22, డిసెంబర్ 2022, గురువారం

శ్రీమద్భగవద్గీత

 *🧘‍♂️01 శ్రీ భగవన్ ఉవాచ🧘‍♀️*

🕉️🌞🌏🌙🌟🚩

*☀️శ్రీమద్భగవద్గీత☀️* 

*💥 శ్రీ జ్ఞాన అవధూత సూర్య నారాయణ స్వామి మఠం 💥*


*తొలి పలుకు*


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ | దేవీ సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్ ॥ 


ఈ గ్రంథము పేరు *భగవాన్ ఉవాచ.* 


సర్వవేదములు పరబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మకు బోధించుటవలన అవి భగవాన్ ఉవాచ అయినవి. భారతములోని భీష్మపర్వంలో 25వ అధ్యాయము నుండి 42వ అధ్యాయము వఱకు చెప్పినవాటిలో శ్రీకృష్ణ ఉవాచ అనిగాక భగవాన్ ఉవాచ అని కలదు. కావున ఈ గ్రంథమునకు 'భగవాన్ ఉవాచ' అను పేరు నిర్ణయించడమైనది. పైన చెప్పిన అధ్యాయములలో అధ్యాత్మ విషయములు సంక్షిప్తముగా చెప్పబడినవి. కావున వీటిని వేదములలోని ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవతములద్వారా గ్రహించవలసి ఉండును. అందువలన భగవాన్ ఉవాచలోని శ్లోకములకు ఉపనిషత్తులు, రామాయణాది పురాణములద్వారా విషయములు విశదీకరించబడినవి.


*వేదములు :-* వేదములు అపౌరుషేయములు. ఏది తెలిసిన ఈ సర్వమూ తెలియునో అది జ్ఞానము. అట్టి జ్ఞానమును తెలుపునవి వేదములు. వేదము అపరవిద్య, పరవిద్యల సమ్మేళనము అయిన బ్రహ్మవిద్యను చెప్పినది. ఇహలోక, పరలోకములకు సంబంధించిన సర్వవిషయములు బ్రహ్మవిద్యలో ఉండును. అనగా దేశము ఎలా ఉండాలి? రాజు ఎలా ఉండాలి? రాజ్యపాలన ఎలా ఉండాలి? జాతిధర్మములు, ఆశ్రమధర్మములు ఏమిటి? ధర్మార్థకామములు, వర్ణనలు, ఆత్మ, అధ్యాత్మతత్త్వము, సృష్టి, దేహి, దేహముల విచారణ, జీవుడు ఈశ్వరుడగు సాధన విధానము ఉండును. జీవన సంగ్రామమును దేవ దానవ-సంగ్రామముగా వర్ణించిరి. అయితే వేదములలో ఒకేచోటగాని, ఒక వరుసక్రమంలోగానీ ఈ విషయములు ఉండవు. వీటిని క్రోడీకరించి ఒక వరుసక్రమంలో చదువవలసి వుండును. వేదము అర్థబాహుళ్యము, భావబాహుళ్యము గలది. కావున వేదములు చదివి, విషయమును గ్రహించుట కష్టము.


కావున ఋషులు వీటిని రామాయణ, భారత, భాగవతములుగా మనకు అందించిరి. వీటిలో కథ అప్రధానము. కథలద్వారా అందించిన సందేశము ప్రధానము. సామాన్యులకు రామాయణములో రాముని కథ, భారతములో కౌరవ-పాండవుల కథ, భాగవతములో ప్రహ్లాదచరిత్ర, వామన చరిత్ర, శ్రీకృష్ణుడు గోపికల కథలు మొదలయిన కథలు ఉండునని భావింతురు. వేదజ్ఞుల దృష్టిలో ఇవి బ్రహ్మవిద్యను బోధించు గ్రంథములు. కావున వీటిని అధ్యయనము చేసి, సాధన చేసిన జీవుడు ఈశ్వరుడగును. అమృతత్త్వమును పొందును.


*రామాయణము:-* వాల్మీకిమహర్షి ఆశ్రమమునకు నారదమహర్షి వచ్చి బ్రహ్మవిద్యను రహస్యముగా బోధించినాడు. ఆ తర్వాత బ్రహ్మ వచ్చి నారదోక్త ప్రకారము రామాయణమును రచియించమని ఆదేశించెను. రామాయణము వేదోపబృంహణార్థము రచియింపబడినది. ఆవిధముగా


*సర్వశ్రుతి మనోహరమ్* - వేదసారమును


*ధర్మకామార్థ సహితం* - ధర్మ అర్థ కామములను


*విచిత్రపదమ్* - నానార్థములతో


*నానాచిత్రకథా* - అనేక కథలతో సమాన సంధియోగములతో రామ-అయనమును రచించెను. ఈ సమాససంధులు భాషాపరమైనవి కావు.


*అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం చ విశేషతః* (బాలకాండ-4వ సర్గ-17)


శ్లోకములు మాధుర్యముగా ఉన్నవి. విశేషించి గీతయొక్క అర్థము మాధుర్యముగా ఉన్నది. ఈ శ్లోకములో గీత అని, శ్లోకము అని రెండు పదములు ప్రయోగింపబడినవి. కేవలము కథాభాగమును తెలుపునవి శ్లోకములు. అటులనే కథాభాగములో వేదాంతార్థమును సంధిచేసి సమాసములతో చెప్పునది గీత అని భావము. కావున ‘గీత’ అను పదమునకు వేదాంతార్థ ప్రతిపాదితమైన వస్తువు అని అర్థము.


వేదము చెప్పిన సర్వవిషయములు రామాయణములో కలవు. స్థూలదేహములోని అవయవములను రావణపరివారముగా, సూక్ష్మశరీరములోని అవయవములను దేవతాంశలుగా జన్మించిన వానరులుగా, సత్త్వగుణయుతుడైన జీవుని రామునిగా, రజోగుణయుతుడైన జీవుని రావణునిగా, తమోగుణయుతులైన జీవులను ఇతర రాక్షసులుగా చిత్రీకరించి రాముడు రావణాది రాక్షసులను సంహరించి, శాంతిని పొంది, జీవన్ముక్తుడై బ్రహ్మను దర్శించి, దేహసామ్రాజ్యపట్టాభిషిక్తుడైన విధము, దేహత్యాగానంతరము అనగా సీతాపరిత్యాగానంతరము ఆత్మలో ఏకీభూతుడై, ఆత్మయై విరాజిల్లిన విధము వర్ణింపబడినది.


వేదములో చెప్పిన దేవ దానవ యుద్ధమునే రామ రావణ సంగ్రామముగా రామాయణములో వివరింపబడినది. 'రామ' శబ్దమునకు ఆత్మ అని అర్థము. సృష్ట్యాదియందున్న ఆత్మ సృష్టిలో అంతరాత్మగా, విరాట్పురుషునిగా జీవునిగా వచ్చినాడు. ఇది ఆత్మయొక్క ప్రయాణము. కావున రామ-అయనము అయినది. ఆత్మస్థానము అనే అయోధ్యనుండి బయలుదేరిన రాముడు అనేక మజిలీలను దాటి రావణసంహారానంతరము తిరిగి అయోధ్య చేరినాడు. ఇది రాముని ప్రయాణము. కావున *రామ - అయనము* అయినది. ఆవిధముగా పైన చెప్పిన సర్వవిషయములను ఇటు కథాభాగము, అటు అధ్యాత్మభావనలను సంధిచేసి, సమాసములతో వాల్మీకిమహర్షి రామాయణమును రచియించినారు. యోగరహస్యములను బాలకాండలో విశ్వామిత్రమహర్షి రామునికి కథలుగా వివరించినారు. అటులనే వివిధ సాధన పద్దతులను మిగిలిన కాండలలో వివరించినారు. ఈ రామాయణమును రామునికే రాముని సభలో లవకుశులు వినిపించిరి.


ఈ రామాయణమును


*ధర్మకామార్థసహితం శ్రోతవ్యమనసూయయా* (బాలకాండ - 5వ సర్గ -4) ధర్మ అర్థ కామములనే పురుషార్థములతో కూడిన ఈ రామాయణమును అసూయాది అసురసంపదలు లేకుండా వినవలయును. విని ఆచరించవలయును. ఆచరించినవాడు ఆత్మయగును. ఇదే రామాయణ ప్రయోజనము.


వాల్మీకిమహర్షి బాటసారులను దోచుకొనే దొంగ అనిగాని, వల్మీకము అనగా పుట్టనుండి పుట్టినట్లుగాని, రామాయణ, భారత, భాగవతములలో లేదు. ఈ అపభ్రంశము లోకములో ప్రచారంలో ఉండుటకు కారణము కలియుగ లక్షణం. అటులనే వాల్మీకి రామాయణంలో చెప్పని అనేక విషయములు లోకములో ప్రచారములో ఉన్నవి. వీటన్నింటికి కారణము కలియుగమే.


*భారత, భాగవతములు* - వ్యాసమహర్షి మొదట భారతమును రచియించి, ఆ తర్వాత భాగవతమును రచియించెను. కాని మొదట అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తునకు శుకబ్రహ్మ భాగవతమును వివరించెను. ఆ తర్వాత పరీక్షిత్తు కుమారుడైన జనమేజయునకు వైశంపాయనుడు జనమేజయుడు చేయుచున్న సర్పయాగ సందర్భమున భారతమును వినిపించెను. అనగా మొదట భాగవతము, ఆ తర్వాత భారతము వ్యాప్తిలోనికి వచ్చినవి.


*భాగవతము* - బ్రహ్మమానసపుత్రుడైన నారదమహర్షిచే ప్రేరేపింపబడి వ్యాసమహర్షి భాగవతమును రచించెను. రామాయణములో వివరించిన సర్వవిషయములు భాగవతములో కలవు. భాగవతము వేదమనే కల్పతరువు నుండి జాఱిపడిన ఫలము. ఈ భాగవతము చదివి -


*“సమస్తంబుఁ గాకయు నయ్యునుండు*


*వస్తు వెఱుఁగంగఁదగు భాగవతమునందు"*


(భాగవతము - ప్రథమస్కంధము - 36) సమస్తము అయ్యు – అనగా ఈ సర్వస్థావర జంగమములు విరాట్ స్వరూపమే. సమస్తంబు గాకయు - అనగా ఈ సర్వస్థావర జంగమములు ఆత్మ కావు. ఆత్మలో ఈ సర్వజగత్తు ఉండదు. ఈ భాగవతము చదివి సృష్టికారకుడైన విరాట్పురుషుని, సృష్టి ఎలా వచ్చినది గ్రహించి సాధనచే ఆత్మ (వస్తువు)ను తెలియవలయును. ఆవిధముగా ఆత్మను దర్శించిన


మోక్షకామునకు మోక్షంబు సిద్ధించు

భవభయంబులెల్ల బాసిపోవు 


(భాగవతము - ద్వితీయస్కంధము - 7) 


జననమరణవలయములో తిరుగాడుట అనే భవభయమ్ము తొలగిపోయి, మోక్షార్థికి మోక్షంబు సిద్ధించు. ఉపనిషత్తులలో చెప్పిన విషయములకు ఉదాహరణలుగా అనేక కథలు భాగవతమున చెప్పబడినవి.


భాగవతము - ఏకాదశస్కంధములో శ్రీకృష్ణుడు ఉద్దవునికి చెప్పినది 'ఉద్ధవగీత’గా ప్రచారంలో ఉన్నది.


*భారతము* - వ్యాసభగవానుడు తను రచింపబోవు విషయములు గుఱించి ఆలోచించుచుండగా -


తత్రాజగామ భగవాన్ బ్రహ్మా లోకగురుః స్వయమ్ । 

ప్రీత్యర్థం తస్య చైవర్షేః లోకానాం హితకామ్యయా I


(భారతము - ఆదిపర్వము - ప్రథమాధ్యాయం - 57) 


సర్వలోకములకు హితంబు చేయు తలంపుతో సర్వలోకములకు గురువు, ప్రభువు భగవంతుడు అయిన బ్రహ్మ వ్యాసమహర్షికి సంతోషము కలుగజేయుటకు స్వయముగా వచ్చెను. వ్యాసమహర్షి తన ఆలోచనలు బ్రహ్మకు విన్నవించగా ఈ గ్రంథమును వ్రాయుటకు గణపతిని ప్రార్థింపమని చెప్పి బ్రహ్మ తన లోకమునకు వెళ్లెను. వ్యాసమహర్షి తన గ్రంథము వ్రాయుటకు గణపతిని ప్రార్థింపగా గణపతి వచ్చి వ్యాసభగవానుడు చెప్పు శ్లోకములు వ్రాసెను.


| వేదైశ్చతుర్భిః సంయుక్తం - వేదరహస్యం - వేదార్థాౖర్భూషితం । 


సాంగోప నిషధాం - సూక్ష్మార్థ న్యాయయుక్తం || 

- విచిత్రపద పర్వణః - విచిత్రార్థాః - గ్రంథ గ్రంథి |


(భారతం - ఆదిపర్వము)


అనగా భారతము నాలుగు వేదముల సారము. విచిత్రపదములు అనగా నానార్థములతో కూడి గ్రంథ గ్రంథి అనగా సంధిసమాసములతో రచియింపబడినది.


అష్టాశ్లోకసహస్రాణి అష్టా శ్లోక శతాని చ | 

అహం వేద్మి శుకో వేత్తి సంజయో వేత్తి వా న వా ||


(ఆదిపర్వం - ప్రథమాధ్యాయం - 81)


 8,800 శ్లోకములు, గ్రంథగ్రంథితో చెప్పబడినవి. అనగా కథాభాగమును వేదాంతార్థముతో సంధి చేసి సమాసములతో చెప్పబడినవి. ఇందలి గూఢార్థములు శుకబ్రహ్మకు తెలుసు. వైశంపాయనునికి తెలుసు. సూతమహర్షినైన నాకు తెలుసు. సంజయునికి తెలుసునో, తెలియదో తెలియదు. ఈ భారతము కేవలము కథాభాగముగా గాక కథాభాగములతో అపరవిద్య, పరవిద్యల సమ్మేళనముతో రచియింపబడినది. కావున సంజయునికి తెలుసునో, తెలియదో అని అంటే మిగిలినవారి గుఱించి ఏమి చెప్పాలి?


భారతములో ఆది, సభా, వన, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేథ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ అనే పదునెనిమిది (18) పర్వములు కలవు.


వేదములోగల సర్వవిషయములు భారతములో కలవు. అనగా వర్ణనలు, దేశము, రాజు, రాజ్యపాలన, చాతుర్వర్ణములు, పౌరులు, జాతిధర్మములు, ఆశ్రమ ధర్మములు, లోకాచారములు, ధర్మార్థకామములు, పుణ్యకర్మానుష్ఠానము, యోగము, భక్తి అనే కర్మయోగము, సాంఖ్యమైన జ్ఞానయోగము అటులనే ఆత్మ, అధ్యాత్మము, విరాట్, సృష్టి, జీవుడు, జీవుడు ఆత్మస్వరూపుడగు విధము మొదలైన విషయములు వర్ణింపబడినవి. అటులనే భారతములో


ఉతథ్యగీత - వాసుదేవగీత - ఋషభగీత - షడ్డగీత - శంపాన గీత - మంకిగీత - బోధ్యగీత - హారీతగీత - వృత్రగీత - పరాశరగీత - హంసగీత - మొదలైన గీతలు శాంతిపర్వంలో కలవు. అటులనే భీష్మపర్వంలో ఒక గీత కలదు. (భాగవతములో ఉద్ధవ గీత కలదు.) ఇవిగాక వసిష్ఠగీత మొదలైనవి అనేక గీతలు కలవు.


సశేషం

🕉️🌞🌏🌙🌟🚩

భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని

 🙏🚩

ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి.

మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో,  గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం.

గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో)  ఈ క్రింది విషయాలను బోధించారు.

01 అగ్ని విద్య (లోహశాస్త్రం)

02 వాయు విద్య (గాలి)

03 జల్ విద్య (నీరు)

04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)

05 పృథ్వి విద్య (పర్యావరణం)

06 సూర్య విద్య (సౌర అధ్యయనం)

07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)

08 మేఘ విద్య (వాతావరణ సూచన)

09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)

10 దిన్  రాత్ విద్య.

12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)

13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)

14 భుగోళ విద్య (భౌగోళిక)

15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)

16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)

17 రత్నాలు మరియు లోహాలు 

18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)

19 ప్రకాశ విద్య (శక్తి)

20 సంచార విద్య (కమ్యూనికేషన్)

21 విమాన విద్య (విమానం)

22 జలయన్ విద్య (నీటి నాళాలు)

23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)

24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)

25 యజ్ఞ విద్య

ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం!

26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)

27 కృషి విద్య (వ్యవసాయం)

28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)

29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)

30 యాన విద్య (మెకానిక్స్)

32 వాహనాల రూపకల్పన

33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)

36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)

37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)

38 తక్కలు

39 రంగ్ విద్యా (డైయింగ్)

40 ఖాట్వాకర్

41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)

42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)

43 ఖానా బనానే కి విద్యా (వంట)

44 వాహన్ విద్యా (డ్రైవింగ్)

45 జలమార్గాల నిర్వహణ

46 సూచికలు (డేటా ఎంట్రీ)

47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)

48 బాగ్వానీ (హార్టికల్చర్)

49 వాన్ విద్యా (అటవీ)

50 సహోగీ ( పారామెడిక్స్)

ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను  అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత  భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది.

భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?

కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.

మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.

భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ *దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ*  పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం  ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. 

వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.

మెకాలే ఇలా చెప్పాడు -  ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి.  అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.

1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ  'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి.  గురుకులములు  ప్రజలు మరియు రాజు చేత  కలిపి నడుపుబడేవి.

విద్యను ఉచితంగా ఇచ్చారు.

గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!

మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది

మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు".  ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము. 

మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.

మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని   తిరిగి పొందే సమయం ఇది.🙏

*🇮🇳 జైహింద్ 🇮🇳*