15, జులై 2020, బుధవారం

శ్రీ ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి దేవస్థానం

శ్రీ ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి దేవస్థానం ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరుజిల్లా సీతారామపురం మండలంలోని శ్రీసిద్ధేశ్వర కోనలో ఉన్నది. 

చాలా పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం కొంతకాలంపాటు ఆదరణ లేక శిధిలావస్థకు చేరుకునే దశలో కాశీనాయన స్వామి పునరుద్ధరించారు. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య ఘటిక సిద్దేశ్వరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల నుండేకాక పర్యాటకులు చాలా మంది వస్తూ ఉంటారు. అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఇది ఒకటి. 6వ శతాబ్దానికి పూర్వం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. 

సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథ సిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నారు. ఆగస్త్యముని ఒక ఘటిక కాలం స్మరించగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనందున ఈ క్షేత్రం ఘటికసిద్ధేశ్వరంగా ప్రసిద్ధి చెందినట్లు పురాణాలు చెబుతున్నాయి.

 1406లో విజయనగరం సామ్రాజ్యాన్ని పాలించిన రెండో హరిహరరాయులు, ఆయన తనయుడు మొదటి దేవరాయులు ఈ ఆలయానికి ప్రాకార మండపం నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. 1974లో అవధూత కాశినాయన ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ప్రకృతి సౌందర్యం చాలా బాగుంటుంది ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాల నడుమ మనసును మైమరపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది.

ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు శ్రీ సిద్ధివినాయక స్వామి, శ్రీ ఘటిక సిద్దేశ్వర స్వామి, శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు, శ్రీ సద్గురు కాశీనాయన స్వామి, శ్రీ వృద్ధ సిద్దేశ్వర స్వామి, నవగ్రహ మండపం, ఏకశిలా ధ్వజ స్తంభం, మహా బిల్వ వృక్షం, అగస్త్య పీఠం, వీరభోగ వసంతరాయలు, కైలాస కోన (తపోవనం), అయ్యప్ప స్వామి గుడి, ధ్యాన మందిరం, సప్త కోనేరులు, పాలకోనేరు, నంది ధార మొదలగు వాటిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది.

ప్రతి సంవత్సరం శివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.  ఇచట కొలువుదీరిన ఇష్టకామేశ్వరీదేవి అమ్మవారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలందుకుంటారు.

ఇక్కడకు వచ్చే భక్తులు సొంత వాహనాలపై ఆధారపడవలసి ఉంటుంది. శివరాత్రి సమయంలో బస్సు సౌకర్యం ఉంటుంది. ఇక్కడ కొండపై నుంచి ఎల్లప్పుడు నీరు ప్రవహిస్తున్నందు వలన మంచినీటికి ఇబ్బంది లేదు. ఇక్కడకు వచ్చిన భక్తులకు నిరంతరం అన్నదానం చేస్తూనే ఉంటారు వివిధ రకాల సత్రాల వారు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వసతి సౌకర్యం కూడా ఉన్నది.

సర్వేజనా సుఖినోభవంతు 
************

శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం, మురడి

రాయలసీమ.. అనంతపురం జిల్లా లో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం. అత్యద్భుతమైన శక్తి గల ఆంజనేయ స్వామి దేవస్థానం. కసాపురం తరువాత ప్రపంచ వ్యాప్తంగా అంత ఖ్యాతి గల
దివ్య క్షేత్రమే మురడి.

శ్రీ వ్యాస రాయులు ఒకే ముహూర్తం లో మూడు చోట్ల విగ్రహ ప్రతిష్టాపణ చేశారు. ఒకటి శ్రీ కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం గుంతకళ్ళు దగ్గర,శ్రీ మురిడి ఆంజనేయ స్వామి దేవస్థానం మరియు శ్రీ నేమకల్లు ఆంజనేయ స్వామి దేవస్థానం రాయదుర్గం దగ్గర. ఈ మూడు దేవస్థానాలు ఒకే జిల్లా లో ఉండటం విశేషం..
ఈ ఆలయాలను క్రీ.పూ 450 సంవత్సరంలో ఆలయాలను నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

 ఒకే నక్షత్రంలో ప్రతిష్టించిన శ్రీఆంజనేయస్వామి ఆలయాలను పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళ, శనివారాల్లో దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తులు పేర్కొంటున్నారు.
ఇక్కడ స్వామి వారు మూడు అడుగులు ఉండటం చేత మురడి అని పేరు వచ్చింది. కన్నడం లో మురడి అంటే మూడు అడుగులు అని అర్ధం. 

ఆలయ రాజా గోపురం చాల బాగుంటుంది ... గోపురం లో హనుమంతుడు చుట్టూ రామాయణ గాద సంబందించిన చిత్రాలను మనం చూడవచ్చు. అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకలోని డీ హీరేహాళ్‌ మండల పరిధిలో ఉన్న మురడి గ్రామంలో శ్రీ మురిడి ఆంజినేయస్వామి ఆలయం ఉంది.

ఇక్కడికి చేరుకోవడానికి అనంతపురం నుంచి రాయదుర్గం మీదుగా వెళ్ళాలి. రాయదుర్గం నుంచి పది కిలో మీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. కర్ణాటక ప్రాంతామైన బళ్లారి నుంచి 45 కిలోమటర్ల దూరంలో ఉంది.

సర్వేజనా సుఖినోభవంతు 

పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు.

వినాయకుడు బ్రహ్మచారే కావచ్చు... కానీ ఏ పెళ్లిని తలపెట్టినా, అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు.

పశ్చిమ తీరాన...
మనదేశపు పశ్చిమతీరాన వెలసిన గణపతి ఆలయాలలో, ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ఒకటి. ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ గ్రామం ఉంది. కర్నాటకలోనే పుట్టి, ఆ రాష్ట్రంలోనే సంగమించే శరావతి అనే నది, ఇడగుంజికి అతి సమీపంలో ఉన్న హోన్నవర్‌ వద్దనే అరేబియా సముద్రంలో సంగమిస్తుంది.

స్థలపురాణం...
అది ద్వాపరయుగం అంతమై కలియుగం ఆరంభం కాబోతున్న కాలం. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం. రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు రుషులంతా వాలఖిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం వారు శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు అసుర సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని రుషులు నిర్ణయించుకున్నారు. కానీ అదేం చిత్రమో! యజ్ఞయాగాలు మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఏవో ఒక ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో రుషులకు పాలుపోక నారదుని శరణు వేడారు. అంతట నారదుడు, గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే, ఎటువంటి విఘ్నాలూ లేకుండానే క్రతువు పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. సలహాను ఇవ్వడమే కాదు, తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తోడ్కొని వచ్చాడు. గణేశుడు అక్కడకు రావడంతోనే యాగానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ముక్కోటిదేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగింది. తమ విఘ్నాలన్నీ తొలగించిన గణేశుని రుషులందరూ వేనోళ్లతో స్తుతించారు. వారి భక్తికి మెచ్చిన గణేశుడు, ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోర్కెలను తీరుస్తానని వరమిచ్చాడు. అలా గణేశుడు స్వయంభువుగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగుంజి.

భిన్నమైన రూపం....
ఇక్కడి మూలవిరాట్టైన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.

పెళ్లి పెద్ద....
కర్నాటకలోని బంధి అనే జాతివారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే, దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఇలా వైభవోపేతమైన స్థలపురాణానికి తోడుగా, చిత్రవిచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు.

ఏవి చేయకూడదు? ,ఏవి చేయాలి?

1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
2. ఎంత అవసరమైన  కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
4. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి.
5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి .
6. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాం కదా ... కొన్ని నిజాలు చూద్దాం ...
అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని 
అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి 
అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు. 

అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు. 
తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షo కలుగుతుంది.
బాదాం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. 

జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు.
1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. 
2) దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే ... తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది 
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. 
పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది 
ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది 
దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది
కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు

అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టట,దుర్భాష లాడుట చేయరాదు. 
ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,కొంచెం ఆకులో వదిలేయాలి, దెప్పి పొడువరాదు. 
ఎట్టిపరిస్థితిలో నైనా ఒడిలో కంచెం పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును. 
భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం 
భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు.

 నీవు చేసే నీ పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ... ఆనందమే విజయానికి సోపానం.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

జగద్విఖ్యాతమైన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం స్తోత్రాన్ని ప్రతివాద భయంకర అణ్ణాంగారాచార్య లేదా అణ్ణన్ స్వామి రచించారు.

ఇతడు క్రీ.శ.1361 వ సంవత్సరంలో అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు. 

ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు. ఇతని గురువు మణవాళ మహాముని.

సుప్రసిద్ధమైన వేంకటేశ్వర సుప్రభాతము, రంగనాధ సుప్రభాతము కూడా అణ్ణన్ రచనలే. 

వేదాంత దేశికుల కుమారుడైన నారాయణావరదాచార్యుడు అణ్ణన్కు మొదటి గురువు. 

నారాయణ వరదాచార్యుల వద్ద వేదాలు, ఇతర విద్యలు అభ్యసిస్తున్న సమయంలో ఆణ్ణన్ను వాదంలో ఎదుర్కోవడం ప్రత్యర్ధులకు చాలా సంకటంగా ఉండేదట. 

నృసింహ మిశ్రుడనే అద్వైత పండితుడిని వాదనలో ఓడించినపుడు మణవాళ మహాముని అణ్ణన్కు "ప్రతివాద భయంకర" అనే బిరుదు ఇచ్చాడట. 


తరువాత అణ్ణన్ తిరుమలలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో అతను మణవాళ మహాముని శిష్యుడయ్యాడు.

హిందువుల సాంప్రదాయాలు.

1) మంగళ, శుక్ర వారాలలో క్షవరం చేసుకోరాదు

2) ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షవరం చేసుకోరాదు.

3) అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ఒకేరోజు క్షవరం చేసుకోరాదు.

4) భోజనం తిన్న పళ్లెంలో చేయి కడగకూడదు.

5) నూనె, ఉప్పు, గుడ్లు చేతికి ఇవ్వరాదు.

6) ఇంటికి ఎవరైనా వచ్చినపుడు ఎదురుగ చీపురు కనపడకూడదు.

7) సాయంత్రం గం.5 తర్వాత ఇల్లు ఊడ్చ కూడదు.

8) మంచం మీద కూర్చుని తినకూడదు.

9) తలుపుల మీద బట్టలు వేయకూడదు.

10) సాయంత్రం చీకటి పడగానే అన్ని తలుపులు వేసి ఇంట్లో దీపాలు వెలిగించాలి. వీధి తలుపు మాత్రం తీసి ఉంచాలి. (హిందువులు సంప్రదాయం ప్రకారం సంధ్యా సమయంలో లక్ష్మీ దేవి సంచరిస్తూ ఉంటుందిట.)

11) ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి.

12) మంగళ, శుక్ర వారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు.

13) ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు.

14) బయటికి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుగుకొని ఇంట్లోకి రావాలి.

15) తెల్లవారి లేవగానే ముందు దేవుని పటములు కానీ మీ రెండు అరచేతులు గాని చూడాలి. అద్దంలో మీ ముఖం చూసుకోరాదు.

16) అద్దం ఉత్తర దిక్కున మాత్రమే ఉండాలి.

17) ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకోరాదు.

18) ప్రతినెలా కొత్త రైస్ బ్యాగు తేగానే అన్నం వండి తొలిముద్ద దేవుడికి నైవేద్యంగా పెట్టండి.

19) పూజా మందిరంలో మరణించిన మన కుటుంబీకుల ఫోటోలు ఉంచకూడదు.

20) ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు.

21) దేవాలయానికి వెళ్ళి వచ్చాక వెంటనే కాళ్ళు కడుగుకోకూడదు.

22) తూర్పు, పడమటి దిక్కులుగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకోకూడదు.

23) ఆడవాళ్లు శిరోజాల విరబసుకోరదు

24) ఆదివారం అన్నదమ్ములు ఉన్న అక్కచెల్లులు తలస్నానం చేయరాదు

25) ముతైదువులు పంచ మంగల్యాలు (బొట్టు, గాజులు, నల్లపూసలు, కాలి మెట్టెలు ,పువ్వులు) ధరించవలెను

26) దానం చేసేటప్పుడు కుడి చేత్తో చెయ్యవలను.

27) సంధ్య సమయం లో పడుకోకూడదు

పాటించేవారుంటే.. ఎన్నయినా చెప్పవచ్చు. ఎవరు పాటిస్తారులే అని పెద్దలు మౌనంగా ఉండకూడదు. చెప్పడం మన విధి. ఆ పైన వారి ఇష్టం.

ఇది మన హిందువులు సాంప్రదాయాలు.

*జాగ్రత్తగా చదవండి*

*ICMR న్యూ ఢిల్లీ👇*
*జాగ్రత్తగా చదవండి*
*కొన్ని చాలా ముఖ్యమైన అంశాలు*

1) 02 సంవత్సరాల వరకు విదేశీ ప్రయాణాన్ని వాయిదా వేయండి *ప్రస్తుత పరిస్థితుల్లో  హైదరాబాద్ కి వెళ్లకుండా ఉండడం బెటర్.....* హైదరాబాద్ మొత్తం ప్రస్తుతం కరోనా సంక్షోభంలో ఉంది.... *భాగ్యనగరాన్ని కాపాడటం చాలా కష్టంతో కూడుకున్న పని.* 
2) ఒక సంవత్సరం పాటు బయట ఆహారం తినవద్దు.
*3)అనవసరమైన వివాహం లేదా ఇతర వేడుకలకు వెళ్లవద్దు*
4)అనవసరమైన ప్రయాణ యాత్రలు చేయవద్దు.
 *5)కనీసము ఒక సంవత్సరం పాటు రద్దీగా వుండే ప్రదేశాలకు వెళ్లవద్దు*
6)సామాజిక దూర నిబంధనలను పూర్తిగా పాటించండి.
*7)దగ్గు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి*.
8)ఫేస్ మాస్క్‌ను ఉంచండి.
*9)ప్రస్తుత పరిస్థితుల్లో  ఈ వారం నుండి జులై నెలాఖరు వరకు చాలా జాగ్రత్తగా ఉండండి*.
10)మీ చుట్టూ ఎటువంటి గందరగోళాన్ని ఉంచవద్దు.
*11)శాఖాహార ఆహారాన్ని ఇష్టపడండి*.
*12)ఇప్పుటి నుండి వచ్చే 06 నెలలు వరకు క్రౌడ్ మార్కెట్‌కు వెళ్లవద్దు. వీలైతే పార్క్, పార్టీ మొదలైనవాటిని కూడా తప్పించాలి.
*13)రోగనిరోధక శక్తిని పెంచండి*.
14)బార్బర్ షాపులో లేదా బ్యూటీ సెలూన్ పార్లర్‌లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.
*15)అనవసరమైన సమావేశాలకు దూరంగా ఉండండి,సామాజిక దూరాన్ని ఎల్లప్పుడూ పాటించండి*.
16)."'కరోనా'" యొక్క ముప్పు అనేది ఇంతలో పోయేది కాదు. టీకా వ్యాక్సిన్ వచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదు,ఒక సంవత్సరం పాటు తీసుకునే జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష.
 *17)మీరు బయటకు వెళ్ళినప్పుడు బెల్ట్, రింగులు,రిస్ట్ వాచ్ ధరించవద్దు.వాచ్ అవసరం లేదు.మీ మొబైల్‌ నందు  సమయం ఉంటుంది*
 18)చేతి కర్చీఫ్ వద్దు, అవసరమైతే శానిటైజర్ & టిష్యూ తీసుకోండి.
 *19)మీ ఇంటి లోనికి  బూట్లు తీసుకుని పొవద్దు.వాటిని బయట వదిలివేయండి*.
 20)మీరు బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు మీ చేతులు మరియు కాళ్ళను శుభ్రం చేయండి.
 *21)మీరు ఎవరైనా అనుమానాస్పద రోగికి దగ్గరగా వచ్చారని మీకు అనిపించినప్పుడు పూర్తిగా వేడి నీటితో స్నానం చేయండి*
22)వచ్చే 06 నెలల నుండి 12 నెలల వరకు లాక్డౌన్ ఉన్నా లేకున్న  ఈ జాగ్రత్తలు  పాటించండి.
*🙏పై సూచనలను, సలహాలను మీ కుటుంబం & స్నేహితులతో పంచుకోండి.🙏

 *💐🤝ధన్యవాదాలు🤝💐*

 👆ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, న్యూ డిల్లీ.






కృతజ్ఞత చెప్పడం వల్ల ఇంత మేలు జరుగుతుందా

ఒక పక్షి రెక్కలు లేక  తినడానికి  తిండి దొరక్క  తాగడానికి నీళ్లు లేక ఉండడానికి గూడూ లేక చాలా దీనావస్థలో ఉన్నింది  
అటుగా ఓ పావురం  వెళ్లడం  చూసి  ఎక్కడకు  వెళ్తున్నావ్  అని అడిగింది

స్వర్గానికి వెళ్తున్నాను  అని చెప్పడంతో నాగురించి  దేవుడికి  విన్నవించావా  అని వేడుకుంది  
అలాగే అని చెప్పిన  పావురం అక్కడ స్వర్గపు  ద్వారపాలకులతో  పక్షి గురించి చెప్పగా  

ఆ పక్షి అదే స్థితిలో ఇంకా  ఏడేళ్ళు గడపాలి అని ద్వారపాలకులు చెప్పగా 

పావురం చాల బాధపడింది ఆ పక్షి స్థితికి
ఈ విషయం ఆ పక్షికి ఎలా చెప్పను  అని అడగగా
 "నువ్వు ఇచ్చిన  ప్రతిదానికి కృతజ్ఞత భగవంతుడా "
ఈ ఒక్క  మాట ఎప్పుడూ చెప్తూఉండమను అని చెప్పారు 

అదే విషయాన్ని పావురం ఆ పక్షికి చెప్పి  వెళ్ళిపోయింది 

సరిగ్గా వారం తరువాత   పావురం దారిలో  వెళ్తూ  పక్షిని చూసింది 

చెట్టు చిగురించింది 
ఎడారిలో నీటి కొలను  వచ్చింది 
రెక్కలు వచ్చింది పక్షికి 
ఇప్పుడు హాయిగా  ఆడుతూపాడుతూ పక్షి కనిపించింది  

ఆశ్చర్యపోయిన పావురం ఎలా అని కనుక్కోవాలని  మళ్ళీ స్వర్గం  వైపు  వెళ్లి అక్కడ వారిని అడిగింది 
ఏడేళ్లు కష్టపడుతుందని  అన్నారు మరి ఆ పక్షి ఇప్పుడు చాలాబాగుంది ఎలా అని అడిగింది 

పక్షి రెక్కలు లేక కిందపడిపోయింది దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
దాహంతో ఉండగా   దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
ఆకలితో ఉండగా  దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
దేవుడు చలించిపోయాడు  జాలి చూపెట్టాడు ఏడేళ్ల  తన కష్టాన్ని ఏడురోజులకు  తగ్గించేసాడు 
అందుకే  ఇలా అని 

నిజంగా కృతజ్ఞతకు ఇంత బలం  ఉందా  
దేవుడా నువ్వు ఇచ్చిన ప్రతిదానికి  కృతజ్ఞత దేవుడా
***************

 "ధనమొస్తే దాచుకోవాలి.. రోగం వస్తే చెప్పుకోవాలి"

సమాజంలో మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తెలియచెప్పేందుకు ఈ జాతీయం ఉపకరిస్తుంది. ధనం ఉంది కదాని ముందూ వెనుకా చూసుకోకుండా ఖర్చుపెట్టకూడదు... దాచుకోవాలి. అలాగే రోగం వస్తే వైద్యుడికి చూపించుకోకుండా చెప్పకుండా ఉండకూడదు. చెప్పి తగిన మందు తీసుకుని రోగాన్ని తగ్గించుకోవాలి అనే విషయ సూచనకు ఈ జాతీయం ఉపకరిస్తుంది.

సేకరణ:డాక్టర్.యం.ప్రసాద్  
***********

ఆభరణం - కధ 
 ఒకానొక  చక్రవర్తి  యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశ యిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్లు నెత్తికెక్కాయని.

 అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.
'మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహకర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుండును' అన్నాడు. 

అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు. 

తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. 

దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి 'ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు' అన్నాడు. 

పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు. 

'ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండ దు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు' అన్నాడు మంత్రి మళ్ళీ. ..పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు. 

వెంటనే ఆలోచించాడు...

 మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్రల్లోని నీటిని తెప్పించడం, ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది. జ్ఞానోదయమయింది. 

వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, 'గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్ల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్ల్లగా ఉంచు తుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి' అన్నాడు.

ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరో కాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.

 నరస్యాభరణం రూపం 
 రూపస్యాభర ణం గుణమ్‌ 
 గుణస్యాభరణం జ్ఞానమ్‌ 
 జ్ఞానస్యాభరణం క్షమా 

మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం.

పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది. 

అంటే మంచి అందగాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు. 

వినయం అనేది మనిషిలో ఎల్ల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి. 

కొందరు ఓటమి చవి చూసినప్పుడో, బాధలలో మునిగిపోయినప్పుడో తమ బాధలు వెళ్ళబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు. 

అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించి నపుడు, సంపదలు వచ్చినపుడు, మంచి పదవి ఉన్నపుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్న చూపు చూస్తారు. కించ పరుస్తారు. మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు. 

అందంగా ఉండడం మంచిదే కాని తను అందంగా ఉన్నానని అందవిహీనమయిన పనులు చేయడం తగనిది. 

అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది పెద్దల మాట.

కృతజ్ఞత చెప్పడం వల్ల ఇంత మేలు జరుగుతుందా

ఒక పక్షి రెక్కలు లేక  తినడానికి  తిండి దొరక్క  తాగడానికి నీళ్లు లేక ఉండడానికి గూడూ లేక చాలా దీనావస్థలో ఉన్నింది  
అటుగా ఓ పావురం  వెళ్లడం  చూసి  ఎక్కడకు  వెళ్తున్నావ్  అని అడిగింది

స్వర్గానికి వెళ్తున్నాను  అని చెప్పడంతో నాగురించి  దేవుడికి  విన్నవించావా  అని వేడుకుంది  
అలాగే అని చెప్పిన  పావురం అక్కడ స్వర్గపు  ద్వారపాలకులతో  పక్షి గురించి చెప్పగా  

ఆ పక్షి అదే స్థితిలో ఇంకా  ఏడేళ్ళు గడపాలి అని ద్వారపాలకులు చెప్పగా 

పావురం చాల బాధపడింది ఆ పక్షి స్థితికి
ఈ విషయం ఆ పక్షికి ఎలా చెప్పను  అని అడగగా
 "నువ్వు ఇచ్చిన  ప్రతిదానికి కృతజ్ఞత భగవంతుడా "
ఈ ఒక్క  మాట ఎప్పుడూ చెప్తూఉండమను అని చెప్పారు 

అదే విషయాన్ని పావురం ఆ పక్షికి చెప్పి  వెళ్ళిపోయింది 

సరిగ్గా వారం తరువాత   పావురం దారిలో  వెళ్తూ  పక్షిని చూసింది 

చెట్టు చిగురించింది 
ఎడారిలో నీటి కొలను  వచ్చింది 
రెక్కలు వచ్చింది పక్షికి 
ఇప్పుడు హాయిగా  ఆడుతూపాడుతూ పక్షి కనిపించింది  

ఆశ్చర్యపోయిన పావురం ఎలా అని కనుక్కోవాలని  మళ్ళీ స్వర్గం  వైపు  వెళ్లి అక్కడ వారిని అడిగింది 
ఏడేళ్లు కష్టపడుతుందని  అన్నారు మరి ఆ పక్షి ఇప్పుడు చాలాబాగుంది ఎలా అని అడిగింది 

పక్షి రెక్కలు లేక కిందపడిపోయింది దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
దాహంతో ఉండగా   దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
ఆకలితో ఉండగా  దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
దేవుడు చలించిపోయాడు  జాలి చూపెట్టాడు ఏడేళ్ల  తన కష్టాన్ని ఏడురోజులకు  తగ్గించేసాడు 
అందుకే  ఇలా అని 

నిజంగా కృతజ్ఞతకు ఇంత బలం  ఉందా  
దేవుడా నువ్వు ఇచ్చిన ప్రతిదానికి  కృతజ్ఞత దేవుడా

" దాగుడు మూతలు దండాకోర్ ,పిల్లి వచ్చే,ఎలుక గప్ చుప్ సంబారు బుడ్డి’’


ఇవి చిన్నపుడు పిల్లలు ఆడుకునే ఆటల్లో,కళ్ళు మూసి చెప్పే మాటలు.ఇందులోని సంబారు బుడ్డి అంటే ఏమిటో వివరించమని మిత్రులు సాయి వంశీ,ఇంకా కొందరు అడిగారు.వారికోసం,మరియు నా మిత్రులైన మీ అందరి కోసం నాకు తెలిసిన ఈ వివరణ...
పల్నాడు ప్రాంతాలలో,[నరసరావుపేట,పిడుగురాళ్ళ,సత్తెనపల్లి,గుంటూరు జిల్లాలోని ఇంకా కొన్ని ప్రాంతాలలో]కూరలలో వాడుకోవటానికి ఏడాదికి సరిపడా,ఎండాకాలంలోనే,సంబారు తయారుచేసుకుని పెట్టుకుంటారు.కూరల్లో పసుపు వాడరు.దీన్నే వాడతారు.దీని రుచి,వాసన చాలా బాగుంటుంది.కూరలకు అదనపు రుచి వస్తుంది.చంటిబిడ్డలకు వేడ న్నంలో నేయి,ఈ సంబారు పొడి వేసి కలిపి ముద్దలు పెడుతూ వుంటే,పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.ఇది మంచి అరుగుదల నిస్తుంది.
ఇది ఎలా తయారుచేస్తారంటే ఒకకిలో మంచి పసుపుకొమ్ములు తీసుకుని,ముక్కలుగా నలగగొట్టి ఎండలో పెడతారు.కిలో ధనియాలు,పావుకిలో చొప్పున మెంతులు,జీలకర్ర,కల్లుప్పు తీసుకుని,నూనె లేకుండా,మాడకుండా వేపుతారు.పసుపుకొమ్ములువేపిన ఇవన్నీ,ఇంకా ఎండబెట్టిన కరివేపాకు చాలా ఎక్కువ మోతాదులో తీసుకుని,ఇవన్నీ కలిపి మర పట్టిస్తారు..
ఇందులో ఎండు మిరపకాయలు గానీ,కారం గానీ వేయరు..
ఇంటికి తెచ్చాక,పొట్టు వలవని పావుకిలో వెల్లుల్లి పాయలు[ఎల్లిగడ్డలు]ఈ పొడిలోవేసి కచ్చాపచ్చాగా దంచి,ఒక బేసిన్ లోకి తీసుకుని దానిలో పావుకిలో వంటాముదం పోసి బాగా కలిపి ఒక మట్టిబుడ్డికి [మట్టిదుత్త]ఎత్తి పెట్టుకుంటారు.ఈ సంబారు బుడ్డి చిన్న కుండ సైజ్ లో వుండిమూతి సన్నగా,చేయి పట్టేంత సన్నగా వుంటుంది.అచ్చం దీపం బుడ్డి ఆకారంలో వుంటుంది.
మా చిన్నపుడు ఇళ్ళలో కాస్త చీకటిగా వుండే గదిని స్టోర్ రూమ్ గా వాడుకునేవారు.మా ఇంట్లో అయితే మా పడమటింటి గదిని అలా వాడేవారు.ఆ గదిలో అనేక సైజ్ లలో బాన లు,కుండలు,బుడ్లు ఉండేవి. బానల్లో జొన్నలు,సజ్జలు,బియ్యం కుండల్లో ఉప్పు గోంగూర,గోంగూర ,పండు మిరపకాయ పచ్చళ్లు,చింతాకు,కరివేపాకు లాంటి పొడులు,ఒరుగులు,వడియాలు ఇలా నిలువ చేసే ఆహార పదార్ధాలు,బుడ్డిల్లో కారం,సంబారు,ఆవకాయ,ఇంకా రకరకాల పచ్చళ్ళ జాడీలు,ఇంకా ఏవో పెట్టెలు ఉండేవి.అవసరమైనప్పుడు దీపం ముట్టించుకుని వెళ్ళి కావలసినవి తెచ్చుకునే వారు.ఆ పెద్దపెద్ద బానల మాటున ఈ చిన్ని సంబారు బుడ్డి , కనీ,కనపడకుండా,నక్కి వుంటుంది.
అందుకే ఈ దాగుడు మూతల  ఆటలో, సంబారు లాగా నక్కి,దాగి వున్న,దొంగను పట్టుకోవాలి.
 సాంబారు బుడ్డి మూత తీయగానే ఒక్కసారిగా గుప్పున,సువాసన ఎలా వెదజల్లు తుందో,అలాగే  దొంగ పట్టుబ డ,గానే దాంకుని వున్న  పిల్లలందరూ ఘోల్లున నవ్వుతూ ఒక్కసారిగా బయటకు వస్తారు.. ఇంకా సాంబారు  బుడ్డి లాగ చీకటిలో పెద్ద వాటి మాటున దొంగ పెట్టినవారికి కనపడకుండా నక్కి కూర్చో అనే అర్ధంలో ‘గప్ చుప్ సంబారు బుడ్డి’ అంటారు.ఇదండీ కత..ఇందులోనే దండాకోరి అనే పదం వుంది.దండాకోరి అంటే మొండి అని అర్ధం వుంది.అంటే భయపడకుండా మొండిగా,దైర్యంగా వెళ్ళిదొంగని పట్టుకో అని చెప్పుకోవచ్చు.
               పూదోట.శౌరీలు.బోధన్.

సామెతల్లో ఆయుర్వేదం!

"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" ..అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !
.
పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు !
.
త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !
.
"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు,కనీసం కందిపుల్ల" ...ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట
.
వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు ..
.
అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని ...సామెత ఏమంటే ...."కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "
.
పుండుమీదకు ఉమ్మెత్త ,నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా ..."పుండుమీదకు నూనెలేదంటే గారెలొండే పెండ్లామా అన్నట్లు"..."ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...
.
వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది ...సామెత ...ఇలా ..."ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "
.
కరక్కాయ పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి ...శ్వాస,కాస,ఉదర,క్రిమి,గుల్మ,హృద్రోగం ,గ్రహణి,కామిల,పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది..అందుకే ..."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి "..అని సామెత
.
ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది ..సామెత ఇదుగో ..."పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "...."ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి "
.
అలానే ...శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ..."కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...
.
ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి !
.
పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?
.
సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ?
.
అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది!
జాతి జీవనాడి నశిస్తుంది!

ముచ్చటైన కుండ

        ఒక ఊరిలో ఒక కుమ్మరి ఉండేవాడు. కుమ్మరి అంటే తెలుసు కదా... మట్టితో మన ఇంటికి కావలసిన వస్తువులను తయారుచేసేవారిని కుమ్మరి అంటారు. ఒకసారి ఆ కుమ్మరి  చాలా కుండలు చేశాడు. వాటిని సంతలో అమ్మడానికి బైలు దేరాడు. దారిలో ఆకలయితా వుంటే ఒకచోట కుండలు దించి అన్నం తినసాగాడు.
అప్పుడు ఒక అందమైన రంగురంగుల కుండ అక్కడినుంచి దొర్లుకుంటా... దొర్లుకుంటా చాలా దూరం పోయింది. కుమ్మరి అది గమనించలేదు. అన్నం తిని మిగతా కుండలు తీసుకొని వెళ్ళిపోయాడు.
కొంచెం సేపటికి ఒక ఈగ ఎగురుకుంటా ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ... ఎంత బాగుంది ఈ ముచ్చటైన కుండ. ఇదే ఇప్పటినుంచీ నా ఇల్లు” అనుకొంది. 
“లోపల ఎవరయినా ఉన్నారా” అని గట్టిగా అరిచింది ఈగ. ఏమీ శబ్దం రాలేదు. దాంతో సంబరంగా ఎగురుకుంటా లోపలికి పోయింది. 

కాసేపటికి ఒక కప్ప ఎగురుకుంటా ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ... ఎంత ముచ్చటగా ఉంది ఈ రంగురంగుల కుండ. ఇలాంటి అందమైన దానిలో నివాసిస్తే ఎంత బాగుంటుంది” అనుకొంది.
 “లోపల ఎవరయినా ఉన్నారా” అని అడిగింది. “నేనున్నా... నేనున్నా” అంటూ అరిచింది లోపల నుంచి ఈగ. “నేనుగూడా లోపలికి వద్దునా” అని అడిగింది కప్ప. “దా... దా... ఇద్దరమూ కలిసే వుందాం. చాలా స్థలముంది” అంది ఈగ. కప్ప సంబరంగా ఎగురుకుంటా లోపలికి పోయింది.
కాసేసటికి ఒక ఎలుక ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ ఎంత బాగుంది ఈ కుండ. చూస్తేనే మనసుకు ఇంత హాయిగా ఉంది. ఇక దీనిలోనే వుంటే ఇంకెంత బాగుంటుందో” అనుకొంది.
“లోపల ఎవరయినా ఉన్నారా” అని అడిగింది. 
“మేమున్నాం... మేమున్నాం” అంటూ అరిచాయి ఈగ, కప్ప. “నేనుగూడా లోపలికి వద్దునా.మీతో ఉండనిస్తారా” అని అడిగింది ఎలుక. 
“దా... దా... ముగ్గురమూ కలిసే వుందాం” అన్నాయి ఈగ, కప్ప. ఎలుక సంబరంగా లోపలికి పోయింది. 
కాసేపటికి ఒక నక్క ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ ఎంత బాగుంది ఈ రంగురంగుల కుండ. దీన్ని నా ఇల్లుగా చేసుకుంటే ఇంకెంతో బాగుంటుంది” అనుకొంది. “లోపల ఎవరయినా ఉన్నారా” అని అడిగింది. “మేమున్నాం... మేమున్నాం ...” అంటూ అరిచాయి ఈగ, కప్ప, ఎలుక. “నేనుగూడా లోపలికి వద్దునా” అడిగింది నక్క.
“వద్దొద్దు. నువ్వు చాలా పెద్దగా ఉన్నావు. ఇందులో పట్టవు. అన్నాయి కప్ప, ఎలుక, ఈగ. నక్క కోపంగా నన్నే లోపలికి రావద్దు అంటారా... ఎంత థైర్యం మీకు అంటూ కుండలోపలికి పోబోయింది. కానీ నక్క కుండకన్నా పెద్దగా వుంటుంది గదా... దాంతో అది అడుగు పెట్టగానే కుండ ఫక్కున పగిలిపోయింది.
ఈగ , ఎలుక , కప్ప బాధతో మరో అందమైన ఇంటిని వెతుక్కుంటా బైలు దేరాయి. మీకు ఎక్కడైనా మంచి రంగురంగుల ఇల్లు కనబడితే పాపం వాటికి చెప్పండి. వెదికీ వెదికీ అలసిపోతున్నాయి.
********

ఏది గుడ్డిది 
**********
     ఒక రైతు దగ్గర ఒక ఆవు వుండేది. ఒక రోజు ఒక దొంగ దాన్ని ఎత్తుకొని పోయాడు. రైతు చాలా బాధపడ్డాడు. ఇంటిలో పాలకు ఇబ్బంది అయింది. ఇంకొక ఆవును కొందామని పక్క ఊరిలో జరుగుతున్న సంతకు పోయాడు. ఆ దొంగకూడా అదే సంతకు దొంగతనం చేసిన ఆవును అమ్మడానికి తెచ్చాడు. అవును చూడగానే రైతు అది తనదే అని కనుక్కున్నాడు. కానీ ఆ దొంగ ఆ ఆవు తనదే అన్నాడు. ఇద్దరూ ఆవు నాదంటే నాదని గొడవ పడడంతో జనాలంతా చుట్టూ గుంపుగా చేరారు.

 అంతలో రైతు ఛటుక్కున ఆవు రెండు కళ్ళు మూసేసి 'ఈ ఆవు నీదే అయితే దీని రెండు కళ్ళలో ఏది గుడ్డిదో చెప్పుకో చూద్దాం' అన్నాడు. దొంగకు ఎంత ఆలోచించినా ఏ కన్ను గుద్దిదో తెలియలేదు. సరే ఏమైతే అదే కానీ ఒక రాయి విసిరి చూద్దాం అని  'కుడివైపుది' అన్నాడు. రైతు 'కాదు' అన్నాడు. వెంటనే దొంగ తడబడుతూ కుడి వైపుది కాదు, ఎడమ వైపుది. తొందరపాటులో మరిచిపోయా అన్నాడు. రైతు జనాల వైపు తిరిగి “అయ్యలారా ! నిజానికి దీని రెండు కళ్ళూ బాగానే వున్నాయి. దొంగను పట్టించడానికే ఒక కన్ను గుడ్డిదని చెప్పాను. కావాలంటే చూడండి" అని చేతులు తీశాడు.

జనాలంతా ఆవు వంక చూశారు. రైతు చెప్పినట్టే ఆవు రెండు కళ్ళూ బాగున్నాయి. దాంతో వాళ్ళు దొంగను మెత్తగ తన్ని ఆవును రైతుకు అప్పగించారు
**********
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

ఆశా దీపం -- కధ

సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది.  

 అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.

ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు.

 ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు.

ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. 🏚️ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.

ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. 

తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి.  🔥

తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.  

తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.😢😢

తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది.

అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. 😀

ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.

“నువ్వు మంట పెట్టి  పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.

ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు ............ 

 ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి..........     

ఉన్నతులు

ఏ పనిచేస్తే ప్రజలకు ఉపకారం జరుగుతుందో, లోకానికి మేలు చేకూరుతుందో, ఏ పని ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తుందో- ఆ పనిని ఉన్నతమైనదిగా నలుగురూ ప్రశంసిస్తారు. ఆ పని చేసిన వ్యక్తిని లోకం సదా గుర్తుంచుకొంటుంది, స్మరించుకుంటుంది. ఉన్నతుడని కీర్తిస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా సమాజం ఇలాంటివారి పట్ల గౌరవభావాన్ని ప్రదర్శిస్తుంది.

మానవ మనుగడకే కాకుండా సమస్త ప్రాణులూ బతకడానికి కావలసిన సకల పదార్థాలనూ సమకూర్చే భూమాతకు రోజూ నిద్రలేచాక కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ మంచం మీద నుంచి మన పాదాలను నేల మీదికి దించుతాం. భూమాత ఔన్నత్యాన్ని స్మరించుకుంటాం. సర్వకాల సర్వావస్థలయందు సకల జీవుల్నీ సంరక్షించే సర్వేశ్వరుడు సర్వోన్నతుడు. లోకేశ్వరుడి లక్షణ స్వభావాన్ని మానవులమైన మనం ఒంటపట్టించుకొని పరోపకారానికి నడుం బిగించాలి. పంచభూతాలలో ఒకటైన నేలతల్లి కూడా తన శక్తినంతటినీ సకల జీవులకు ధారపోస్తూనే ఉంది. తనలో నిక్షిప్తమైవున్న లోహాలు, చమురు మొదలైన పదార్థాలు ప్రజలకు నిరంతరం ఇస్తూనే ఉంది. భూదేవికి గల ఈ దాతృత్వమే ఆ తల్లి ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. సకల జీవులకూ ప్రాణవాయువును అందిస్తున్న వాయువు, ప్రాణసమానమైన నీటిని ఇస్తున్న వరుణుడు, వేడిమినిస్తున్న అగ్ని... వీళ్లంతా లోకాలను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నందువల్ల ఉన్నతులయ్యారు. పంచభూతాల్లోంచి ఆవిర్భవించి వారికి వారసులమైన మనమంతా ఆ ఔదార్యాన్ని, లోకోపకార గుణాన్ని పుణికిపుచ్చుకోవాలి. సమస్త ప్రాణికోటికీ సేవలు అందిస్తూ ఉండాలి. వారిలాగా మనం కూడా ఉన్నతులమనిపించుకోవాలి.
గోదావరి నది మీద ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించి కాలవల ద్వారా నీటిని సరఫరాచేస్తూ ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు సాగునీటికి తాగునీటికి కొరతలేకుండా చేసి అన్నపానీయాలను అందించి మహోన్నతుడయ్యాడు కాటన్‌ దొర. ప్రజల ఆకలిదప్పులను తీర్చడంలో తమ ధనప్రాణాలను సైతం అర్పించిన సహృదయులు, ఉదారులు ఎంతోమంది ఉన్నతులుగా లోకంలో విఖ్యాతిగాంచారు. ప్రాచీన భారతదేశంలో శిబి చక్రవర్తి, రంతిదేవుడు, దధీచి మొదలైనవారు పరుల కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఉన్నతులుగా ప్రసిద్ధిచెందారు.

నిటారుగా, ఉన్నతంగా ఎదిగివున్న చెట్ల కొమ్మలు పండ్ల భారంతో కిందికి ఒదిగి ఉంటాయి. ప్రజలకు, పక్షులకు తమ ఫలాలను ఆహారంగా అందిస్తాయి. ఆకలిని తీరుస్తాయి. ఇతరులకు సేవచేస్తూ చెట్లు తమ ఔన్నత్యాన్ని నిరూపిస్తున్నాయి. మనం పొలాల్లో ఏతంతో నీరు తోడుతున్న రైతును చూస్తాం. నీటిని బయటకు తెచ్చే ఏతంమాను చేస్తున్న పని వల్ల పొలం చక్కని పంటనిచ్చి ప్రజలకు ఉపకారం చేస్తోంది. ఏతంమానులాగే శక్తిమంతుడు, సమర్థుడు అయిన వ్యక్తి ఏ కారణం చేతనో ఎదుటివారి ముందు తలదించుకోవలసి వచ్చినా అతడిని అసమర్థుడని భావించరాదని పెద్దలు చెబుతారు. అతడు తన ఔన్నత్యాన్ని చాటుతూ- మళ్లీ   నలుగురిలో మన్ననలందుకొనే ఘనకార్యాలు చేస్తూనే ఉంటాడు.
ఈనాటి బాలలే రేపటిపౌరులు అని మనం భావిస్తాం. పెద్దవారయ్యాక ఆ బాలలు మంచి పౌరులుగా అందరి మన్ననలు పొందగలిగినప్పుడే గదా మన ఈ భావన సార్థకమవుతుంది. అందువల్ల పిల్లల్ని సాకే తల్లి, బిడ్డలను పాఠశాలకు పంపి విద్యాబుద్ధులు చెప్పించే తండ్రి తమ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతోపాటూ లోకజ్ఞానం, పారమార్థిక విషయాలను కూడా బోధిస్తారు. పిల్లలూ తమ గురువులు చెప్పిన విషయాలను ఒంటపట్టించుకొని పెద్దవారయ్యాక ఉత్తమపౌరులకు ఉండవలసిన లక్షణాలతో సమాజంలో మెలిగినట్లయితే- తల్లిదండ్రులు, గురువుల శ్రమ ఫలిస్తుంది. ఉన్నత మార్గంలో పయనించే తమ పిల్లల్ని చూసి లోకం ప్రశంసిస్తుంది. సమాజ ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని తమ కర్తవ్యాలను నిర్వర్తించిన వారే ఉత్తమ, ఉన్నత పౌరులు కాగలుగుతారు.
**********

చిట్టికథ

ఒక మహారాజుకి సకల భోగాలు అనుభవిస్తున్నా తెలియని అసంతృప్తి వెంటాడుతుండేది. ఏదో వెలితి బాధ పెడుతుండేది. అదే వ్యాకులతతో రోజూ సాయంకాలం తన ప్రాసాదంపై ఒంటరిగా పచార్లు చేస్తుండేవాడు.

అలా నడుస్తూ దూరంగా ఓ పూరి గుడిసెలో కుండలు చేసుకుని కాలం గడుపుతున్న ఓ పేద కుటుంబాన్ని గమనిస్తుండేవాడు.

పైకి సామాన్యంగా సాగిపోతున్నా ఆ కుమ్మరి కుటుంబంలో ఏదో తెలియని ఆనందం తాండవిస్తున్నట్లు మహారాజుకు అనిపించింది. ఎలాగైనా ఆ ఆనందం రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడాయన.

మరుసటి రోజు చీకటి పడుతున్న వేళ మహారాజు మారువేషంలో ఆ కుమ్మరి ఇంటి తలుపు తట్టాడు.

అనుకోని అతిథి వచ్చినా, ఆ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. సపర్యలు చేశారు. ఉన్నదాంట్లోనే మంచి ఆతిథ్యమిచ్చారు.

అప్పుడా మహారాజు ఇంటి యజమానితో, ‘నేనెవరో తెలియకపోయినా ఆత్మీయంగా ఆదరించారు. నేను పక్క ఊరిలో శ్రీమంతుణ్ణి. నా దగ్గర డబ్బుకు కొదవలేదు. ఇదిగో ఈ కానుక తీసుకోండి’ అంటూ వజ్రాల హారాన్ని బహూకరించబోయాడు.

వెంటనే ఆ కుమ్మరి చిరునవ్వుతో ‘మీ అభిమానానికి ధన్యవాదాలు. కానీ రోజూ కష్టానికి తగ్గట్టుగా సంపాదించుకుంటూ, అందులోనే ఆనందాన్ని వెదుక్కుంటున్న మా జీవితాలను ఈ  బహుమతి కకావికలం చేస్తుంది. లేనిపోని ఆశలను ప్రేరేపిస్తుంది. కొత్త కోరికలవైపు పరిగెత్తిస్తుంది. కుండల అమ్మకంలో నా ఆదాయం పెరిగితే సంతోష పడతాం. తప్ప ఇలా కాదు. ఆకస్మికంగా వచ్చిపడే సంపద తృప్తి కన్నా అపరిమిత దుఃఖాన్ని తెచ్చి పెడుతుంది.’ అని చెప్పాడు.

అలా మహారాజుకు కొత్త పాఠాన్ని నేర్పాడా కుమ్మరి.

ఉన్నదానితో తృప్తిపడేవాడు రాజులా ఉండగలడు .

భోగో యస్య సదాహేయ: ప్రియ: స్యాత్‌ నిత్య మస్తిత:

ససర్వ మంగళో పేతోపి అవశ్యం స్యాదంకిచన:* 

భోగము అనగా సుఖమును అనుభవించవలెను అని కోరిక. భోగము ఎంత ఇష్టమైననూ అది శాశ్వతము కాదు కావున దానిని విడువవలెను. భోగమును బాగా అనుభవించవలెనన్న కోరిక కలవారు సకల శుభములు, సంపదలు కలవారైననూ ఏమీ లేనివారే అగును. 

ఉన్నదంతా అనుభవించాలన్న కోరికతో అనుభవించడం మొదలుపెడితే అన్ని సంపదలు తొలగిపోతాయి.

 అనుభవించేది తృప్తి కొరకే కావున ఒకసారి తృప్తి పొందిన వారు మరల కావాలని అర్రులు చాస్తూ తపిస్తూ ఉంటే అన్ని ఉన్నా లేనివారే అగుదురు.

 భోగాని కి, సంపదకు తృప్తి పరమావధి. ఆ తృప్తి లేనివాడు సంపదలు ఉన్నా లేనివాడే.

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిఆలయం

ఆలయం దర్శనం ఉదయం 9:30 నుండి 12:30  వరకు మరియు మధ్యాహ్నం 2:30  నుండి సాయంత్రం 7:30 వరకు 

రాష్ట్రంలోనే అత్యంత పురాతన లక్ష్మీనరసింహ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట ఆలయం అంతర్వేది. ఆంధ్ర తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన అంతర్వేది... అందమైన బంగాళాఖాతం ఒడ్డున గోదావరి నదీశాఖయైన వశిష్టానది సంగమ స్థానంలో అలరారుతోంది. భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి విశేషాలు.

కృత యుగం లోని మాట ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.

ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్‌, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టుడు ఇక్కడ యాగం చేసినందు మూలంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధిగాంచినది.

 రక్తవలోచనుని కథ..:
ఒకానొక సమయంలో రక్తావలో చనుడు (హిరణ్యాక్షుని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భ వించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వంతో లోక కంట కుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణు లను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒక సారి విశ్వామిత్రుడుకి, వశిష్ఠుడుకి జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరి స్తాడు.

వశిష్ఠ మహర్షి శ్రీమహావిష్ణువును ప్రార్థించగా మహా విష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభ త్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుం డి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహారం తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

- ఆలయ విశేషాలు:
మొదటి ఆలయము శిధిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు శ్రీకొపనాతి కృష్టమ్మ. ఈయన పెద్దాపురపు జమిందారుల కుటుంబీకుడు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణం ఈయన విరాళాలు, కృషి ద్వారానే జరిగి నది. ఆలయ ప్రధాన ముఖద్వారము నకు ముందు ఈయన శిలా విగ్ర హము కలదు. ఈ ఆలయ ము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాల యము రెండు అం తస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా (నడవా) మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించినారు. ఆలయమునకు దూరముగా వశిష్టానదికి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించినారు. ఈవిధంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసి నారు. ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింప బడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి.

- వశిష్టాశ్రమము:
అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమ ము కలదు. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్ర మ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయము లతో ఇక్కడ అందమైన ఆశ్రమము నిర్మించబడినది. ఈ ఆశ్రమము వికసించిన కమలము మాదిరిగా నాలుగు అం తస్తులుగా నిర్మించినారు. చుట్టూ సరోవరము మధ్య కలు వపూవు ఆకారమున ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము. దీనికి సమీపముగా ద్యానమందిరం, పఠనా శాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి కల వు. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు కలవు.

- దీప స్తంభం:
దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా దీప స్తంభం (లైట్‌ హౌస్‌) కలదు. దీనిని బ్రిటిష్‌ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. దీని చుట్టూ అందమైన తోటలు, పచ్చక పెంచబడుతున్నది. కేవలం భక్తులు, యాత్రికులే కాక ఇక్కడికి పిక్నిక్‌, వనభోజనాలు వంటి వాటి కోసం వచ్చే సందర్శకుల, విధ్యార్ధులతో ఈ ప్రాంతం కళ కళలాడుతూ ఉంటుంది. లైట్‌ హౌస్‌ పైకివళ్ళి చూసేందుకు ఇక్కడ అనుమతి కలదు. మూడురూపాయల నామమాత్ర రుసుము టికెట్‌ కొరకు వసూలు చేస్తారు. దీని పనుండి చూస్తే లక్ష్మీనరసింహస్వామి దేవాలయము, వశిష్టాశ్రమము, మిగిలిన దేవాలయములు, దూరదూరం గా కల పల్లెకారుల ఇళ్ళ సముదాయాలు, తీర్రపాంతము వెంబడి కల సర్వితో టలు అత్యద్భుతంగా కానవస్తాయి.

- అశ్వరూ డాంభిక (గుర్రా లక్క) ఆలయము...
నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రధాన దేవాల యమునకు ఒక కిలోమీ టరు దూరములో కలదు. స్థల పురాణ రెండవ కధనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపు డు నరహరిఆతన్ని సంహరించేందు కు వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.

- అన్న చెళ్ళెళ్ళ గట్టు:
సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

సర్వేజనా సుఖినోభవంతు 
 ధర్మశాస్త సేవాసమితి విజయవాడ 7799797799

note: copied from a whatsapp post. 

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు

ఆధ్యాత్మిక వేత్త,ప్రసిద్ధ ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు జన్మదినం నేడు. ఆసందర్భంగా వారికి శుభాకాంక్షలు. జననం 14 జూలై 1959

బ్రహ్మశ్రీ చాగంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. వీరు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు.  బ్రహ్మశ్రీచాగంటి సుందర శివరావు, శ్రీమతి సుశీలమ్మల పుణ్య దంపతులకు వీరు 1959 జూలై 14వ తేదిన జన్మించారు. కోటేశ్వరరావు గారి  సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; వీరి ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని,, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు. వీరు ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డారు.

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. వీరికి ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. సామాన్య కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న, అన్న  స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచే వారి విద్యాబుద్ధులు వికసించాయి.వారు యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.

వారి ధారణాశక్తి చాలా గొప్పది. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం తన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.

వారు ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.

అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. వారి స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.

చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.

వారు  బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వంటి వారి ఆవశ్యకత ప్రస్తుత మన తెలుగు సమాజానికి ఎంతేనా వుంది. ధర్మం గాడి తప్పుతున్న ఈ తరుణంలో మన హిందూ సంస్కృతీ, సంప్రదాయాలు, ఆచారాలు, దైవ చింతన తెలిపే మహానుభావుల దివ్య ప్రసంగాలు ఈ సమాజపు దారి తెన్నులు మర్చి హిందుత్వం వైపు సమాజాన్ని నడిపించే దిశగా పయనించాలిసిన అవసరం వుంది. ఇతర మతస్తులు మన మతాన్ని హీనంగా విమర్సిస్తూవుంటే వారి విమర్శలను ఎదుర్కొనే శక్తి ప్రతి హిందువుకు కావలి.  అప్పుడే మనం మత మార్పులను ఎదుర్కోగలుగుతాము. 

తెలుగు భాషని మన ఇళ్లలోనే వాడటం మానేసాం.


ఇప్పుడు బళ్ళలో కూడా... 
ఎప్పుడో కొన్నేళ్ళక్రితం 
నాయని జయశ్రీ రాసిన వ్యాసం....

"డోర్ లాక్ చెయ్యకండి"

‘నేను వెళ్తున్నా, డోర్ లాక్ చేస్కో’, ‘నా కార్ కీస్ ఎక్కడ?’
ఇందులో ‘కార్’ తప్ప అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
కానీ మనం వాడం.

ఎందుకు? 
ఇది ఈరోజు నాకు హఠాత్తుగా వచ్చిన ఆలోచన కాదు. 
చాలా రోజుల నుంచీ మనసులో నలుగుతున్న ప్రశ్నే.
ఓ ఇరవై యేళ్ళు వెనక్కి వెళితే, 
తలుపు తాళం వేసుకో, 
గడిపెట్టుకో అనే వాళ్ళం. 
ఇవేకాదు, 
చిన్నతనంలో వినిన, వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్నమొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకి నేర్పించాల్సింది పోయి, మనమిలా ఎందుకు మారిపోయాం?

మన తెలుగులో మాటలు లేవా? 
ఎందుకు లేవు, భేషుగ్గా ఉన్నాయి. 
కానీ మనం పలకం. 

వంటింటిని కిచెన్ చేసాం. 
వసారా వరండాగా మారింది. 
ఇలా చావడి, పంౘ, ముంగిలి, నట్టిల్లు, తలవాకిలి, నడవ, పెరడు, ఇవన్నీ మరచిపోయాం.

మన ఇళ్ళకి చుట్టాలు, బంధువులు రావడం మానేసారు. 
గెస్ట్‌లే వస్తారు. 
ఆ వచ్చిన వాళ్ళు మనింట్లో అన్నం తినరు. 
ఏ లంచో, డిన్నరో చేస్తారు. 
భోజనానికి కూర్చొన్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. 
అందులో వడ్డించేవన్నీ రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రై, చికెన్, మటన్ వగైరాలే.

అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, కోడికూర, మాంసం తినండి అంటే ఇంకేమన్నా ఉందా,  
వాళ్ళేమనుకుంటారో అని భయం.
అంగడి (కొట్టు) కి వెళ్ళేటప్పుడు సంచి తీసికెళ్ళం. 
బ్యాగ్ పట్టుకుని షాప్‍కి వెళ్తున్నాము. 
అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాము. 
కూరగాయలు, పళ్ళు కుళ్ళిపోయున్నాయి గదా మరి.

ఏమండీ మీ మనవరాలికి కానుపు అయ్యిందా అని ఆ మధ్య ఓ పెద్దావిడని అడిగా. 
ఏంటమ్మా డెలివరీ అయిందా అనకుండా నువ్వింకా కానుపు అంటావేంటి? అని ఎదురు ప్రశ్న వేసింది. 
బిత్తరపోవడం నావంతయింది. 

టీవీలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలు, 
వంటా-వార్పు కార్యక్రమాలు రోజూ చూసే వాళ్ళకి అలవోకగా ఆంగ్లపదాలు పట్టుబడతాయి మరి. 
అందుకే ఆవిడ అలా అని ఉండొచ్చు. 

టీవీ వంటల కార్యక్రమంలో ఒకావిడ మనకి వంటకం ఎలా చెయ్యాలో చెబుతుంది. 
అది ఏ భాషో మీరే చెప్పండి. 
‘కొంచెం సాల్ట్, మిర్చీపౌడర్, ధనియాపౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి, 
ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, 
స్టౌవ్ ఆఫ్‍చేసి మసాలాపౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి.’ ఇలా సాగుతుంది. 
మరి మన కూరలకి అల్లం, వెల్లుల్లి, ఉప్పూ, కారాల రుచులు ఎలా తగుల్తాయి?

నిన్న మా పక్కింటాయన వచ్చి 
‘మా సిస్టర్స్ సన్ ది మేరేజ్ ఉందండి, 
ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తుండండి’ 
అని చెప్పి వెళ్ళాడు. 
మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరితనం ఉంటుంది? ఎందుకిలా ముచ్చటైన పదాల్ని వాడటానికి కూడ మనం వెనుకాడుతున్నాం?
అమ్మ, నాన్న అని పిలవడం ఎప్పుడో మానేసాం. 
అత్త, మామ, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న 
అందరూ పోయి ఆంటీ అంకుల్ మిగిలారు. 
ఇప్పుడు అక్క, అన్నా, బావ, మరిది, వదిన, మరదలు వగైరాలంతా దూరమై కజిన్స్ అయిపోయారు.

పిల్లల్ని బడికి పంపడం కూడ మానేసాం. 
స్కూల్‍కే పంపిస్తాం. 
సరే బడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాగూ ఇంగ్లీషులో మాట్లాడక తప్పదు. 
ఇంటి దగ్గరన్నా తెలుగు మాటలు మాట్లాడాలని అనుకోము. 

మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలని వదిలేస్తున్నాం? 
ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే మనకి సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా? 
తెలుగు మాటలు మనకి మొరటుగా ఎందుకనిపిస్తున్నాయి? 
ఇది పరభాషా వ్యామోహం మాత్రమే కాదు. 
నాకూ ఇంగ్లీషు ముక్కలు వచ్చు, 
నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, 
ఇతరులు అనుకోవాలన్న భావన.

ఇలా ఆలోచిస్తాం కాబట్టే మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. 
ఒకప్పుడు సంస్కృతం పట్ల ఇదే దృక్పథం అలవరచుకున్న తెలుగు వాళ్ళు 
తూర్పు పడమర మిగిల్చారు 
కానీ ఉత్తరం దక్షిణం మరచిపోయారు. 
ఈ కాలంలో ‘వడ’, ‘తెన్ను’ అంటే ఎవరికి తెలుస్తుంది? 
‘జనని సంస్కృతంబె ఎల్ల భాషలకును’ 
అని భావించిన గొప్పగొప్ప పండితులు 
వారి పాండిత్య ప్రకర్ష కోసం తెలుగు మాటలు వదిలేసి సంస్కృతం వాడటం మొదలుపెట్టారు. 
వారి దగ్గర పాఠం వల్లెవేసిన వాళ్ళకి అదే గీర్వాణం వంటబట్టింది. 

అదే వరవడిలో మనకి పగలు మిగిలింది, మావు చీకట్లో కలిసిపోయింది. 
ఉసురుకి ప్రాణం పోయింది. 
ఎడం దూరం అయింది. 
అన్నం తినడం మొదలు పెట్టాక కూడు చద్దిపట్టింది. ప్రస్తుతం మనం సంతోష పడాలన్నా, 
బాధ పడాలన్నా, 
ఆఖరికి భయపడాలన్నా 
సంస్కృతంలోనే పడుతున్నాం. 
ఇలా చెబుతూ పోతే వీటికి అంతే లేదు.  

వివిధ జానపద కళారూపాలలో ఉన్న ఆనాటి తెలుగు సాహిత్యం, 
శాసనాలు దేశీయ ఛందస్సు లోనే ఉండేవి. 
తెలుగు కవులు దేశి కవిత్వాన్ని వదిలి మార్గ కవిత బాట పట్టడంతో చాప కింద నీరులా భాషలో మార్పు వచ్చింది. 
ఇంత జరిగినా మన పల్లె పట్టుల్లో మాత్రం 
జానపద కళలు నిన్న మొన్నటి వరకు బతికే ఉన్నాయి. 
వారి నోట అచ్చ తెనుగు మాటలే వినిపించేవి. 

ఇప్పుడు మాత్రం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంటపట్టాయి.

ఈ మధ్య ఓ సారి ప్రయాణం మధ్యలో 
ఒక చిన్న పల్లెటూర్లో కారు ఆపి 
ఇక్కడ మంచినీళ్ళ సీసాలు ఎక్కడ అమ్ముతారు బాబూ అని ఒకతన్ని అడిగా. 
అతడు కొంచెం వింతగా నావైపు చూసి, 
మినరల్ వాటర్ బాటిల్సా మేడం? అన్నాడు. 
అవునయ్యా అన్నా. 
అలా చెప్పండి మేడం అర్థం అవుతుంది, 
అని అవి అమ్మే చోటు చూపించాడు. మూలమూలలకి విస్తరించిన టివి ప్రసారాలు, 
ఇంటర్నెట్ల ప్రభావం వలన ఈ మార్పు చాల త్వరగా జరుగుతూ ఉంది. 

భాషలో లేని పదాలను 
పరభాషల నుంచి తెచ్చుకొని వాడుకోవడం వల్ల 
ఆ భాష పరిపుష్టమౌతుంది. 

అలాగని వాడుకలో ఉన్నమాటలని వదిలేసి 
పరభాషా పదాలు వాడటం వల్ల భాష క్షీణించిపోతుంది. ఇంకా సమయం మించిపోలేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు మాటలు 
అంతరించి పోకుండా ఉండాలంటే మనం వీలైనంత వరకు తెలుగు మాటలే వాడాలి. 

బయటకెళితే ఎలాగు తప్పదు అనుకున్నా,కనీసం ఇంటి గోడల నడుమైనా ఆపని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి, అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం. 

-జయశ్రీ నాయని

అయనాలు అంటే ఏమిటి

సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు.

ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.

ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. 'అయనం' అంటే ప్రయాణం అని అర్ధం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. కానీ సూర్యోదయాన్ని గమనిస్తే, అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21, సెప్టెంబరు 23. మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా, మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు.

ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడనికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.

శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపసాన, తరుచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి.

ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహళాయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాదులు చేయడం విధి, ఎంతో ముఖ్యం, శుభప్రదం. పితృ ఋణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.

ధ్యానం, మంత్ర జపాలు, సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు, పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, అవసరంలో ఉన్న వారికి దానం చేయడం, అన్నదానం, తిల (నువ్వుల ) దానం, వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి, మనసుకు మేలు చేస్తాయని, పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు.

- సేకరణ

దక్షిణాయనం అంటే ఏంటీ ?

ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం , జూలై 16 నుంచి జనవరి14 వరకు దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయనంలో పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు చేయడం , సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు.
ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన , దాన , జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.

ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ , దక్షిణాయనాలు. 'అయనం' అంటే ప్రయాణం అని అర్ధం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. కానీ సూర్యోదయాన్ని గమనిస్తే , అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21 , సెప్టెంబరు 23.  మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు.
ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు , మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.
శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం , ఉపాసన , తరుచుగా ఉపవాసాలు , పూజలు , వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి , ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప , దాన , పూజలు ఆరోగ్యాన్ని , అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి.

ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు , విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు. ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహలయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ , మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి , ఎంతో ముఖ్యం , శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.

చేయవలసినవి

ధ్యానం , మంత్ర జపాలు , సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు , పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు , సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం , అవసరంలో ఉన్న వారికి దానం చేయడం , అన్నదానం , తిల (నువ్వుల ) దానం , వస్త్ర దానం , విష్ణు పూజ , విష్ణు సహస్రనామ పారాయణ , సూర్యరాధన , ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి , మనసుకు మేలు చేస్తాయని , పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు.

ఓం నమో నారాయణాయ నమః

నారాయణుడే మనలో వాసుదేవుడిగా దిగివస్తాడు. ఇంకొంచెము దిగివస్తే సంకర్షణుడు అవుతాడు. ఇంకొంచెము దిగివస్తే ప్రద్యుమ్నుడు అవుతాడు. మన మనసులోకి పూర్తిగా దిగివస్తే అనిరుద్ధుడవుతాడు. 

అనిరుద్ధుడు మన మనసులో కూర్చుంటే మన ఇంద్రియాలన్నీ చేయవలసిన పనులే చేస్తాయి. 

బుద్ధిలో ప్రద్యుమ్నుడు కూర్చుంటే చేయవలసిన పనులే ఎలా చేసుకోవాలో తోస్తాయి. 

సంకర్షణుడు వాసుదేవునితో ఉంటే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు పనిచేస్తూ ఉంటారు.

రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులలో రాముడు వాసుదేవుడు, లక్ష్మణుడు సంకర్షణుడు, భరతుడు ప్రద్యుమ్నుడు, శత్రుఘ్నుడు అనిరుద్ధుడు అందరూ కలిసి వున్నట్టే.

బాధాతప్త జీవితాలు…



👉అవును, ఎవడి ఖర్మ ఎప్పుడు కాలిపోతుందో అర్థంకాని జీవితమైపోయింది అందరిదీ.. 
👉హమ్మయ్య, ఇవాల్టికి నాకు కరోనా రాలేదు.. గండం గడిచిపోయిందనుకుని సంబరపడిపోయి బతికేసే రోజులు వచ్చేశాయి..
👉ఏదీ ఇంతకుముందులా జీవితం లేదు.. ఇక ముందూ ఉండకపోవచ్చు.. అంతా విచిత్రం. అంతా విడ్డూరం..
అంతా భయం .. భయం .. భయం.

👉పక్కింటోళ్లతో మాట్లాడుకోవడం మానేశాం.. పక్కింటి పిల్లల్ని మన ఇంటికి రానివ్వడం ఏనాడో మర్చిపోయాం..ఎక్కడ కరోనా వస్తుందోనని..మన పిల్లల్ని నాలుగు గోడల మధ్య కట్టేస్తున్నాం.. కరోనా పుట్టుపూర్వోత్తరాల గురించి మాటలు రాని పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పేస్తున్నాం. ఆఖరికి పక్కింటోళ్లు పెట్టిన దేవుడి ప్రసాదం కూడా తినడం మానేశాం.ఎక్కడ ఆ కరోనా పురుగు అందులో ఉందోనని..
👉ఏదో తెలీని అంటరాని తనం తెలియకుండానే మనం అలవాటు చేసేసుకున్నాము..

👉ఇంట్లో కూడా చాలా మంది మాస్క్ లు కట్టుకుని బతికేస్తున్నారు. _కూరగాయలపైనా శానిటైజర్ కొట్టి ఎండలో ఎండబెట్టి వండుకుంటున్నారు..
_రోజుకు వందసార్లు చేతులు కడిగేస్తున్నారు.
_మాస్క్ కట్టీ కట్టీ మూతి తెల్లగా అయిపోయింది..
_చేతులకు శానిటైజర్ రాసీ రాసీ.. పొట్టు ఊడిపోతోంది.. _కషాయాలు తాగీ తాగీ నోరంతా అదోమాదిరిగా తయారైంది..

👉పండగలు, పబ్బాలు నాలుగు నెలల క్రితమే మానేశాం.. 
_నలుగురు కలిసి సంతోషంగా నవ్వుకుని నాలుగు నెలలు దాటిపోయింది.
👉మందు కొట్టేటప్పుడు తాగుబోతులు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసేస్తున్నారు.
_కబుర్లు చెప్పుకుంటూ చాయ్ దుకాణం దగ్గర చాయ్ తాగుతూ.. సిగరెట్ పీకే ఆలోచనలు కల్లోకి కూడా ఎవరికీ రావడం లేదు.
_పాలప్యాకెట్ వేసేవాడు కూడా ఇంటి కింద గేటు దగ్గరే వేసి వెళ్లిపోవాలి..
_ఏ ఆమెజానోడో.. ఫ్లిప్ కార్టోడో ఖర్మకాలి ఇంటి గుమ్మం దాకా వచ్చాడో చచ్చాడే.. గుమ్మానికి ఆవతలెక్కడో ప్యాకెట్ విసిరి పారేస్తే తెచ్చుకుని దాన్ని శానిటైజర్ లో ముంచి లేపి గానీ ఓపెన్ చేయడం లేదు.. ఎక్కడ మహమ్మారిని అందులో ఏమూలో వేసుకొచ్చాడోమోనని..
_స్విగ్గీలు, జొమాటోల్లో ఆర్డర్లు మానేశాం.. ఒకవేళ ఆర్డరిచ్చినా ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్ నే ఆర్డరిస్తున్నాం.అంతేగాదు ఆర్డరిచ్చేముందే డెలివరీ బాయ్ కి నో కాంటాక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం..

👉పార్క్ ల్లో ప్రేమ జంటల కిలకిలలు, ముద్దూ ముచ్చటలూ మాయమైపోయాయి..
_స్విమ్మింగ్ పూల్స్ లో స్విమ్మింగ్ మానేసాం..
_అందమైన జలపాతాలు, పర్యాటక ప్రాంతాల్లో ఫ్యామిలీతో కలిసి వెళ్లడం అనేది.. ఊహల్లో మాత్రమే..
_సినిమా దియేటర్ లో పాప్ కార్న్ తింటూ సినిమా చూసే రోజులు పోయాయి.. ఇకపై ఉండకపోవొచ్చు..
_ఆఫీసులన్నీ బోసిపోయాయి… షాపులన్నింటికీ తాళాలు పడిపోయాయి..
_కర్మాగారాలన్నీ మూతబడిపోయాయి..
_వ్యాపారాలన్నీ నాశనమై పోయాయి..ఉద్యోగాలన్నీ ఎగిరిపోయాయి.. జీవితం సంకనాకిపోయింది…

👉అంతా భయం.. భయం.. భయం..
_బయటికెళ్తే కరోనా..
_టీ తాగితే కరోనా..
_సమోసా తింటే కరోనా.. 
_పానీ పూరి తింటే కరోనా..
_కూరగాయల్లో కరోనా..
_పాలల్లో కరోనా..
_షాపుకెళ్తే కరోనా…
_పార్క్ కెళ్తే కరోనా..
_వాకింగ్ కెళ్తే కరోనా..
_గుడికి వెళ్తే కరోనా… చర్చికి వెళ్తే కరోనా..పెళ్లి కి వెళ్తే కరోనా… ఫంక్షన్ కి వెళ్తే కరోనా.. ఎక్కడికి వెళ్లినా కరోనానే..

👉ఏం చేస్తున్నాం..ఎవడు ఏం చెప్పినా వెంటనే పాటించేస్తున్నాం..
_ఎవరో ఏదో తింటే కరోనా రాదంటే అది కసకసా నమిలి మింగేస్తున్నాం..
_ఎవరో ఏదో తాగితే కరోనా రాదంటే పిచ్చి కషాయాలన్నీ తాగేస్తున్నాం..

👉కరోనాతో చచ్చింది కన్నతండ్రైనా.. తోడబుట్టిన సోదరి అయినా కడుపున బుట్టిన పిల్లలైనా ఎవరి దగ్గరకూ వెళ్లలేకపోతున్నాం.. మూటగట్టి నిర్ధాక్షిణ్యంగా శవాన్ని బుల్డోజర్ తో మున్సిపాల్టీ వాళ్లు గోతిలోకి విసిరిపారేస్తే టీవీల్లో చూసి కన్నీళ్లు పెట్టేసుకుంటున్నాం..
👉పక్కింటోడికి చిన్న జ్వరం వచ్చినా కరోనా వచ్చిందేమోనని ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లిపోతున్నాం… రోడ్డుమీద ఎవరైనా తుమ్మితే, దగ్గితే వణికిపోతున్నాం.. అంతా భయం .. భయం.. భయం.. చస్తా మేమోనని భయం..
_చావొస్తుందేమోనని భయం.. బతకాలి..మనం మాత్రమే బతకాలి..
_ఏ కరోనాలు సోకకుండా మనం, మన పిల్లలు మాత్రం క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి.. అంతే..అదే కావాలి.

👉రేపటి సంగతి ఏంటో తెలీదు.. 
_వ్యాక్సిన్లు వస్తాయో రావో తెలీదు..
_రేపటి తరం పరిస్థితి ఏంటో తెలీదు..
_బతకడమెలాగో అర్థం కావడం లేదు.
👉డబ్బులు లేనోళ్లకి చాలా మందికి పూట గడవడం లేదు.. డబ్బులెక్కువైనోళ్లకి సమయం గడవడం లేదు..
_ఇంకొన్నాళ్లకి చాలామంది మానసిక వ్యాధి గ్రస్థుల్లా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
_భయంతో ఇప్పటికే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. వ్యాపారాలు దెబ్బతిని అల్లాడిపోతున్నారు.

👉ఇలాంటి విపత్కర సమయంలోనూ ఒకరికి ఒకరు సాయం చేసుకునే మంచితనం, మానవత్వం కనీసం మన దరిదాపుల్లోకి కూడా రావడం లేదు.
👉పక్కోడు తిండికి లేక అల్లాడుతున్నా.. ఉద్యోగం లేక బాధపడుతున్నా కనీసం స్పందించే హృదయం లేదు.. డబ్బంతా ఇళ్లల్లో, బ్యాంకుల్లో దాచుకుంటాం. 
👉అంతే అంతా కరోనా జీవితాలు..
👉అన్నీ బాధాతప్త  జీవితాలు….