5, జులై 2023, బుధవారం

శ్రీ అశ్వక్రాంత ఆలయం

 🕉 మన గుడి : 






⚜ అస్సాం : గౌహతి


⚜ శ్రీ అశ్వక్రాంత ఆలయం



💠 శ్రీకృష్ణుడు నరకాసురుని వధించిన చోట వెలసిన దేవాలయము అశ్వక్రాంత్ స్వామి (విష్ణుమూర్తి) దేవాలయము


💠 ఇది బ్రహ్మపుత్ర నదీతీరములో ఉన్నది. సుక్లేశ్వర్ ఘాటికి దగ్గర నదికి ఇటు వైపున గౌహతి, అటు వైపున ఈ ఆలయం ఉన్నది. ఇక్కడికి వెళ్ళాలంటే పడవల మీద వెళ్ళాలి. ఇక్కడ విష్ణుమూర్తి తాబేలుపై, కప్పపై నీటిలో నీటి మొక్కలపై తేలియాడుతూ పవళించి ఉంటాడు. 


💠 ఈ దేవాలయములో సోమవారము నాడు అమావాస్య వచ్చిన రోజున అతి వైభవముగా ఉత్సవము జరుగుతుంది.


🔅 ఆలయ చరిత్ర 🔅


💠 "అశ్వక్రాంతం" అనే పదానికి అర్థం గుఱ్ఱము అనే పదం నుండి తీసుకోబడింది. 

ఆలయం చుట్టూ ఉన్న పౌరాణిక పురాణం ప్రకారం, శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని ఓడించి చంపడానికి ముందు తన సైన్యంతో ఇక్కడ విడిది చేశాడు. 


💠 అశ్వక్రాంత ఆలయం శ్రీకృష్ణుడు మరియు అతని భార్య రుక్మిణి కథతో ముడిపడి ఉంది. ఈ ఆలయం నిర్మించబడిన ప్రదేశంలో సరిగ్గా కృష్ణుడి గుఱ్ఱాన్ని అనేక మంది శత్రువులు చుట్టుముట్టారని కూడా నమ్ముతారు.

మరియు శ్రీకృష్ణుడు కుండిల్ నగర్ నుండి తన నగరమైన ద్వారకకు ప్రయాణం చేస్తున్నప్పుడు అతని గుఱ్ఱము అశ్వం అలసిపోయినందున ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లు కూడా అంటారు.


💠 అశ్వక్రాంత ఆలయం చుట్టూ, శ్రీకృష్ణుడు, కూర్మజనార్దన మరియు అనంతశాయి యొక్క పాదముద్ర ఉన్న ప్రదేశాన్ని సందర్శించవచ్చు.


💠 'యోగిని తంత్రం' ప్రకారం ఈ ప్రత్యేక మందిరం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. 

ఏ పాపుడైనా ఇక్కడ పూజలు చేయడం ద్వారా మోక్షాన్ని పొందగలడని నమ్ముతారు.

 

💠 గౌహతి అశ్వక్రాంత దేవాలయానికి ఎలా చేరుకోవాలి

 

🔅 రైలు మార్గం: సమీప రైల్వే స్టేషన్ గుహతి స్టేషన్.


 🔅 విమాన మార్గం: సమీప విమానాశ్రయం గౌహతి విమానాశ్రయం.

పండ్ల బండి

పండ్ల బండి 

ఒక గ్రామంలో ఒక పండ్ల వర్తకుడు ఒక తోపుడు  బండినిండా అరటి పండ్లు యాపిల్ పండ్లు, బత్తాయిలు ఇలా రకరకాల పండ్లను పెట్టుకొని  వీధిలో విక్రయిస్తున్నాడట.  ఉదయం నుంచి మధ్యాన్నం వరకు విరామం లేకుండా పండ్లు అమ్మి గల్లా నిండా డబ్బులు  సంపాయించాడు. ఎండలో ఒకింత విశ్రాన్తి తీసుకుందామని దగ్గరలోని ఒక చెట్టుక్రింద పడుకున్నాడు. ఈ ఎండలో ఎవరు గ్రాహకులు రారనే  భావనతో. అతనికి తన బండిమీద పండ్లు, డబ్బులు ఎవ్వరు తీసుకొని పొరనే నమ్మకం.  ఎందుకంటె అతడు రోజు అలానే చేసినా కూడా ఒక పండు పోలేదు ఒక రూపాయి పోలేదు.  అతనిని .చుస్తే సృష్టి కార్యం చేస్తూ అలసిపోయి మధ్యలో ఒకింత విశ్రాన్తి తీసుకుంటున్న వటపత్ర సాయి లాగ వున్నాడు.

కానీ ఈ విషయాన్ని రోజు గమనించిన ఒక దొంగ అవకాశం కోసం  ఎదురుచూస్తున్నాడు. ఈ రోజు అతనికి ఆ బండివాని డబ్బులు కాజేయటానికి సరైన సమయం దొరికింది.  చిన్నగా అతను దూరంగా బండివాని కదలికలను గమనిస్తూ చిన్నగా అతను నిద్రలోకి జారుకోగానే పిల్లిలా నడుచుకుంటూ ఆ బండి వైపుకు బయలుదేరాడు.  ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో కానీ ఒక పెద్ద కోతి ఆ బండిమీదకు దూకి కొన్ని పండ్లను తింటూ, కొన్ని పండ్లను చేతులతో పట్టుకొని ఆ పండ్లను దొంగిలిస్తున్నది. అది గమనించిన మన దొంగగారు వేగంగా ఆ కోతిని అదిలిస్తూ ఆ బండి వద్దకు వెళ్ళాడు. అతని భయం ఏమిటంటే ఆ కోతి అక్కడి డబ్బులపెట్టే మీద పడితే ఆ డబ్బులని  తీసుకొని పొతే ఇన్నాళ్ల తన నీరిక్షణ అంతా వృధా అవుతుందని, అతని ఆందోళన. నిజానికి ఆ కోతికి అక్కడ డబ్బుల పెట్టె వున్నదని అందులో పండ్లకన్నా ఎంతో విలువైన ద్రవ్యం వున్నదని దానికి తెలియనే  తెలియదు. దానికి తెలిసినదల్లా తన ఎదురుగా వున్న పండ్లు మాత్రమే. కోతి డబ్బుల పెట్టె జోలికి వెళ్లనందుకు ఎంతో సంతోషించిన మన దొంగగారు ఆ కోతిని అదిలించి చిన్నగా డబ్బుపెట్టెను తెరచి అందులోని ద్రవ్యాన్ని చేచిక్కించుకున్నాడు.  అతను ఒక్క పండుకూడా ముట్టుకోలేదు. ఇలాంటి సంఘటనను మనం  ఊహించుకోవచ్చు. కొన్నిసందర్భాలలో జరిగి కూడా ఉండ  వచ్చు.

 ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా ఈ ప్రపంచంలోని సాధారణ ప్రజలు పైన చెప్పిన కోతిలాగా పండ్ల వెంట అంటే ఐహిక భోగాలకు, విలాసాలకు, సుఖాలకు ఆశ పడి వాటిని పొందుతూ అవే  వారి జీవిత లక్ష్యగా భావించి వాటితోటె సంతృప్త పడుతుంటారు. కానీ నిజమైన జ్ఞ్యాని ఈ ఐహిక భోగాలు కేవలం కొంత సమయం వరకు తృప్తిని ఇచ్చేవిగా తెలుసుకొని అనంతమైన బ్రహ్మ జ్ఞ్యానం శాశ్వితము నిత్యము అని తెలుసుకొని ఏరకంగా అయితే దొంగగారు డబ్బుల పెట్టె వెంట పడ్డారో అలానే జిజ్ఞాసువులు జ్ఞ్యాన బాండాగారమైన శాస్త్రాలను అంటే వేదాంత జ్ఞ్యానానికి సంబందించిన ఉపనిషత్తులు మొదలైనవి  సత్ గురువుల ద్వారా తెలుసుకొని నిత్యము, సత్యము శాశ్వితము అయిన బ్రహ్మ జ్ఞనాన్ని పొందుతారు.  ఎన్నో జన్మలనుంచి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తూ ఉంటే ఆ దేవదేవుడు దయతో మనకు ఈ రోజు ఈ మానవ జన్మను ప్రసాదించాడు. కాబట్టి ఒక్క క్షణం కూడా వృధా కాకుండా నిరంతరం పరమేశ్వరుని సేవలో జీవితాన్ని గడుపుతేనే కానీ మనకు మోక్షము  లభించదు. ఈ విషయం ప్రతి సాధకుడు గమనించి ఆ అనంతుని వెంట వెంటనే పడి జన్మరాహిత్యానికై కృషి చేస్తే తప్పకుండా మోక్ష సిద్ది లభిస్తుంది. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనం నాది, మనది అనేది ఏదీకూడా నాది కాదు అది వస్తువే కానీ జ్ఞ్యానమే కానీ అంతా కూడా ఆ పరమేశ్వరుడిది  మాత్రమే అయి వున్నది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆ పరమేశ్వరుడే అయి వున్నది.   ఏరకంగా అయితే ఆ బండివాడి పండ్లు, ద్రవ్యం అతనివే అయినట్లు.  మనవి కాని వాటిని మనం మనవి అని అనుకొంటూ వాటి కొరకు పరుగులు తీస్తూవున్నాము. నిజానికి ప్రతి సాధకుడు కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ జగత్తు మొత్తం జగదీశ్వరుడిదే అయి వున్నది.  నేను కేవలం ఈ జగత్తులోని వాటిని కొంతకాలం అనుభవించటానికి వచ్చిన ఒక అతిధిని  మాత్రమే. ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రతి సాధకుడు తెలుసుకుంటాడో అప్పుడు నిత్యా నిత్య జ్ఞ్యానం కలిగి సమర్పణ భావంతో మెలఁగి ఈశ్వరునితో సఖ్యత కలిగి ఈశ్వరునితో ఐక్యం చెందగలదు. ఇదే విషయాన్ని ఈశావాసోపనిషత్తు ఉటంకిస్తున్నది. 

ఓం ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్

తేనత్యక్తేన భుంజీథా: మాగృథ: కస్యస్విద్ధనమ్. 

కాబట్టి మనది కానిదానిని మనది అని అనుకోకుండా పూర్తిగా ఆ ఈశ్వరునిదే అనే భావము కలిగి కేవలం ఒక అద్దె ఇంట్లో నివసించే కిరాయిదారుడిగా మాత్రం ఈజగత్తుతో సంబంధం కలిగి సర్వే సర్వేత్ర ఆ ఈశ్వరుని తలుస్తూ జీవనాన్ని గడపాలి. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ 



_భగవంతుడి_ఆరాధనలో

 #పురాణగ్రంధాల_ప్రకారం_భగవంతుడి_ఆరాధనలో_నిషేధించబడినవి_ఏమిటో_చూద్దాం


1. తులసిని వినాయకుడికి సమర్పించద్దు.

2. ఏ దేవతకూ దూర్వాపత్రం వద్దు.

3. తిలకంలో విష్ణుమూర్తికి అక్షతలు వద్దు.

4. ఒకే పూజాస్థలంలో 2 శంఖాలు వద్దు.

5. గుడిలో 3 గణేశ విగ్రహాలను ఉంచద్దు.

6. తలుపు దగ్గర Shoes, Chappals తలకిం దలుగా ఉంచద్దు.

7. భగవంతుడ్ని దర్శించుకుని తిరిగొచ్చేటప్పుడు గంట మోగించరాదు.

8. ఒక చేతితో హారతి తీసుకోరాదు.

9. బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోరాదు.

10. తల్లికి తప్ప ఏ స్త్రీ కి కూడా నమస్కరించడం నిషేధం.

11. దక్షిణయివ్వలేనప్పుడు జ్యోతిష్యుడ్ని కలవద్దు. 

12. ఇంట్లో పూజకోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచద్దు.

13. తులసిచెట్టులో శివలింగం ఉండరాదు.

14. గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకరాదు.

15. కుటుంబంలో సూతకముంటే, పూజా విగ్రహాలను తాకరాదు.

16. శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటరాదు.

17. ఒక చేత్తో నమస్కరించద్దు.

18. చరణామృతం తీసుకునేటప్పుడు, ఒక్క చుక్క కూడా కిందపడకుండా కుడిచేతి కిం ద రుమాలు ఉంచాలి. చరణామృతం తా గిన తర్వాత తలపై చేతులు తుడచద్దు, కానీ, కళ్లపై రాసుకోండి. గాయత్రి మన తల పై నివసిస్తుంది. కనుక ఎంగిలి చేతితో కలుషితం చేయరాదు.


19. పెళ్లికాని ఆడపిల్లల పాదాలు పెద్దలు తాకడం పాపం.

20. తాగుబోతులు భైరవుడు కాకుండా వేరే దేవాలయాల్లోకి ప్రవేశించడం నిషేధం.

21. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా కుడిపాదం, బైటకెళ్లేటప్పుడు ఎడమ పాదం ఉంచాలి.

22. పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మోగించరాదు.

23. గుడికెళ్లడానికి ఒక జత బట్టలు విడిగా ఉంచుకోండి.

24. దేవాలయం మీ యింటికి చాలా దగ్గర్లో ఉంటే కనుక పాదరక్షలు లేకుండా నడిచెళ్ళండి. 

25. గుడిలో కళ్లు తెరిచి దేవుడి దర్శనం చేసుకోండి. 

26. ఆరతి తీసుకున్న తర్వాత  తప్పకుండా చేతులు కడుక్కోవాలి.


ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో ఋషుల నుండి సాంప్రదాయబద్దంగా చెప్పబడ్డాయి.


🚩సర్వే జనా సుఖినోభవంతు🚩... Chittatturu Rambaburao గారి వాల్ నుండి...

కర్మ భూమి" చర్చ

 ఈ రోజు ఓ గౄపులో "కర్మ భూమి" పై జరిగిన ఓ చర్చ:-


[7/5, 12:14 PM] +91 80963 54159: ఈ విషయంలో ఏఏ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? ఒకవేళ లోకంలో ఇదొక ప్రచారం మాత్రమేనా? లేదా ఏదన్న శాస్త్రం స్పష్టంగా ఈ విషయాన్ని చెబుతోందా అన్నది పరిశోధించటం  చాలా అవసరం.  ఒకవేళ చెబితే ఆ శాస్త్రమే అక్కడికక్కడే పరిష్కారాన్ని సూచిస్తుంది కదా. కాబట్టి  మీరు చెప్పినది ఏ గ్రంధంలోనో /శాస్త్రంలోనో లేదా మరో రూపంలో ఎక్కడ ఉందో తెలియజేయ ప్రార్ధన.   🙏 🙏                                                                                                                                          వాల్మీకి విరచిత యోగావాసిస్టం లో  అద్భుతమైన విషయాలు వున్నాయి. ఒక గ్రహం నుండి ఇంకోగ్రహానికి ప్రయాణం,  ఒక బ్రహ్మాండం నుండి మరో బ్రహ్మాండంకి ప్రయాణం, అలాంటి సమయంలో ఎలాంటి కర్మలు చేయాలి? వాటి ఫలితం ఏమవుతుంది? టైం ట్రావెల్ లో వొచ్చే ధార్మిక సమస్యలకు ఎలాంటి పరిహారం చేయాలి..... ఇలాంటి అద్భుతమైన విషయాలని సాక్షాత్తు సరస్వతిదేవి లీల అనే  భక్తురాలికి ఒక బ్రహ్మాండం నుండి మరో బ్రహ్మాండంకి ప్రయాణం చేయిస్తూ వివరంగా చెబుతుంది. ఆ సమయంలో మొదటి సారి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ దేవుడు సంధ్యావందనం చేసి ప్రారంభించాడని మాత చెబుతుంది. ఏ సృష్టి లేనపుడు సంధ్యావందనం ఎవరికో? అది కూడా చెబుతుంది మాట.  ఒక బ్రహ్మాండం నుండి మరో బ్రహ్మాండంకి ప్రయాణం చేసినపుడు ఎలాంటి వైదిక కర్మలు చేయాలో వాటి స్టితి,ఫలితం ఏమవుతాయో చెప్పినపుడు. సముద్రం దాటితే పరిహారం ఉండదా? 🙏🙏

[7/5, 12:51 PM] శర్మద: ఆర్యా! 

మీ ప్రశ్నలు బాగున్నాయి. 


నాకు తెలిసిన విషయం చెప్పటానికి ప్రయత్నిస్తాను. 


భూమిపైన మన భారతదేశం ఒక్కటే కర్మభూమిగా గుర్తించబడినది. మిగతా ఏ ప్రాంతములోనూ లేదా దేశాలలోనూ మన శాస్త్రాలు చెప్పిన కర్మాచరణ లేదు. అంతా అనాచారము. అసంస్కృతీప్రవర్తనలు. (మనదేశంలో ఇవి లేవని కాదు. ఇప్పుడు ఈ దుష్టసంస్కృతి ఏర్పడినది.) మన యొక్క ఏ మతగ్రంథాన్ని పరిశీలించినా.... భగవంతుని అవతారాలనుండి దేవతల తపస్సులు సహితము మన హైందవభూమియందే జరిగినట్లు మనకు తెలుస్తుంది. 


భగవద్గీత లో కూడా భగవంతుడు భరతవర్షమే కర్మభూమి అని, దేవతలు సహితము భరతవర్షంలో జన్మించాలని కోరుకుంటారని చెప్పటం జరిగింది. ఇలా ఎందుకంటే.... భూలోకంలో తప్ప మరేలోకంలోనూ కర్మాధికారం లేదు. చివరకు తపస్సు చేయాలన్నా కర్మ అవసరమే. అందువలన అలా కోరుకుంటారని భగవంతుని మాట. 


కర్మభూమియైన భరతవర్షంలో చేసిన కర్మ ఫలవంతమౌతుంది. ఇతరచోట్ల చేసిన కర్మ నిష్ఫలమౌతుంది. అందువలన కర్మాచరణకు మన కర్మభూమి దాటి పోరాదని శాస్త్రనియమం. ఎంతటి బ్రాహ్మణుడైనా వరుసగా మూడురోజులు పాటు సంధ్యావందనము చేయనిచో అతనికి మరలా శుభముహూర్తంలో ఉపనయనం చేయమని శాస్త్రం చెబుతోంది. అందువలన సముద్రాన్ని దాటి వేరే దేశాలకు వెడితే...  కర్మభూమి కానటువంటి ఆ దేశంలో చేసిన కర్మలు (సంధ్యావందనము సైతం కర్మయే) నిష్ఫలమౌతాయి. అందువలన మరలా ఆ వ్యక్తి ఉపనయనంచేత సంస్కరించబడాలి. అందుకే...  కంచి పరమాచార్య అనేక సందర్భాలలో సంధ్యావందనం చేయటం ముఖ్యమని, ఇతరదేశాలకు నీవు వెళ్ళటం అవసరమా? అని భక్తులకు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. 


ఈ కారణాలవలన సముద్రం దాటటం వద్దని చెప్పటం జరిగింది.

[7/5, 1:38 PM] +91 80963 54159: లోక వ్యవహార దృష్టి కోణంలో ...సముద్రం దాటి ఇతరదేశాలకు వెళ్ళటం వల్ల  "Brain drain" కి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. విద్వాంసులు మనకు తక్కువై మనసమాజంలో అజ్ఞానం పెరుగుతుంది అని మహాత్ములు ఎప్పుడో  దర్శించి చెప్పివుండవచ్చు.  అది మన మంచికే.  ఇప్పుడు అదే చూస్తున్నాం అనుభవిస్తున్నాం కూడా.  కానీ.. మనం రోజూ చేసే సంధ్యా వందనంలో ఆచమనం (శ్రౌతాచామానం) లోనే 6 లోకాల (భూ, భువ, సువ, మహా, జన, తపో, సత్య) ప్రస్తావన ఉంది. అసలు సంధ్యావందనలో ఎన్నిసార్లు ఆచమనం చెయ్యల్సివోచ్చినా శ్రౌతాచామానం మాత్రమే చేయాలి, పురాణాచమనం(కేశవాది నామాల) అప్రస్త్తుతం అని ప్రాచీన వేదపండితులు సూచిస్తున్నారు అని తన తాతగారు చెప్పగా తానూ విని ఆచరిన్స్తున్నాను అని మా తాతగారు నాకు  చెప్పగా యధాశక్తి నేను తిరుమల వెంకటేశ్వరుడి దయవల్ల ఆచరించగలుగుతున్న. ఇక్కడ అంశం ఏమంటే.. భూ లోకం అనగా ఈ మొత్తం భూగోళం తో పాటు  షడ్వికారాలకు లోనయ్యే జీవానికి, జీవ ప్రక్రియకు అవకాశం ఉన్న ప్రతి ప్రదేశాన్ని (మొత్తం సృష్టిలో..అనేకం వున్నాయి ) భూలోకంగానే భావిస్తున్నాను అని ఆచమన మంత్రానికి అర్ధం అని పెద్దలు చెప్పగా విన్నాను. కాబట్టి  అఖండమైన అనంతం శాశ్వతమైన వేదమే లక్ష్యంగా ఆచరించే వైదిక కర్మ అయిన సంధ్యవందనలో అనేక భూలోకాలనన్నిటినీ కలిపి ఒకే భూలోకంగా భావించి కర్మ చేస్తున్నపుడు.. మొత్తం భూలోకం కర్మభూమి వేదభూమి అయినట్లే. కాబట్టి వైదిక కర్మలు మనముంటున్న భూమి మీద ఎక్కడ ఆచరించినా ఫలితం రాకమానదు. సంధ్యావందనమే నిలువెత్తు సాక్ష్యం. 🙏🙏

[7/5, 2:01 PM] +91 79957 06813: భారతదేశము అంటేనే కర్మభూమి అనియు  కర్మాచరణమందు ఎక్కువ ఆదరణ గల భూమి అనియు ఆర్యావర్తము అని కూడా ఈ నిఘంటువులో ఇచ్చారు. ఇప్పుడే నిఘంటువును పరిశీలించి పలికిన వ్యాఖ్యలివి. 


మతపరమైన కర్మలు (కర్మకాండ) జరిగే భూమి, భారతవర్షము అని ఆప్టే నిఘంటువు.  


విష్ణుపురాణంలో వున్న  ఈ శ్లోకాన్ని ఓసారి గమనించగలరు. 


ఉత్తరేణ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం |

వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః ||

నవయోజనసాహస్రో విస్తరోSస్య మహామునే |

కర్మభూమిరియం స్వర్గమపవర్గంచ గచ్ఛతాం ||

(అపవర్గమంటే మోక్షం) 


ఈ శ్లోకానికి అర్థం ఇదిగో.


సముద్రమునకుత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షము గలదు. అందలిసంతతి ''భారతి'' యనబడును. ఇతి తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమి యని దీనికిపేరు. స్వర్గాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. 


ఇదే శ్లోకం కొలది మార్పులతో బ్రహ్మ పురాణం, పందొమ్మిదవ అధ్యాయం, జంబూద్వీప వర్ణనంలో ఇలా కనిపిస్తోంది.


రోమహర్షణ ఉవాచ -


ఉత్తరేణ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం |

వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః ||

నవయోజనసాహస్రో విస్తారశ్చ ద్విజోత్తమాః!|

కర్మభూమిరియం స్వర్గ మపవర్గం గంతు మిచ్ఛతామ్‌ ||


సూతుడిట్లనియె-


సముద్రమునకుత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షము గలదు. అందలిసంతతి ''భారతి'' యనబడును. ఇతి తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమియని దీనికిపేరు. కోరినవారికి స్వర్గము మోక్షమును గూడ నిందే యున్నవి.


ఉదాహరణకు అగ్ని మహాపురాణం, జంబూ ద్వీప వర్ణనంలో ఇలా వుందట Agni Maha Purana (Telugu) Chapter 118


శివమహాపురాణంలో ఇలా వుందని విన్నాను. 


నవయోజనసాహస్రో విస్తరోSస్య మహామునే |

స్వర్గాపవర్గయో:కర్మభూమిరేషా స్మృతా బుధై:||


స్వర్గమోక్షాలనిచ్చే కర్మభూమి అని పండితులచే చెప్పబడినది


మొత్తానికి మనదేశానికి కర్మభూమి అనే పేరు పురాణాల్లో వుంది అని చెప్పవచ్చు. అంటే కర్మ భూమి అంటే మన దేశం తప్పించి యావత్ ప్రపంచానికి వర్తించదేమోనని నా నమ్మకం.

[7/5, 2:11 PM] +91 79957 06813: కాని భగవద్గీత 15 వ అధ్యాయం, 2 వ శ్లోకం లో *కర్మాణుబంధీని మనుష్యలోకే* అని చెప్పబడింది. 


అంటే మనుష్యులు నివసించే లోకమంతా కర్మ చేత బంధించబడినది అని చెప్పబడింది. భారత దేశం కూడా ఈ లోకంలో భాగమే కాబట్టి, ఈ విషయం భగవద్గీతలో చెప్పబడిందని అనవచ్చు. 


ఈ లోకంలో కర్మలచేతే (పనులు చేయడం వలనే) ఫలితాలు వస్తాయని చెప్తోంది (దేవలోకంలో సంకల్పమాత్రం వలన ఫలితాలు రావచ్చు).


అంటే ఈ లెక్కన మనకు తేలిందేమిటంటే పురాణాలు శాస్త్రాలు కూడా కర్మభూమి అంటే ఇదమిత్థంగా తెలియబరచని పరిస్థితి. 


ఇంకనూ ప్రయత్నిస్తేగాని వీటన్నిటిని అర్థం చేసుకోలేమేమో

[7/5, 2:48 PM] శర్మద: సరే అయితే...


ముందు మీరు సముద్రాన్ని దాటండి. 😅😅


నాకొక సందేహం వచ్చింది. దీనిని కూడా ఆలోచించండి. 


సీతమ్మను తీసుకొని రావటానికి వెళ్ళినవారంతా సముద్రాన్ని దాటారు కదా? 


అంతకుముందు రావణుడు లంకనుండి ఎన్నోసార్లు సముద్రాన్ని దాటి వచ్చాడు కదా? 


ఇక్కడ వారు ఫరిహారాలు చేసుకున్పారా?

[7/5, 2:55 PM] +91 92411 45762: రావణాసురిడిది కూడా అసలు లక్నో దగ్గర ప్రాంతమేనని ఒక వాదన.

[7/5, 2:57 PM] శర్మద: ఇది బాగున్నది. 


అసలు రావణుడు పులస్త్యబ్రహ్మకు మనుమడు. బ్రహ్మ దేవలోకానికి చెందినవాడు. కనుక రావణుడు అసలు భూలోకానికి చెందినవాడు కానేకాదు. 

😂😂😂😂😂

[7/5, 2:58 PM] +91 80963 54159: సముద్రాన్ని ఎవ్వరైనా దాటవచ్చు. వారి వారి వర్ణ/వేద/శాఖ ధర్మాలను అనుసరించి, దేశ,కాల,మాన, పరిస్త్తితులకు తగ్గట్లు మూల ధర్మం మారకుండాప్రాయచ్చిత్త సహితంగా యధాశక్తి వేదం నిర్దేశించిన కర్మలు చేయవచ్చు. సంధ్యావందనం, సత్రయాగం, వరలక్ష్మి వ్రతం...ఇలా అన్నీ హైదరాబాద్ లో చేసినా, బ్రెజిల్ లో అమెజాన్ చిట్టడవికి వెళ్ళి చేసినా శ్రద్ద,భక్తిని అనుసరించి ఫలితం రాకమానదు. 🙏

[7/5, 3:00 PM] శర్మద: భరతఖండంలో ఎక్కడ చేసినా ఫలితం ఓకే. 


భరతఖండం దాటి చేసేటువంటి కర్మలవిషయంలోనే పెద్దల (శాస్త్ర) అభ్యంతరం.

[7/5, 3:02 PM] శర్మద: దేశాంతరంలోనైనా, దేశంలోనైనా మూడురోజులపాటు నిత్యకర్మలను ఆచరించకపోతే అతడు కర్మభ్రష్టుడు అని, తిరిగి ఉపనయనం చేసుకోవాలనీ శాస్త్రం చెబుతోంది.

[7/5, 3:02 PM] +91 79957 06813: నేనూ ఈ నిబంధనతో ఏకీభవిస్తున్నాను

[7/5, 3:04 PM] +91 79957 06813: కంచి పరమాచార్య వారు ఎన్నో సార్లు ఈ వివరణ ఇవ్వడం నేనే చదివాను.

[7/5, 3:04 PM] +91 80963 54159: Brain Drain ని ముందే ఊహించి కట్టడిచేసే ప్రయత్నం అనుకోవచ్చు. వేద నిషేధం చేయకుండా పరిహారాలు చెప్పిందేమో....నాకు అంత బుద్ధి బలం లేదు. వేదవిద్వంసులు చెప్పగలరు. 🙏

[7/5, 3:07 PM] +91 80963 54159: ..దానిదేముంది శాస్త్రం చెప్పిన పరిహారం. కర్మపై కర్తపై నిషేధం లేదుకదా. పూజ ప్రారంభించాం..దీపం కొండెక్కింది. ఆపేయం కదా. ఓ పరిహార మంత్రమో/శ్లోకమో/నామమో చెప్పి మళ్ళీ వెలిగించి. కర్మ చేస్తాం. 🙏

[7/5, 3:09 PM] శర్మద: మీరు చెప్పినటువంటి ఎన్నో సైన్సు కారణాలు మన ఆచారాలవెనుక ఉన్నాయనేది సత్యం. 


మన పూర్వీకులకు ఈ రహస్యాలన్నీ తెలుసు. కారణాలను చెబితే.... *ఓస్... ఇంతేగా...* అనే నిర్లక్షం కలిగి సమాజం పాటించదనే శంకతో ఆ విజ్ఞానానికి భక్తిని రంగరించి బోధించారు మన పెద్దలు. 


అందవలననే ఏ సంప్రదాయం ఎందుకు అనేది అర్థంకాక ఇప్పుడు మనం జుట్టుపీక్కుంటున్నాము.


దీనిపై మన ఆత్మీయులు తమ తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.

గాలులు లొని రకాలు -

 అష్ట దిక్కుల గాలులు  -  లాభ నష్టాలు . 


  గాలులు లొని రకాలు  - 


     బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు  . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 


  దక్షిణ దిక్కు గాలులు  - 


    ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి 


  నైరుతి గాలులు  - 


      జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు. 


  పడమర గాలులు  - 


     ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి. 


  వాయువ్య దిక్కుల గాలులు  - 


   

     అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది. 


  తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు  - 


     డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి. 


   ఆగ్నేయ గాలులు   - 


  

       ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.


  

    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


మరింత విలువైన మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .

            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

      9885030034                       


    

    కాళహస్తి వేంకటేశ్వరరావు 


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు

హనుమంతుని గొప్పదనం

 నిత్యాన్వేషణ: 


*అతులిత బలధాముడు, జ్ఞానులలో అగ్రగణ్యుడు, సకల గుణ సంపన్నుడు అయినప్పటికీ, హనుమంతుడు, రాముని దాసుడెందుకయాడు?*



హనుమంతుని గొప్పదనం ఇక్కడ ప్రస్తుతించబడినది:

*అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం*

*దనుజ వనకృశానుం ఙ్ఞాణినామగ్రగణ్యమ్*

*సకలగుణనిదానం వానరాణామధీశం*

*రఘుపతి ప్రియభక్తం వాతాజాతా నమామి॥*

అర్ధం: అసమానమైన శక్తివంతుడు, బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూతప్రేతపిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతం, ఙ్ఞానులలో అగ్రగణ్యుడు,అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారాలు.

శక్తి, జ్ణానం గుణం, ధైర్య పరాక్రమాలున్నప్పటికీ, హనుమంతుడు రామబంటు ఎందుకయాడు అనేది:


रामो विग्रहवान् धर्मस्साधुस्सत्यपराक्रमः।

राजा सर्वस्य लोकस्य देवानां मघवानिव।। 3.37.13 ।।

[Sloka 13 from 37th Sarga in Aranya Kanda from Sri Valmiki Ramayanam]


అర్ధం: రాముడు ధర్మ అవతారం. అతను ధర్మవంతుడు. అతని బలం సత్యం. దేవతలకు ఇంద్రునివలె, అన్ని ప్రపంచాలకు ఆయన రాజు.

ధర్మమే మహోన్నతమైనది. దానిని మించినది మరొకటి లేదు. ఎంతటి వ్యక్తి, శక్తి అయినా ధర్మం ముందు తల వంచవలసిందే. ఎందుకంటే, ధర్మం సత్యం, నిత్యం మరియు అంతిమ శక్తి. రాముడు మానవుడయినా, ధర్మావతారం - రామో విగ్రహవాన్ ధర్మ- ధర్మానికి విగ్రహ రూపం ఇస్తే, అది రాముడే!

అందుకే, హనుమంతుడు ఎంతటి శక్తివంతుడు, గొప్పవాడయినప్పటికీ, రామ (అదే ధర్మ) దాసుడయాడు.

ధర్మో రక్షతి రక్షిత: - ధర్మాన్ని ఎవరూ రక్షించాల్సిన పని లేదు; దాన్ని పాటించటం వలన, మిమ్ములను మీరు రక్షించుకున్న వాళ్ళవుతారు.

నీటి మీద రాత

 🌹🌹  _*సుభాషితమ్*_  🌹🌹

---------------------------------------------


*శ్లోకం*


అసద్భిః శపథేనోక్తం జలే లిఖితమక్షరమ్।

సద్భిస్తు లీలయా ప్రోక్తం శిలాలిఖితమక్షరమ్॥


(సుభాషితరత్నావళిః)


*తాత్పర్యం*


దుర్జనులచే చేయబడిన ప్రతిఙ్ఞ నీటి మీద రాత వలే వెంటనే కనుమరుగైపోవును.

సజ్జనులచే పలుకబడి‌న వాక్కు సాధారణమైనదైననూ శిలపై చెక్కబడి‌న అక్షరముల వలే శాశ్వతంగా నిలచి ఉండును......

భారతదేశం ఒక్కటే కర్మభూమి

 


భూమిపైన మన భారతదేశం ఒక్కటే కర్మభూమిగా గుర్తించబడినది. మిగతా ఏ ప్రాంతములోనూ లేదా దేశాలలోనూ మన శాస్త్రాలు చెప్పిన కర్మాచరణ లేదు. అంతా అనాచారము. అసంస్కృతీప్రవర్తనలు. (మనదేశంలో ఇవి లేవని కాదు. ఇప్పుడు ఈ దుష్టసంస్కృతి ఏర్పడినది.) మన యొక్క ఏ మతగ్రంథాన్ని పరిశీలించినా.... భగవంతుని అవతారాలనుండి దేవతల తపస్సులు సహితము మన హైందవభూమియందే జరిగినట్లు మనకు తెలుస్తుంది. 


భగవద్గీత లో కూడా భగవంతుడు భరతవర్షమే కర్మభూమి అని, దేవతలు సహితము భరతవర్షంలో జన్మించాలని కోరుకుంటారని చెప్పటం జరిగింది. ఇలా ఎందుకంటే.... భూలోకంలో తప్ప మరేలోకంలోనూ కర్మాధికారం లేదు. చివరకు తపస్సు చేయాలన్నా కర్మ అవసరమే. అందువలన అలా కోరుకుంటారని భగవంతుని మాట. 


కర్మభూమియైన భరతవర్షంలో చేసిన కర్మ ఫలవంతమౌతుంది. ఇతరచోట్ల చేసిన కర్మ నిష్ఫలమౌతుంది. అందువలన కర్మాచరణకు మన కర్మభూమి దాటి పోరాదని శాస్త్రనియమం. ఎంతటి బ్రాహ్మణుడైనా వరుసగా మూడురోజులు పాటు సంధ్యావందనము చేయనిచో అతనికి మరలా శుభముహూర్తంలో ఉపనయనం చేయమని శాస్త్రం చెబుతోంది. అందువలన సముద్రాన్ని దాటి వేరే దేశాలకు వెడితే...  కర్మభూమి కానటువంటి ఆ దేశంలో చేసిన కర్మలు (సంధ్యావందనము సైతం కర్మయే) నిష్ఫలమౌతాయి. అందువలన మరలా ఆ వ్యక్తి ఉపనయనంచేత సంస్కరించబడాలి. అందుకే...  కంచి పరమాచార్య అనేక సందర్భాలలో సంధ్యావందనం చేయటం ముఖ్యమని, ఇతరదేశాలకు నీవు వెళ్ళటం అవసరమా? అని భక్తులకు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. 


ఈ కారణాలవలన సముద్రం దాటటం వద్దని చెప్పటం జరిగింది.

ఈ రోజు పదము

 211వ రోజు: (సౌమ్య వారము) 05-07-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

కూతురు: అంగజ, ఆడుబిడ్డ, ఆత్మజ, ఆత్మసంభవ, కుమారి, కొమరిత, కొమరి, ఝుల, తనయ, తనూభవ, తనూజ, నందన, నందిని, పుత్రి, పుత్రిక, సుత, స్వజ. 


 ఈ రోజు పద్యము:


అక్కఱపాటు వచ్చు సమయంబునఁజుట్టములొక్కరొక్కరి/

న్మక్కువనుద్దరించుటలు మైత్రికిఁజూడగ యుక్తమేసుమీ/

యెక్కట నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలన్/

దక్కక వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా!

 

 భాస్కరా! మానవులు ఇచ్చిపుచ్చుకొనుట సహజము. అలాగే అవసరమున్న వేళయందు బంధువులు ఒకరినొకరు ప్రేమతో, కష్టముతో నుండిన  వేళలయందు ఉద్దరించుటకు ప్రయత్నములు చేయుట స్నేహమునకు భావము. ఏలననగా, నీటిలో పడవల మీద బండ్లు తీసుకొని వెళ్ళునట్లు. భూమి మీద బండ్ల మీద పడవలను తీసుకు వెళ్ళునట్లు. అలాగే తగిన అవసరము వచ్చిన వేళ ఒకరినొకరు అన్యోన్యతలు పాటించాలని సారాంశము.

ఆషాఢ మాసం - ప్రత్యేకత - VII

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - VII    



ॐ  కొత్త దంపతులు 


    ఆషాఢ మాసంలో కొత్త కోడలూ, కొత్త అల్లుడూ వారివారి అత్తిళ్ళ గడపలు దాటకూడదు అంటారు. 

   దీని అసలు కారణాలు వెనక్కి వెళ్ళిపోయి, గడపలు దాటకుండా, మిగతా వ్యవహారాలు మాత్రం సాగిపోతున్నాయి. 

    ఈ ఆచారానికి అసలు కారణాలు 


1. మనది ప్రధానంగా వ్యావసాయక దేశం. ఆషాఢ మాసం ప్రారంభంనుంచీ వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. 

     కాబట్టి వాటిమీద దృష్టి పెట్టాలి. 


2. నూతన దంపతులు ఆషాఢ మాసంలో కలిసి, స్త్రీ గర్భవతి అయితే, పురుడు వేసవి మధ్య కాలంలో వస్తుంది. స్త్రీకి మొదటి కానుపుకు ఆకాలం అనుకూలం కాదు. 

    అందుకనే దంపతులని ఆ నెల దూరంగా ఉంచడం. 

    కొద్దిరోజుల దూరం మరింత దగ్గరచేస్తుంది కూడా కదా! 


3. అత్తింటి దగ్గర కొత్త కోడలుగా ఉండి, పుట్టింటికి వచ్చిన అమ్మాయి, అత్తింటి - పుట్టింటి ఆచార వ్యవహారాలవంటివన్నీ తల్లిదండ్రులతో చెప్పుకుంటూ, సమన్వయ పరచుకునే వెసులుబాటు ఆషాఢమాసం వలనే. 

  (ప్రస్తుత residential విద్యా సంస్థల్లో, చేరిన పిల్లలకి మొదట్లో home sick అని సెలవులిస్తారు కదా!)


    పెద్దలు ఎంతో ఆలోచించి, మన శ్రేయస్సుకై అందిచ్చిన ఆచారాలను, యథాతథంగా కొనసాగించాలి కదా! 


                       సమాప్తం 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

సమదర్శనం

 గీత "సమదర్శనం", "అన్నింటిలోనూ మరియు అందరిలోనూ ఒకేలా చూడటం" గురించి మాట్లాడుతుంది నిజమే, కానీ గీత ఏ కుల భేదాలను గుర్తించదని దీని ఆధారంగా వాదించడం వక్రబుద్ధి అవుతుంది. కృష్ణుడి ప్రకారం, మనం ఎప్పుడు? 

సమత్వ దశను, మనం అందరినీ సమానంగా చూసే దశను పొందాలా? మనం సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవాలి: ఆత్మలో లీనమై ఉన్న జ్ఞాని యొక్క సమదర్శనం గురించి భగవంతుడు మాట్లాడుతాడు మరియు అతని కోసం [ఆత్మ తప్ప మరొకటి లేదు. 

] సృష్టితో సహా - మరియు ఈశ్వరుడే సృష్టికర్త అనే వాస్తవం కూడా అతనికి ఎటువంటి ఫలితాన్నివ్వదు.అన్నీ ఉన్నాయి అని భగవంతుడు చెప్పాడు.


సన్యాసిగా మారడానికి కర్మను పూర్తిగా త్యజించి, జ్ఞానోదయం యొక్క చివరి స్థితిని పొందినప్పుడు మనిషికి సమానం. 

వేదాలు, ఉపనిషత్తులు అదే చెబుతున్నాయి. 

అత్యున్నత స్థాయికి చెందిన వ్యక్తి మాత్రమే అన్ని విషయాలను ఒకటిగా [ఒక వాస్తవికతగా] చూడగలడు. 

సమదర్శనం బహుత్వపు ఈ అద్భుత ప్రపంచానికి చెందినది కాదు లేదా పనిలో నిమగ్నమైన మనకు కాదు. 

భగవంతుడు యోగిని దృష్టిలో సమదర్శనం, సమచిత్తం మరియు సమబుద్ధి యొక్క గీతలో మాట్లాడుతున్నాడు, అయితే అతను మన ప్రాపంచిక ఉనికికి వర్తించే "సమకార్యత్వ" ను ఏ విధంగానూ సూచించడు.

అవిచ్ఛిన్న జగద్గురువుల పరంపర

 https://www.facebook.com/100028579124976/posts/pfbid02Rm59e2y85hZQsdMaztuayzXNvLDg598WpKPAUq4Gz6vAjXBX7Duv5gsg8gYkgQJul/?mibextid=Nif5oz


అవిచ్ఛిన్న జగద్గురువుల పరంపర

పూరి 145మంది

ద్వారకా 78మంది

బదరీ 46మంది ( విచ్చిన్నం)

శృంగేరి 37మంది

కంచి 70మంది 


జగద్గురువులు

 పూరి పీఠం ( గోవర్ధన మఠం) 145 అధిక సంఖ్యలో ఉన్నారు , అక్కడి పీఠాధిపతులు కొద్ది సంవత్సరాలు మాత్రమే పీఠాధిపత్యం నిర్వహించి, తదుపరి ఉత్తరాధికారికి పీఠాధిపత్యం ఇచ్చివేసి వారు ,ఆత్మ నిష్టలో ఉండిపోయేవారు , అందువలన పూరీకి అత్యధిక జగద్గురువులు కలిగి ఉన్నారు.


ఇక బదరీ విషయానికి వస్తే , దురదృష్టవశాత్తు 165 సంవత్సరాలకు పూర్వం బదరీ పీఠ జగద్గురు పరంపర

విచ్చిన్నమయ్యింది ( ఆగిపోయింది) మరలా దాన్ని  విదేహముక్తులు అయినటువంటి జగద్గురు శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి పునరుద్ధరించారు ,

ఆ తర్వాత శ్రీ కృష్ణబోదాశ్రమ స్వామి వారు ఆ తరువాత  శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతిగా జగద్గురు శ్రీ అవిముక్తానంద  స్వామి వారు కొనసాగుతున్నారు, 


అన్నిటికంటే అత్యంత స్వల్ప ( తక్కువ) పీఠాధిపతుల సంఖ్య శృంగేరికి మాత్రమే కలిగి ఉన్నది , కారణం వారు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని క్రీస్తు శకం 788 సంవత్సరంలో జన్మించారని పరిగణిస్తారు , 

అనగా ఇప్పటికీ 1232 సంవత్సరాలు  అయినది

కావున వారి సంఖ్య 37 మంది మాత్రమే ఉన్నారు, 

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే , 

మిగతా ప్రముఖ నాలుగు పీఠాలు అయినా బదరీ పూరీ ద్వారకా కంచి పీఠాలు మాత్రం శంకరాచార్య స్వామి వారు క్రీస్తుపూర్వం 509 వ సంవత్సరంలో జన్మించారని సత్యాన్ని తెలియజేస్తున్నాను

అందువలన వారి పీఠాధిపతుల సంఖ్య హెచ్చుగా ఆ సంవత్సరానికి సరిపోయే విధంగా ఉన్నది, 


ఆదిశంకరాచార్య స్వామి జనన  కాలం భారత ప్రభుత్వం వారు ఇప్పటికీ అధికారికంగా క్రీస్తు శకం 788 అనే చెబుతున్నారు ఎందువలన అంటే

భారత  చరిత్రను ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్టులు రచించారు, వారు అనేక కుట్రల ద్వారా భారత చరిత్ర చాలా హీనంగా హేయంగా చిత్రీకరించారు, అందువలన ఆదిశంకరాచార్యుల జన్మ సంవత్సరాన్ని దాదాపు 1500 సంవత్సరాలు తగ్గించేశారు, 

ఈ విషయాన్ని అనేక భారత సాంప్రదాయ చరిత్రకారులు సాధికారికంగా ఖండించారు

అనేక కోణాలలో ప్రమాణాలు చూపించారు

అయినా ఇప్పటికే మన భారత దేశ చరిత్ర మార్చబడలేదు, 

దురదృష్టవశాత్తు దానినే జగద్గురు పీఠమైనటువంటి శృంగేరి శారదా పీఠం వారు కూడా క్రీస్తు శకం 788 ప్రమాణంగా తీసుకోవడం చాలా బాధాకరం.

అందువల్లనే శృంగేరి జగద్గురుల పరంపర 37 మాత్రమే ఉంటుంది, 

జయ జయ శంకర హర హర శంకర,

పరమాచార్య గొప్పదనం

 పరమాచార్య గొప్పదనం


1950-51 సంవత్సరాలలో, పరమాచార్య స్వామివారు కుంభకోణం మఠంలో ఉన్నారు. ఒకరోజు రాత్రి స్వామివారు ఉపన్యసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా మైక్ కూడా లేదు. శ్రీమఠానికి చాలామంది భక్తులు వచ్చారు. స్వామివారు ఉపన్యాసాంతర్గాతంగా ఒక శ్లోకంలోని ‘కర్మనాశ జలస్పర్శత్’ అన్న రెండు పదాలను పదే పదే చెబుతున్నారు కాని, పూర్తీ శ్లోకం చెప్పడంలేదు. నా అజ్ఞానం వల్ల స్వామివారికి మిగిలిన శ్లోకం తెలియదేమో అనుకున్నాను. నాకు ఆ శ్లోకం మొత్తం రావడంతో బాల్య చాపల్యం చేత, స్వామివారు ప్రసంగిస్తున్నా అత్యుత్సాహంతో గట్టిగా ఆ శ్లోకాన్ని చెప్పాను. 


కర్మనాశ జలస్పర్శత్ కరదోయ విలంగనాత్

గండకీ బాహుదరనాత్ ధర్మఃక్షరతి కీర్తనాత్


మహాస్వామివారు తమ ఉపన్యాసాన్ని ఆపి, ఆ శ్లోకాన్ని మరలా చెప్పమని నన్ను ఆజ్ఞాపించారు. ఎవరినా ఉపన్యసిస్తున్నప్పుడు మధ్యలో భాగం కలిగిస్తే, వారికి కోపం రావడంతో పాటు ఆ ఇబ్బంది కలిగించినవాణ్ణి అధికప్రసంగి అని తిట్టుకోవడం సహజం. కాని పరమాచార్య స్వామివారు కరుణామూర్తి. శ్లోకం చెప్పమని స్వామివారు ఆదేశించిన వెంటనే నేను చెప్పడం మొదలుపెట్టాను కాని, సరిగ్గా గుర్తుకురాలేదు. అయినా “ఆ పిల్లవాడు చెప్పాడు చూడండి” అని స్వామివారు నన్ను ఆశీర్వదించారు. నాకు అవకాశం కల్పించడానికే స్వామివారు అ శ్లోకాన్ని మరచిపోయినట్టుగా నటించారు. దాంతోపాటు నా అజ్ఞానాన్ని కూడా బయటపడకుండా చేశారు. పరమాచార్య స్వామివారి కరుణ ఎటువంతిదని తెలిపే ఈ సంఘటన ఇప్పటికి నా జ్ఞాపకాల పొరల్లో ఎంతో తాజాగా ఉంది.


***********************************************************************


ఒకసారి పరమాచార్య స్వామివారు కాంచీపురంలోని శివాస్థానంలో ఉన్నారు. వృక్షశాస్త్రంలో డాక్టరు డిగ్రీ పొందిన ఒక యువకుడు స్వామివారి దర్శనానికి వచ్చాడు. మహాస్వామివారు అతణ్ణి, “వెట్రిలై(తమలపాకు) కు ఆ పేరు రావడానికి గల కారణమేమి?” అని అడిగారు. తనకు తెలియదని చెప్పడంతో, స్వామివారే డానికి కారణం తెలిపారు, “అది ఒక లత. ఏ లత అయినా పువ్వులు పూచి, కాయలు కాస్తుంది. కొన్ని పాదులు కాయలు కాయకపోయినా పువ్వులు పూస్తుంది. కాని ఈ తమలపాకు లత పువ్వులు పూయదు, కాయలు కాయదు. కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి. ఈ తీగ కేవలం ఆకులతో ఉంటుంది కాబట్టి దీనికి వెట్రిలై(కేవలం ఆకు) అని పేరు”.


నిజంగా డాక్టరేటు ఇవ్వాల్సింది మహాస్వామివారికే అని అనుకున్నాడు ఆ యువకుడు.


***********************************************************************


పరమాచార్య స్వామివారికి శిల్పశాస్త్రంలో అపారమైన జ్ఞానం. శిల్పులకు కూడా తెలియని ఎన్ని విషయాలను స్వామివారు తెలిపేవారు. ఆగమశాస్త్రంలో శిలలను మూడు రకాలుగా విభాజించారు: ఆడవి, మగవి, ఆడ మగ కానివి. కొన్ని శిల్పాలు కేవలం మగ శిలలతోనే చేయాలి, కొన్ని ఆడ శిలలతో, మరికొన్ని నపుంసక శిలలతోనే చెయ్యాలి. ఉలి దెబ్బ ద్వారా శిల యొక్క గుణాన్ని శిల్పులు తెలుసుకుంటారు. కాని పరమాచార్య స్వామివారు కేవలం ఆ శిలను చూసే, దాని గుణం తెలుసుకుంటారు.


దాంతోపాటు ఒక్కోసారి ఆ శిలల్లో కప్పలు ఉంటాయి. అటువంటి శిలలతో దైవప్రతిమలు చెయ్యరాదు. ఒకసారి స్వామివారి వద్దకు స్థపతి ఒకరు ఒక శిలను తెచ్చారు. స్వామివారు అందులో కప్ప ఉందని చెప్పారు. అందుకు ఆ శిల్పి పరీక్ష చేసి నిర్ధారించుకున్న తరువాతనే తాను ఈ శిలను తెచ్చానని వాదించాడు.

ఆ శిలను పగులగొట్టమని స్వామివారు ఆదేశించారు. ఆ శిలను బద్ధలుకొట్టగానే ఒక కప్ప ఎగురుకుంటూ బయటకు వచ్చింది. ఆ శిల్పి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ శిలలతో పనిచేసే శిల్పాచార్యులకు కూడా లేని శిల్పశాస్త్ర పాండిత్యం స్వామివారికి సొంతం.


--- యస్. పంచపకేశ శాస్త్రిగళ్, కుంభకోణం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కర్మ ఫలితాన్ని స్వీకరిస్తే

 *శుభోదయం*

💐🙏💐🙏💐


*కర్మ ఫలితాన్ని స్వీకరిస్తే అది  ఆగామి, ప్రారబ్దం, సంచితం...* 

స్థితిని బట్టిమారుతుంది...  జన్మకు కారణం.. (ఇక్కడ బ్యాంక్ బ్యాలన్స్ ఫుల్)


*అదే కర్మ ఫలితాన్ని నివేదిస్తే మిగిలేది శూన్యం..*.  

మోక్షానికి, జీవన్ముక్తికి మార్గం. (ఇక్కడ బ్యాంక్ బ్యాలన్స్ నిల్) 


*రెండు నేను ల మధ్య సాగే ప్రయాణమే జీవితం..*. ఇది అత్మది... (అహం నేను నుంచి అహం ఆత్మ వరకు....) 


ఒక్కసారి *నేను ఆత్మను అనే జ్ఞానం కలిగితే మిగిలిన ప్రయాణం పరమాత్మది.*

 

*అజ్ఞానమే* జీవాత్మ....

ఆ *జ్ఞానమే* పరమాత్మ..


🙏🙏🙏🙏🙏🙏

ఓం అరుణాచల శివ

ఆచార్య సద్బోధన:

 


              *ఆచార్య సద్బోధన:*

                   ➖➖➖✍️


 *లోకులు పలు కాకులు!*

```"ఈరోజుల్లో మనము చేసే భజనలు, సేవలు మరియు ఇతర దైవారాధనలను చూసి నవ్వుతూ విలువైన సమయం వృధాగా గడుపుతున్నారని భావించే అజ్ఞానులు మనకు తారస పడవచ్చును"... 


అయితే వారిని మీరు ఎంతమాత్రం పట్టించుకోనవసరం లేదు...


మురికిగా ఉన్న పొలంలో  చల్లటానికి తెచ్చిన వరి విత్తనాల సంచులను చూసి ఆ వ్యక్తులు నవ్వవచ్చు,విలువైన ఆహార పదార్థాలను వ్యర్థంగా పారబోస్తున్నారని మీ చర్యలను ఖండించవచ్చు.


కానీ మనకు తెలుసు, వరి విత్తనం యొక్క ప్రతి సంచికి, కొన్ని వారాలలో భూమి పది రెట్లు లేదా ఇరవై రెట్లు ధాన్యాన్ని తిరిగి ఇస్తుంది అని!!


అలానే దేవుని గురించి ఆలోచించడం లేదా దైవ ఆరాధనలో గడిపిన సమయం నిజంగా విలువైనది, సార్థకమైనది.  

ఎందుకంటే ఇది మనకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని,సుఖ జీవనాన్ని సమకూర్చుతుంది.


కనుక మూర్ఖుల సాంగత్యానికి దూరంగా ఉండాలి!


మన లోపల ఉన్న మనశ్శాంతికి భంగం కలిగించే ఏ వస్తువైనా, విషయమైనా, వ్యక్తినైనా మన దరిదాపులకు రానివ్వ రాదు.


*"ఆధ్యాత్మికతయే మన గమ్యానికి రాచబాట అని తెలుసుకోవాలి! అప్పుడే పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులమవుతాము."✍️```

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

* గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

హనుమంతుని సముద్ర లంఘనం

 శుభోదయం🙏


హనుమంతుని  సముద్ర లంఘనం 

                       -------------------------------------------------- 


   ఉ: "  చువ్వన  మేనువంచి , రవి సోకుఁగఁ  దోకవిదిల్చి , పాదముల్


            వివ్వగఁబట్టి , బాహువులు  వీచి ,  మొగంబు బిగించి ,కొండ  జౌ


           జవ్వన  నూగి , ముందరికిఁ జాగి , పిరిందికిఁదూఁగి,   వార్ధిపైఁ


          రివ్వన  దాటె , వాయుజుఁడు  రెక్కలతోడి    సురాద్రియోయనన్!


                 రామాయణము- కిష్కింధ కాండ-కుమ్మరి మొల్ల; 


           మనం చాలా రామాయణాలు చూశాం చదివాం. కానీ  మొల్ల రామాయణ మంత సరళసుందరమైన  రామాయణ 

కావ్యాన్ని  మనంచూడబోము.అలతి యలతి తత్సమ పదాలతో  అతిసుందరంగా  ఆనీలమేఘశ్యాముని  రాముని సుందర

మందహాస వదనం మనముందుకు కదలి వస్తున్నాదా యనిపస్తుంది ఆమెకవిత్వం! 


        కం:  చెప్ప వలె కప్పురంబులుఁ

               గుప్పలుఁగాఁ బోసినట్లు  కుంకుమ  పై పై

                గుప్పిన గతి"- అనియామె కవిత్వ నిర్వచనం! అందుకు తగనట్లే భాసించింది. ఇక  ప్రస్తుతానికి వస్తా,


             ఈపద్యం హనుమ సముద్ర లంఘనానికి చేసేప్రయత్నం. దృశ్యాన్ని కన్నులకు గట్టించటం మొల్ల ప్రత్యేకత!

ఎంత  ప్రయత్నం లేకపోతే శత యోజన విస్తీర్ణమైన దుస్తరమైన  సాగరాన్ని  హనుమ ఒక్క గెంతులో దాటాడు? ఆ

మహా ప్రయత్నమిదో  చిత్తగించండి!


              చువ్వన  మేను వంచాడట! ఎగరాలి యంటే శరీరాన్ని అందుకు తగిన రీతిగా మలుచుకోవాలి.తొలిప్రయత్నంగా 

తన శరీరాన్ని యెగర టానికి కావలసినరీతిగా  వంచుకున్నాడు. తరువాత ఒక్కసారి తోక విదిలించాడు. అది సూర్యునకు తగి

లేంతగా  పైకి  లేపాడట. పాదాలను రెండిటిని దూరంగా ఉంచాడట. యెగిరేటప్పుడు పట్టుకోసం. చేతులు నిటారుగా చాపాడట

తన శరీరాన్నొక వ్యోమ నౌకగా మార్చి చేతులను చుక్కానుల వలెనుపయోగించుటకు చేసే ప్రయత్నమిది. మొగంబు బిగించాడట. అంటే పెదవుల బిగబట్టి బింకంగా చూస్తున్నాడని భావం. ఒక్కసారి కొండ బలమెంతో  తెలిసికొనుటకు కొండ జవజవలాడేలా  ఊపుతున్నాడట. ముందుకి పరుగెడుతున్నాడట.ప్రక్కలకు వంగుతున్నాడట.


                                 ఇంత బృహత్తర మైన ప్రయత్నం చేశాకే అన్నీ సరిగ్గా అమిరాయీ  అనుకున్నాకే  సమ్ముద్రంమీద  రివ్వుమని యెగిరి  రెక్కలు మొలచిన మేరు పర్వతమా యని చూచువారు అచ్చెరువొందు నట్లు సాగి పోతున్నాడట!


                       మొల్ల  యీదృశ్యాన్ని  యెంత సహజంగా  చిత్రించింది! మాటలతో  వర్ణించగలిగే  విషయమా  ఇది. మహనీయుడైన  హనుమంతునికే  దుస్తరమైన సాగరాన్ని దాటాలంటే  ఇంత ప్రయత్నం చేయాల్సి వచ్చింది.

చూచారుగదా! ఇదిమనకుపదేశం; యేదైనా పనిచేసేముందు దానికి ప్రయత్నం  అవసరం. ప్రయత్న సిధ్ధుడైన వానికి

కార్యవిఘ్నంఉండదు.కార్య సిధ్ధితప్పదు అని.


                         బాగున్నది గదా! 


                                                              స్వస్తి!🙏🙏🙏🙏💐💐💐🌷💐💐💐💐💐💐💐🌷💐