30, ఆగస్టు 2023, బుధవారం

భూచక్రగడ్డ విశేషాలు -

 భూచక్రగడ్డ విశేషాలు  -


       సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను  ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు.  నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి. 


          ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి. 


             భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.


           ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో " కాయసిద్ది " అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.


        పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.


   

   మరింత సంపూర్ణ మరియు వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  

తుం గ భ ద్రా న ది

 శు భో ద యం!👏👏

              చొప్పకట్ల.


తుం గ భ ద్రా  న ది

...........................


గంగా సంగమ మిచ్చగించునె, మదిన్  కావేరి  దేవేరిగా 

అంగీకారమొనర్చునే, యమునతో ఆనందమున్ పొందునే, 

రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాక రేంద్రుండు నీ 

అంగంబంటి సుఖించునేని, గుణభధ్రా తుంగభద్రా నదీ!


తెనాలి రామకృష్ణ కవి

పాండురంగ మాహాత్మ్యము

ప్రథమాశ్వాసం

139 వ పద్యం


తెనాలి రామకృష్ణ కవి తుంగభద్రానదిని స్తుతిస్తున్నాడు. 


ఓ తుంగభద్రా నదీ!

నీవు గుణభద్రవు, నీవు సముద్రునితో కలవడం లేదు. ఒకవేళ, తన ఉత్తుంగ తరంగ హస్తాలతో రత్నాకరేంద్రుడైన సముద్రుడు నీ స్పర్శా సౌఖ్యాన్ని గనక పొంద గలిగి వుంటే, అతడు తానిప్పుడు అనుభవిస్తున్న గంగాసంగమాన్ని ఇష్టపడతాడా? కావేరిని దేవేరిగా అంగీకరిస్తాడా? యమునతో ఆనందాన్ని పొందుతాడా? 

అవేవీ ఆ నదులతో పొందబోడని పద్యభావం.


ఈ పద్యంలో సముద్రంలో ప్రత్యక్షంగా కలిసే నదులు రెండు - గంగ, కావేరి. అట్లా కలవని ఉపనదులు రెండు - యమున, తుంగభద్ర. తక్కిన నదీ సముదాయాన్ని కవి పేర్కొనడం లేదు. యమున శాఖానది. త్రివేణి వద్ద గంగతో సంగమిస్తుంది. కాకపోతే, సముద్రుడు యమునతో కూడా ఆనందాన్ని పొందుతున్నాడని వక్కాణిస్తున్నాడు. అంటే, యమునానది, గంగతో బాటు రహస్యంగా ప్రవహించి, సముద్రునితో రహస్య దాంపత్యం నెరపుతున్నదని కవి భావం. అందుకే యమునతో "ఆనందమున్ పొందునే" అంటున్నాడు.

 

విశ్వనాథ వారు ఈ పద్యం గురించి రాస్తూ ఇట్లా అంటారు: "యమున ప్రయాగ వద్ద గంగతో కలిసి ఆమె వెనక దాగికొని వెళ్ళుచున్నది. గంగకు కూడా తెలియకుండా వెళ్ళు చున్నదేమో! సముద్రునకు యమున తోడి సంగమం చాల రహస్య సంగమం. అందుచేత అతడధికమైన సుఖాన్ని పొందుచున్నాడు. అందుకనియే గంగా కావేరుల విషయంలో ఉపయోగించి ఆనంద శబ్దమును వాడినాడు. గంగా కావేరితో సంసారం చేయుచున్నాడు. యమునతో ఆనందమును పొందుచున్నాడని అర్థము" .


ఇది విశ్వనాథవారి వ్యాఖ్య. మరి తుంగభద్ర విషయం? ఆ నది సముద్రునితో రహస్య కాపురం చెయ్యడం లేదని, ఒక్కసారి గనక తుంగభద్రా సౌఖ్యం సముద్రునికి కలిగితే, యమునను పరిత్యజించి, తుంగభద్ర తోనే ఆనందాతిరేకాన్ని పొందుతాడనీ కవి తాత్పర్యం.


ఇదంతా రామకృష్ణ కవి పద్యరచనలో చూపించే గడుసుదనం.


శబ్ద సౌందర్యంలో ఈయన ఎవరికీ తీసిపోడు. ఈ పద్యంలో తుంగభద్ర పొంగులను చూపడానికి శార్దూల వృత్తాన్ని ఎన్నుకున్నాడు. ఇతర నదులను వర్ణిస్తున్నా ఆయన ధ్యాస తుంగభద్ర పైనే. అందుకే అందుకు అనుగుణమైన పాదప్రాసను ఎన్నుకున్నాడు. గంగాసంగమము, అంగీకార మొనర్చడము, రంగత్తుంగ తరంగ హస్తాల సముద్రుడు, అంగంబంటి సుఖించడము - తుంగభద్రానదిని స్ఫురింపజేసే శబ్దాలు ఇవన్నీ. 

All the sounds that rhyme with the spelling of Tungabhadra.


ఇవి గాక, కావేరి దేవేరి కావడము, తుంగభద్ర గుణభద్ర కావడమూ, ఈ ప్రాసా సౌందర్యాలన్నీ ఒలకబోసి, మీదికి లంఘించే శార్దూల పద్యంలో సముద్రుడు, కనీసం భావనా ప్రపంచంలో నైనా తుంగభద్రను తన ఉత్తుంగ తరంగ హస్తాలతో గాఢ పరిష్వంగంలో చేర్చుకొక పోతాడా అనే భ్రమను సృష్టిస్తాడు.


 ( మోహన్ గారి సుదీర్ఘవ్యాసంలో ఇది కొంతభాగం మాత్రమే!)


అక్టోబర్ 1971 - నివర్తి మోహన్ కుమార్


 


👏🌸🌷🌷💐💐🌷🌷🌷👏🌷🌷💐

A


 

భూజనసురభాష

 *1866*

*కం*

భూజనసురభాష కరణి

తేజములొందెడి గతులను తీరిన తెలుగున్

ఓజులు సైతము విడిచిన

నోజమ్ములు తగ్గబోవు నుర్విన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! భూజనులకు దేవభాషవలె వెలుగొందేవిధంగా సంస్కరించబడిన తెలుగు ను ఉపాధ్యాయులు (ఓజులు) కూడా విడిచిపెట్టి ననూ దాని ప్రకాశములు(ఓజములు) ఈ భువిలో తరగవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

శ్రీ రాజీవ్ లోచన్ Temple

 🕉 మన గుడి 


⚜ ఛత్తీస్‌గఢ్ : రాజిమ్ (రాయపూర్)






⚜ శ్రీ రాజీవ్ లోచన్ Temple


💠 రజిమ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని ప్రయాగ్ అని పిలుస్తారు.  నదులు, అందమైన దృశ్యాలు మరియు దేవాలయాలు ఈ మూడింటిని ఒకే చోట చూడాలనుకుంటే, ఖచ్చితంగా రజిమ్‌కు రండి. వర్షాకాలంలో దీని అందం మరింత పెరుగుతుంది.  


💠 ఇది గరియాబంద్ యొక్క ఈశాన్యంలో మహానది యొక్క కుడి ఒడ్డున ఉంది, ఇక్కడ పరి మరియు సొంధూర్ అనే దాని ఉపనదులు కలుస్తాయి. 

మహానది, పారి నది మరియు సొంధూర్ నది సంగమించడం వల్ల దీనిని ఛత్తీస్‌గఢ్ త్రివేణి సంగమం అంటారు.  ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమ నుండి మహాశివరాత్రి వరకు ఇక్కడ భారీ జాతర జరుగుతుంది.  


💠 సంగం మధ్యలో కులేశ్వర్ మహాదేవ్ యొక్క భారీ ఆలయం ఉంది. 

శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రదేశంలో మహాదేవ్‌ను పూజించాడని నమ్ముతారు.  

ఈ ప్రదేశం యొక్క పురాతన పేరు కూడా కమల క్షేత్రం.


💠 రాజిమ్‌లో అనేక ప్రధాన ఆలయాలు మరియు ఆకర్షణీయ కేంద్రాలు ఉన్నప్పటికీ.  అయితే ఈ రోజు మనం ఇక్కడ ఉన్న ప్రసిద్ధ రాజీవ్ లోచన్ దేవాలయం గురించి మాట్లాడుకుందాం.  


💠 రాజీవ్‌లోచన దేవాలయం చతుర్భుజంగా నిర్మించబడింది.  ఇది శంఖం, చక్రం, గద మరియు పద్మాలతో నల్లరాతితో చేసిన నాలుగు చేతుల శ్రీ మహావిష్ణువు విగ్రహం. 


💠 ప్రజల విశ్వాసాల ప్రకారం, రాజీవ్ లోచన్ ఆలయాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు.

రాజీవ్ లోచన్ దేవాలయం ప్రాచీన భారతీయ సంస్కృతి మరియు హస్తకళల యొక్క ఏకైక సంగమం.  ఈ ఆలయంలో విష్ణువు విశ్రమిస్తాడని ప్రజల నమ్మకం.


🔅 ఆలయ చరిత్ర 🔅


💠 ఈ ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది.  

ఈ ఆలయం లోపల 1197  యొక్క శాసనం ఉంది . ఈ ప్రదేశం యొక్క పురాతన పేరు కమల క్షేత్రం.  విశ్వం ప్రారంభంలో విష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలం ఇక్కడ ఉందని మరియు బ్రహ్మా ఇక్కడ నుండి విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు, అందుకే దీనికి కమలక్షేత్రం అని పేరు వచ్చింది.  ప్యారీ నది, సొంధూర్ నది మరియు మహానది సంగమం అయిన రజిమ్ ఛత్తీస్‌గఢ్ యొక్క ప్రయాగగా పరిగణించబడుతుంది.  

ఈ స్థలంలో అస్తికల నిమజ్జనం మరియు పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు మరియు పిండతర్పణం నిర్వహిస్తారు.


💠  రాజీవ్‌లోచన్ దేవాలయంలో ఉత్తరం మరియు దక్షిణంలో ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మహామండపం మధ్యలో గరుడుడు ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. గర్భగుడిలో, రాజీవ్లోచన్ అంటే సింహాసనంపై విష్ణుమూర్తి ఉన్నాడు. ఈ విగ్రహం నల్లరాతితో చేసిన చతుర్భుజి విష్ణుమూర్తి. శంఖ, చక్ర, గద, పాదములను చేతిలో ఉన్నవాడు, లోచన నామముతో పూజింపబడువాడు. ఆలయానికి రెండు వైపులా పరిక్రమ మార్గం ఉంది.

మహామండపం పన్నెండు రాతి స్తంభాలతో నిర్మించబడింది.


💠 ఉత్తరం వైపున ఉన్న ద్వారంలోంచి బయటకు వస్తే సాక్షి గోపాల్‌  ఆలయం కనిపిస్తుంది. తరువాత, చుట్టూ నరసింహ అవతారం, బద్రీ అవతారం, వామనావతారం, వరాహ అవతారం ఉప ఆలయాలు ఉన్నాయి.


💠 రెండవ ప్రకారంలో రాజరాజేశ్వర్, సతీ మాత ఆలయం ఉన్నాయి.

దీని తరువాత నదుల వైపు వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. ఇక్కడి ద్వారం పశ్చిమ దిశలో ఉన్న ప్రధాన మరియు పురాతన ద్వారం. దానిపై రజిమ్ పురాతన పేరు కమలక్షేత్ర పద్మావతి పూరి అని వ్రాయబడింది.


💠 నది ఒడ్డున భూతేశ్వర్ మరియు పంచేశ్వర్ నాథ్ మహాదేవ్ ఆలయాలు ఉన్నాయి మరియు త్రివేణి మధ్యలో కులేశ్వర్ నాథ్ మహాదేవ్ యొక్క శివలింగం ఉంది.


💠 రాజీవ్‌లోచన్ దేవాలయం ఇక్కడి దేవాలయాలన్నింటిలో కెల్లా పురాతనమైనది.


💠 రాజీవ్‌లోచన ఆలయంలో ఒక మూలలో, గజరాజు తన తొండంతో తామరపువ్వును పట్టుకొని ఉన్నట్టు విగ్రహాలు ఉంటాయి.

గజేంద్ర మోక్షాన్ని గుర్తుకు చేస్తూ గజరాజు పుష్పాలతో చతుర్భుజడైన శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తున్న విగ్రహం దేశంలో ఇంకా ఎక్కడ ఉండదు. ఇది ఇక్కడి విశేషం.


💠 దీని గురించి ప్రముఖ కథనం ఇలా ఉంది : మొసలి చేత హింసించబడిన గజరాజు తన తొండంతో తామర పువ్వును పట్టుకుని రాజీవ్ లోచన్‌కు అందించాడు. ఈ తామర పువ్వు ద్వారా, గజరాజు తన బాధనంతా విష్ణువు ముందు విన్నవించాడు. ఆ సమయంలో విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నాడు. మహాలక్ష్మి అతని పాదాలను నొక్కుతోంది. గజరాజు బాధను చూసిన దేవుడు వెంటనే లేచి చెప్పులు లేకుండా పరుగెత్తుకుంటూ ప్రస్తుతం రాజీవ లోచన ఆలయం ఉన్న ప్రాంతానికి చేరుకుని గజరాజును రక్షించాడు. గజేంద్రమోక్ష ఘట్టం ఈ ప్రదేశంలోనే జరిగింది అని ఈ ప్రాంత వాసుల నమ్మకం.


💠 త్రివేణి సంగమం మధ్యలో ఉన్న "కులేశ్వర్ మహాదేవ్" ఆలయం, దాని మహామండపం దగ్గర ఒక శాసనం ఉంది, దాని ప్రకారం ఈ ఆలయం 8-9వ శతాబ్దంలో నిర్మించబడింది . ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి ఈ దేవాలయం సజీవ సాక్ష్యం. 


💠 రైలులో : రాయ్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి 50 కి.మీ.

నీలిరంగు చందమామ

 🎻🌹🙏నేడు నీలిరంగు చందమామ  ఆవిష్కృతం..!!



🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿హైదరాబాద్ :ఆగస్టు 30

ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. 


🌸బుధుడు, యురేనస్‌, గురుగ్రహం, నైప్యూటర్‌, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది.ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం నీలిరంగు చందమామ ఆవిష్కృతం కాబోతున్నది.


🌿ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. 


🌸నేడు నీలిరంగు చందమామ బుధవారం ఏర్పడబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి..


🌿కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్‌ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్‌ మూన్‌ ఆవిష్కృతమవుతుంది. 


🌸సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు.


🌿 సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు..స్వస్తి.. సేకరణ...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

నవగ్రహా పురాణం🪐* . *14వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *14వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 5*


ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ , సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ , ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ , కశ్యపుని తల్లి కళా , తండ్రి మరిచీ , ప్రసూతి దక్ష ప్రజాపతులూ , నారద మహర్షీ , ఇతర బ్రహ్మ మానస పుత్రులైన అత్రీ , అంగిరసుడూ , కర్దముడూ , పులహుడూ , పులస్త్యుడూ , భృగువూ , వసిష్ఠుడూ , క్రతువూ , వాళ్ళ పత్నులూ.... కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు.


కశ్యపుడు శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ యిలా అన్నాడు. *"పరమ పురుషా ! మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే ! సార్థక నామధేయం అనుగ్రహించి , ఆశీర్వదించండి !"*


*"కశ్యపా ! ఈ పుత్రుణ్ని నీకు ప్రసాదించింది. కేవలం మీ దంపతుల కోసమే కాదు. సమస్త విశ్వం కోసమూ ! నవగ్రహ దేవతలలో ఆద్యుడూ , అధికుడూ అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు ! జ్యోతిర్మండలంలో , నక్షత్రాల కలయికతో రూపొందిన ద్వాదశ రాశులలో నెలకొకరాశిలో నెలకొంటూ సంచరిస్తూ వుంటాడు..."*


*"ద్వాదశ రాశులా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు..


*"ఔను కశ్యపా !"* బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. *"మా జనకులు శ్రీమహావిష్ణు దేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం , వృషభం , మిథునం , కర్కాటకం , సింహం , కన్య , తుల , వృశ్చికం , ధనస్సు , మకరం , కుంభం , మీనం - ఆకారాలలో స్థిరపడి వున్నాయి !"*


*"ద్వాదశ రాశులలో ద్వాదశ మాసాలలో ద్వాదశ నామ ధేయాలతో అదితి కశ్యపుల అనుంగు సుతుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు..."* అంటూ శ్రీమహావిష్ణువు బ్రహ్మనూ , శివుణ్నీ సాభిప్రాయంగా చూశాడు. *"పరమేష్ఠీ పరమేశ్వరులూ , నేనూ చిరంజీవికి ద్వాదశ నామ నిర్దేశం చేస్తాం !"*


*"చాలా సంతోషం. ప్రారంభించండి !"* పరమ శివుడు అన్నాడు..


అదితి లేచి , శ్రీమహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పురిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుణ్ని చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుణ్ని చూస్తున్న లక్ష్మి దేవి ముఖం కమలంలా వికసిస్తోంది !


*"లక్ష్మీ ! బాలసూర్యుణ్ని ఆ వేదిక మీద పడుకో బెట్టు !"* అన్నాడు విష్ణువు.


లక్ష్మి బాలుణ్ని నుదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకో బెట్టింది. శ్రీమహావిష్ణువు బాలుణ్నే చూస్తూ నామ నిర్దేశం ప్రారంభించాడు. *"ధాత ! ఆర్యముడు..."*


అందర్నీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"మిత్రుడు !"* ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వరం ఛేదించింది మూడవ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"శక్రుడు !"* విష్ణువు నాలుగవ నామధేయాన్ని ప్రకటించాడు. నాలుగవ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు.


విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూశాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్ధం చేసుకుంటూ , బాలసూర్యుడికి తన వంతుగా నాలుగు నామధేయాలు ప్రకటించాడు.


*"వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు !"* బాలసూర్య రూపాలు మరో నాలుగు ప్రత్యక్షమయ్యాయి.


పరమశివుడు బాలసూర్యుడికి మరొక నాలుగు పేర్లు ప్రసాదించాడు. *"పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"* బాలసూర్యుని రూపాలు ఇప్పుడు పండ్రెండు కనిపిస్తున్నాయి.


పండ్రెండు రూపాలూ ఒకదాని పక్కన ఒకటి - వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళూ , చేతులూ ! చిరునవ్వుల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు ! తామరరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ! ద్వాదశ బాలాదిత్యులతో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టినీ లాగి పట్టింది.


నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరసగా ఆ ద్వాదశ బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వల్లె వేశాడు. *"ధాత! ఆర్యముడు ! మిత్రుడు ! శక్రుడు ! వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు ! పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"*


త్రిమూర్తులూ , దేవతలూ , మానస పుత్రులూ , వాళ్ళ పత్నులూ , నారదుడూ , కశ్యపుడు , ఆయన పత్నులూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు.


*"త్రిమూర్తులు నా మనుమడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు ! వెలుగు వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం !"* మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు.


*"సకల ప్రాణుల్నీ సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తపించింది అదితి ! ఉన్నతమైన ఆ కోరికతో - ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్నీ , అర్హతనూ సంపాందించుకుంది ! ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహసార్వభౌముడిగా అందరి అర్చనలూ అందుకుంటాడు !"* విష్ణువు అన్నాడు.


*“తథాస్తు !"* అన్నారు శివుడూ , బ్రహ్మా.


అదితి ఆనందబాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తోంది. పన్నెండు ముద్దుల మూటలను చూస్తుంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. పన్నెండుగుర్నీ ఒకేసారి ఎత్తుకుని , వక్షానికి హత్తుకుని , బొజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్నీ ఆవరించి కుదిపి వేస్తోంది.


అదితి ఆవేశంగా కదిలి చేతులు ఎడంగా చాపి , తన ద్వాదశ పుత్రుల్ని వొడిసి పట్టుకోబోయింది. విచిత్రంగా అన్ని రూపాలూ ఒక్కసారిగా కలిసి , ఒక్కటిగా మారిపోయాయి. తన చేతుల్లోకి వచ్చిన బాలసూర్యుణ్ని ఆశ్చర్యానందంతో చూస్తోంది. అదితి. కశ్యపుడు ఆమె పక్కకు జరిగాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు. అందర్నీ కలయజూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతున్నాడు.


 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

నవగ్రహా పురాణం🪐* . *14వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *14వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 5*


ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ , సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ , ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ , కశ్యపుని తల్లి కళా , తండ్రి మరిచీ , ప్రసూతి దక్ష ప్రజాపతులూ , నారద మహర్షీ , ఇతర బ్రహ్మ మానస పుత్రులైన అత్రీ , అంగిరసుడూ , కర్దముడూ , పులహుడూ , పులస్త్యుడూ , భృగువూ , వసిష్ఠుడూ , క్రతువూ , వాళ్ళ పత్నులూ.... కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు.


కశ్యపుడు శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ యిలా అన్నాడు. *"పరమ పురుషా ! మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే ! సార్థక నామధేయం అనుగ్రహించి , ఆశీర్వదించండి !"*


*"కశ్యపా ! ఈ పుత్రుణ్ని నీకు ప్రసాదించింది. కేవలం మీ దంపతుల కోసమే కాదు. సమస్త విశ్వం కోసమూ ! నవగ్రహ దేవతలలో ఆద్యుడూ , అధికుడూ అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు ! జ్యోతిర్మండలంలో , నక్షత్రాల కలయికతో రూపొందిన ద్వాదశ రాశులలో నెలకొకరాశిలో నెలకొంటూ సంచరిస్తూ వుంటాడు..."*


*"ద్వాదశ రాశులా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు..


*"ఔను కశ్యపా !"* బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. *"మా జనకులు శ్రీమహావిష్ణు దేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం , వృషభం , మిథునం , కర్కాటకం , సింహం , కన్య , తుల , వృశ్చికం , ధనస్సు , మకరం , కుంభం , మీనం - ఆకారాలలో స్థిరపడి వున్నాయి !"*


*"ద్వాదశ రాశులలో ద్వాదశ మాసాలలో ద్వాదశ నామ ధేయాలతో అదితి కశ్యపుల అనుంగు సుతుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు..."* అంటూ శ్రీమహావిష్ణువు బ్రహ్మనూ , శివుణ్నీ సాభిప్రాయంగా చూశాడు. *"పరమేష్ఠీ పరమేశ్వరులూ , నేనూ చిరంజీవికి ద్వాదశ నామ నిర్దేశం చేస్తాం !"*


*"చాలా సంతోషం. ప్రారంభించండి !"* పరమ శివుడు అన్నాడు..


అదితి లేచి , శ్రీమహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పురిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుణ్ని చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుణ్ని చూస్తున్న లక్ష్మి దేవి ముఖం కమలంలా వికసిస్తోంది !


*"లక్ష్మీ ! బాలసూర్యుణ్ని ఆ వేదిక మీద పడుకో బెట్టు !"* అన్నాడు విష్ణువు.


లక్ష్మి బాలుణ్ని నుదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకో బెట్టింది. శ్రీమహావిష్ణువు బాలుణ్నే చూస్తూ నామ నిర్దేశం ప్రారంభించాడు. *"ధాత ! ఆర్యముడు..."*


అందర్నీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"మిత్రుడు !"* ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వరం ఛేదించింది మూడవ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"శక్రుడు !"* విష్ణువు నాలుగవ నామధేయాన్ని ప్రకటించాడు. నాలుగవ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు.


విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూశాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్ధం చేసుకుంటూ , బాలసూర్యుడికి తన వంతుగా నాలుగు నామధేయాలు ప్రకటించాడు.


*"వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు !"* బాలసూర్య రూపాలు మరో నాలుగు ప్రత్యక్షమయ్యాయి.


పరమశివుడు బాలసూర్యుడికి మరొక నాలుగు పేర్లు ప్రసాదించాడు. *"పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"* బాలసూర్యుని రూపాలు ఇప్పుడు పండ్రెండు కనిపిస్తున్నాయి.


పండ్రెండు రూపాలూ ఒకదాని పక్కన ఒకటి - వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళూ , చేతులూ ! చిరునవ్వుల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు ! తామరరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ! ద్వాదశ బాలాదిత్యులతో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టినీ లాగి పట్టింది.


నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరసగా ఆ ద్వాదశ బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వల్లె వేశాడు. *"ధాత! ఆర్యముడు ! మిత్రుడు ! శక్రుడు ! వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు ! పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"*


త్రిమూర్తులూ , దేవతలూ , మానస పుత్రులూ , వాళ్ళ పత్నులూ , నారదుడూ , కశ్యపుడు , ఆయన పత్నులూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు.


*"త్రిమూర్తులు నా మనుమడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు ! వెలుగు వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం !"* మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు.


*"సకల ప్రాణుల్నీ సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తపించింది అదితి ! ఉన్నతమైన ఆ కోరికతో - ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్నీ , అర్హతనూ సంపాందించుకుంది ! ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహసార్వభౌముడిగా అందరి అర్చనలూ అందుకుంటాడు !"* విష్ణువు అన్నాడు.


*“తథాస్తు !"* అన్నారు శివుడూ , బ్రహ్మా.


అదితి ఆనందబాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తోంది. పన్నెండు ముద్దుల మూటలను చూస్తుంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. పన్నెండుగుర్నీ ఒకేసారి ఎత్తుకుని , వక్షానికి హత్తుకుని , బొజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్నీ ఆవరించి కుదిపి వేస్తోంది.


అదితి ఆవేశంగా కదిలి చేతులు ఎడంగా చాపి , తన ద్వాదశ పుత్రుల్ని వొడిసి పట్టుకోబోయింది. విచిత్రంగా అన్ని రూపాలూ ఒక్కసారిగా కలిసి , ఒక్కటిగా మారిపోయాయి. తన చేతుల్లోకి వచ్చిన బాలసూర్యుణ్ని ఆశ్చర్యానందంతో చూస్తోంది. అదితి. కశ్యపుడు ఆమె పక్కకు జరిగాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు. అందర్నీ కలయజూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతున్నాడు.


 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-33🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-33🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ధ్రువబేరం:*


తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం. 


మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. 


మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు.


 నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.



 18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి


ధృవబేరం చక్కని ముఖకవళికలతో వెలసి ఉంటుంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది.


 నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, సైజూ వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా కచ్చితంగా పాటిస్తారు. 


స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం ఉంది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. 


కచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36-40 అంగుళాల మధ్య సైజులోనూ

, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు సైజులోనూ ఉంటుంది. 


స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది. స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. 


అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది).


 ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉంది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు. రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి (స్వామివారు భక్తుల రక్షణకు నడచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా). 


స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి



వేంకటేశ్వరునిగా వ్యవహరించే ఈ ధృవభేరం ఏ దేవతామూర్తిది, మొదటి నుంచి ఏ రూపంగా అక్కడ అర్చన కొనసాగింది అన్న విషయంపై తీవ్ర వాదోపవాదాలు సాగాయి.


నాగేంద్రభూషణ గోవిందా, మంజీర మండిత గోవిందా, తులసిమాలప్రియ గోవిందా, ఉత్పమాలాంకృత గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||33||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 27*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 27*

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩


.               *ఆధ్యాత్మిక అనుభూతి*


1.ఆత్మ, భగవంతుడు లాంటి సత్యాలను ధ్రువీకరించడానికిగల ఒకే మార్గం ప్రత్యక్ష అనుభవమే. శాస్త్రాలు సంకేత ఫలకాలలా ఈ సత్యాలను సూచించ గలుగుతాయేగాని వాటిని నిరూపించలేవు. వర్షం ఎప్పుడు పడుతుందో పంచాంగం తెలుపుతుంది. అలాగని పంచాంగాన్ని పిండితే ఒక చుక్కనీరు కూడా రాదు.


2. ఆధ్యాత్మిక అనుభవాలకు హద్దులు లేవు. కనుక పొందిన అనుభవాలతో తృప్తిచెంది ఆగిపోకుండా ముందుకు సాగాలి.


 3. కుండలినీ శక్తి జాగృతమయినప్పుడే ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి.


4. ద్వైతం కాని స్థితియైన అద్వైతానుభవమే అత్యంత ఉన్నతమైన అనుభవం.


5. కాని అద్వైతం చరమ అనుభూతి కాదు. అద్వైత అనుభవం పొందిన కొందరు మళ్లీ సామాన్య స్థితికి వస్తారు. వారు సర్వత్రా భగవంతుణ్ణి చూస్తారు, ఆ భగవదానందంలోనే జీవిస్తారు. ఈ స్థితి 'విజ్ఞానం' అనబడుతుంది. ఈ స్థితిని పొందిన వ్యక్తిని 'విజ్ఞాని' అని పేర్కొంటారు. ఆ వ్యక్తి భగవంతుడు (నిత్యం), జగత్తు (లీల) రెంటినీ సత్యంగా దర్శిస్తాడు.


6. ఎన్నడూ బద్ధుడుకాని, సదా ముక్తి స్థితిలోనే నెలకొనివున్న వారుకొందరున్నారు.

నిత్యముక్తులయిన వీరు భగవంతుడు అవతరించే తరుణంలో ఆయనతో బాటే జన్మించి, ఆయన అవతార కార్యానికి తోడ్పడతారు. వీరిని ఈశ్వర కోటులుగా పేర్కొంటారు.


శ్రీరామకృష్ణులు వీటిని బోధించడంమే కాక సత్యాలను ధ్రువీకరించడానికి కొందరి జీవితాలను రూపొందించి నిష్క్రమించారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 11*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 11*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి*

*ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |*

*చతుశ్చత్వారింశత్ వసుదళ కలాశ్రత్రివలయ*

*త్రిరేఖబి సార్ధం తవ శరణకోణాః పరిణతాః ||*



ఈ శ్లోకంలో అమ్మవారు శ్రీచక్ర స్థిత అయిన వైనం వివరిస్తున్నారు. దీనిలో అనేకమైన శ్రీచక్ర రహస్యాలను నిక్షిప్తం చేశారు శంకరులు. అందంతా ఒక విజ్ఞాన శాస్త్రం, ఒక సాంకేతిక పరిజ్ఞానం. గురూపదేశం,గురు శిక్షణ లేకుండా శ్రీచక్ర ,బిందు కోణచక్ర వివరణ అర్థం చేసుకోవడం కష్టం.గురూపదేశం లేకుండా శ్రీచక్రార్చన చేయరాదు.


చతుర్భిః శ్రీకంఠైః = నాలుగు శివ  చక్రాలతోనూ


శివయువతభిః పంచభిః = ఐదు శక్తి చక్రములతోనూ  కలిసి ఏర్పడింది శ్రీచక్రము.


ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలపృకృతిభిః = ఇవ్వన్నీ కలిసి పరమేశ్వరుని నవాంశములతో కూడిన మూలప్రకృతిని తెలియచేస్తున్నాయి.


చతుశ్చత్వారింశత్ వసుదళ కలాశ్ర త్రివలయ =  44 త్రికోణాలతోను,అష్ట గణాధి దేవతలు దళములతోను, షోడశ కళల దళములతోను, మూడు వలయములతోను


త్రిరేఖభిః సార్ధం తవ శరణకోణతాః = మూడు రేఖలతోను,నీ ఆశ్రయమైన శ్రీచక్రము విరాజిల్లుతున్నది తల్లీ! శ్రీచక్రమును ఎలా భావన చేయాలో భావనోపనిషత్ చెప్తుందట.అమ్మవారి నామాల్లో *భవానీ భావనాగమ్యా* దీనికి సూచన.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

యజ్ఞోపవీత ధారణ

 *"ఓ బ్రాహ్మణా" నీ కోసం నీకు నువ్వే కేవలం 10 ని.ల సమయం కూడా కేటాయించుకోలేవా...??*


*ది.31/8/23 గురువారం నాడు ఉదయం పూట జంధ్యాల పౌర్ణమి/శ్రావణ పౌర్ణమి సందర్భంగా కనీసం నీ వంటి మీద వున్న నీ పవిత్ర జంధ్యాన్ని కూడా నేడు మార్చుకోలేవా...?? దయచేసి మార్చుకో...!!🙏*


*""నూతన యజ్ఞోపవీత ధారణ విధానము ప్రార్థన:""*


శుక్లాంబరధరం విష్ణుం

శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్న వదనం ధ్యాయేత్ 

సర్వ విఘ్నోపశాంతయే ||


గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః 

గురు దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: 

శ్రీ గురవే నమః ||


అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో పివ |


యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||


పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!


(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)


ఆచమన విధానం:

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1.   ఓం కేశవాయ స్వాహా,


2.   ఓం నారాయణాయ స్వాహా,


3.   ఓం మాధవాయ స్వాహా,


అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.


4.   ఓం గోవిందాయనమః,


5.   ఓం విష్ణవే నమః,


6.   ఓం మధుసూదనాయనమః,


7.   ఓం త్రివిక్రమాయనమః,


8.   ఓం వామనాయనమః,


9.   ఓం శ్రీధరాయనమః,


10.  ఓం హృషీకేశాయనమః,


11.  ఓం పద్మనాభాయనమః,


12.  ఓం దామోదరాయనమః,


13.  ఓం సంకర్షణాయనమః,


14.  ఓం వాసుదేవాయనమః,


15.  ఓం ప్రద్యుమ్నాయనమః,


16.  ఓం అనిరుద్ధాయనమః,


17.  ఓం పురుషోత్తమాయనమః,


18.  ఓం అధోక్షజాయనమః,


19.  ఓం నారసింహాయనమః,


20.  ఓం అత్యుతాయనమః,


21.  ఓం జనార్దనాయనమః,


22.  ఓం ఉపేంద్రాయనమః,


23.  ఓం హరయేనమః,


24.  ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను. అటు పిమ్మట:


*భూతోచ్చాటన:*


(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)


ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః


(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)


గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.


ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||


*తదుపరి సంకల్పం:*


మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే


(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య” అని చెప్పనక్కర లేదు)


యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.


*1 మొదటి యజ్ఞోపవీతం ధారణ:*


యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,


దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||


*“ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం*


*ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్*


*ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం*


*యజ్ఞోపవీతం బలమస్తు తేజః”*


అని చెప్పి అని మొదటి ముడి ఉన్న జంధ్యాన్ని ధరించవలెను.


(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)


*2 ద్వితీయోపవీత ధారణం:*


తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


*3 తృతీయ యజ్ఞోపవీత ధారణం:*


తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


*4,5 చతుర్ధ, పంచమ యజ్నోపవీతములు ధరించుట:*


తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ “ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.


తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)


*గాయత్రీ మంత్రము:*


“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం


భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ ”


తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.


*జీర్ణోపవీత విసర్జనం:*


తిరిగి మరలా ఆచమనం చేసి


శ్లో: ఉపవీతం భిన్నతంతుం కశ్మల దూషితం


విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||


శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం


వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం


ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం


జీర్నోపవీతం విసృజంతు తేజః ||


శ్లో: ఏతా వద్దిన పర్యంతం


బ్రహ్మత్వం ధారితం మయా


జీర్ణత్వాత్తే పరిత్యాగో


గచ్ఛ సూత్ర యథా సుఖం ||


విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.


తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి “గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.


తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.


నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:


శ్రావణ పౌర్ణమి నాడు, జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను. ఎవరు తొక్కని ప్రదేశంలోనో, చెట్ల మొదలులోనో, పారే నదిలోనో,బావిలోనో విసర్జించవలెను.


ఓం శ్రీ గాయత్రి దేవై నమః

        🔥శివేశ్రీ🔥


*బ్రాహ్మణ చైతన్య వేదిక*

సుభాషితమ్

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*ఇదే మే హి పాండిత్యం*

*ఇయమేవ విదగ్ధతా.*

*అయమేవ పరోధర్మః*

*యత్ ఆయావ్యధికోవ్యయ*


*- _తాత్పర్యము_-* 


*సంపాదనకు మించి ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు. అలా ఖర్చుపెట్టకుండా ఉండడమే పాండిత్యం, అదే గొప్ప నేర్పరితనం, అదే ముఖ్య కర్తవ్యం.*


 *కనుక ఎప్పుడూ ఆదాయానికి మించి వ్యయం చేయకూడదు*.....!!!!


🧘‍♂️🙏🪷 ✍️🙏

విలువుండని(విలువెరుగని) వారలతో


*కం*

విలువుండని(విలువెరుగని) వారలతో

విలువగు సమయంబునెల్ల వెచ్చించినచో

అలతులు బల్లిదులగుదురు

విలువగు నీ విలువలెల్ల వెడలును సుజనా.

*భావం*:-- ఓ సుజనా! విలువ లేని వారి తో విలువైన సమయమంతా గడపడం వలన ఆ అల్పులు బలవంతులై విలువైన నీ విలువ లన్నీ తగ్గిపోవును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

వంశజనులపెంచగనే

వంశోధ్ధారకులుగారు పరిగణమొనరన్(ప్రముఖులు మెచ్చన్)

వంశ(పు)ప్రతిష్ఠ బెంచగ

వంశోధ్ధారకుడనబడు పదపడి (బలముగ)సుజనా

*భావం*:-- ఓ సుజనా! వంశం లో జనులను పెంచినంతమాత్రాన వంశోధ్ధారకుడనబడరు. పరిగణించేస్థాయిలో వంశం యొక్క ప్రతిష్ఠ పెంచినప్పుడే వంశోధ్ధారకుడనబడును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మొదటి* *భాషగా సంస్కృతం✍️📚*

 *📚✍️పాఠశాల విద్యలో మొదటి*

 *భాషగా సంస్కృతం✍️📚*


*♦️ఆరో తరగతి నుంచి ఎంపికకు అవకాశం*


*♦️ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన*


*🌻ఈనాడు, అమరావతి*: పాఠశాల విద్యలో మొదటి భాషగా సంస్కృతం సబ్జెక్టును తీసుకురాబోతున్నారు. పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వ నికి పంపింది. త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. మొదటి భాషగా దీన్ని ఎంచుకున్న విద్యార్థులు రెండో భాషగా హిందీకి బదులు తెలుగు సబ్జెక్టు చదవాల్సి ఉంటుంది. మూడో భాషగా ఆంగ్లం ఉంటుంది. తెలుగు సబ్జెక్టును మొదటి భాషగా తీసు కున్న వారు రెండో భాషగా హిందీ చదవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆరో తరగతిలో మొదటి భాషను ఎంపిక చేసుకునే

అవకాశం కల్పిస్తారు. సంస్కృతం పుస్తకాలు ఆరో తరగతి నుంచి ఉన్నాయి. పదో తరగతి పరీక్షల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం కాంపొజిట్ తెలుగును తొలగించింది. ఇందులో తెలుగు 70 మార్కులు, సంస్కృతం 30 మార్కులకు ఉండేది. తెలుగునే వంద మార్కులకు చేసినందున సంస్కృతం సబ్జెక్టుకు అవకాశం కల్పించాలనే డిమాండ్ వచ్చింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కృతం ఉపాధ్యాయులు పని చేస్తు న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్నడ, తమిళం, ఒడియా, హిందీ, ఉర్దూ మొదటి భాషగా చదువుతున్న విద్యార్థులు 10వేల వరకు ఉన్నారు. ఇప్పుడు సంస్కృతం తీసుకువస్తే ఈ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. సంస్కృతంలో ఎక్కువ మార్కులు సాధించే వీలుంది. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది ఈ సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంది.


🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

⚜ శ్రీ మా దిద్నేశ్వరి దేవి మందిర్

 ⚜ ఛత్తీస్‌గఢ్ : మల్హర్‌






⚜ శ్రీ మా దిద్నేశ్వరి దేవి మందిర్


🕉 మన గుడి :


⚜ ఛత్తీస్‌గఢ్ : మల్హర్‌( బిలాస్‌పూర్)


⚜ శ్రీ మా దిద్నేశ్వరి దేవి మందిర్



💠 ఛత్తీస్‌గఢ్‌లోని సిద్ధ శక్తిపీఠాల శ్రేణిలో, బిలాస్‌పూర్ సమీపంలోని మల్హర్‌లో ఉన్న మా దిద్నేశ్వరి అనే ఆలయం మత విశ్వాస కేంద్రానికి పేరు . 


💠 పురావస్తు సంపద అక్కడక్కడ చెల్లాచెదురుగా ఉంది. 

ఈ ప్రాంతంలోని ప్రతి రాతిలోనూ దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. 

విరిగిన విగ్రహాలు, రాతి, రాగిపై గీసిన విచిత్రమైన అక్షరాలు, కాల్చిన మట్టి బొమ్మలు, ముక్కలు మరియు బంగారం, వెండి, రాగి నాణేలు, అనేక రకాల అవశేషాలు మరియు పాత దేవాలయాల శిథిలాలు ఎన్ని ఉన్నాయో తెలియదు.

సహజ మరియు పురావస్తు ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో అమ్మవారు కొలువై ఉన్నారు.


💠 పద్మాసనంలో కూర్చున్న ఈ అమ్మవారు  10వ-11వ శతాబ్దపు  స్వచ్ఛమైన నల్ల గ్రానైట్‌తో తయారు చేయబడింది, తపస్సు చేస్తున్న మా దిద్నేశ్వరి విగ్రహం యువరాణి అనుభూతిని ఇస్తుంది.


💠 16 అలంకారాలతో, కాంతిరేఖతో ఉన్న ఈ దివ్య అతీంద్రియ విగ్రహం ఉదయం పూట చిన్నపిల్లగా, మధ్యాహ్నం ఆడపిల్లగా, రాత్రిపూట స్త్రీగా దర్శనమిస్తుంది. 

ఈ విగ్రహం నుండి ఒక ప్రత్యేక ధ్వని వెలువడుతుంది.


💠 స్థానిక ప్రజలే కాకుండా, ఛత్తీస్‌గఢ్ మరియు దేశం మొత్తం నుండి ప్రజలు కూడా ఈ విగ్రహాన్ని సందర్శించడానికి మల్హర్ చేరుకుంటారు. అమ్మవారి గుమ్మం నుండి ఏ భక్తుడు ఖాళీ చేతులతో వెళ్ళడు అని గట్టి నమ్మకం 


💠 10-11వ శతాబ్దం నాటి ఈ ఆలయాన్ని శక్తి పీఠం అంటారు.

 శివుడిని పొందడానికి పార్వతి రాత్రి తపస్సు చేసిన అనుభూతిని కలిగించే ఈ విగ్రహం విగ్రహ కళకు అద్భుతమైన ఉదాహరణ.


💠 బిలాస్‌పూర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్రా రహదారిపై ఛత్తీస్‌గఢ్‌లోని పురాతన నగరం మల్హర్ కౌశాంబిలో మా దిద్నేశ్వరి దేవి ప్రతిష్టించబడింది. 

త్రవ్వకాల నుండి లభించిన అవశేషాలను బట్టి, ఈ ఆలయం క్రీస్తు పూర్వం నుండి సుమారు వెయ్యి సంవత్సరాల నుండి మరాఠా కాలం వరకు ఉందని తెలుస్తుంది. 

1000వ సం.లో మౌర్యుల కాలం, రెండవ శాతవాహన కుషానుల కాలం, మూడవది, శరబ్‌పురియా, మరియు సోమవంశీ కాలం, నాల్గవ మరియు ఐదవ కల్చూరి కాలం. 

కల్చూరి తర్వాత మరాఠా మరియు బ్రిటీష్ పాలన వరుసగా ఉంది. 

మల్హర్ దిద్నేశ్వరి విగ్రహంతో పాటు, ఇది చక్కటి మరియు గొప్ప హస్తకళకు ప్రసిద్ధి చెందింది. దీనితో పాటు, శైవ, శాక్త, జైన మరియు బౌద్ధ కళలు మరియు విష్ణువు యొక్క పురాతన చతుర్భుజ విగ్రహం కూడా చాలా ప్రసిద్ధి చెందాయి.


💠 కాలగర్భంలో పడిన ఈ ఆలయాన్ని నిషాద్ సమాజ్ పునరుద్ధరించింది. నిషాద్ సమాజంలో అబ్బాయిని దిండ్వా అని, అమ్మాయిని దిండ్వి అని అంటారు. బహుశా ఈ కారణంగా ఈ పేరు పెట్టబడి ఉండవచ్చు లేదా శంకరుడి  యొక్క డమరుకం లోని డిండిమ్ శబ్దం కూడా దీనికి కారణం కావచ్చు.


💠 భూమిలో జరిగిన త్రవ్వకాలలో ఈ భారీ ఆలయం కనుగొనబడింది. 

విగ్రహాన్ని పునరుద్ధరించారు.

 1981 ఏప్రిల్ 18న దొంగలు విగ్రహాన్ని దొంగిలించి మెయిన్‌పురి పొలాల్లో పాతిపెట్టారు. 

బ్రిటీష్ హయాంలో కూడా విగ్రహాన్ని దొంగిలించడానికి విఫలయత్నాలు జరిగాయి. దొంగలకు శారీరక నొప్పి రావడంతో విగ్రహాన్ని వదిలి పారిపోయారు.


💠 చాలా మంది సాధకులు దీనిని సిద్ధపీఠంగా ధృవీకరించారు. 

ఇక్కడ రాత్రి సమయంలో అమ్మవారి విగ్రహo చీలమండ ప్రాతం నుండి ఒక మృదువైన ధ్వని ప్రతిధ్వనిస్తుంది. 

ఈ విషయాన్ని స్థానిక పూజారులు అలాగే  కామాఖ్య అన్వేషకులు ధృవీకరించారు. ముంగేర్‌లోని యువ తాంత్రికుడు కూడా దీనిని ప్రత్యక్షంగా అనుభవించాడు


💠 నవరాత్రులలో ప్రత్యేక కార్యక్రమాలు,

చేత్ర నవరాత్రుల రోజుల్లో, ప్రజలు మాతా దిద్నేశ్వరి ఆలయానికి రంగులలో పెయింట్ చేస్తారు. 


గ్రామంలో భక్తి వాతావరణం నెలకొని, అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు చేరుతారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు, మతపరమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి.


💠 మల్హర్‌లోని కేవత్ ప్రాంతంలో జైన తీర్థంకర్ సుపత్వనాథ్‌తో పాటు తొమ్మిది తీర్థంకర్ విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. 

గ్రామస్థులు దీనిని నందమహల్ అని పిలుస్తారు. దేవాలయాలు, రాళ్లు, విగ్రహాలే కాకుండా, పురావస్తు సంపద ఇక్కడ చెల్లాచెదురుగా ఉంది.



💠 బిలాస్‌పూర్ నుండి 40 కిమీ దూరంలో ఉంరి  ఉన్న మల్హర్ గ్రామం

అమ్మకడుపునుండి

 *సీసము*

అమ్మకడుపునుండి కమ్మంగనేర్చిన

   యమ్మవంటి కలిమి యాంధ్రభాష

ఆనందమందైన నావేశమందైన

  నావేదనందైన ననుగునైన

ఉత్సాహమందైన నుద్వేగమందైన

  కూర్మికైననుగాని పేర్మినైన

అంధులైననుగాని బంధుజనంబైన

   వితతమ్ము వాడెడి వెలుగు తెలుగు.

*ఆ.వె.*

ఎల్లవేళలందు నుల్లంబునందుండ

తెగడుచుండు జనుల తెగులు గాంచి

భావి చెరచ బడెడి బాలుర మదినెంచి

తల్లి వంటి తెలుగు తల్లడిల్లు.


*అందరికీ ప్రపంచ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు.*


*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -32🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -32🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*“ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !*

*వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!*


తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. 


శ్రీ మహావిష్ణువు తిరుమలలో మొదటిసారి వెలసింది మొదలు ఇప్పటివరకు మొత్తం మూడుసార్లు ఆలయ నిర్మాణం జరిగింది. విశ్వకర్మ, తొండమాన్ చక్రవర్తి- ఇద్దరు కట్టించిన రెండు ఆలయాలు ఇప్పటికీ సప్తగిరుల్లో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి.


 మూడోసారి భరద్వాజ మహర్షి కట్టించిన ఆలయమే నేటి తిరుమల క్షేత్రంగా భాసిల్లుతోంది. అప్పటినుంచి తిరుమలేశుడు దేవదేవుడిగా పూజలందుకుంటున్నాడు.


ద్వాపరయుగం చివర్లో, కలియుగం ఆరంభాన స్వామివారికి తొండమాన్ చక్రవర్తి ఒక ఆలయం కట్టించారు. రెండు గోపురాలు, మూడు ప్రకారాలతో వేంకటేశ్వరస్వామికి ఆలయం నిర్మించినట్టు అష్టాదశ పురాణాల్లో ఉంది.


అయితే, తొండమాన్ చక్రవర్తి కట్టించిన గుడి కూడా కొన్ని నైసర్గిక వైపరీత్యాల వల్ల కాలగర్భంలో కలిసిపోయింది. 


దాంతో స్వామివారి దివ్యమంగళ అర్చావతార స్వరూపం కూడా భూగతమైపోయింది. 


రెండో ఆలయం కూడా శిథిలం కావటంతో చాలాకాలం తర్వాత మళ్లీ శ్రీనివాసుడి కోసం ఆలయ నిర్మాణం జరిగింది. 


1900 సంవత్సరాల క్రితం భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో దేవాలయం నిర్మించారు. తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయ అర్చకులు శ్రీ గోపీనాథ దీక్షితులు, మరో గ్రామానికి చెందిన యాదవునికి స్వామివారు ఒకేసారి కలలో కనిపించారు. 


తన అర్చావతార స్వరూపం స్వామివారి పుష్కరిణికి దక్షిణం దిశగా ఒక చింతచెట్టు కింద భూగతమై ఉన్నట్టు చెప్పారు. దానిని వెలికితీసి అదే చోట మళ్లీ ప్రతిష్టించమని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం వాళ్లిద్దరూ దివ్యమంగళ స్వరూపం కోసం వెతుకుతూ వెళ్లి ఒక చోట కలుసుకుంటారు. 


ఇద్దరూ కలిసి చెట్టు కింద స్వామివారి రూపాన్ని కనుగొంటారు. తర్వాత కపిలగోవు పాలను కుండల్లో తీసుకొచ్చి పుట్ట మీద పోస్తారు. దాంతో పుట్టమన్ను కరిగిపోయి, అర్చావతారంలో ఉన్న స్వామివారు దర్శనమిస్తారు. సరిగ్గా అదే చోట భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో వైఖానస ఆగమోత్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశారు


భరద్వాజ మహర్షి నిర్మించిన ఆలయాన్ని అనేక మంది రాజులు, రారాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఆలయం చుట్టుపక్కల అనేక నూతన నిర్మాణాలు చేపట్టారు. తరతరాలుగా భరద్వాజ గోత్రానికి చెందిన గోపీనాథ దీక్షితుల వంశం వాళ్లే స్వామి వారికి సేవలు అందిస్తున్నారు. వారికి మాత్రమే మూలవిరాట్టుని తాకే అర్హత ఉంది. 


 క్రీ.శ.614. పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది. సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్టింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది


ఆ వెండి విగ్రహాన్ని మనవాల పెరుమాల్ అని పిలుస్తారు. అప్పటికే స్వామివారి ఆలయంలో గర్భాలయం, అంతరాలం, విమాన గోపురం ఉన్నాయి.

అంతరాలం అనేది స్వామివారికి ఏకాంత సేవ జరిపే శయన మంటపం! ఈ మంటపం బయట రాములవారి మేడ ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు స్వామివారి ఆలయ ప్రదక్షిణ ఉండేది. 


1150వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. స్వామివారి విమాన ఆకారాన్ని పెంచి, ఆ బరువును మోయడానికి గర్భాలయ గోడలను మరింత పటిష్టం చేశారు.


 ఆ క్రమంలోనే ప్రస్తుతమున్న వైకుంఠ ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. రాములవారి మేడను మూసేసి అర్థమంటపం, ముఖ మంటపం కట్టారు. గరుడాళ్వార్ సన్నిధి, ఇరువైపులా ద్వారపాలకులను కూడా ఆసమయంలోనే నిర్మించారు. ప్రదక్షిణ మార్గంలో ఈశాన్యం వైపు యోగ నరసింహస్వామి దేవాలయం, ఆగ్నేయంలో వరదరాజులస్వామి వారి ఆలయం, దక్షిణ ఆగ్నేయంలో యాగశాల మంటపం, పచన మంటపం, పాకశాల నిర్మించారు. అప్పుడే విమాన ప్రదక్షిణం ఏర్పడింది. 


గరుడాళ్వార్ సన్నిధి వెనకవైపు ధ్వజస్తంభం, బలిపీఠాన్ని ప్రతిష్టించారు. ఆ సమయంలోనే రెండో ప్రాకారంగా పిలిచే వెండివాకిలి నిర్మించారు.

13వ శతాబ్దంలో శ్రీవారి ఆలయానికి మరిన్ని హంగులద్దారు. ఆలయం బయట రంగనాయకుల మండపాన్ని నిర్మించారు. 


అప్పుడే అద్దాల మండపం కూడా కట్టారు. ఈ అద్దాల మండపంలోనే వరాహస్వామి కొలువై ఉండేవారని చెప్తుంటారు. అప్పట్లో అక్కడ ఒక పూలబావి ఉండేది. 14వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల హయాంలో మహద్వార గోపురం, మహాప్రాకారం నిర్మించారు. 


మహద్వార గోపురం లోపల 16 స్తంభాలతో ప్రతిమా మంటపాన్ని కట్టారు. అందులో శ్రీ కృష్ణ దేవరాయలు ఒక సామాన్య భక్తుడిగా తన ఇద్దరు రాణుల ప్రతిమలను ఏర్పాటు చేయించారు. ఆ రెండు విగ్రహాలు స్వామివారికి నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తాయి. 


అప్పటికే ఆలయంలో సుమారు 9, 10 శతాబ్దాల్లో నిర్మించిన వెయ్యి కాళ్ల మంటపం, వాహన మంటపం ఉండేవి. తిరుమల వెంకన్న ఆలయంలోని మండపాలు, ప్రాకారాలు, సోపానాలు, జలాశయాలే కాదు- ప్రతీరాయి ప్రతీస్తంభం వైఖానస ఆగమశాస్త్రం ప్రకారమే నిర్మించారు. ఎక్కడా శాస్త్రాన్ని మీరలేదు. కించిత్ వాస్తుదోషం లేకుండా దివ్యక్షేత్రంగా తిరుమల ఆలయ నిర్మాణం జరిగింది.


 ఒకపక్క వరదహస్తం మరోపక్క కటిహస్తంతో నిశ్చలానంద మందార మకరందంతో కనిపించే శ్రీనివాసుడి రూపం మధురం! ఆయన నామం బతికించే సిద్ధమంత్రం! ఆయన పాదం పరమపదం! అందుకే వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన! ఎన్నిసార్లు కైమోడ్పులు అర్పించినా.. పునర్‌దర్శనం ఇప్పించు స్వామీ అని వేడుకుంటాం.


పద్మావతీస గోవిందా, పద్మ మనోహర గోవిందా, ఆనంద నిలయ గోవిందా, ఆనంద రూపా గోవిందా; |


గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||32


మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, పురాణ గాథల కోసం *సనాతన హిందూ ధర్మం* పేజీని లైక్ చేసి ఫాలో చేయండి.


ఈ పోస్ట్ నచ్చితే షేర్ చేయండి.


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *13వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *13వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 4*


శ్రీ మహావిష్ణువు లక్ష్మిని శేషతల్పం వైపు నడిపించాడు. ఆమెను కూర్చోబెట్టి , పక్కనే కూర్చున్నాడు.


శ్రీదేవి ముఖపద్మాన్ని తన రెండు అరచేతుల మధ్య ఇమిడ్చి పట్టుకుని , సున్నితంగా తన వైపు తిప్పుకున్నాడు శ్రీమహావిష్ణువు. ఆమె విశాల నేత్రాలలోకి ఆయన నేత్రాలు తదేకంగా చూశాయి.


*"ఒక జ్యోతి వెలుగును తీసుకువెళ్ళి , దానితో రెండవ జ్యోతిని వెలిగించినప్పటికీ , మొదటి జ్యోతిలోని కాంతి తరిగిపోలేదు. అంటే అక్కడ కాంతి 'వ్యయం' కాలేదు. కాదు కూడా ! అది అవ్యయం ! మూలరూపాలు కూడా అంతే ! అవ్యయాలే ! వేరొక అవతారాన్ని ధరించాక మూల రూపంలో కొరత ఏర్పడదు. దాని శక్తి తగ్గదు; చేవ తరగదు !”* 


*"స్వామీ !"* లక్ష్మి భావావేశంతో అంది.


విష్ణువు చిన్నగా నవ్వాడు. *"నువ్వే చూస్తావుగా దేవీ ! భవిష్యత్తులో నువ్వూ , మేమూ ఎన్నో అవతారాలు ధరిస్తాం ! కానీ మన ఈ 'మూలరూపాలు' ఇలాగే వుంటాయి !"*


మెరుస్తున్న శ్రీలక్ష్మి కళ్ళకి తోడుగా , ఆమె పెదవులు కూడా చిరునవ్వుతో మెరిశాయి. *“కాబట్టి , ఇక్కడ సూక్ష్మరూపంలో మీ నయన కమలాలలో ప్రకాశిస్తున్న సూర్యుడు - అక్కడ స్థూల శరీరంతో కూడా ప్రకాశిస్తూ వున్నాడు. స్వామీ , అంతేకదా ?"*


“అంతే కదా ? లక్ష్మి ప్రశ్నకు విష్ణువు ప్రశ్న సమాధానం చెప్పింది. *"స్వామీ ! మీ నయన సూర్యుడు ఎక్కడ , ఎవరికి జన్మించాడు ? ఎందుకు జన్మించాడు ?"* లక్ష్మి కుతూహలంగా అడిగింది.


*"కశ్యప ప్రజాపతి సతి అదితికి ప్రియ పుత్రుడుగా జన్మించాడు ! నరుల ఆరాధనా సౌలభ్యం కోసం అంతరిక్షంలో సూక్ష్మ రూపాలలో ఉన్న 'నవగ్రహాలు' స్థూలదేహాలు ధరించి అవతరించాలనీ , గ్రహదేవతలను ప్రసన్నం చేసుకుని ప్రాణులు తరించాలనీ మేం సంకల్పించాం. సూర్యుడి జననంతో మా సంకల్పానికి అంకురార్పణ జరిగింది !"* శ్రీమహావిష్ణువు కంఠంలో తృప్తి ధ్వనించింది.


*"దివ్య సంకల్పం స్వామీ , మీది !"* లక్ష్మి ఉత్సాహంగా అంది. *"అయితే మిగిలిన గ్రహదేవతలు ఎప్పుడు ఎవరెవరికి జన్మిస్తారు ?”*


*"ఎప్పటి మాటో ఇప్పుడెందుకు దేవీ ?"* విష్ణువు చిరునవ్వుతో అన్నాడు. శ్రీలక్ష్మి ఏదో అనబోయింది. అయితే , 'నారాయణ !' అనే నారదుడి కంఠధ్వని ఆమెకు అడ్డు తగిలింది. నారాయణ నామ ధ్వనిని వెంబడిస్తూ నారదుడు ప్రవేశించాడు.


*“నమో నమః ! నమో నమః !”* నారదుడు ఆదిదంపతులకు చేతులెత్తి నమస్కరించాడు. *“నారదా ! కుశలమా ?”* శ్రీమహావిష్ణువు పలకరింపుగా అన్నాడు.


*“సర్వకాల సర్వావస్థల్లో నా నాలుక మీద నాట్యం చేసే నీ దివ్య నామం నాకు రక్షగా వుందిగా , నారాయణా ! నీది నిర్హేతుక కృప కదా ! కారణం లేకుండా కరుణించే అమృత తత్వం కదా నీది ! నా తండ్రి గారి శాపాన్ని స్వీకరించి , నీ నామస్మరణ యాగం ప్రారంభించిన వెంటనే మహత్తర సంగీత సాధనమైన ఈ 'మహతి'ని బహూకరించావు. ఇంక ఈ నారదుని క్షేమానికి కొరత ఎక్కడ !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"ఊ ! నీ 'కుశలము' నకూ కొరత లేదు. 'కౌశలము' నకూ కొరత లేదు' శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు.*


*“నారాయణ !"*


*"రాక రాక వచ్చావు ! రాకలో ఏదైనా రహస్యముందా ?"* లక్ష్మి చిరునవ్వుతో అడిగింది.


*"చిత్తం ! ఒక శుభవార్త విన్నవించే కోరికతో వచ్చాను మాతా ?"* నారదుడు. ఉత్సాహంగా *"అయితే ఆ వార్త మాకు అందలేదనుకుంటున్నావా , నారదా ?"* శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు.


*"మీకు తెలియని దేముంటుంది ? పాపం... చెప్పనివ్వండి స్వామీ !"* లక్ష్మి మందలింపుగా అంది. 


*“సరే ! మంచిమాట మాటిమాటికీ వినడం మంచిదే ! వినిపించు , నారదా !”* విష్ణువు చిరునవ్వు నవ్వాడు.


*"ధన్యోస్మి ! సాధ్వీమణి అదితికి పుత్రుడు జన్మించాడు... కశ్యప ప్రజాపతి జాతకర్మ , నామకరణ మహోత్సవాలకు సంకల్పించాడు...”*


*"శుభం ! చతుర్ముఖుజ్జీ , త్రినేత్రుణ్ణి , ఇంద్రాదులనూ ఆహ్వానించు , నారదా ! సూర్య జననం అందరికీ హర్షం కలిగించేదే !"* విష్ణువు అన్నాడు. *"నారాయణ ! అలాగే !"* నారదుడు నమస్కరించి నిష్క్రమించాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 10*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 10*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*సుధాధారసారైః చరణ యుగళాన్తః విగళితైః*

*ప్రపచం  సిఞ్చన్తీ పునరపి రసామ్నాయ మహసః |*

*అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్టవలయం*

*స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ||*



సాధకుడు గత శ్లోకంలో చెప్పినట్లు సహస్రా పద్మాన్ని కుండలినీ శక్తితో చేరగలిగినప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతాడు?


చరణయుగళాన్తః విగళితైః = అమ్మవారి పాదాల నుండి వెలువడుతున్న


 సుధాధారాసారైః = అమృతప్రవాహం


ప్రపంచం సిన్ఞంతీం = శరీరంలోని 72వేల నాడులను తడుపుతూ ఉంటుంది.


పునరపి రసామ్నాయ మహసః =  మళ్ళీ మళ్ళీ ఆ ఆనందామృత ప్రవాహం శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది.


రసః = ఆర్ద్రత,తడి, ఆనందానుభవము


మహసః = మహత్


కాంతి = జ్ఞాన కాంతి 


అవాప్య స్వాం ... కులకుండే కుహరిణి = ఆ విధంగా షట్చక్రములను ఛేదించి సహస్రార పద్మమునందు శివసాయుజ్య స్థానమైన, అమృత కాంతి తుల్యమైన చంద్రుడిని వీడి కుండలినీ శక్తి స్వస్థానమైన మూలాధార చక్రాన్ని మరల చేరుకుని, స్వస్వరూప జ్ఞానముతో సర్పము వలే చుట్ట చుట్టకుని నిద్రిస్తుంది.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

తెలుగుభాష! రతనాలభాష!*

 *నా తెలుగుభాష! రతనాలభాష!*


*అంశం* : *"అధికారభాషపై అధికారుల నిర్లక్ష్యం*

*శీర్షిక* :    *నా తెలుగుభాష! రతనాలభాష!*

*పేరు* : *~శ్రీశర్మద*


సంస్కృతామృతమ్ము నాపోశనంబట్టి 

నన్నయ్య చిన్నయ్య సంస్కరించిన భాష 

తీయతేనెలకన్న కమ్మనై యలరారి 

నయగారములనొలుకు నా తెలుగుభాష 


అల కందుకూరి గురజాడ జాడలన్ 

చిలకమర్తి వారి పల్కులందున కులికి 

పిడుగు వంటి గిగుడు గొడుగు ఛాయన జేరి 

కడిగిన ముత్యమైన భాష నా తెలుగుభాష


రాజుల కాలన రాజసమ్మొలికించి 

చట్టభాషగ తాను మెలగి చెలగి 

చుట్టమై ప్రజకెల్ల అలరారిన భాష 

కమ్మతేనెల మాధురి నా తెలుగుభాష 


భాషోద్యమమునందు వ్యావహారికస్థాయి 

నందిబుచ్చుకొని వచ్చి అందివచ్చిన భాష 

నా తెలుగుభాష నాదరింపగ రారె!

అధికార వ్యవహార డోలలూపగ రారె! 

అందివచ్చును భాష అందగించును భాష 

నిర్లక్ష్యమిక వద్దు లక్ష్యమే ఇక ముద్దు 


జై తెలుగుభాష! జై తెలుగుభాష! 

----------------------------------------------------------

రచన:

*కవితాభారతి*

*~శ్రీశర్మద*

8333844664 

తెనాలి.

పాలిటానా

 


🛕🛕 గుజరాత్‌లోని పాలిటానా 900 కంటే ఎక్కువ దేవాలయాలను కలిగి ఉన్న ప్రపంచంలోని ఏకైక పర్వతం. మొత్తం పర్వతం అత్యంత పవిత్రమైన తీర్థ క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ సముదాయం, ఇది విమానం వీక్షణలో చూపబడింది. అయితే ఇప్పటికీ తాజ్‌మహల్‌ ప్రపంచంలోనే అద్భుతం. మనలో చాలామంది దీని గురించి వినలేదు, చూడలేదు. ఎందుకంటే పబ్లిసిటీ లేదు. అద్భుతం..🎊🙌✊

తెలుగు భాషా దినోత్సవo

 గోరు ముద్దల తోటి తల్లి నేర్పిన భాష

గోముగా తండ్రి మనని పలుకరించే భాష

బంధు మిత్రులతో ఊసు లాడెడి భాష

బాధ గల్గినప్పుడు బయటకొచ్చే భాష

పలుకుటకు సొంపుగా, వీనులకు ఇంపుగా ఒదిగిపోయే భాష.

అదె మన మాతృభాష, తేనెలొలికెడి మన తెలుగు భాష.

తెలుగులోనే మాట్లాడదాం!

తెలుగును పిల్లలకు నేర్పించుదాం!

అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

సుబ్బు శివకుమార్ చిల్లర💐💐.

Panchaag


 

నీలిరంగు చందమామ

 *నేడు నీలిరంగు చందమామ  ఆవిష్కృతం*


ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్‌, గురుగ్రహం, నైప్యూటర్‌, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది.ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం నీలిరంగు చందమామ ఆవిష్కృతం కాబోతున్నది.


ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. నేడు నీలిరంగు చందమామ బుధవారం ఏర్పడబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి..


కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్‌ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్‌ మూన్‌ ఆవిష్కృతమవుతుంది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు..

ఆలయానికి చేరుకోవాలి.

 *ప్రతి మంగళవారం సాయంత్రం 7:00 నుండి 7:30 మధ్య, మీరు ఎక్కడ ఉన్నా ఆలయానికి చేరుకోవాలి.*


క్రైస్తవులు ఆదివారాల్లో చర్చికి వెళ్లినట్లు 


మరియు ముస్లింలు ఖచ్చితంగా శుక్రవారం రోజున మసీదుకు వెళతారు.     

                                  మనం హైందవులం మంగళవారం రోజు, బలం మరియు బుద్ధి రోజు, శక్తి రోజు, హనుమాన్ జీ రోజును నిర్ణయించుకోవాలి.


హిందువు ఎప్పటికీ హిందువు కోసం నిలబడలేడని మీరందరూ ఫిర్యాదు చేస్తున్నారు.  


మీరు కనీసం వారానికి ఒకసారి ఒకరినొకరు కలుసుకోలేని వారు అలాంటి పిర్యాదు ఎలా చేస్థారు.


ఎడారిగా ఉన్న మన దేవాలయాలను శక్తి మరియు సంస్థాగత ప్రదేశాలుగా అభివృద్ధి చేసుకుందాం.


 *ప్రతి మంగళవారం సాయంత్రం 7:00 నుండి 7:30 మధ్య, మీరు ఎక్కడ ఉన్నా ఆలయానికి చేరుకోవాలి.*


ఇది హనుమాన్ చాలీసా మరియు హారతి సమయం.



 మీ ఇంట్లో ఉంటే ఇంటి దగ్గర ఉన్న గుడిలో..


షాపులో ఉంటే షాప్ దగ్గర ఉన్న గుడిలో..


ఆఫీస్ దగ్గర ఉన్న గుడిలో.. 


ప్రతి మంగళవారం సాయంత్రం 7:00 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. 7:00 నుండి 7:30 వరకు.

భారతదేశంలో లక్షలాది దేవాలయాలు ఉన్నాయని ఊహించుకోండి,


కేవలం 50 నుండి 100 మంది మాత్రమే ప్రతి ఆలయానికి చేరుకుని, శంఖం మరియు హారతి శబ్దాలు వారి గంటలతో ప్రతిధ్వనించి నట్లయితే, 


భారతదేశం మొత్తంలో ప్రతి మంగళవారం సరిగ్గా 7:00 గంటలకు మిశ్రమ సంగీతం. 7 .

 30 నిమిషాల మధ్యలో ప్రతిధ్వనిస్తే, 


ఈ స్వరం ప్రపంచం మొత్తానికి వెళుతుంది, 


దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది.  నన్ను నమ్మండి, ఈనాటి సమస్యలన్నీ కర్పూరంలా ఎగిరిపోతాయి, 


హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో తమ దేవాలయాలకు చేరుకున్నప్పుడు, 


అది కూడా ప్రతి వారం, హిందువులను ఆటపట్టించే ధైర్యం ఎవరికి ఉండదు.

 

వీలైతే 

భార్యాబిడ్డలను తీసుకుని గుడికి వెళ్లండి, 


ప్రతి మంగళవారం ఈ విధంగా క్రమం తప్పకుండా గుడికి చేరుకుంటే మీ ఇరుగుపొరుగు వారు కూడా మిమ్మల్ని కలుస్తారని మీకే తెలుస్తుంది, 


మీ బాంధవ్యం పెరుగుతుంది. 


ఆపై మీరు కూడా ఒకరికొకరు సుఖ దుఃఖాలలో పాలుపంచుకుంటారు, 


అదే విధంగా మనమందరం ఐక్యత అనే దారంలో కట్టుబడి ఉంటాము.


మీకు సందేశం నచ్చినట్లయితే, 

దానిని అన్ని సమూహాలకు విస్తరించండి.  (అన్ని గౄపులకు పంపండి) 


మరియు ఈరోజే ప్రతిజ్ఞ చేయండి, 


మనం ఏమి చేస్తున్నా, ప్రతి మంగళవారం 7:00 నుండి 7:30 వరకు, 


మేము ఖచ్చితంగా ఆలయానికి చేరుకుంటాము, 

మన కోసం కాదు, మన సమాజం మరియు మన కుటుంబాల భద్రత కోసం.  


ఇప్పుడు ఇది అవసరం అయిందని గుర్తుంచుకోండి, మీరు ఇంకా వాయిదా వేస్తే, మీరు చాలా ప్రమాదంలోకి వెళ్ళాల్సి వస్తుంది.  


మీరు దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే, అంత త్వరగా మీరు ఐక్యత యొక్క దారంలో ఒకరికొకరు ముడిపడి ఉంటారు.


 *ఈ సందేశాన్ని కనీసం ఐదు గ్రూపులకు పంపండి*

 *కొందరు పంపరు కానీ మీరు తప్పకుండా పంపుతారని నేను నమ్ముతున్నాను ఆశిస్తున్నాను*

30-08-2023 రాశి ఫలితాలు

 30-08-2023

రాశి ఫలితాలు


మేషం

ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా  వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.  వ్యాపారాలలో అనుకొన్న సమయానికి నూతన పెట్టుబడులు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. -------------------------------------

వృషభం

 30-08-2023

బంధుమిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంత సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.  ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి  వ్యాపారాల్లో నూతన లాభాలు అందుతాయి.  

-----------------------------------

మిధునం

వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.  వ్యాపారమున  భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు  నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. 

------------------------------------

కర్కాటకం

బంధుమిత్రులతో ఊహించని  కలహాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో   అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

------------------------------------

సింహం

ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులతో గృహమున  సంతోషంగా గడుపుతారు. ఉద్యోగం వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు.

-------------------------------------

కన్య

చేపట్టిన పనులు  సకాలంలో పూర్తి అవుతాయి. ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది

----------------------------------

తుల

గృహమున కొందరి  ప్రవర్తన వలన మానసిక సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో వ్యయ  ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ప్రారంభించిన  పనులలో అవరోధాలు  కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.  సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు.

---------------------------------------

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది.  స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో  ఒక వ్యవహారంలో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.  వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో  దైవ దర్శనాలు చేసుకుంటారు.   

--------------------------------------

ధనస్సు

భూ సంబంధిత   క్రయవిక్రయాల లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. 

--------------------------------------

మకరం

వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో  అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన  పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున కొందరి  మాటలు చికాకు కలిగిస్తాయి.  అవసరానికి చేతిలో డబ్బు నిలవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. 

---------------------------------------

కుంభం

ధన పరంగా  సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగ యత్నాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. సమాజంలో  ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారమున  స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక   ప్రగతి సాధిస్తారు.

---------------------------------------

మీనం

సన్నిహితులతో  ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్ధికంగా కొంత నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు విఫలమవుతాయి. 

---------------------------------------

పంచాంగం 30.08.2023 Wednesday,

 ఈ రోజు పంచాంగం 30.08.2023 Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస శుక్ల  పక్ష: చతుర్థశి తిధి సౌమ్య వాసర: దనిష్ఠ నక్షత్రం అతిగండ యోగ: వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం. 


త్రయోదశి మధ్యాహ్నం 02:45 వరకు.

శ్రవణం రాత్రి 11:47 వరకు.

సూర్యోదయం : 06:05

సూర్యాస్తమయం : 06:28

వర్జ్యం : రాత్రి 03:04 నుండి 04:28 వరకు.

దుర్ముహూర్తం: పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:41 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30  వరకు.


యమగండం : ఉదయం 07:30 నుండి 09:30 వరకు.  

 

ఈ రోజు సర్వ యజుశ్శాఖీనాం ఉపాకర్మ, రక్షాభందనం


శుభోదయ:, నమస్కార:

హనుమాన్ చాలీసా

 🙏🙏🙏🙏🙏🙏🙏

 *హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు,

సమాధానములు*


🔔🔔🔔🔔🔔🔔🔔🔔


1, చాలీసా " అంటే ఏమిటి ?

జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా

__ అని పేరు { చాలిస్ అంటే హిందీ లో 40 అని }


2. హనుమాన్ అంటే  అర్థం ఏమిటి ?


జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు

అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం.

 *అజ్ఞానమును* *హననము చేయునది కనుక*

*జ్ఞానమునకు హనుమ అని పేరు.* 


3. ఆంజనేయ - అర్థం ?


జ. ఆంజనేయ అంటే ....

సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే

అంజనం , జ్ఞానాంజనం వల్ల  మాత్రమే దొరికే

పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.


4. తులసీదాస్ అస్సలు పేరు ?


జ. *రామ్ బోల*. ఎప్పుడూ రామ నామం

స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.


5. హనుమంతుడు బ్రహ్మచారి 

అయితే మరి సువర్చల ఎవరు ?


జ. దేవుళ్ళ భార్యలను,

మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు.


భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి,  

    

సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య వల్ల

వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల"

ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం

మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.


6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?


జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం

అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ

హనుమత్ స్మరణాత్ భవేత్. 


హనుమంతుని స్మరించటం వలన

మనం పొందే అష్టసిద్ధులు ఇవే.


7. సూర్యునితో పాటు తిరుగుతూ

విద్య నేర్చుకున్నాడు హనుమ.అంటారు కదా

అసలు సూర్యుడు తిరగడు కదామరి ?


జ. తిరగడం అంటే ఇక్కడ,

ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు,

క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది

దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.


8. హనుమంతుని పంచముఖములు ఏవి ?


జ. హనుమ శివాంశ సంభూతుడు.

శివుని పంచముఖములు,హనుమంతునిలో

ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. .....

తూర్పున వానర ముఖం  జన్మతః

వచ్చినది అది సద్యోజాత శివవదనము.

దక్షిణం వైపు నార సింహం.

అది శివుని వామదేవ ముఖం.


రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.

పశ్చిమం గరుడ ముఖం అది శివుని అఘోరరూపం,

వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.


ఉత్తరం వరాహ ముఖం

అది శివుని తత్పురుష రూపము.

సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న

సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. 

ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. 

అది శివుని ఈశాన ముఖం .

వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు.

ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి.

ఈ మూర్తి పది చేతులతో వుంటాడు.


వేద విద్య ,త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ

నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది,


9. "జయ" హనుమాన్ అని

హనుమకి జయం చెప్పడమేంటి ?


జ. ఎవరైనా ఏది సాధించడానికి (పురుషార్థాలను) 

పుట్టారో అది సాధించడమే జయం అంటే.


జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం.

దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము

అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి

ఉండు అని అర్థము.


10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు ?

జ.126 సం.జీవించాడు.


శ్రీరామదూతం శిరసా నమామిః🙏

*సర్వేజనాసుఖిననోభవంతు*🙏🙏🙏

విలువలు సంస్కారం

 పెద్ద చదువులతో పాటు విలువలు సంస్కారం కూడా కొంచెం నేర్పించండి. ఆడపిల్ల దేనికి తక్కువ కాదు అంటూ గొప్పలు చెప్తారు బానే కానీ.. అంటే అర్ధం ఇదేనా..!??  

       ఈ స్వేచ్ఛ, సమాజం పట్ల భయం లేకపోవడం ఇద్దరు ఆడపిల్లలు ఉన్న చాలా ఇళ్లలో చూస్తున్నాం..

ఖచ్చితంగా పెంపక లోపం....  (కొందరు మాత్రమే)

  మగపిల్లలను లెక్క చెయ్యకుండా దురుసు ప్రవర్తన ఉంటుంది.. అదే ఒక అన్న తమ్ముడు ఉంటే ఒకే జనరేషన్ వాళ్ళు కాబట్టి ఆడపిల్ల ప్రతి కదలిక తెలుసుకుంటాడు అన్న లేదా తమ్ముడు...

   వారి పట్ల భయం, ప్రేమ, గౌరవం తోనో ఒకింత ఒద్దికగా ఉంటున్నారు.. ఈ మధ్య నేను చుసి obeserve చేసిన విషయం..    ✍️

      

Sad news: కోరుట్ల 👇👇👇👇👇

    


అక్క అనుమానస్పద మృతి.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పారిపోయిన చెల్లెలు


కోరుట్ల - భీమునిదుబ్బలో నివాసం ఉండే బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ముగ్గురు సంతానం కాగా పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తూ వర్క్ ఫ్రం హోం చేస్తుంది. చిన్న కూతురు చందన బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది.


ఓ ఫంక్షన్ నిమిత్తం తల్లితండ్రులు సోమవారం హైదరాబాద్ వెళ్లగా మంగళవారం ఉదయం దీప్తి సోఫాలో శవమై కనిపించింది. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో చిన్న కూతురు చందన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిపోయినట్లు బస్ స్టాండ్ సీసీటీవీ ఫుటేజిలో నమోదైంది.


ఇంట్లో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు ఉండగా మద్యం సేవించిన అనంతరం దీప్తిని చంపారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.

   హత్య లేదా ఆత్మ హత్య ఏదైనా కూడా విచ్చలవిడి తనమే స్పష్టంగా కనిపిస్తుంది...

చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి

 చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు -

                                                 

ఇవాళ సినిమా హీరోలలో అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని పేరుప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.  గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం.  అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు.  ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో , కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు.  సునాయాసంగా బయటపడ్డారు.  


చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు.  ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి.  ఏ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి.  అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా.  కానీ చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు.  ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు.  ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు.  అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో.  ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు.  


చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు.  కానీ ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు.  ఎక్కడికైనా బయట నగరాలకు5 వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు.  ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు.  ఇంతవరకు ఆయనకు కారు లేదు.  ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు.  ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు.  చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు.  సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు.  


చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు.  ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.  తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు.  వారికి ఆస్తిపాస్తులు లేవు.  నిరుపేద కుటుంబం.  సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు.  పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి.  వేదాగ్రణి ఆయన రసన మీద తిష్టవేసుకుని కూర్చున్నది.  ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.  


ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు.  ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి.  ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు.  అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు.  ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం.  ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది.  ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.  వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం.  


ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు.  అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె  తన సంపాదనతో వివాహాలు చేశారు.  కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.  తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు బాలన్స్ లేదంటే నమ్ముతారా?  


అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు.  ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు.  ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు.  ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి.  అభిమానులు పెరిగారు.  


పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు.  "మీ గురించి ఎంతో విన్నాను.  మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి.  ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం.  ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను.  ఏమైనా అడగండి.  చేసిపెడతాను"  అన్నారు పీవీ.  


చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు.  మీ సహృదయానికి కృతజ్ఞతలు.  నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.  


ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!!  


 

చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు.  ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998  లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు.  ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది.  ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి  కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది.  ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.


*దుర్మార్గులను ఖండించక పోవుట ఏంతటి తప్పో ఇట్టువంటి మహాత్ములను ప్రశంసించక పోవడం గూడా అంతే తప్పు ఔతుంది  ఒక మహోన్నతమైన వ్యక్తిని కీర్తించడం పదుగురికీ తెలియజేస్తున్న మీ మహోన్నత వ్యక్తిత్వం ప్రశంసనీయం*

సాంఖ్య యోగః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️* 

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 12వ శ్లోకం* 


 *నత్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |* 

 *న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్|| 12* 


 *ప్రతిపదార్థం* 


అహామ్ = నేను; జాతు =ఒకప్పుడును ; న, ఆసమ్ తేను - అనునది;న, తు, ఏవ =లేనే లేదు; త్వమ్ = నీవు;న ( ఆసీః )= లేవు.- అనునది" లేదు; ఇమే ఈ ; జనాధిపాః = రాజులు;న (ఆసన్) = 'లేరునునది 'యును లేదు;చ = మరియు; అతః, పరమ్ . ఇక మీదట; వయమ్, సర్వే = మనము అందరము ;న, భవిష్యామః = " లేకపోవుట  " యనునది;న, ఏవ = లేనే లేదు;


 *తాత్పర్యము* 


 నీవుగాని, నేనుగాని, ఈ రాజులుగాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు.( అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మశాశ్వతము. అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించునది కాదు. )


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

రామాయణమ్ 309

 రామాయణమ్ 309

....

శీఘ్రముగా రధము మీద తన వైపు వస్తున్న ఇంద్రజిత్తును చూసి సింహనాదము చేసి కాయమును పెంచి సన్నద్ధుడై నిలిచాడు మహాబలి మారుతి.

.

వరుసగా పిడుగుల పడినట్లుగా ధనుష్ఠంకారము చేస్తూ వాడివాడి నారాచములను ప్రయోగించగా వాటి వేగాన్ని గేలి చేస్తున్నట్లుగా వాయుసుతుడు రయ్యిమంటూ ఆకాశములోకి దూసుకొని పోయెను.

.

బాణమునకు బాణమునకు మధ్య తానొక తారాజువ్వ అయిపోయి సంచరిస్తూ ఇంద్రజిత్తు చేసిన శస్త్రప్రయోగమును వ్యర్ధముగావించెను.

.

అంత దివ్యాస్త్రములు ప్రయోగించిన ఇంద్రజిత్తు అవి కూడా మారుతిని రవ్వంత కదిలించలేక పోయినందుకు మనస్సులో కళవళ పడెను.

.

అస్త్రములు వ్యర్ధమైపోయాయి

శస్త్రములువికలమయిపోయాయి .ఇంద్రజిత్తు చేస్తున్న యుద్ధము అంతా నిష్ప్రయోజనమయిపోయింది.

.

అసలు ఇంద్రజిత్తు చేసే ప్రతిప్రయోగాన్ని ఆదిలోనే సునిశితంగా గమనించి తదనుగుణంగా తన వేగాన్ని వృద్ధిపొందిస్తూ చిత్రవిచిత్రగతులలో బాణానికిబాణానికి మధ్య సంచరిస్తూ ఆ రావణకుమారుని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు హనుమస్వామి.

.

ఇక లాభంలేదు ఇతడు సామాన్యుడు కాడు బ్రహ్మాస్త్రప్రయోగము చేయవలసినదే అని మనస్సులో సంకల్పించి ఆ అస్త్రమును అభిమంత్రించి మారుతిపై ప్రయోగించాడు ఇంద్రజిత్తు.

.

వూటుకూరు జానకిరామారావు

 కాంగ్రెస్ పరిపాలన లో అవినీతి, అక్రమలు, అబద్దం మాటలు విని ఇప్పటికి మనం ఇంకా దొంగ రాజకీయ నాయకుల చేతిలో బానిస బతుకులు బతుకుతున్నాం అన్న సంగతి కూడ మర్చిపోయ్యము..నిజం ఏంటి, అసలు మణిపూర్ లో ఏమి జరిగింది..........

మణిపూర్ ఒక్కప్పుడు హిందువుల తో  శోభనియంగా ఉండేది. హిందు పండుగలు చాలా ఘనంగా జరిగేవి.. కలిసి మెలిసి జీవించే ఒక్క సనాతన దర్మం అక్కడ పాటించేవాళ్ళు.. మంచి కొండా ప్రాంతం, చక్కగా వ్యవసాయం చేసి జీవించే వాళ్ళు.. కొన్ని రోజుల తరువాత అక్కడి పరిస్థితి లు మారాయి.. కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. హిందు మతం ను విడగొట్టడం ప్రారంభించరు. మెల్లగా మెల్లగా హిందువులను మతం మార్చడం, వాళ్ళ లో  హిందు మతం మీద హిందువుల మీద విషం కక్కే మాటలు బుర్ర లో నింపడం చేశారు... అంతటితో ఆగాకుండ కాంగ్రెస్ నాకు ఎందుకు లే అని అందరికి విచ్చలవిడిగా వొదిలేసింది.. అక్కడి ప్రజలు హిందు, క్రిస్టియన్స్, ముస్లిం లుగా విడి పోయి బతకడం ప్రారంభించరు..అంతే కాకుండా అక్కడి ప్రజలు సుఖానికి అలావాటు పడి తొందరగా డబ్బు ఎలా సందించడం మీద దృష్టి పెట్టరు వాళ్ళ వ్యవసాయం లో మార్పులు వచ్చాయి.. కొండ ప్రాంతం లో ఉన్నవారు గంజాయి, పొగాకు పంటలు వెయ్యడం ప్రారంభించరు..100% ఉన్న హిందువులను మతం మర్చి 35% హిందువులగా చేసి వారిని ఒక్క సర్కిల్ లో తెచ్చి వారి హక్కులను, వారి స్థితి గతులను ఒక్క రక్షణ లేని వలయం లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ... చుట్టూ సముద్రం మధ్యలో భూమి ఉంటే అక్కడ బతికే వారి పరిస్థితి ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి మణిపూర్ హిందువుల పరిస్థితి కూడ అలాగే మరి పోయింది... అక్కడ కాంగ్రెస్ పార్టీ కి  ఎవరు ఓడించారు అని అనుకున్న సమయం లో బీజేపీ అక్కడ రావడం జరిగింది.. అది జిర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకమే మణిపూర్ అల్లారులు...

బీజేపీ అక్కడ ఒక్కటే చేసింది. కొండ ప్రాంతం లో ఉన్న వాళ్ళ గంజాయినీ నాశనం నాశనం చేసి ప్రజలకు మంచి పరిపాలన అంది ఇవ్వాలి అని...అది కాంగ్రెస్ పార్టీ కి నచ్చడం లేదు... ఎప్పటికైనా హిందువులు మారండి.. బీజేపీ కి ఓటు వెయ్యండి.. దేశం ను కాపాడండి...సేకరణ శంకర్ శేర్ల...జై హింద్.. జై శ్రీరామ్..

అర్థవంతమైన_హిందూమతం

 #అర్థవంతమైన_హిందూమతం


 తమిళ భాషలో కవిరాజుగా ప్రసిద్ధి చెందిన కన్నదాసన్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు.


*నేను హిందువుగా ఉండడానికి ఇష్టపడుటకు కారణాలు👇👍


1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం, హిందూధర్మం.


2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.


3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పనిసరిగా ఒక్క సారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.


4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.  


5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు. 


6.  సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం, హిందూధర్మం.


7.  హిందువులు ఈ క్రింది వాటిని కూడా భగవత్సరూపాలుగానే ఆరాధిస్తారు.


 వృక్షాలు దైవ స్వరూపాలే.

 రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే.


8 నీరు (గంగ), గాలి కూడా దైవ సవరూపమే.


9 వానరాలు (కోతులు),కుక్కలు (భైరవుడు),పందులు(వరాహం) కూడా దైవ స్వరూపాలే.


10. నీవు దైవ స్వరూపమే.

నేనూ దైవ స్వరూపమే. 

చక్షు గోచరమైనవన్నీ (కంటికి కనిపించేవన్నీ)

     దైవ స్వరూపాలే.    


11.  చతుర్వేదాలు,  నాలుగు ఉప వేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం, హిందూధర్మం. 


12.మన ధార్మిక గ్రంథాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు.


కర్మల గురించి తెలియాలంటే ......

👉 వేదాలు చదవాలి.


సమస్త జ్ఞానం పొందాలంటే ......

👉 ఉపనిషత్తులు చదవాలి.


పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ......

👉 రామాయణం చదవాలి.


రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ......

👉 మహాభారతం చదవాలి.


భగవంతుని తత్త్వం తెలియాలంటే ......

👉 భాగవతం చదవాలి.


చక్కటి పరిపాలన అందించాలంటే ......

👉 కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి.


అన్యోన్య దాంపత్యానికి ......

👉 వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి.


చక్కటి ఆరోగ్యానికి ......

👉 ఆయుర్వేదం చదవాలి.


మేథస్సుకు ......

👉 వేద గణితం చదవాలి.


శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి ......

👉 పతంజలి యోగశాస్త్రం చదవాలి.


భవన నిర్మాణాలకు ......

👉 వాస్తుశాస్త్రం చదవాలి.


గ్రహ, నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి ......

👉 ఖగోళ శాస్త్రాన్ని చదవాలి.


13. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం, హిందూధర్మం.


14. ఆహార అలవాట్లలో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాకాహారం, మాంసాహారం  ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు.)


15. హిందూధర్మం, అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగానే పరిగణిస్తుంది.


16. మోక్షానికి దారి చూపించే ధర్మమే, హిందూధర్మం.


17. అన్ని మతాలను గౌరవించే ధర్మం, హిందూధర్మం.


18. పరమత దూషణ చెయ్యని ధర్మం, హిందూ ధర్మం.


                జై హింద్.


           ఓమ్ శ్రీ మాత్రే నమః

      సర్వేజనా సుఖినోభవంతు

రక్షాబంధనం

 🔅 రక్షాబంధనం ఎలా ప్రారంభమైందంటే ...  


పూర్వం దేవతలకు , రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది.


 రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను , లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి  చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి  ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. 


 రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.


      రాఖీపౌర్ణమి చరిత్ర


    ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం


ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది , శ్రీకృష్ణుడికి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట.


అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు...


శ్రీ మహావిష్ణువు - బలిచక్రవర్తి


శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. 


శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి , తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది.


 (రక్ష బంధం మంత్రం : " ఏన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల" 


భావం - ఓ రక్షాబంధమా ! మహాబలవంతుడూ , రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను.)



జై శ్రీకృష్ణ



( సేకరణ )

నూతనయజ్ఞోపవీత

 నూతనయజ్ఞోపవీత ధారణ విధానము https://youtu.be/gaJnD3pyEvM?feature=shared


పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను.


.


ప్రార్థన:


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |


ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||


.


గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |


గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః ||


.


అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా |


యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||


పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!


(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)


.


ఆచమన విధానం:

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1.   ఓం కేశవాయ స్వాహా,


2.   ఓం నారాయణాయ స్వాహా,


3.   ఓం మాధవాయ స్వాహా,


అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.


4.   ఓం గోవిందాయనమః,


5.   ఓం విష్ణవే నమః,


6.   ఓం మధుసూదనాయనమః,


7.   ఓం త్రివిక్రమాయనమః,


8.   ఓం వామనాయనమః,


9.   ఓం శ్రీధరాయనమః,


10.  ఓం హృషీకేశాయనమః,


11.  ఓం పద్మనాభాయనమః,


12.  ఓం దామోదరాయనమః,


13.  ఓం సంకర్షణాయనమః,


14.  ఓం వాసుదేవాయనమః,


15.  ఓం ప్రద్యుమ్నాయనమః,


16.  ఓం అనిరుద్ధాయనమః,


17.  ఓం పురుషోత్తమాయనమః,


18.  ఓం అధోక్షజాయనమః,


19.  ఓం నారసింహాయనమః,


20.  ఓం అత్యుతాయనమః,


21.  ఓం జనార్దనాయనమః,


22.  ఓం ఉపేంద్రాయనమః,


23.  ఓం హరయేనమః,


24.  ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను. అటు పిమ్మట:


.


భూతోచ్చాటన:


(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)


ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః


.


(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)


.


గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.


ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||


.


తదుపరి సంకల్పం:


మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే


.


(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య” అని చెప్పనక్కర లేదు)


.


యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను. కొందరు రెండు ముడులు కొందరు మూడు ధరిస్తారు 


.


యజ్ఞోపవీతమిత్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,


దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||


.


“ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం


ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్


ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం


యజ్ఞోపవీతం బలమస్తు తేజః ”


అని చెప్పి అని ధరించవలెను.


.


(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)


.


ద్వితీయోపవీత ధారణం:


తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


.


తృతీయ యజ్ఞోపవీత ధారణం:


తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.


.


చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట:


తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ “ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.


.


తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు కానీ నూట ఎనిమిది మారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)


.


గాయత్రీ మంత్రము:


“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం


భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ ”


.


తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.


.


జీర్ణోపవీత విసర్జనం:


తిరిగి ఆచమనం చేసి


.


శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం


విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||


.


శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం


వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం


ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం


జీర్నోపవీతం విసృజంతు తేజః ||


.


శ్లో: ఏతా వద్దిన పర్యంతం


బ్రహ్మత్వం ధారితం మయా


జీర్ణత్వాత్తే పరిత్యాగో


గచ్ఛ సూత్ర యథా సుఖం ||


.


విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.


తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి “గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.


.


తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.


.


నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:


జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను.  యజ్ఞోపవీత మహిమ https://youtu.be/f2xtCih_cjc?feature=shared


వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. 


దీనినే తెలుగులో ‘జ్యంద్యం’ అంటాం. 


ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. 


ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు. 


యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. 


దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.


’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య 


   వేదతత్త్వస్య సూచనాత్


తత్సూత్రముపవీతత్వాత్ 


బ్రహ్మసూత్రమితి స్మృతమ్’!!


బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.  


యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. 

అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని


 ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’


 అనే మంత్రం చెబుతోంది.  


యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. 


ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం - 


‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ 

వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ 

ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ

తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా 

పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః

సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ 

సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’!!


మొదటి తంతువులో ఓంకారం,

 రెండవ తంతువులో అగ్నిదేవుడు, 

మూడవ తంతులో నాగదేవత, 

నాలుగవ తంతువులో సోమదేవుత, 

ఐదవ తంతువులో పితృదేవతలు, 

ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, 

ఏడవ తంతువులో వాయుదేవుడు, 

ఎనిమిదవ తంతువులో సూర్యుడు, 

తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం. 


‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది. 


’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్

కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’


ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది. 


తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. 

అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.


 ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది. 


’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ

తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’


నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. 


అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. 


గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం. 


యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది. 


’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్

తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్

ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్

యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’!!


అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. 

దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.


బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.


యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. 


యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. 


ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. 


ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. 


ఇదే యజ్ఞోపవీత మహిమ!


ఓం తత్సత్......

సర్వేజనా సుఖినోభవంతూ.......


ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ