీవులము అనుకోకుండా, మాయపొర వలన "దేహమే నేను" అనే భ్రాంతి కలిగియుంటాం. 

    అసలు శరీరమన్నా, దానితోపాటు ఇతర పదాలు వాడుతున్నా, వాటి అర్థాలు మనలో చాలామందికి తెలియదు. అవి పరిశీలిద్దాం. 


1. శరీరం 


    నశించేది కాబట్టి శరీరమని పేరు. 

   (శీర్యతే ఇతి శరీరమ్), 


2. దేహం 


  అ) అన్నరసాదులచేత వృద్ధిపొందింపబడేది దేహం 

   (దిహ్యతే అన్నరసే నేతి దేహః) 

  ఆ) దహింపబడేది కాబట్టి కుడా దేహం అని పేరు, 


3. తనువు 


    ఆహారము చేత విస్తారం చేయబడేది తనువు 

   (తన్యతే ఆహారేణేతి తనుః) 


4. వపుః 


    పూర్వకర్మలచేత పుట్టంపబడేది వపుః 

   (ఉప్యతే ప్రాక్కర్మభిః ఇతి వపుః) 


5. విగ్రహము 


    విశేషంగా ఆత్మచేత గ్రహింపబడేది విగ్రహం 

   (విశేషాత్మనా గృహ్యతి ఇతి విగ్రహః), 


6. వర్ష్మము 


    తడుపబడేది వర్ష్మము 

   (వృష్యతి ఇతి వర్ష్మః). 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

నిమ్మకాయతో చికిత్స

 నిమ్మకాయతో చికిత్స - 


  అజీర్ణం ( Dyspepsia ) - 


   గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 


  మలాశయం బాధ ( Bowel Trouble ) - 


    నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.


 స్థూలకాయం ( Obesity ) - 


    నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.


 ముఖ సౌందర్యం ( cosmetic ) - 


   సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 


  చలి జ్వరం - ( Maleria ) 


     నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 


   అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.


 రక్తస్రావం - 


    శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను. ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen కడుపులో బల్ల పెరుగుట హరించును. 


    నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 


  దంతశుద్ధి - 


     దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది.


          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*హరిదాసుని అంతరంగం..*


"అయ్యా!..మా అబ్బాయి కి పెళ్లి సంబంధం కుదిరింది..ఈ స్వామివారి సన్నిధిలో చేయాలని మొక్కుకున్నాము..వచ్చేనెల లో ముహూర్తం ఉందని పురోహితుల వారు చెప్పారు..ఆరోజు ఆదివారం అయింది..ఇక్కడ పెళ్లి చేయించడానికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా?..చెప్పండి.." అంటూ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం మఱ్ఱిగుంట నివాసి రామదాసు అడిగాడు..రామదాసు వాళ్ళు హరిజనులు..


ఒక్క రామదాసు మాత్రమే కాదు..మొగలిచెర్ల గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న చాలా గ్రామాల్లోని చాలా మందికి శ్రీ స్వామివారి మీద విపరీతపు భక్తి భావం నెలకొని వున్నది.. వాళ్లకు ఏ కష్టం కలిగినా..ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ దత్తాత్రేయ స్వామివారే..తమ బిడ్డల నామకరణం నుంచి..వివాహం దాకా..ప్రతి శుభకార్యమూ శ్రీ స్వామివారి సమక్షంలోనే జరిపించాలని వారి కోరిక..అప్పుడే తమకూ.. తమ పిల్లలకూ క్షేమదాయకమని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం..కులమతాల ప్రసక్తి ఈ క్షేత్రం వద్ద వినపడదు..అందరూ యథేచ్ఛగా శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చు..ఎక్కువ, తక్కువ, బేధ భావం లేదు..వారి వారి భక్తి విశ్వాసాల స్థాయిని బట్టి వారి వారి కోరికలు సఫలం అవుతూ ఉంటాయి..


శ్రీ స్వామివారి మందిరం వద్ద వివాహం చేసుకోవాలంటే పాటించాల్సిన నియమ నిబంధనలు తెలియచేసాము..అన్నీ శ్రద్ధగా విన్నాడు రామదాసు..


"ఆరోజుల్లో ఇన్ని నియమాలు లేవు.." అన్నాడు..

నాకు అతని మాట అర్ధం కాలేదు.."ఎన్నాళ్ల క్రిందటి సంగతి నువ్వు చెప్పేది?..ఈ నియమాలు పెట్టి సుమారు పది,పన్నెండు సంవత్సరాలు అవుతున్నది.." అన్నాను..


"ఇప్పటి సంగతి కాదు..ముప్పై ఐదేళ్ళ క్రిందట.. నా పెళ్లి కూడా ఇక్కడే చేసుకున్నాను..ఆరోజుల్లో మమ్మల్ని ఏ కాగితాలూ..ఏ సర్టిఫికెట్లు అడగలేదు..మేము వారం రోజుల ముందు వచ్చి..ఇక్కడ పూజారి గారితో మాట్లాడుకున్నాము..భజంత్రీలతో మాట్లాడుకున్నాము..మళ్లీ ముహూర్తానికి వచ్చి పెళ్లి చేసుకున్నాము..ఇప్పుడన్నీ కొత్త కొత్త నిబంధనలు పెడుతున్నారు..సరేలే..రోజులు మారాయి..అందుకు తగ్గట్టే మారాలి.." అని ధోరణిగా మాట్లాడసాగాడు..


రామదాసు తల్లిదండ్రుల కాలం నుంచే శ్రీ స్వామివారిని భక్తి ప్రపత్తులతో కొలిచేవారు..రామదాసు పుట్టిన తరువాత..తరచూ మొగలిచెర్ల వచ్చి, శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళుతుండే వారు..రామదాసు వివాహం కూడా శ్రీ స్వామివారి సన్నిధిలోనే జరిగింది..రామదాసు కు పెళ్లి జరిగిన ఆరేడు సంవత్సరాల దాకా సంతానం కలగలేదు..సంతానం కోసం శ్రీ స్వామివారికే మొక్కుకున్నాడు..తనకు సంతానం కలిగితే..ఆ పిల్లల పెళ్లిళ్లు కూడా శ్రీ స్వామివారి సన్నిధిలోనే చేస్తానని ప్రమాణం చేసాడు..ఆ తరువాత సంవత్సరం లోపే రామదాసు కు మొగపిల్లవాడు పుట్టాడు..మరో రెండేళ్లకు ఆడపిల్ల పుట్టింది..తాను శ్రీ స్వామివారి వద్ద అనుకున్న మాట ప్రకారమే..కుమారుడి వివాహాన్ని శ్రీ స్వామివారి సన్నిధి లో చేయడానికి రామదాసు ప్రస్తుతం వచ్చాడు..


ఆ తరువాతి ఆదివారం ఉదయం కుమారుడి వివాహం లక్షణంగా జరిగిన తరువాత.."అయ్యా..నా చిన్నతనం నుంచీ ఇక్కడకు వస్తూ వున్నాము..ఆ దత్తాత్రేయుడు మమ్మల్ని అన్ని విషయాల్లో కాపాడుతున్నాడు..మా ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా ముందుగా స్వామి దగ్గరకి వచ్చి..సమాధి కి మొక్కుకొని వెళతాము..ఈరోజు కూడా ఆ స్వామి దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాడు..ఆ స్వామి దయ వుంటే..వీడికి పుట్టబోయే సంతానం వివాహం కూడా ఇక్కడే జరిపిస్తాము.." అన్నాడు భక్తిగా..ఆ మాట చెపుతున్నప్పుడు అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి..


రామదాసు లో ఉన్న అపరిమితపు భక్తే అతనికి ఎల్లవేళలా రక్ష!..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

_నమస్కారం

 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

*_నమస్కారం చేసే విధానం_*


_*నమస్కారం*_ _అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం._


_తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి._


*_మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం,  విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం  భాష._*


_సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయపూర్వకంగా  "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు.  వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా  తాకేలా గౌరవంగా చేయాలి._


_🙏 శివకేశవులకు నమస్కరించేటపుడు తలనుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి  నమస్కరించాలి.(శివకేశవుల్లో ఏ భేదంలేదని చాటడానికి ఇది గుర్తు)_


*_🙏హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు.._*


*_🙏గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి_*


*_🙏తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి._*


*_🙏తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి._*


*_🙏యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి._*


*_నమస్కారంలోని అంతర్గతం ...._*


_హిందూ సంస్కృతిలో నమస్కారం_  

 _విశిష్ట ప్రక్ధియ._ _ఒకరికొకరు ఎదురైతే_

 _రెండు చేతులు_ _జోడించి హృదయ_ 

 _స్థానం దగ్గర ఉంచి_ _నమస్కారం  చెప్పడం_  

 _హిందువు అలవాటు   మామూలుగా_

 _చూస్తే నమస్కారం చేయడం  అంటే_  

 _ఎదుటి వ్యక్తికి గౌరవం  ఇవ్వడం  .._

 _నమస్కారం అన్న పదం  సంస్కృతం_ 

 _నుంచి వచ్చింది ._ 

 _సంస్కృతానికి_ _చెందిన నమః  అనే_

 _పదం నుంచి_  _నమస్కారం  అన్న. పదం_  

 _ఏర్పడిననది .._  _సంస్కృతంలో నమః_

 _అంటే విధేయత._ _ప్రకటించామని  అర్ధం .._

 _మనషులందరిలోనూ దైవత్వము_ 

 _ఉంటుందని  హిందువులు నమ్ముతారు ..._

 _దీనినే ఆత్మ అంటారు_  .

 _నమస్కారం పెట్టడం  అంటే  ఒక వ్యక్తిలో_ 

 _ఉన్న ఆత్మ ఎదుటి  వ్యక్తిలోని ఆత్మను_ 

 _గుర్తించి దానికి విధేయత ప్రకటించడం .._

 _ఇది అధ్యాత్మిక పరమైన వివరణ .._


 _శాస్త్రీయంగా చూస్తే నమస్కారం  చేసేటప్పుడు_

 _రెండు చేతుల వేలి కోసలు ఒకదానికొకటి_

 _తాకుతాయి  మనం చేతి వెళ్ల కొనలకు_

 _కళ్ళు చెవి_ _మెదడులతో సంబంధం_ 

 _ఉంటుంది._ _నమస్కారం  చేసేటప్పుడు_

 _చేసేటప్పుడు  వేలి కొనలు పరస్పరం_ 

 _ఒత్తుకోవడం  వల్ల కళ్ళు చెవి మెదడు_

 _కేంద్రాలు_ _ఉత్తేజమవుతాయి  దాంతో_ 

 _కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తిని  మెదడు ఎక్కువ_

 _కాలం  గుర్తు పెట్టుకోవడం_

 _వాళ్ళ మాటల్ని చెవి గుర్తుంచుకోవడం._

 _జరుగుతుంది .._

 _అంటే మనం ఎవరికైనా చేతులు జోడించి_

 _నమస్కారం పెడితే  వాళ్ళు మనకి_

 _ఎక్కువ కాలం_ _గుర్తుండిపోతారని అర్థము  .._

 _నమస్కారం పెట్టేటపుడు మనం_  

 _ఎదుటి వాళ్ళను_ _ముట్టుకోనవసరంలేదు_ 

 _దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు_ 

 _సోకె ప్రమాదం ఉండదు._

 _భౌతిక సంబంధం లేకపోవడంవల్ల._

 _ఇద్దరి మధ్య సానుకూల శక్తుల అదాన_

 _ప్రదానం జరుగుతుంది._

 _ఒకరినొకరు ముట్టుకోకపోవడం వల్ల_

 _ఒకరి నుంచి చెడు భావనలు  మరొకరిలోకి_  

 _చొరబడే అవకాశము కూడ. ఉండదు._

 _నమస్కారం అన్నది సత్యగునమైనది ._

 _అవకాశం ఉన్నంతవరకు  ఎదుటి వ్యక్తికి -_ 

 _మంచి మనస్సు తో_

 _చేతులు జోడించి_ _నమస్కంరించడం_ 

 _మంచిది ...._


_*నమస్కారం  మంచి  సంస్కారం*_

 _దీన్ని మనం   అందరం  పాటిదాం_

 _ఎదుట వారికి   నమస్కరించటం  తో  మన  విలువ  పెరుగుతుంది_

 _ఈ సాంప్రదాయాన్ని  మనం  పాటిస్తూ , మన  పిల్లలకు  నేర్పిద్దాం .నేర్పిద్దా_

🙏🏽🙏🏽🙏🏽🙏🏽