31, ఆగస్టు 2022, బుధవారం

నేను లేకపోతే

 *నేను లేకపోతే?*


అశోక వనంలో రావణుడు సీతమ్మ వారి మీదకి కోపంతో కత్తి దూసి ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని


కానీ మరుక్షణంలోనే హనుమంతుడు  మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! 


హనుమంతుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. 'నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతను ఎవరు రక్షించే వాళ్ళు అని భ్రమలో నేను ఉండేవాడిని' అనుకున్నాడు హనుమంతుడు! 


బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?' అని. 

అయితే ఇక్కడ ఏం జరిగింది చూద్దాం... 


సీతామాతను రక్షించే పనిని, ప్రభువు రావణుని యొక్క భార్యకు అప్పగించాడు. 


అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. 

**

మరింత ముందుకు వెళితే త్రిజట 'తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుంది. అది లంకను కాల్చివేస్తుంది..దాన్ని నేను చూశాను.' అని చెప్పింది. 

అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. 


అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు. 

*

హనుమంతుని చంపడానికి రావణుని సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. 

అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. 

అప్పుడు హనుమంతునికి తెలిసింది తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని  పై ఉంచాడు అని. 


ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే  విభీషణుడు ఆ మాట చెప్పినప్పుడు రావణుడు వెంటనే ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. అయితే కోతులకు తోకంటే మహా ఇష్టం కాబట్టి తోకకు నిప్పు పెట్ట' మని చెప్పాడు. 


అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. లేకపోతే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! 


కానీ గమనించండి...పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నిటి ఏర్పాటు రావణుడే స్వయంగా చేయించాడు. 

అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తన నుండి తనకు కావలసిన పనిని చేయించుకోవడంలో ఆశ్చర్యం ఏముంది! 

**

అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతోంది అని అనుకోండి. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం అని గుర్తు పెట్టుకుని మసలండి. 

అందువల్ల *ఎప్పుడు కూడా నేను లేకపోతే ఏమవుతుందో?* అన్న భ్రమలో ఎప్పుడు పడవద్దు 

'నేనే గొప్పవాడి'నని అనుకోవద్దు. *భగవంతుని కోటాను కోట్ల దాసులలో అతి చిన్నవాడను* అని ఎఱుక కలిగి ఉందాం.

జై శ్రీరామ🙏

☘️🍂


(హిందీ రచనకు స్వేచ్ఛానుసరణ)

వినాయకచవితి ని జరుపుకుంటున్నారు

 పార్ధసారధి పోట్లూరి


.


మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ?


మొదటి సారిగా బెంగుళూరు ఈద్గా మైదానంలో వినాయకచవితి ని జరుపుకుంటున్నారు ! గత 75 ఏళ్లుగా కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు తేల్చకుండా


వదిలేసిన సమస్య 'ఈద్గా మైదాన్ "! ఈ రాజకీయ పార్టీలకి వోట్లు పోతాయనే భయంతో ఈద్గా మైదాన్ విషయంలో కప్పదాటు ధోరణిని ప్రదర్శించి సమస్యని జటిలం చేసి వెళ్లిపోయాయి. ముస్లిం రాజకీయ నాయకులని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక సమస్యని నాన్చి మరింత జటిలం చేశాయి. ఇది మరీ ముఖ్యంగా సుదీర్ఘ కాలం కర్ణాటకని పాలిచిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకం. గత ఆగస్ట్ 15 న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించి బెంగుళూరు లోని చామరాజ పేట లో ఉన్న ఈద్గా మైదానం ని దానికి వేదిక చేసుకోవాలని నిర్ణయించుకొని చామరాజ పేట లోని స్థానికులు ఈద్గా మైదానం లో చిన్న సమావేశం నిర్వహించారు. అయితే స్థానిక ఎంఎల్ఎ అయిన జహీర్ అహ్మెద్ వచ్చి ఈద్గా మైదానం తమది అని ఇక్కడ రంజాన్, బక్రీద్ ల సందర్బంగా నమాజు చేయడానికి మాత్రమే అనుమతిస్తామని ఇతర కార్యక్రమాలకి అనుమతించమని వాగ్వివాదానికి దిగాడు స్థానీకులతో ! అయితే బిజేపి నాయకులు 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ప్రభుత్వ అనుమతిని కోరారు! ప్రభుత్వం అనుమతి ఇచ్చి పోలీసు బందోబస్తు మధ్యన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిపోయింది.


తాజాగా ఆగస్ట్ 31 న వినాయ చవితి పండుగని జరుపుకోవడానికి అనుమతి ఇవ్వమని ప్రభుత్వాన్ని


 కోరారు గణేష్ ఉత్సవ నిర్వహుకులు. ఇక్కడ సమస్య మొదలయ్యింది మళ్ళీ. ఈద్గా మైదాన్ లో కేవలం ముస్లిం మత పరమయిన కార్యక్రమాలకే అనుమతి ఇస్తామని

 గణేష్ పూజకీ అనుమతి ఇవ్వమని స్థానిక ఎంఎల్ఎ జహీర్ అహ్మెద్ మళ్ళీ అభ్యంతరం పెట్టాడు. ఈద్గా మైదాన్ తమదే అని తమకి సంబంధించిన స్థలంలో మా అనుమతి లేకుండా ప్రభుత్వం అనుమతి ఎలా ఇస్తుంది అంటూ వాదనకి దిగాడు జహీర్ అహ్మెద్. 


BBMP అధికారులు ఈద్గా మైదాన్ కి యాజమాన్యమ్ కి సంబంధించి డాక్యుమెంట్లు చూపించమని అడిగారు. కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి యాజమాన్య హక్కులని నిర్ధారించే డాక్యుమెంట్స్ లేవు. అదేసమయంలో BBMP దగ్గర కూడా ఈద్గా మైదాన్ కి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తెలిసింది మొదటిసారిగా !


కానీ కర్ణాటక రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రం 2 ఎకరాల 10 గుంటల భూమికి సంబంధించి అది ప్రభుత్వానిదే అని నిర్ధారించే రికార్డులు ఉన్నాయి. దాంతో కర్ణాటక ప్రభుత్వం అది ప్రభుత్వ స్థలం కాబట్టి గణేష్ ఉత్సవ నిర్వహకులకి వినాయక చవితి పండుగని జరుపుకోవచ్చని అనుమతి ఇచ్చింది.


దీనిమీద ఈద్గా మైదాన్ తమదే అని వాదిస్తూ వచ్చిన జహీర్ అహ్మెద్ హై కోర్టు ని ఆశ్రయించాడు. తన పిటిషన్ లో ఈద్గా మైదానం లో గణేష్ ఉత్సవాన్ని నిర్వహించుకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలని కోరాడు. ప్రభుత్వ తరపున ఈద్గా మైదాన్ నిర్వహుకుల వాదనలు విన్న కర్ణాటక హై కోర్టు గణేష్ ఉత్సవం నిర్వహించడాన్ని ఆపమని కోరిన పిటిషన్ ని కొట్టివేస్తూ చట్ట ప్రకారం ఎలాంటి అనుమతులు ఇవ్వవచ్చో వాటిని ఇవ్వమని


ప్రభుతాన్ని ఆదేశించింది! ఆగస్ట్ 31 న మొదటిసారిగా ఈద్గా మైదాన్ లో వినాయకచవితి


ఉత్సవాలు జరగబోతున్నాయి అన్నమాట ! గత దశాబ్దాలుగా ఈద్గా మైదాన యాజమాన్య హక్కులు తమవే అని వాదిస్తూ వచ్చిన వాళ్ళని కనీసం భూ యాజమాన్య హక్కులకి సంబంధించి పత్రాలు ఉన్నాయా ? లేవా ? అని అడిగిన పాపాన పోలేదు. ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వాలు కాని ! చామరాజ పేట లోని 2 ఎకరాల 10 గుంటల భూమి విలువ ఇప్పుడు హీన పక్షం 500 కోట్లు ఉంటుంది కానీ కేవలం వోట్ బాంక్ రాజకీయాలతో ఎలాంటి పత్రాలు లేని వాళ్ళకి ఇన్నాళ్ళూ అక్కడ మేకలు, గొర్రెలు అమ్ముకోవడానికి సంతని నిర్వహించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? వందల సంఖ్యలో జనావాసాల మధ్య మేకలని, గొర్రెలని పెంచుతూ వాటి దుర్గంధం ని స్థానికులు అభ్యంతరం పెడుతూ వచ్చినా ఎందుకు ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాల్సి వచ్చింది ?


తమది కానీ భూమిలో జాతీయ జెండాని ఎగురవేయడానికి అనుమతి ఇవ్వము అని చెప్పేంత ధైర్యం వాళ్ళకి ఎవరు ఇచ్చారు ? ఇలాంటి సమస్యలు బహుశా దేశ వ్యాప్తంగా కొన్ని వేలు ఉండి ఉండవచ్చు ! జైహింద్ !