4, మార్చి 2021, గురువారం

అమ్మతోఒక మాట !!

 చొప్పకట్ల!


ॐ                    అమ్మతోఒక మాట !!

   

 (తప్పక చదవండి మీ అనుభూతిని నలుగురితో పంచుకోండి )


    ఏంటమ్మా ఇది.. 

    ఎప్పుడూ ఆ ఆదిశంకరుడు, కాళిదాసు, మూకశంకరులేనా! 

    కొంచెం మావైపు కూడా చూడొచ్చు కదా! 

   “ఏమిట్రా నీ గోల! నేను మీవైపు చూడకుండానే మీరంతా పెద్దాళ్ళైపోతున్నార్రా!” అని ఉరమకు. 

    చూడటం అంటే అలా ఇలా చూడమని కాదు. 

    పామరుడిని మహాకవిని చేయడానికీ, మూగవాడితో అయిదొందల పద్యాలు చెప్పించడానికీ, నువ్వొక చూపు చూశావే! అదీ, ఆ చూపూ చూడాలి. 

    అమ్మా! అవడానికి అక్షరాలను పుట్టించింది మీ ఆయనే అయినా, నీ చూపు పడకపోతే అవి కదలనే కదలవేంటమ్మా! 

     ఆమాట కొస్తే, సర్వేశ్వరుడైన నీ మగడే, నీ అనుమతి లేనిదే ఏ పనీ చేయడు. 

     అప్పట్లో హాలాహలం పుట్టి లోకాలను దహించి వేస్తుంటే.. 

    పాపం ఆ దేవతలంతా మీ ఇంటిముందు బారులు తీరి.. “కుయ్యో! మొర్రో! విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు” అని ఏడుపులు, పెడబొబ్బలూ పెడుతుంటే.., 

    అప్పుడు కూడా అంతటి ఆ భోళాశంకరుడూ, వెళ్ళిరానా?  అన్నట్టు నీవైపు చూశాడు. 

   “పాపం మీ అన్నయ్య ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. నేను వెళ్ళి ఈ హాలాహలం సంగతేదో చూస్తే, అతను పొంగిపోతాడు” అంటూ నీ పుట్టింటి వారి మాటలు చెప్పి మరీ, నిన్ను ఒప్పించి బయల్దేరాల్సి వచ్చింది. 

    మరి నువ్వు భర్తను కొంగున ముడేసుకున్న *“స్వాధీనవల్లభ”* వు కదా! 

    పుట్టింటివాళ్ళ పేరు చెబితే పొంగిపోతావన్న మాట నిజమే కానీ, వాళ్ళైనా మీ ఆయన గురించి, ఒక చిన్నమాట తప్పుగా అన్నా, కళ్ళెర్ర జేస్తావు. అసలే నువ్వు *సదాశివపతివ్రతవు*. 

    *కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరవు.* 

     మీ నాన్న దక్షుడు నీ మగని కోసం నానా మాటలు అంటే, ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియనిదా! 

    మీ  ఆయనకు కూడా నీవంటే ఎంత ప్రేమో కదా! నువ్వు నవ్వితే ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఆ కామారి. 

   మరి *“మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా”* అని ఊరికే అన్నారా ఆ వసిన్యాది దేవతలు. 

    నీ నవ్వులో ఉన్న మధురిమముందు ఆ చదువుల తల్లి వీణానాదమే వెలవెల బోయిందటగా. *“నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ”* అని వాళ్ళువీళ్ళూ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది. 

    మా ఆది శంకరులు కూడా సౌందర్య లహరిలో *“విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః.. ”* అంటూ మొదలయ్యే ఓ శ్లోకంలో ఈ విషయాన్నే చెప్పారు. 

    సరస్వతీ దేవి నీ దగ్గర కూర్చొని, మీ ఆయన లీలలను తన వీణ కచ్ఛపిపై గానం చేస్తోందట. నువ్వేమో పొంగిపోయి, “భలే పాడుతున్నావ్!” అన్నావట. అసలు నీ మాటలలో ఉన్న మాధుర్యం ముందు నా వీణానాదం మరీ తీసికట్టుగా ఉందనుకుంటూ, ఆవిడా గభాలున ఆ వీణను మూటకట్టేసిందట. 

    ఇక్కడ ఇంకొక విషయం.. మీ ఆయనన్నా, మీ ఆయనను కీర్తించేవారన్నా నీకు ఎంతిష్టమో కదా! 

 *“ఓ మహా కామేశ మహిషీ”* అని పిలిస్తే చాలు పొంగిపోతావ్. అవున్లే అసలు ఉన్నదంటూ మీ ఇద్దరే కదా! 

    ఈ సృష్టి మొత్తం లయం చేసేసి, నీ మగడు ఆనంద తాడవం చేస్తుంటే.. అసలు పోలికే లేనంత అందమైన చుబుకం గల *“అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా”* వైన నువ్వు, నీ పల్లవముల వంటి అందమైన చేతులను అలా ఆ చుబుకం కింద పెట్టుకుని, ఆ తాండవాన్ని చూసి పరవశించిపోతూ.. *“మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి”గా* ఉన్నావు. 

    నువ్వసలే *“లాస్యప్రియ”వు* కూడానాయే. 

   ఎంతటి *“మహాలావణ్య శేవధి”వి*. *“ఆబ్రహ్మకీటజనని”వి* అయినా, 

    నీకు మీ ఆయన తొడమీద కూర్చుని, *“శివకామేశ్వరాంకస్థా”* అని అనిపించుకోవడమే ఇష్టం.  

    అందుకే మా కాళిదాసు 

*"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే*

*జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”* అంటూ మీ ఇద్దరి అభేదాన్ని చూపిస్తూ, నమస్కరించుకున్నాడు. 

  అసలు మా కాళిదాసు నీపై వ్రాసిన *“దేవీ అశ్వధాటి”* స్తోత్రం చదివితే తెలుస్తుందమ్మా! మా కవుల కవిత్వంలోని సొగసు. 

    సంగీతం ఏమాత్రం రానివాడికి కూడా తనకు సంగీతం వచ్చేసునేమో అన్న భ్రమకలిగించేంత అందంగా ఉంటుందా శ్లోకాల నడక.


*చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ* 

*కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా* 

*పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా* 

*ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్* 


    ఆహా! మొదటి శ్లోకమే ఎంత అందంగా ఉందో చూశావా? 

    ఇలాంటివి 13 శ్లోకాలున్నాయి ఆ స్తోత్రంలో. ఈ శ్లోకాలలో కూడా ఒకచోట నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమను రసవత్తరంగా చెప్పాడు కాళిదాసు. 

   *“శంభా వుదార పరిరంభాంకుర త్పులక దంభానురాగ పిశునా..”* అంటాడు. 

    మీ ఆయన నిన్ను గాఢంగా ఆలిగనం చేసుకున్నప్పుడు నీకు కలిగే పులకరింతలు నీకా పరమేశ్వరునిపై ఉన్న అపారమైన అనురాగానికి సూచికలట. 

    మీ ఆయన కోసమే చెప్పుకుంటూ కూర్చుంటే నీకూ, నాకూ ఇద్దరికీ ఇక ఈ లోకం పట్టదు. 

    కనుక కాసేపు వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం.


    అమ్మా! అసలు మీ అన్న దశావతారాలను అలా నీ చేతివేళ్ళ గోళ్ళలో నుండి అలా ఎలా పుట్టించేశావమ్మా! చిత్రం కాకపోతేను. 

   *“కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః”* అన్న మాట తలచుకుంటేనే భలేగా ఉంటుంది. ఇక్కడే ఇంకొక్క విషయం చెప్పాలి. మళ్ళీ మరచిపోతానేమో! 

   *“సాగరమేఖలా”* అనే నీ పేరు కూడా నాకెంత ఇష్టమో!  

     సముద్రాన్నే వడ్డాణంగా పెట్టుకున్న దానివంటకదా! ఎంత బావుంటుందో తెలుసా ఈ మాట. 

     ఈ నీ నామాన్నే మా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు 

   *“తేనెలతేటల మాటలతో, మన దేశ మాతనే కొలిచెదమా..”* అనే ఓ చక్కని గీతంలో అందంగా వాడారు. 

  *“సాగర మేఖల చుట్టుకొని -  సురగంగ చీరగా మలచుకొని”* అంటూ నీ నామాన్ని దేశమాతకు అన్వయిస్తూ వ్రాశారు. 

    అసలు మా సినీ కవులు కూడా నీమీద పాట రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతారు. 

    ముందుగా మాత్రం నేను మా మల్లాది రామకృష్ణశాస్త్రి గారినే చెబుతాను. 

*“లలిత భావ నిలయ నవ రసానంద హృదయ*

*విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ*

*మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ*

*సుమరదన విధువదన.. దేవి…”* అంటూ ఆయన వ్రాస్తే, 

    ఆ సాహిత్యానికి మా ఘంటశాల వేంకటేశ్వర్రావు గారు బాణీ కట్టారు. 

    మల్లాది వారి సూచన మేరకు, ఈ పాటలో 

    సరస్వతీ దేవి కోసం వచ్చినప్పుడు సరస్వతి రాగంలో, 

     శ్రీదేవి కోసం వచ్చినప్పుడు శ్రీరాగంలో, 

     లలితాదేవి కోసం వచ్చినప్పుడు లలితరాగంలో స్వరరచన చేశారు మా ఘంటశాల. 

     ఇలాంటి పాట వింటూ నాలాంటి పామరుడే పులకించిపోతుంటే.. 

   *“కావ్యాలాప వినోదిని”వి,* 

  *“రసజ్ఞ”వు.* *“కావ్యకాళా”* రూపిణివి అయిన నీవెంత మురిసిపోతుంటావో కదా! 

    ఆయనే వ్రాసిన *“శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా”* పాట కూడా మరో మేలిమి ముత్యం! 

   *“జగముల చిరునగవుల పరిపాలించే జననీ*

    *అనయము మము కనికరమున కాపాడే జననీ”* అంటూ.. 

   *“అనేకకోటిబ్రహ్మాండజనని”* వైన నిన్ను కీర్తిస్తూ.. 

   *“మనసే నీ వశమై స్మరణే జీవనమై*

    *మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి”* అంటూ మా అందరి తరపునా ఆయనే ప్రార్థించేశారు.

    ఇక సముద్రాలగారి *“జననీ శివకామినీ..”*, పింగళిగారి *“శివశంకరీ..”* పాటలు కూడా మమ్మల్ని ఆనందడోలికల్లో మునకలేయించేవే.

    మా వేటూరి గారి సంగతైతే చెప్పనక్కరనే లేదు. 

*“అఖిలాండేశ్వరి చాముండేశ్వరి*

 *పాలయమాం గౌరీ*  *పరిపాలయమాం గౌరీ”* అంటూ మొదలయ్యే ఆ పాట, కాళిదాసు కవిత్వంలా సొగసుగా పరుగులు తీస్తుంది.

*“శుభగాత్రి గిరిరాజపుత్రి*  

 *అభినేత్రి శర్వార్ధ గాత్రి* 

 *సర్వార్థ సంధాత్రి* 

 *జగదేక జనయిత్రి”* ఇలా అద్భుతంతా సాగిపోతుందా పాట. 

    మీ ఆయన అయిన శర్వునిలో నీవు సగభాగం కాబట్టి *శర్వార్ధ గాత్రి* అన్నారు. గాత్రము అంటే శరీరం అనే అర్థం ఉంది కదా!  అలానే సర్వ కార్యసిద్ధిని ఇచ్చుదానవు కనుక *సర్వార్థ సంధాత్రి* అన్నారు. అసలు శర్వార్థ, సర్వార్థ అనే పదాలు వినడానికి కొంచెం ఒకేలా ఉన్నా, ఎంతటి భేదం ఉందో కదా వాటి మధ్య. అదీ మరి మా వేటూరంటే! 

    అదీ నీ కరుణ ప్రసరించిన వారి కవిత్వమంటే. 

    ఈరోజు  నీతో ఇలా ఏవోవో చెప్పేస్తున్నాను. 

    అప్పట్లో శివరాత్రికి మీ ఆయనకోసం, 

    శ్రీరామనవమికి మీ అన్నయ్యకోసం రెండుత్తరాలు వ్రాశాను. 

    వాళ్ళకు వ్రాసి, మీ అందరికీ తల్లినైన నాకు మాత్రం వ్రాయవా అంటావమోనని ఈ మాటలన్నీ అరచి మరీ చెబుతున్నాను. వింటున్నావు కదా! 

    ఇక్కడ వంటింట్లో పని చేసుకుంటున్న మా అమ్మకు ఏదో ఒకటి చెబుతూ, 

    మధ్యమధ్యలో “ఇదిగో అమ్మా, వింటున్నావా? ఓ అమ్మా!!” అని అరుస్తుంటాను. 

    మా అమ్మేమో, ఊ! చెప్పరా” అంటుంది తన పని తాను చేసుకుంటూనే. కాకపోతే ఆవిడకు ఇక్కడ ఒకింటి పనే కాబట్టి ఇబ్బంది లేదు. 

    కానీ నీ సంగతి అలా కాదు కదా! 

    అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ పరిపాలించే తల్లివి. 

    లోకాలన్నీ తన బొజ్జలో దాచుకున్న ఆ పరమశివుని భార్యవు. *“సదాశివకుటుంబిని”వి.* 

    అందుకే, కోట్లాదిమంది పిలుపులలో నా పిలుపెక్కడ వినబడదో అన్న భయం చేత, ఇంకాస్త గట్టిగా అరచి చెబుతున్నాను. 

    *ఇదిగో అమ్మా! ఇటూ.. ఈవైపు.. నావైపు చూడు! నేనూ..* 

          *స్వస్తి!*


చాలా బాగుంది కదా!

తండ్రి లేని పిల్లలు

 *నాకు నచ్చిన శ్రీమతి శశికళ  ఓలేటి గారి కథ.*

             🌷🌷🌷

తండ్రి లేని పిల్లలు( కొత్త కథ) 


" సంధ్యా! ఆలస్యం అయిపోతోంది. లోపలికెళ్లి సాయమ్ ను, సమీర్ నూ పిలుచుకుని రా..", మెట్లమీద కూర్చుని షూలేస్ బిగించుకుంటున్న మనవరాలితో చెప్పారు రాఘవరావుగారు. 


మరో పదినిమిషాల్లో పదేళ్ల తమ్ముడు సమీర్ ను ఒకచేత్తో, వాడి షూస్, టై, బేడ్జ్ ఒకచేత్తో పట్టుకుని దాదాపు లాక్కుంటూ తెచ్చి కారులో కుదేసింది పదిహేనేళ్ల సంధ్య. ఈలోపున సైకిలు మీద చక్కర్లు కొడుతున్న పదమూడేళ్ల సాయం.. సైకిల్ ను గుమ్మం దగ్గరే పడేసి, బేగ్ తో ఫ్రంట్ సీట్ లో తాతగారి పక్కనే కూలబడ్డాడు. " బొయ్ బొయ్యంటు పక్కనే ఆగిన ఆటోలో మరో ఐదుగురు పిల్లలు ... ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు... రాఘవరావుగారి పెద్దబ్బాయి, రెండవ అబ్బాయి పిల్లలు. వాళ్లను చూసి సంబరంగా చెయ్యూపిన సమయ్ ను వాళ్లు నిరసనగా చూస్తూ.. మొహాలు తిప్పుకున్నారు. 


        నగరంలో ఉన్నవాళ్ల పిల్లలంతా చదివే ప్రముఖపాఠశాల చేరారు పిల్లలందరూ. కారు దిగగానే సంధ్యకు.. తమ మేనత్త రమ తన కూతురు సుమతో దిగడం కనిపించి స్నేహపూర్వకంగా సుమను పలకరించడానికి వెళ్లింది. సుమ సంధ్యను చూడనట్టే స్కూల్ లోపలికి పరిగెట్టింది. 


       రాఘవరావుగారు ఇదంతా క్రీగంట గమనిస్తూనే ఉన్నారు. పిల్లల మధ్య సయోధ్య తేవడం ఎలాగో తెలియడం లేదు. పిల్లలు సరే.. ముందు ఇంట్లో పెద్దవాళ్లే ఈ తండ్రిలేని పిల్లల మీద ద్వేషం సాధిస్తుంటే... ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదాయనకు. 


       రాఘవరావుగారి నలుగురు సంతానం ఏడాదిన్నర వయసు తేడాలతో పుట్టినవాళ్లే. గెజిటెడ్ రాంక్ లో ఆయన రిటయిర్ అయ్యేటప్పటికి, నలుగురూ మంచి స్థాయిలో స్థిరపడ్డారు. తండ్రి కట్టించిన విశాలమైన డాబా ఇంటిమీద రెండు డూప్లేలు, ఒక పెంట్ హవుస్ కట్టుకున్నారు. అమ్మాయికి వేరే చోట ఫ్లాట్ కొనిపెట్టారు. రాఘవరావుగారి ఆఖరికొడుకు పరశురాం. ముందునుంచీ చదువులో మహాచురుకు. జీవితంలో బాగా ఎదగాలి, తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకస్థానం సంపాదించుకోవాలని ఆశయాలతో వుండేవాడు. ఎందుకో ఆ కొడుకంటే తండ్రికి మహాప్రీతి. 


       బెంగుళూరులో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ తన కొలీగ్ ప్రీతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ముచ్చటయిన ముగ్గురు పిల్లలు, పదిలక్షలకు పైబడి జీతం, మంచియిల్లు... హాయిగా సాగిపోతున్న జీవితాన్ని అతని బిజినెస్ బగ్ చెదలా కుట్టడం మొదలుపెట్టింది. 


చాలామంది చేసే పొరపాటే అది. తాము పనిచేసిన సంస్థ తమవలనే ఇంత అభివృద్ధిలోకి వచ్చిందంటే.... తామే స్వయంగా కంపెనీ తెరిస్తే మరిన్ని అద్భుతాలు చేయగలమని అనుకుంటూ ముందుకురికేయడం!


 తండ్రి ఇచ్చిన ఆస్థులు, భార్యకున్న ఆస్థులు కరిగించి, తన కొలీగ్స్ ఇద్దరితో బయటకొచ్చి మొదలుపెట్టిన బిజినెస్.... ఫార్ట్యూన్ 500లో ఉన్న  కంపెనీప్రాజెక్టులు సంపాదించి నాలుగేళ్ళు మంచిలాభాలలోనే నడిచింది.కంపెనీ  

ఎక్స్ పాన్షన్ అంటూ వివిధసిటీల్లో ఆఫీస్ లు తెరిచారు. వాటికి తగ్గ ప్రాజెక్టులు చేతిలో లేక.. అవన్నీ మూతపడే సమయానికి... ఒక పార్ట్నర్ తన వాటా లాభాలతో బయటకు వెళ్లిపోయాడు. అతనితో పాటూ వీరి క్లయంట్లు కూడా బయటకు నడిచిపోయారు. 

కల్లోలకడలిలో నావలా ఉన్న కంపెనీని మరో రెండేళ్లు నడిపించి, పరశురాం చేతులెత్తేసాడు. 


           భర్తకు అతని విజయాల్లో,అపజయాల్లో వెన్నంటి ఉండాల్సిన ప్రీతి , అతనికి పెద్ద ప్రతికూలమై కూర్చుంది. ఎలా అలవాటు చేసుకుందో తెలీదు పేకాటకు బానిసయింది. హై సొసైటీ లేడీస్ తో క్లబ్ లో హైస్టేక్స్ కు ఆడుతూ... రాత్రీపగలూ అక్కడే గడిపేంత పతనావస్థకు చేరింది. 

పిల్లలను పనివాళ్లమీద వదిలేసి వ్యసనంలో కూరుకుపోయిన భార్య, నష్టాలవూబిలో వ్యాపారం... ఎక్కడా చిరువెలుగు కూడా కనిపించని జీవితం పరుశురాంను ఆత్మహత్యవేపే. మొగ్గుచూపేలా చేసాయి. రాఘవరావు దంపతులకు పుట్టెడు గర్భశోకం మిగిలింది. 


             ముందునుంచీ అత్తింటివేపు పెడమొహమే అయిన ప్రీతి.. పిల్లలతో పుట్టింటికి చేరి భంగపడి , తప్పనిసరై అత్తగారింటికే రావలిసి వచ్చింది. 

❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️


మార్చినెల మొదలవుతోంది. మెల్లగా సూర్యుడు నడినెత్తిమీదకు పాకుతూ చిరచిరలాడిస్తున్నాడు. పెరట్లో మామిడిచెట్టు చుట్టూ ఉన్న చప్టామీద కూర్చుంది సంధ్య. టెన్త్ బోర్డ్ పరిక్షలయిపోయాయి. తమ్ముళ్లిద్దరూ అక్కడే గట్టు మీద కూర్చుని వాళ్లు సేకరించిన కార్డులేవో చూసుకుంటూ కూర్చున్నారు. ముగ్గురినీ ముప్పిరిగొన్న వంటరితనం!

భవిష్యత్తేమిటో తెలీని అయోమయం!

ముద్దుముచ్చట్లలో ముంచితేల్చిన నాన్న ఒక్కసారి వైదొలగిపోయాడు.!

కడుపులో పెట్టుకుని దాచుకోవలసిన తల్లి నిశ్చేష్టగా, గదిని విడిచిరాదు. !

తాము బతికిన్నామో లేదో కూడా కనుక్కోదు.

అమ్మానాన్నలా బాధ్యత తీసుకున్న తాతగారూ, బామ్మా వయసు పరిమితులకు లొంగిపోతున్న పరిస్థితి. !

తండ్రితో వచ్చినప్పుడు తెగ గారం చేసిన బంధువులకు తామిప్పుడు పెనుభారం.!

వారి ఆర్ధికప్రణాళికల్లో తమకోసం పక్కన పెట్టాలిసిన భాగం , వారిలో మిగిలిస్తున్న అసహనం! 

అక్కరలేని తద్దినంలా తమ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి... తమకు మిగలని హక్కులను సాధించికోడానికి తయారయిన వీరంటే మిగిలిన పిల్లలకు అభద్రత! 


ఇన్ని అపసవ్యాల మధ్య.... ఆ ముగ్గురూ ఒకరికి ఒకరుగా బతకాల్సిన పరిస్థితి! 

" ఎందుకు నాన్నా! అంత మోసం చేసావు నన్ను. నా ఒళ్లో తలపెట్టుకుని పడుకున్నావ్. అమ్మనీ, తమ్ముళ్లనూ బాగా చూసుకోమన్నావు. నా చదువులతల్లి సంధ్య అన్నావు. ఎందుకో క్షమించమన్నావు. పొద్దున్నకే నువ్వు కాల్చుకుని చచ్చిపోయావ్!" ......... " డబ్బెందుకు నాన్నా! నువ్వుంటే చాలదా మాకు. తప్పంతా తనమీద పడేసుకుని అమ్మ క్రుంగిపోయి మాకు తను ఉన్నా లేనిదయింది. తాతగారు రక్షణకవచంలా నిలబడ్డా చుట్టూ కనబడని నిరాదరణ.... ఏం కోరి మమ్మల్ని ఇలా వదిలేసావు?..." .... సంధ్య ఆలోచనలు తెగడం లేదు. ఆడుకుంటూనే .... సజలనేత్రాలతో శూన్యంలోకి చూస్తూ ఆలోచనల్లోకి పారిపోతున్న అక్కను దిగులుగా చూస్తున్నారు సాయం, సమయ్! 


" అమ్మా! "...... పెద్దగా కేకపెట్టి... హఠాత్తుగా తలపట్టుకుని కూలబడిపోయింది సంధ్య. నుదిటిమీదనుంచి బొటబొటా కారిపోతున్న రక్తం. పక్కనే కాగితం చుట్టిన చిన్నరాయి. బహుశా కేటాపల్ట్ తో పైడాబా మీంచి విసిరినట్టున్నారు. " లీవ్ దిస్ ప్లేస్ యూ ఆర్ఫన్స్"... అని ఉంది ఆ చీటిలో. సంధ్య గబగబా దాన్ని ఉండచుట్టి పడేసింది. 

రక్తశిక్తమయిన మొహంతో అలాగే స్థాణువులా నిలబడిపోయిన సంధ్య తేరుకునే సరికి.... చుట్టూ ఇంటిల్లిపాదీ! అన్నాళ్లలో తన గది వదిలిరాని ప్రీతి... పరుగున మేడదిగొచ్చి కూతుర్ని ఒడిసిపట్టుకుంది. కొంగుతో గాయాన్ని నొక్కిపెట్టి.... భీతహరిణిలా చూస్తూ... మాటలకు తడబడుతూ నత్తుతున్న  తల్లిని చూసేసరికి..... సంధ్య ఇన్నిరోజులూ కూడగట్టుకుని నటిస్తున్న ధైర్యమూ కరిగి నీరయిపోయింది. తల్లిని పట్టుకుని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. 


తల్లీబిడ్డలను ఆ స్థితిలో చూసి.... అన్నాళ్లూ కరుకుగా ప్రవర్తిస్తున్న వారందని మనసులూ కూడా ద్రవీభవించాయి. 


             సంధ్య పెద్దనాన్న డాక్టరు. గాయం కడిగి, ఫస్టెయిడ్ చేసి, కుట్లు వేసి సంధ్యను మంచిమాటలతో సాంత్వన పరిచారు. 


ఆ ఇంటిలో మారిన పరిస్థితులను, పిల్లల అమానవీయ ప్రవర్తన గమనిస్తున్న రాఘవరావు దంపతులు ఆ సాయంత్రం కుటుంబసభ్యులనందరినీ సమావేశ పరిచారు. 


సంధ్య తనను ఎవరుకొట్టారో నోరిప్పలేదు. అస్థిమితంగా కదులుతున్న ఆ ఇంటిపెద్ద మనవడు ధీరజ్ చేసినపనే అని అందరికీ తెలుస్తోంది. 


ఇంతలో అక్కడి మౌనాన్ని ఛేదిస్తూ సంధ్య నోరిప్పింది. 

" తాతగారూ! మమ్మల్ని ఏదయినా అనాధాశ్రమానికైనా, ఎవరికయినా దత్తతగానయినా ఇచ్చేయండి. మేము ఇక్కడ ఉండకూడదు. మాకు హక్కు లేదు...." ఆమాటలకు ఉండేలు దెబ్బతిన్న పక్షిలా గిలగిల లాడిపోయారు ఆ వృద్ధదంపతులు.


" సంధ్యా! చిన్నపిల్లవు ఏంటా పెద్దమాటలు. మా మరిది పిల్లలు ...మీరుమా బాధ్యత. అలా పిచ్చిగా మాట్లాడకు..."... పెద్దకోడలు గట్టిగా అరిచింది. 


" మరేం చెయ్యాలి దొడ్డా? మా నాన్న ఈఇంట్లో ఏ హక్కులూ మిగుల్చుకోలేదు.అన్నీ తీసేసి వాడేసుకున్నాడు. మా పెంట్ హౌజ్ కూడా పెద్దనాన్నకు ఇచ్చేసి డబ్బు తీసుకున్నారు. మేము ఏ హక్కుతో ఇంకా అక్కడ ఉండాలి? మరి మీ పిల్లలకు కోపం రావడం సహజమే కదా! మా అమ్మ చదువుకుని ఒకప్పుడు పెద్ద ఉద్యోగం చేసేది. తను మా నాన్నకూ సపోర్ట్ చెయ్యలేదు. మమ్మల్నీ చూసుకోవడం లేదు. మా చదువులకీ, పోషణకీ మీరెందుకు మంత్లీ కంట్రిబ్యూట్ చెయ్యాలి? వెరీ అన్ ఫెయిర్! మేము ఆర్ఫన్స్ మి దొడ్డా! మా నాన్న పిరికివాడులా లోకంలోంచి పారిపోయాడు. మా అమ్మ మాకోసం ఏమీ చెయ్యదు. మరి మేము ఎవరికి చెందినవాళ్లం? చెప్పండి"


" సంధ్య తల్లీ! ఎందుకురా అంతలా మనసు కష్టపెట్టుకుంటున్నావ్? ఈ ఆరునెలల్లో మీకు ఏమన్నా లోటు రానిచ్చామా నేను కానీ తాతకానీ? చెట్టంత కొడుకు పోయినా, వాడిపిల్లల్లో వాడిని చూసుకుంటున్నాం.....".... రాఘవరావుగారి భార్య గద్గదస్వరంతో అంటుంటే, అడ్డుకుని సంధ్య...

.

" బామ్మా! మీరు నిజానికి మాకు అర్హతున్న దానికన్నా ఎక్కువ చూసుకుంటున్నారు. మా అమ్మ గది వదలకపోయినా... అన్నీ అక్కడికే పంపుతారు. మాకు ఏదంటే అది చేస్తున్నారు. బెస్ట్ స్కూల్ లో వేసారు తాతగారు. ఈ ప్రోసెస్ లో మిగిలిన పిల్లలు ఎంత కోల్పోతున్నారో మీరు గమనించడం లేదు. పదిమందిపిల్లలపై చూపించే ప్రేమ ఇప్పుడు మా ముగ్గురిమీదే కేంద్రీకరిస్తున్నారు. కుర్రాళ్లు ఆటల్లోనో, స్కూల్లోనో గొడవపడితే ... సాయం, సమయ్ లను మినహాయించి.... మిగిలిన వారిని దెబ్బలాడతారు. ఇది వరకూ తాతగారి కారులో స్కూల్ కెళ్లే వాళ్ళు ఇప్పుడు ఆటోలో వెళ్లాలి. ఇదివరకటి ఆదివారం కుటుంబసమావేశాలు, తాతగారితో సినిమాలూ, హోటల్ కూ వెళ్లడాలు ఆగిపోయాయి.తాతగారి కాలమంతా మాకోసమే వెచ్చిస్తున్నారు. ఎందుకంటే మాకు నాన్న లేడు. వాళ్లకున్నారు. పెద్దమ్మలు కానీ, అత్తకానీ పొద్దున్నే టిఫిన్ చెయ్యకపోతే పిల్లలు కిందకొచ్చి, బ్రేక్ ఫాస్ట్ తినేవారు. కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర మేము ముగ్గురం ఆవాటా తినేస్తూ. ధీరజ్ అన్న ఆటల్లో ఫస్ట్. నేను చదువులో బ్రైట్. ఇద్దరినీ పోలుస్తూ..... తండ్రిలేకపోయినా నేను బాగా చదువుతున్నానని నాకే కితాబులిస్తుంటే.... వాళ్లకు ఎందుకు నచ్చాలి? మా అమ్మానాన్నలకే అక్కరలేని మాకు జాలితో వచ్చే ఈ ప్రివిలేజెస్ వద్దండి తాతగారూ. మేము అనాధలుగా బయట బతకడం సమంజసం. మాకు మమ్మల్ని గారంగా చూసే పెద్దనాన్నలు , పెద్దమ్మలూ కావాలి. సుమతో సమంగా ముద్దలు పెట్టే అత్తకావాలి. వాళ్ల బడ్జెట్ నుంచి మాకోసం కేటాయించే పైసలు వద్దు. మేము తండ్రిలేని పిల్లలుగా ఈ ఛారిటీ తీసుకోలేము. ...".... తెలుగూ, ఇంగ్లీషు కలగలుపుతూ ఆ పదిహేనేళ్ల పిల్ల ఆవేశంతో , ఆవేదనతో తన మనసు పరుస్తుంటే.... అక్కడ అందరి తలలూ సిగ్గుతో అవనతమయ్యాయి. 


అందరికన్నా ముందు ప్రీతే నోరిప్పింది. " ఐ యాం వెరీ సారీ సంధ్యా...."...... తల్లిమాటలను షార్ప్ గా ఖండిస్తూ... సంధ్య...


" షేమ్ ఆన్ యూ అమ్మా! యు ఆర్ ఎ డిస్ గ్రేస్ టు మదర్ హుడ్ అండ్ ఉమన్ హుడ్ అమ్మా. ఏ త్యాగాలు చేసావు నువ్వు? నాన్నకు నువ్వు సపోర్ట్ గా నిలబడివుంటే , తను మనకు మిగిలి ఉండేవాడు. మా బాధ్యత ఎంత తీసుకున్నావు? నీ చదువు, నీ తెలివితేటలు మరిచిపోయి డిప్రెషన్ అనే కకూన్ లోకి దూరిపోయి మమ్మల్ని కూడా పారసైట్స్ చేసావు. షేమ్ ఆన్ యూ! వీళ్లు మమ్మల్ని ఎందుకు పోషించాలి? చెప్పు! అందరి రైట్స్ మాకోసం ఎందుకు త్యాగం చెయ్యాలి? ఈ ఓల్డేజ్ లో గ్రాండ్ పా కు మా రెస్పాన్సిబిలిటీ ఎంత భారమో ఆలోచించావా? గదిలో శూన్యంలోకి చూస్తూ గడిపేయడం ఎస్కేపిజమ్ అమ్మా. నువ్వు పిరికిదానివి. మమ్మల్ని పెంచలేవు. అందుకే వి ఆర్ ఆబ్ సల్యూట్ ఆర్ఫన్స్ టు ద కోర్......."...। పిల్ల ఏడుస్తోంది.

" అలా అనకు సంధ్యా! నేను మారతాను. నేను మిమ్మల్ని చూసుకుంటా. మనం వెళ్లిపోదాం. నేను మళ్లీ ఉద్యోగంలోకి వెళ్తా! మీ నాన్నలాగే చూసుకుంటా. ఐ ప్రామిస్. నమ్ము సంధ్యా! ..... పిలలను పొదువుకుని దెబ్బతిన్న తల్లిపక్షిలా కదిలిపోతోంది ప్రీతి ! 


🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


మరో నెల్లాళ్లలో పిల్లలంతా కైలాసగిరి ట్రెక్కింగ్ కు వెళ్లినప్పుడు సంధ్యతో అన్నాడు ధీరజ్... " సంధ్యా! నువ్వు ఆ రోజు నాపేరు ఎందుకు బయటపెట్టలేదు? నువ్వు నన్ను చూసావు కూడా డాబామీద. మోరోవర్ ఆరోజు ఎందుకంత ఆవేశంగా మాట్లాడావు? ....

" అన్నా! ఆరోజు నేను అలా నా మనసులో బాధ బయటకు చెప్పడం వలనే కదా... ఈరోజు మనమంతా స్నేహంగా ఉన్నాము. మా అమ్మ ఉద్యోగానికి వెళ్తోంది. మా నాన్నలేకపోయినా మేమూ గౌరవంగా బతుకుతాము ఇకముందు. మేము ఎప్పటికీ పోగొట్టుకున్నామనుకున్న కుటుంబం ప్రేమ మళ్లీ మాకు దొరికింది. ఇది చాలు అన్నా మాకు. తండ్రిలేని పిల్లలన్న సానుభూతి వద్దు. ...మా నాన్న అది ఎప్పటికీ హర్షించడు.ీ " 


తనకన్నా రెండింతలు మెచ్యూరిటీతో అందరి మన్ననలూ పొందిన సంధ్యను చూసి..." నువ్వు లైఫ్ లో చాలా పైకి వస్తావు సంధ్యా. ఐయాం సో ప్రౌడ్ ఆఫ్ యూ" అన్నాడు ధీరజ్


ధీరజ్ మాటలు నిజం చేస్తూ సంధ్య.. చాలా గొప్పచదువులు చదివి... తండ్రి ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే... తన తమ్ముళ్లతో కలిసి, తల్లి గైడన్స్ లో "పీ ఆర్ సాఫ్ట్ సొల్యూషన్స్" అనే సాఫ్ట్ వేర్  కంపెనీ పెట్టి, పదేళ్లలో పదిదేశాలలో ....వేల ఉద్యోగులతో విజయవంతంగా విస్తరించి...సాయంసంధ్యా సమయ్ లు ... తండ్రిలేని పిల్లలయినా ఎంత పైకి వచ్చారని నలుగురిలో గొప్పమెప్పుపొందడం కొసమెరుపు! 


శశికళ ఓలేటి

21-2-2020

నువ్వు చాలా అందం గా వున్నావ్

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నాకు నచ్చిన వింజమూరి వెంకట అప్పారావుగారి పోస్టు* 

              🌷🌷🌷

#నువ్వు చాలా అందం గా వున్నావ్!!.

👌

తలుపు ఎవరో కొడుతున్నారు !!

"పారాణి" వచ్చి తలుపు తీసింది!

ఎదురుగా ఓ 70 ఏళ్ల పెద్దాయన నిలబడి వున్నాడు!!!

"ఎవరు? ఎం కావాలి??" అని అడిగింది "పారాణి"

"మీ ఆయన వున్నారా??" అని అడిగాడు ఆ పెద్దాయన !!

"లేరండీ !! ఆఫీసుకెళ్లారు!" అంది అమాయకం గా "పారాణి"

"ఓహో!! నువ్వు చాలా అందం గా వున్నావ్!!" అన్నాడు .

"పారాణి" నిశ్చెస్టురాలయ్యిన్ది !!

ఏమిటీ...చూస్తె పెద్ద మనిషి లా వున్నాడు, నా తండ్రి వయస్సువాడు, 

ఇలా అంటున్నాడెమిటీ అని!!

"పారాణి" తలుపు ధడాలున వేసేసింది!!

ఇలా 4,5 రోజులు ఆ పెద్దాయన రావడం,

"నువ్వు చాలా అందం గా వున్నావ్" అనడం జరుగుతూనె వుంది !!

ఇక ఉండబట్టలేక తన భర్త కి చెప్పింది, "పారాణి"

"ఔరా !! వాడీ అంతు... నేను తెలుస్తానుండు...వాడు ఈ సారి వచ్చినప్పుడు

 వాడిని మాటల్లో పెట్టు...నేను తలుపు చాటునే వుంటాను!!" అన్నాడు 

"పారాణి" భర్త ,"మన్మధ రావు"!!

తెల్లవారింది !!

పెద్దాయన వచ్చాడు!!

తలుపు కొట్టాడు!!!

"పారాణి" తలుపు తీసింది!!

"నువ్వు చాలా అందం గా వున్నావ్!!" అన్నాడు పెద్దాయన!

తలుపు చాటున "పారాణి" భర్త నక్కి వున్నాడు !!

"నాకు తెలుసు...మీరు రొజూ చెప్పక్కర్లేదు ....." అని ఇంకా ఏదో 

చెప్పబోయింది "పారాణి"..

వెంఠనె మన పెద్దయాన , చేతులు రెన్దూ జోడించి .....

"అద్గదీ !!..నాక్కావలసింది అదే!!...ఇదే ఆత్మా విశ్వాసమ్ తో మీ ఆయనకీ 

తెలియ చెయ్యి, నువ్వూ అందంగా ఉంటావని, ఎందుకంటే నాకు నీ వయసున్న కూతురు వుంది , రొజూ మీ ఆయన మా ఇంటి మీదుగా వెళ్ళేటప్పుడు, మా ఇంటికేసి, మా అమ్మాయికేసి, చూస్తూ, వెకిలి నవ్వులు 

నవ్వుతూ వెళుతూ వుంటాడమ్మా.  మాకు కాస్త ఇబ్బందిగా ఉంటోంది.  ఆ 

విషయం మీ ఆయనికి తెలియాలనే, నిన్ను ఇబ్బంది పెట్టాను.  ఏమీ అనుకోకమ్మా!" అంటూ కళ్ళ  జోడు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన!

👌🏿🍂👌🏿🍂👌🏿🍂👌🏿🍂

మొగలిచెర్ల

 *భక్తి..సేవ..ఫలితం..*


"నా పేరు లీలావతి..ఎల్లుండి శుక్రవారం నాడు మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు రావాలని అనుకుంటున్నాను..పదకొండు రోజులు అక్కడే ఉండాలని అనుకున్నాను..వసతి చూపించగలరా?." అని ఆ యువతి నన్ను ఫోన్ ద్వారా అడిగింది.."ఈవారం ప్రత్యేకంగా మీకు కేటాయించడానికి రూములేవీ ఖాళీ లేవండి.." అన్నాను.."ప్రత్యేకంగా రూము వద్దండీ..నేను స్వామివారి మంటపం లోనే ఉంటాను..అక్కడ ఉండటానికి అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నాను.." అన్నది.."అలా అయితే సరేనమ్మా..మీరు రండి.." అని చెప్పాను.."అలాగేనండీ.." అన్నది..


ఆ ప్రక్క శుక్రవారం నాతో ఫోన్ లో మాట్లాడిన లీలావతి గారు ఉదయం 10 గంటలకు మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు బస్సులో వచ్చారు..ఆమెతో పాటు మరో యువతి కూడా వచ్చింది..శుక్రవారం నాడు శ్రీ స్వామివారి మందిరం శుభ్రం చేసే కార్యక్రమం ఉంటుందని పాఠకులకు తెలుసు..లీలావతి గారు, ఆమెతో వచ్చిన యువతి ఇద్దరూ నా వద్దకు వచ్చారు.."అయ్యా..మీతో మాట్లాడిన లీలావతి ని నేనే..ఈమె నా కూతురు..పేరు పుష్పవల్లి..అమ్మాయికి కొన్ని సమస్యలున్నాయి..ఈ స్వామివారి వద్ద కొన్నాళ్ళు ఉంటే..ఆ సమస్యలు తీరిపోతాయని ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాము..మాది పల్లెపాలెం.." అన్నది.."అమ్మా..అందరితో పాటు వుండగలము అనుకుంటే..మందిరం వెనకాల ఒక షెడ్ ఉన్నది..అందులో వుండండి..రాత్రికి ఇక్కడ మంటపం లో పడుకోవచ్చు.." అని చెప్పాను.."సరేనయ్యా.." అని మా సిబ్బంది చూపించిన షెడ్ లో వాళ్ళ సామాన్లు పెట్టుకొని వచ్చారు..స్వామివారి పూజకొఱకు వాడే వస్తువులను ఇతర ఆడవాళ్ళతో కలిసి తామూ శుభ్రంగా కడిగి పెట్టారు..ఆరోజు మధ్యాహ్నం హారతి తీసుకొని..అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి వచ్చారు..శుక్రవారం సాయంత్రం స్వామివారి వెండి పాదాలను శుభ్రం చేసిన నీళ్లను తీర్ధంగా తీసుకొని..ఆపై హారతి తీసుకొని మంటపం లోనే వున్నారు..శని, ఆదివారాలు మా పనిలో మేము ఉండిపోయాము..


"అయ్యా..మొన్న వచ్చిన తల్లీకూతుళ్ల కు ఆరోగ్య సమస్యలేవీ ఉన్నట్లుగాలేవు..ఇద్దరూ బాగున్నారు..మరి వాళ్ళు ఏ బాధతో ఇక్కడికి వచ్చారో తెలియడం లేదు..ఉదయం మూడు గంటలకే ఇద్దరూ బావి వద్ద స్నానం చేసి..ఆ తడిబట్టల తోనే లోపలికి వచ్చి..నూటయెనిమిది ప్రదక్షిణాలు చేస్తున్నారు..స్వామివారి హారతి కళ్లకద్దుకొని..వెళ్ళిపోయి..మళ్లీ ఎనిమిది గంటల కల్లా మందిరం లోకి వస్తున్నారు..ఊరికే ఉండటం లేదు..మంటపం లో ఏమూల శుభ్రంగా లేకపోయినా..వెంటనే శుభ్రం చేస్తున్నారు..ఏదో ఒక సేవ చేస్తూనే వున్నారు..మరి వాళ్ళు ఏ కోరికతో స్వామివారి వద్దకు వచ్చారో తెలియడం లేదు..వాళ్ళ వల్ల ఎవ్వరికీ ఇబ్బంది లేదు సరికదా..స్వామివారి పూజా వస్తువులన్నీ శుభ్రం చేయడానికి సహాయం కూడా చేస్తున్నారు..." అని మా సిబ్బంది చెప్పారు..


పదకొండు రోజుల పాటు ఉంటానని చెప్పిన లీలావతి, ఆమె కూతురు నెల రోజులు గడిచినా స్వామివారి సన్నిధి లోనే వున్నారు..ఒకరోజు ఉదయం నా వద్దకు వచ్చి.."అయ్యా..మేము పదకొండు రోజులు వుందామని అనుకున్నాము..కానీ మేము నలభై రోజులు ఉండాలని అనుకుంటున్నాము..మా సమస్య తీరుతుందని ఆశగా ఉంది..మీరు పెద్ద మనసుతో అంగీకరించండి.." అన్నది.."అమ్మా..అడుగుతున్నానని అనుకోవద్దు..అసలు మీ సమస్య ఏమిటి..?" అన్నాను..


లీలావతి ఆమె కూతురు ముఖాముఖాలు చూసుకున్నారు..ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అనుకొని.."అయ్యా..మా అమ్మాయికి వివాహం జరిగి ఐదేళ్లు అయింది..సంతానం లేదు..ఈ అమ్మాయి అత్తగారు "పిల్లలు పుట్టని కోడలు మాకెందుకు..? మా అబ్బాయికి మేము ఇంకో పెళ్లి చేసుకుంటాము..నువ్వు వెళ్లిపో.." అన్నారట..ఇది ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది..మేము మా అల్లుడితో మాట్లాడాము..అతను అటు తల్లిని ఒప్పించలేక..మాతో మీ అమ్మాయిని కొన్నాళ్ళు మీ దగ్గర వుండనియ్యండి..మా అమ్మ ను ఒప్పించి నా భార్యను తీసుకెళతాను..అని చెప్పాడు..అమ్మాయి కాపురం చక్కబడాలని స్వామివారి కి మొక్కుకున్నాను..నేనూ మా అమ్మాయి స్వామివారి సేవ చేసుకుంటూ కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే..దీని కాపురం నిలుస్తుందని..స్వామి దయ చూస్తాడని నాకు నమ్మకం..ఆ నమ్మకం తోనే దీన్ని తీసుకొని ఇక్కడకు వచ్చాను.." అన్నది..నాకు చిత్రంగా అనిపించింది..ఈరోజుల్లో కూడా ఇటువంటి అత్తగార్లు ఉన్నారా?..అని.."మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది..మీ ఇష్టప్రకారమే నలభై రోజులూ వుండండి.." అన్నాను..ఇద్దరూ నమస్కారం పెట్టి వెళ్లిపోయారు..


మరో ఆరు రోజులు గడిచాయి..ఒకరోజు ఉదయాన్నే మొదటి బస్సు లో ముగ్గురు వ్యక్తులు వచ్చారు..ఇద్దరు దంపతులు..వాళ్ళ కుమారుడు..నేరుగా మందిరం లోపలికి వచ్చి.."ఇక్కడ లీలావతి అనే వారు ఉన్నారా?.." అని అడిగారు..మంటపం లో కూర్చున్న లీలావతి ని మా వాళ్ళు చూపించారు..ఈ ముగ్గురూ అక్కడికి వెళ్లారు..వాళ్లలో వాళ్ళు సుమారు గంటసేపు మాట్లాడుకుంటున్నారు..ఆ దంపతులు లీలావతి చేతులు పట్టుకొని..ఏదో చెపుతున్నారు..మరి కొద్దిసేపటికి లీలావతి కూతురు పుష్పవల్లి, ఆ దంపతులతో పాటు వచ్చిన యువకుడూ ఇద్దరూ కలిసి..స్వామివారి వద్ద అర్చన చేయించుకున్నారు..ఇద్దరూ స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..ఆ తరువాత లీలావతి నా వద్దకు వచ్చి.."అయ్యా..స్వామివారు మా మీద దయ చూపారు..మా వియ్యంకులు వచ్చింది..అమ్మాయిని కాపురానికి తీసుకెళతానని చెప్పారు..అల్లుడూ వచ్చాడు..అన్ని విషయాలూ మాట్లాడుకున్నాము..కాకుంటే..మేము స్వామివద్ద నలభై రోజులు ఉంటామని అనుకున్నాము..ఈనాటికి ఇంకా ఐదు రోజులు గడవాలి..అందుకని ఈ నలభై రోజులూ పూర్తయిన తరువాత..మంచిరోజు చూసి అమ్మాయిని పంపుతామని చెప్పాను..ఒప్పుకున్నారు..స్వామివారు దాని కాపురం నిలబెట్టారు.." అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నది..


మరో ఐదురోజులు ఆ తల్లీకూతుళ్ళు ఎప్పటిలాగే స్వామివారి సేవ చేసుకుంటూ గడిపారు..నలభై ఒకటోరోజు..స్వామివారికి పూజ చేయించుకొని..సమాధి దర్శనం చేసుకొని..తమ గ్రామానికి వెళ్లిపోయారు..ఆ తల్లీకూతుళ్లకు స్వామివారి మీద ఉన్న అపరిమిత భక్తి విశ్వాసం మేము కళ్లారా చూసాము..అంతేకాదు ఆ భక్తి విశ్వాసాల ఫలితాన్ని కూడా ప్రత్యక్షంగా చూడగలిగాము..


ఈ సంఘటన జరిగిన రెండేళ్ల తరువాత..లీలావతి తన కూతురు అల్లుడు ..వాళ్లకు పుట్టిన పాప తో సహా స్వామివారి వద్దకు వచ్చి..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..ప్రక్కరోజు అన్నదానం చేసింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

వేంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనగరం,

 జై శ్రీమన్నారాయణ్ ...

   భక్త మహాశయులకు

మనవి. 

శ్రీ ఆదిలక్ష్మి అలిమేలు మంగా సహిత శ్రీ (బాలాజీ ) వేంకటేశ్వర స్వామి దేవస్థానం  గ్రామం శ్రీనగరం, తుక్కుగుడా మున్సిపాలిటీ(మంఖాల్) లో భాగ్య నగరమునకు 22 కి.మి  దూరంలో దేవాద్రి,గరుడాద్రి ,కుక్కుటాద్రి, నీలాద్రి, బ్రహ్మ, విష్ణు ,మహేశ్వరులు గా పిలువబడే (త్రిగుణ పర్వతములు ) సప్త మహాపర్వతములలోని దేవాద్రిగా పిలువబడే మహాపర్వత గుహాంతరాళం లో  అత్యంత  వైభవంగా 3700 సంవత్సరాల క్రితం  స్వయంభుగా  వ్యక్తమై వెలసిన   శ్రీ  ఆదిలక్ష్మి ,అలిమేలు మంగా సమేత శ్రీ (బాలాజీ) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రప్రథమంగా శ్రీ పార్వతి  సమేతుడై ఈశ్వరుడు దర్శించి పూజించిన ఈ దివ్య సన్నిధిలో మరియు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వానమాముల జీయ్యర్ స్వామివారు, అత్తాన్ శఠగోపదేశికులవారు ,

ప్రతివాదిభయంకరం శ్రీ రంగాచార్యులవారు, శ్రీ రంగ రాజభట్టర్ వారు, ఆసూరిమరింగంటి లక్ష్మణాచార్యుల వారు ఇంకెందరో పీఠస్తులు మరియు భాగవతోత్తములు తీర్థపరిగ్రహణముచేసి మంగళాశాసనములు చేసిన ఈ మహాస్థలములో, అణువణున భగవంతుడు ఉన్నాడు అన్న నిదర్శంగా చూపే ఈ దివ్య సన్నిధిలో 


స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘ బహుళ సప్తమి తేదీ 5-3-2021శుక్రవారం మొదలు తేదీ 14-4-2021 వరకు మండల దివసములు 

(41,రోజులు)

దేవాద్రిగా (దేవుని గుట్టగా) కొనియాడబడే మహాపర్వతమునకు మహా గిరి ప్రదక్షిణ మహోత్సవం లోక కళ్యానార్థం మరియు ఆలయ సర్వతోముకాభి వృద్ధిని కాక్షింస్తు  భగవత్ కైంకర్య సేవగా  అత్యంత వైభవంగా జరుగును.

కార్యక్రమం ప్రారంభం 

తేదీ 5-3-20221 శుక్రవారం ఉదయం 7-00 గంటలకు అఖండ  దీపారాధన  స్వామివారికి తిరుమంజన అభిషేకం,

శ్రీ విష్వక్సేనారాధన స్వస్తి పుణ్యాహవాచనం ,రక్షాబంధనం, కలశ స్థాపన  ,అర్చన అనంతరం  మంగళవాద్యములు ముందు సాగుతుఉంటే, భాగవతతోత్తములు వేదమంత్రములు ,దివ్య ప్రబంధం అనుసంధానం చేస్తూ,భక్తులు గోవింద నామాలను గానం చేస్తూ దేవాద్రి (దేవుని గుట్ట)మహాగిరి  పదక్షిణ 

 మహోత్సవం ప్రారంభం అవుతుంది. 

ఈ గిరి ప్రదక్షిణ మన పూర్వజన్మ సుకృతంవల్ల  భగవంతుడే తన అపార కృపతో మనను  అనుగ్రహించి అందించిన మహత్తరమైన, అద్భుతమైన సదావకాశంగా భావించి 

ప్రతి ఒక్కరు త్రికరణ శుద్ధితో ఈ మహత్కార్యంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రులై తరించగలరు. 

సర్వేజనా సుఖినోభవంతు.  

 

భక్తులకు సూచనలు..


1. గిరి ప్రదక్షిణ ప్రతిరోజు ఉదయం గం 6-30 ని నుండి ఉ: 9-30 ని వరకు కొనసాగుతుంది. 

2. ప్రదక్షిణ పూర్తిచేసిన తరువాత స్వామి వారిని దర్శించండి. 

3.మహాగిరి ప్రదక్షిణ 1,2 లేదా 3 చేయవచ్చును. 

4. ప్రదక్షిణ సమయం లో భక్తులు గోవింద నామాలను గానం చేయాలి. 

5. 11రోజులు, 21రోజులు లేదా 41 రోజులు గిరి ప్రదక్షిణ చేయు భక్తులు( గోవింద మాల)ధారణ చేసి   నియమాలను పాటించాలి. 

6.అన్ని గ్రామాల్లో ఉండే భజన బృందాలు భజన చేస్తూ దేవాద్రి మహాగిరి ప్రదక్షిణ చేయండి. 

7.ఇతర వివరములకు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

9848947776

9848056485

             ఇట్లు 

వంశపారంపర్య

ధర్మకర్తలు. 


అశేష భక్తకోటి.

మన మహర్షులు- 39

 మన మహర్షులు- 39


వైశంపాయన మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


ఈ రోజు మనం  వైశంపాయన మహర్షి గురించి తెలుసుకుందాం. ఈయన చాలా గొప్ప ఋషి, మహాభారతంలో ఈ ఋషి పేరు ఎక్కువ విని వుంటాం. అసలు వేదాల్ని అన్ని వైపులా వ్యాప్తి చేసింది ఈ వైశంపాయన మహర్షి.


వైశంపాయన మహర్షి ఒక ముని కొడుకు. చిన్నప్పుడే వ్యాస మహర్షికి అప్పగించాడు తండ్రి. వ్యాసుడు ఈ పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పి కొంచెం పెద్దవాడయ్యాక యజుర్వేదం

నేర్పి ఈ వేదాన్ని అన్ని లోకాల్లోనూ వ్యాపించేలా చెయ్యమన్నాడు.


 వైశంపాయనుడు యజుర్వేదాన్ని ఇరవై ఏడు శాఖలుగా విభజించి తన శిష్యుల్తో అన్ని లోకాల్లోనూ వ్యాపించేలా చేశాడు.


 వైశంపాయనుడి ఆశ్రమంలో ఎంతోమంది శిష్యులు వేదం నేర్చుకుంటూ వుండేవాళ్ళు.


యాజ్ఞవల్యుడనే శిష్యుడు నాలుగు వేదాలు నేర్చుకుని గురుభక్తి కలిగి ప్రియశిష్యుడుగా ఉండేవాడు.


 కాని రానురాను యాజ్ఞవల్క్యుడికి గర్వం ఎక్కువయి పోయింది.


 అహంకారం ఉండకూడదని గురువుగారు ఎంత చెప్పినా వినకపోవడంతో తాను నేర్పిన వేదం తన దగ్గరే కక్కేసి వెళ్ళమని చెప్పి బయటకి పంపేశాడు యాజ్ఞవల్క్యుడుని వైశంపాయనుడు.


తనకి అత్యంత ప్రియమైనవాడు, గురుభక్తి వున్నవాడు అయినా సరే! అహంకారి కాబట్టి శిష్యుణ్ణి శిక్షించాడు వైశంపాయనుడు.


  వేదవ్యాసుడు తన విజ్ఞానంతో మహాభారతాన్ని రచించి విశ్వానికి ఉపయోగించేలా చేశాడు.

 మహాభారతాన్ని భూలోకంలో జనమేజయుడికి చెప్పడానికి

వైశంపాయన మహర్షిని పంపాడు. 


వైశంపాయనుడు గురువుగారికి మనస్సులో నమస్కారం చేసి వినేవారికి కోరిన కోరికలిచ్చేది, జన్మజన్మల పాపాన్ని పోగొట్టేది, ధర్మార్థ కామమోక్షాలకి గొప్ప సాధనమైంది, సత్యవాక్యాలతో వంద వేల శ్లోకాలతో వున్నది, వ్యాసమహామునితో వ్రాయబడింది అయిన భారతాన్ని జనమేజయుడికి వివరంగా చెప్పాడు.


జనమేజయుడు మళ్ళీ సందేహాలు అడిగాడు. ..


యుద్ధం తర్వాత పాండవులు కౌరవులు స్వర్గానికి వెళ్ళి ఎక్కడ వున్నారు? అని


వైశంపాయనుడు రాజా! కొంచెం పుణ్యం చేసుకున్న వాళ్ళు ముందు స్వర్గానికి వెడతారు. తర్వాత నరకానికి వెడతారు. దుర్యోధనుడు వీరస్వర్గం పొందాడు. కాబట్టి ముందు స్వర్గానికి వెళ్ళి తర్వాత కలిలో కలిసిపోయాడు. అతని తమ్ముళ్ళు రాక్షసులయ్యారు అని చెప్పాడు.


ఎవరెవరు ఎక్కడెక్కడ చేరారో చెప్తాను విను. అర్జునుడు నారాయణుడి ప్రక్కన చేరాడు, కర్ణుడు ద్వాదశాదిత్యుల ప్రక్కన, భీముడు మరుద్గణాల్లో, నకుల సహదేవులు అశ్వినీ దేవతల్లోనూ ఉన్నారు అని చెప్పాడు వైశంపాయనుడు


ధృతరాష్ట్రుడు కుబేర లోకంలోనూ, పాండురాజు ఇంద్ర భవనంలో, అభిమన్యుడు

చంద్రుడిలో, ద్రోణుడు బృహస్పతిలో, భీష్ముడు వసువులో, ధర్మరాజు, విదురుడు ధర్మదేవతలో


ఇలా ఇంకా ఎవరెక్కడెక్కడ ఉండిపోయారో వివరంగా చెప్పాడు వైశంపాయనుడు.


 తర్వాత వైశంపాయనుడు జనమేజయుడికి హరివంశ కథలన్నీ చెప్పాడు.


పృథు చక్రవర్తి చరిత్ర, మన్వంతర వివరణ, కువలయాశ్వ చరిత్ర, త్రిశంకు చరిత్ర జాంబవతీ చరిత్ర, దత్తుని చరిత్ర, యయాతి చరిత్ర, ఇలా చాలాచాలా కథలున్నాయి ఇవన్నీ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.


 చివరగా జనమేజయుడు వైశంపాయనుణ్ణి అడిగి మోక్ష మార్గం గురించి కూడా

తెలుసుకున్నాడు.


వైశంపాయనుడు రాసిన 'నీతిప్రకాశిక' అనే గ్రంథంలో యుద్ధ నీతి గురించి తెలియచెయ్యబడింది.


 దాంట్లో సేనా నాయకుడి విధులు, సైనిక విన్యాసం, ప్రాచీక భారతదేశ శస్త్రాస్త్రాల గురించి, సుమారు నూట ముఫై ఆరు రకాల ఆయుధాల గురించి రాశాడు .యుద్ధం వివరంగా ఎలా చెయ్యాలి సైన్య సమీకరణ మొదలు ఎనిమిది సర్గలున్నాయి దీంట్లో.


 ఇంతటి మేధావిని గురించి తెలుసుకున్న మనం ఎంతో ధన్యులం.🙏🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹