28, ఆగస్టు 2024, బుధవారం

శ్రీనాథరచనాచమత్కృతులు

 


శ్రీనాథరచనాచమత్కృతులు!!


శా. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్ లోచనా

       పాంగ ప్రాంతమునం దిగుర్ప నొక సయ్యాటంబు గల్పించి నా

       యంగుళ్యాభరణంబు బుచ్చుకొనవా! ఆ యుంగరంబిప్పుడే

       సింగారింపని చేత బావకునకున్ జేయన్ హవిర్దానమున్


– ఈ పద్యంలోని సొగసు శ్రీనాథుని కవిత్వంలో ప్రత్యేకతా తెలియాలంటే, మూలంలో యీ సన్నివేశం ఎలా ఉందో చూడాలి. కాశీఖండం స్కంధ పురాణంలో ఒక భాగం. మూలంలో యజ్ఞదత్తుడు రుసరుసలాడుతూ ఇంటికి వస్తూనే, “దీక్షితాయని కుత్రాస్తి ధూర్తే గుణనిధి స్సుతః” అంటాడు. మొదలుపెట్టడంతోనే “ఓ ధూర్తురాలా!” అని తిడతాడు.


“అథ తిష్ఠతు కిం తేన క్వ సా మమ శుభోర్మికా

అంగోద్వర్తన కాలే యా త్వయా మేంగులీ హృతా

సా త్వం రత్నమయీం శీఘ్రం తామానీయ ప్రయచ్ఛమే”

అని అంటాడు.


 “ఎక్కడ నీ కొడుకు? అయినా వాడి సంగతి ఎందుకులే. శుభకరమైన నా ఉంగరం ఎక్కడ? అంగోద్వర్తన వేళ నువ్వు తీసుకున్న ఆ రత్నపుటుంగరాన్ని వెంటనే తెచ్చి నాకివ్వు” అని గద్దిస్తాడన్న మాట. సంస్కృతంలో యజ్ఞదత్తుడు, భార్య తననుండి ఉంగరం కాజేసిన సందర్భం మాత్రం చెప్పి ఊరుకున్నాడు, “అంగోద్వర్తన కాలే” అని. 

అంగోద్వర్తనం అంటే ఒంటికి నలుగుపెట్టడం. కానీ మన శ్రీనాథునికి అంతటితో ఆపేస్తే తృప్తి ఎక్కడిది! ఆ సరసమైన సన్నివేశాన్ని తాను ఊహించి, పాఠకులకి చూపిస్తే కాని అతనికి మనసొప్పదు! ఇదే సన్నివేశంలో శ్రీనాథుని యజ్ఞదత్తుడు, తనకున్న ఆవేశాన్నంతటినీ వెంటనే వెళ్ళగక్కడు. భార్యతో వ్యంగ్యంగా మొదలుపెడతాడు. ఇంటికి వచ్చి, “సోమిదమ్మ! ఏమి చేయుచున్నావు? ఇటు రమ్మ! నీ కొడుకెక్కడం బోయె? బోవగా కేమి? విను మిట్లనియె”, అని పై పద్యం చెపుతాడు. ఎక్కడా తిట్టుపదం లేదు. కానీ పలికే తీరులో ఒలికే వ్యంగ్యమంతా సహృదయులైన పాఠకులు ఊహించుకోవలసిందే! 


“దరహాసాంకూరముల్ లోచనాపాంగ ప్రాంతమునం దిగుర్ప, ఒక సయ్యాటంబు గల్పించి, నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా!” అని అనిపించాడు. ఇదీ యీ పద్యంలోని ఆయువుపట్టు! దరహాస అంకూరముల్ – చిరునవ్వుల చిగురులు. లోచన అపాంగ ప్రాంతము – కంటి తుదలు, ఇగురుచు – చిగురించు.


ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించండి. సోమయాజులుగారి ఒంటికి సోమిదేవమ్మగారు నలుగు పెడుతున్నారు. అలా పెడుతూ పెడుతూ, చిరునవ్వు మొలకలు తన కడకంట చిగురింపజేస్తూ, అతన్ని మురిపిస్తూ, ఒక సయ్యాట కల్పించి, అలా అలా, ఆ చేతినున్న ఉంగరాన్ని లాఘవంగా లాగేశారు సోమిదమ్మగారు! ఎంత సొగసైన సన్నివేశమో! ఇలాంటి సన్నివేశ చిత్రణ అంటే శ్రీనాథునికి ప్రాణం. పురాణాన్ని కవిత్వంగా మలిచే విద్య యిది. “సయ్యాటంబు” అన్న పదంలో “య్యా” అక్షరం యతిస్థానంలో ఉంది. సంస్కృతంలో లాగా తెలుగులో యతి విరామం కాదు. అంటే, యతిస్థానంలో కొత్త పదం మొదలవ్వాలని లేదు. కాని పద్యం చదివేటప్పుడు యతి అక్షరం మీద కొంచెం ఊనిక యివ్వడం ఆనవాయితీ. “సయ్యాటంబు” అన్న పదాన్ని అలా, కాస్త సాగదీసి పలికినప్పుడు, ఆ గొంతులో మరింత వెటకారం ధ్వనిస్తుంది. సంస్కృత దీక్షితులవారు ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో చెప్పలేదు. అంటే అప్పటికే అతనికి ఉంగరం సంగతి తెలిసిపోయిందన్న విషయం సోమిదమ్మగారికి తెలిసిపోతుంది. మన తెలుగు దీక్షితులవారు మరి కాస్త గడసరి. ఆ విషయం వెంటనే తన భార్యకు తెలియకుండా ఉండాలని, తాను ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో కారణం చెపుతున్నారు. ఆ ఉంగరం తొడగని చేతితో అగ్నిహోత్రం చెయ్యరట. పద్యమంతా సమాసాలతో ధారగా సాగి, చివరికి వచ్చేటప్పటికి, “పావకునకున్ చేయన్ హవిర్దానమున్” అని, ముక్కా ముక్కా తెగిపోతోంది. అతను పుల్ల విరిచినట్టు, ఖరాఖండీగా మాట్లాడడం ఇందులో ధ్వనిస్తుంది. ఈ ‘ధ్వనించ’డాలన్నీ పద్యాన్ని ‘సరిగ్గా’ చదవగలిగే వాళ్ళు చదివినప్పుడు మాత్రమే బోధపడే విషయాలు. మాటల్లో వ్రాసి చెప్పడం కష్టం!

కడకంటి చూపుల్లో చిరునవ్వులు చిగురించడం అనేది శ్రీనాథునికి బాగా యిష్టమైన ఒక సున్నిత శృంగారలీల.🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఆగష్టు, 28, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

     🪷 *బుధవారం*🪷

🌷 *ఆగష్టు, 28, 2024*🌷

    *దృగ్గణిత పంచాంగం*                


 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి: దశమి* రా 01.19 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : మృగశిర* సా 03.53 వరకు ఉపరి *ఆరుద్ర*


*యోగం  : వజ్ర* రా 07.12 వరకు ఉపరి *సిద్ధి*

*కరణం  : వణజి* మ 01.22 *భద్ర* రా 01.19 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 06.00 - 11.00 మ 02.00 - 04.30*

అమృత కాలం  :*ఉ 06.59 - 08.36*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*


*వర్జ్యం          : రా 12.33 - 02.12*

*దుర్ముహూర్తం :ఉ 11.43 - 12.33*

*రాహు కాలం : మ 12.08 - 01.42*

గుళికకాళం      : *ఉ 10.35 - 12.08*

యమగండం    : *ఉ 07.27 - 09.01*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 05.53* 

సూర్యాస్తమయం :*సా 06.23*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.53 - 08.23*

సంగవ కాలం   :      *08.23 - 10.53*

మధ్యాహ్న కాలం :*10.53 - 01.23*

అపరాహ్న కాలం:*మ 01.23 - 03.53*

*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ దశమి*

సాయంకాలం  :  *సా 03.53 - 06.23*

ప్రదోష కాలం   :  *సా 06.23 - 08.41*

నిశీధి కాలం    :*రా 11.465- 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


     🪷 *సరస్వతి శ్లోకం*🪷


సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |

శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || 


సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |

సంపన్నాయై కుమార్యై చ 

సర్వజ్ఞే తే నమో నమః ||


జ్ఞాన విజ్ఞాన రూపాయై 

జ్ఞానమూర్తే నమో నమః |

నానాశాస్త్ర స్వరూపాయై 

నానారూపే నమో నమః || 


మహాదేవ్యై మహాకాళ్యై 

మహాలక్ష్మ్యై నమో నమః |

బ్రహ్మవిష్ణుశివాయై చ

బ్రహ్మనార్యై నమో నమః ||


       🙏🏻 *ఓం సురపూజితాయై నమః* 🙏🏻


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

       🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

       🌷🌹🌷🌷🌹🌷

  🌹🍃🌿🪷🪷🌿🍃🌹

స్నేహం అంటారు.

 శ్లోకం:

దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా యత్ర ద్రవత్యంతరంగం స స్నేహః ఇతి కథ్యతే॥


తాత్పర్యం: 

ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు.

         🙏🙏🙏🙏🙏

*శ్రీ బ్రహ్మలింగేశ్వర దేవాలయం*

 🕉 *మన గుడి : నెం 422*


⚜ *కర్నాటక  : మారనకట్టె  - ఉడిపి* 


⚜ *శ్రీ బ్రహ్మలింగేశ్వర దేవాలయం*



💠 మారనకట్టె బ్రహ్మలింగేశ్వర దేవాలయం

కర్నాటకలోని కుందపురా జిల్లా నుండి 16 కి.మీ దూరంలో కంచినాకోడ్లులో ఉన్న మారనకట్టే అనే గ్రామంలో బ్రహ్మదేవుని ఆరాధనకు అంకితం చేయబడిన బ్రహ్మలింగేశ్వర ఆలయం.


💠 ఉడిపి తీరం వెంబడి ఉన్న ఉదయవాణి ప్రాంతంలో కుందాపుర ఉంది.

మారనకట్టె బ్రహ్మలింగేశ్వర దేవాలయం ఉత్తర-దక్షిణ దిశలో ప్రవహించే నదికి కుడి వైపున ఉంది, కానీ తూర్పు వైపు ఒక పదునైన మలుపు తీసుకుంటుంది. 

ఈ నీటి ఆకృతీకరణ చాలా శుభప్రదంగా చెప్పబడింది.


💠 కమ్హాసురుడు, ఒక అసురుడు, భైరవి యాగం చేసి, ఆ దివ్యమైన తల్లిని సంతోషపెట్టి, ఏ మగ జీవిచే చంపబడకూడదని వరం తీసుకున్నాడు. 

వరం పొందిన అసురుడు మూడు లోకాలలో విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు, శాంతి మరియు మంచి వ్యక్తులకు భంగం కలిగించాడు. 


💠 త్రిమూర్తులు మరియు దేవతలందరూ అతని దురాచారాల నుండి తమను రక్షించమని ఆ దివ్యమాతను ప్రార్థించారు. 

తన మార్గాన్ని చక్కదిద్దుకోమని హెచ్చరించడానికి దేవత ఒక దూతను పంపుతుంది కానీ అతని అహంకారం కారణంగా అతను పశ్చాత్తాపం చెందడు. మరింత శక్తిని పొందేందుకు, అతను శివుడుని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు, అతను అకస్మాత్తుగా తన వాక్ శక్తిని కోల్పోతాడు అంటే అతను 'మూక' లేదా మూగ అవుతాడు. 


💠 యుద్ధభూమిలో అతను దివ్యమైన తల్లిని చూస్తాడు మరియు తన మూర్ఖత్వాలను మరియు దుష్కర్మలను ఒక్కసారిగా గ్రహించాడు, కాని అతను మూగ స్థితి కారణంగా క్షమించమని వేడుకున్నాడు. జగన్మాత దీనిని గ్రహించి అతనికి వాక్కు శక్తిని ప్రసాదిస్తుంది; మూకాసురుడు (కమ్హాసురుడు) పశ్చాత్తాపపడి మోక్షం కోసం వేడుకుంటాడు మరియు అతని పేరు శాశ్వతంగా ఉండమని అడుగుతాడు. 

మాత అంగీకరించి, అతనిని వధించిన తరువాత, అతని తర్వాత ఆమెను మూకాంబిక అని పిలుస్తారు అని వరం ఇచ్చింది.


💠 మూకాంబిక బ్రహ్మలింగేశ్వర

సమీపంలోని కొల్లూరులో 80 కి.మీ. ఉడిపి నుండి మూకాంబిక ఆలయం ఉంది. 

ఇక్కడే మూకాసురుడు (మహిషాసురుడు) అనే రాక్షసుడిని చంపిన తర్వాత మూకాంబిక దేవి మరణ హోమ యజ్ఞం చేసింది.


💠 ప్రసిద్ధ మూకాంబిక ఆలయాన్ని సందర్శించడానికి ఉడిపి జిల్లాలోని కొల్లూరుకు వెళ్లే యాత్రికులు ఎల్లప్పుడూ మారనకట్టే వద్ద ఆగుతారు, ఎందుకంటే ఈ ప్రాంతం మూకాంబిక రాక్షసుడు మూకాసురుడిని శ్రీ చక్రంతో వధించడంతో సంబంధం కలిగి ఉంటుంది. 'మరనకట్టె' అనే పేరుకు 'మృత్యువు బలిపీఠం' అని అర్ధం.



💠 స్కంద పురాణం ప్రకారం , మూకాసురుడిని వధించిన తర్వాత మూకాంబిక దేవి ఇక్కడ మరణ హోమం నిర్వహించింది. 

ఆ రాక్షసుని సంహరించిన తర్వాత ఆ రాక్షసుడి ఆత్మకు దివ్యమాత దైవత్వాన్ని ప్రసాదించి బ్రహ్మలింగేశ్వరుడిగా పేరు పొందాలని అనుగ్రహించింది. 


💠 ఆలయం తూర్పు వైపు & గర్భగుడి ఉత్తరం వైపు ఉంది. గర్భగుడి ప్రక్కల ప్రధాన స్వామి బ్రహ్మలింగేశ్వరుడు మలయాళీ యక్షి & వాత యక్షి & రెండు ద్వారపాలకులు కూడా ఉన్నారు. గర్భాలయానికి కుడివైపున ఒక కట్టె ( కన్నడ వాడుక భాష ) ఉంది, దీనిలో శ్రీ చక్ర యంత్రాన్ని ఆది శంకరులు స్థాపించారు . 


💠 ఈ ఆలయంలో శ్రీ చక్రాన్ని స్థాపించిన ఋషి ఆదిశంకరాచార్యులచే కూడా ఆలయం ప్రభావితమైంది .  కాబట్టి, దీనిని ఆదిశంకర స్థాపన అంటారు .


💠 మకర సంక్రాంతి నాడు, ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు, ఇది జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. 

ఆ రోజున ఇక్కడ దర్శనం పొందడం వల్ల వివాదాలు పరిష్కారం అవుతాయి మరియు భగవంతుని పేరు మీద చెప్పిన వాగ్దానాలు స్థిరపడతాయి.



💠 మకర సంక్రాంతి రోజున, దక్షిణ కన్నడలోని అనేక ఇతర దేవాలయాల మాదిరిగానే, ఉడిపి జిల్లా మరియు పొరుగు జిల్లాల నుండి అనేక మంది ప్రజలను ఆకర్షిస్తున్న ఆలయ జాతర ఇక్కడ ఏర్పాటు చేయబడింది .

 భక్తుల మనస్సులో లోతైన ప్రభావాన్ని కలిగి ఉండే దేవుని ( వాక్య తీర్మాణ ) పేరిట వివాదాలు & వాగ్దానాలను పరిష్కరించడం ఇక్కడి ప్రత్యేకత . 

ప్రేతాత్మల బారిన పడినవారు స్వామివారి కృపతో స్వస్థత పొందగలరు. 

ముఖ్యంగా బ్రహ్మరాక్షసుడు ( జీవితంలో దుష్కార్యాలు చేసి మరణించిన బ్రాహ్మణుడి ఆత్మ ) ద్వారా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఈ రకమైన సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాలను పొందవచ్చు.

WELL-WISHER

 😊   *Ironies of life:* 


The Lawyer hopes You

      get into trouble, 


The Doctor hopes You

            get sick, 


The Police hopes You

  become a Criminal, 


The Teacher hopes You

     are born Stupid, 


The Landlord hopes You

     don't buy a House, 


The Dentist hopes Your

        Teeth Decay, 


The Mechanic hopes Your

        Cars Breakdown, 


The Coffin Maker wants

          You dead.........





Only a Thief wishes You

     "Prosperity in life" 

       And Also Wishes 

 "You have a Sound Sleep"


 *A THIEF is actually your biggest WELL-WISHER* 😂😂😂😂

గాలిలో కదిలే దీపం!

 దేహం.. గాలిలో కదిలే దీపం!

ఈ లో కంలో ఏదీశాశ్వతం కాదు. ఇక్కడ దేనికి, ఎప్పుడు కాలం చెల్లిపోతుందో  ఎవ్వరూ చెప్పలేరు. కనుక, ఇక్కడ శాశ్వతమైనది ఏది? అని ప్రశ్న వేసుకుంటే‘అంతాన్ని గురించిన అనిశ్చితియే!’ అనే సమాధానం దొరుకుతుంది. ఆ అనిశ్చితిని మనసులో ఒక వాస్తవంగా స్థాపించుకున్న వ్యక్తికి  దుఃఖం దూరమై, ముక్తి  దగ్గరౌతుందని విజ్ఞులు చెప్పారు.

వేదాంత పరమైన ఈ వాస్తవాన్ని కనుపర్తి  అబ్బయా మాత్యుడు, తాను రచించిన ‘కవిరాజ మనోరంజనం’ ప్రథమాశ్వాసంలోని ఒక సన్నివేశంలో పురూరవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణలో భాగంగా ఒక చక్కటి పద్యంలో చెప్పాడు. తన జన రంజక పాలనను గొప్పగా పొగుడుతున్న నారదుడితో పురూరవుడు ఎందరో రాజులు ఈ పుడమిని ఇంతకు మునుపు గొప్పగా పాలించారు కనుక తనను అంతగా పొగడవలసిన పనిలేదని చెప్పాడు. ఆ పై సంభాషణ కొనసాగింపుగా ఇలా అంటాడు.. 

దేహము వాయుసంచలిత దీపిక, పుత్రకళత్ర మిత్ర సం

 దోహము స్వప్నకాలమున దోచెడి  సందడి రాజ్యభోగ స

 న్నాహము జంత్రపుంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాల మీ 

యైహికసౌఖ్య మేమి సుఖమంచు దలంచెదనయ్య నారదా!

 పద్యం ప్రారంభంలోని ‘దేహము వాయు సంచలిత దీపిక’ అనేమాట లలో సామాన్యము, విశేషము అయిన రెండు భావాలు అవగత మౌతాయి. మానవ దేహం గాలిలో కదులుతున్న దీపం వంటిది. ఎప్పుడైనా ఆరిపోవచ్చు. ఆ కారణంగా దాని భవితవ్యం అనిశ్చితం అని సామాన్యార్థం . విన్నవెంటనే  మనసుకు తోచే   అర్థం . ఇక రెండవది– మానవ శరీరంలో ఊపిరి   అనే   వాయువు ప్రసరిస్తున్నంత వరకు దేదీప్యమానంగా వెలిగే  దీపం వంటిది   ఈ దేహం. ఊపిరి   ప్రసర ణం ఆగిపోగానే  అదీ   ఆగిపోతుంది, ఆరి పోతుంది   అనే   విశేషమైన భావం! ఈరెండు భావాలు కూడా పద్యంలోని సందర్భానికి   సొగసును కూర్చేవే! 

‘భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులతో కూడిన జీవితం, సందడి   అంతా కలలో జరిగేదిగానే  భావిస్తాను. జీవం లేని మరబొమ్మ చేసే   నాట్యం వంటిది రాజ్యభోగం అనీ, ఐంద్రజా లికుడు వెదజల్లే ధనం వంటిది   సంపద అనీ సదా భావించి, ఇహలోకంలో సౌఖ్యం లేదనుకోవడంలోనే   సుఖముందని నేను భావిస్తాను!’ అనేది పురూరవుడు నారదుడితో చెప్పిన మాటలకు అర్థం .

సౌందర్యానికి చిట్కాలు -

 స్త్రీల సౌందర్యానికి చిట్కాలు - 


 నల్లటి మచ్చలు ,మంగు నివారణ -


 *  జాపత్రిని మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొనుచున్న అతిత్వరలోనే ముఖము పైన కల మంగు ,నల్లమచ్చలు మాయం అగును . 


 *  మిరియాలు గోరోజనముతో కలిపి నూరి పైకి లేపనం చేయుచున్న మొటిమలు తగ్గును . మచ్చలు పోవును . 


 *  బాదం పప్పును నీటితో నూరి వడకట్టగా వచ్చిన పాలను ముఖంపై మర్దన చేయుచున్న క్రమంగా నల్లమచ్చలు , మంగు , మొటిమలు త్వరలోనే హరించును . 


 *  ధనియాలు , వస , సుగంధపాల ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణముగా చేసి ఈ చూర్ణమును ఒంటికి నలుగు పిండిలా పట్టించుచున్న నల్లటి మచ్చలు , మొటిమలు తగ్గును . 


 *  నిమ్మరసమును పాలతో కలిపి రాత్రిపూట ముఖానికి మర్దన చేసుకుని తెల్లవారిన తరువాత లేవగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకొనవలెను . సబ్బు వాడరాదు . ఇలా క్రమం తప్పకుండా చేయుచున్న మచ్చలు , మంగు పోయి ముఖం కాంతివంతం అగును . 


 *  తులసి ఆకుల రసములో కొద్దిగా టంకణం ( Borax ) కలిపి పైకి లేపనం చేయుచున్న ముఖం పైన మచ్చలు , మంగు హరించును . 


 *  మంజిష్ట చూర్ణమును ఆవుపాలతో కలిపి అరగదీసి అందులో కొంచం తేనె కలిపి ముఖమునకు లేపనం చేయుచున్న నల్లమచ్చలు , మంగు హరించును . 


   

      మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

నాలుకకు ఎక్కువ విశ్రాంతి

 🙏🕉️ శ్రీ మాత్రే నమః శుభోదయం🕉️🙏. 🩸 *తన కళ్ళు, చెవులు కన్నా నాలుకకు ఎక్కువ విశ్రాంతి నిచ్చేవాడు ఎక్కువ ఆనందాన్ని శాంతిని అనుభవిస్తాడు..మరియు మన కళ్ళు సానుకూలంగా ఉంటే మనము ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తాము..కానీ మన నాలుక సానుకూలంగా ఉంటే ప్రపంచం మనలని మరింత ప్రేమిస్తుంది*.🩸మాటలు రెండేళ్ళకే నేర్చుకుంటాము..కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోడానికి జీవిత కాలం కూడా సరిపోదు..తప్పులు చేసి పాడైన వారికంటే చెప్పుడు మాటలు విని పాడైన వారే ఎక్కువ..ఎవరో చెప్పింది విని దానిని నిజమని నమ్మి వేరొకరిని నిందించకూడదు🩸మాటలు మరియు ఆయుధాలు మధ్య తేడా ఆయుధాలు శరీరాన్ని గాయపరుస్తాయి..మరియు మాటలు ఆత్మను గాయపరుస్టాయి..చేతిలో ధనం నోటిలోని మాట రెండు విలువైనవే..వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ🩸🩸🩸మీ అల్లంరాజు భాస్కర రావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ గోకవరం బస్ స్టాండు దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం 0883-2479577 9440893593 9182075510🙏🙏🙏🙏🙏

*దేవాలయాలు - పూజలు 24*

 *దేవాలయాలు - పూజలు 24*




7) *శఠారి= శఠగోపము = శఠగోప్యము* :-

దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు, తీర్థ సేవన అనంతరము అర్చక స్వాముల వారు శఠగోపము భక్తుల శిరస్సుపై ఒక మాత్ర  కాలము ఉంచుతారు. శఠగోపమునే శఠారి అని శఠగోప్యము అని వ్యవహరించుట అనాదిగా వస్తున్న వాడుక. శఠగోప్యము దేవాలయంలోని దేవీ/దేవతల విగ్రహాల/మూర్తుల *పాదద్వయ దర్శనానికి* ప్రతీక.  దేవాలయానికి వెళ్ళిన ప్రతి భక్తుడికి దేవీ/దేవతలను స్పృశించు వీలుండదు కావున తీర్థ సంప్రాప్తి తదుపరి అర్చక స్వాముల వారు శఠగోప్యమును  భక్తుల శిరస్సుపై ఆనించి భగవత్ స్పర్శ కల్గిస్తాడు. దివ్యమైన శఠగోప్యం తలకు తగలడంతో అందులోని ఆపదుద్ధారక శక్తి వలన భక్తులలో ఆందోళన, భయం లాంటివి తగ్గగలవు.

భగవంతుని సాహచర్యం మనతో భౌతికంగా వుందనడానికి ధైర్యంగా మనమాచరించే ధర్మకర్మ నెరవేర్చగల స్నేహహస్తం మనతో వుందనడానికి సంకేతం. శఠగోప్యం వలయాకారంగా గంట ఆకృతిని కల్గి ఉంటుంది. శఠగోప్యం  తయారిలో రాగి, కంచు మరియు వెండిని ఉపయోగిస్తారు. ఈ మూలకాల సహజత్వం ప్రకారం , విద్యుదావేశం జరిగి భక్తుల శరీరం లోని  రజో తమో గుణాలు నశిస్తాయి. శుద్ధ సాత్వికత ఏర్పడుతుంది.


గత వ్యాసంలో తెలుసుకున్నట్లుగా  శఠగోప్యము భగవత్ పాదుకలను కల్గి ఉంటుంది. సాక్షాత్తు భగవత్ పాదములు భక్తుల శిరస్సును స్పర్శించడం వలన అలౌకిక ఆనందము, అనిర్వచనీయమైన అనుభవము కల్గుట తథ్యము. 


గోప్యము అంటే దాప్యము, రహస్యము అని అర్థాలు. శఠగోప్యము భక్తుల తలపై ఉంచినప్పుడు, భక్తులు *నిశబ్దంగా మరియు మౌనంగా* తమ తమ బాధలను, ఇబ్బందులను, కోరికలను భగవంతునికి నివేదించు సదవకాశము. 

శఠ అను పదమునకు ఉన్న నానార్థములు= మధ్యస్థ, కుత్సితుడు, మోసగాడు, మూర్ఖుడు.  శఠత్వం అంటే మూర్ఖత్వం. గోపం = గోప్యం = రహస్యము, దాచి ఉంచడం.  అర్చక స్వాములు అరుదెంచిన వ్యక్తి తలపై  శఠారిని ఉంచడం వల్ల ఆ వ్యక్తిలో గోప్యంగా ఉన్న  మూర్ఖత్వము, అహంకారము తొలగి జ్ఞానం చేకూరుతుందని ఆధ్యాత్మికుల భావన. *శఠులు* అంటే మోసము చేయువారు అని అర్థము. *అరి* అంటే శత్రువు. *శఠారి* అంటే మోసమునకు శత్రువు. వ్యక్తుల శిరస్సుపై అర్చక స్వాముల వారు *శఠారి* ని ఆనించి నప్పుడు వారిలోని చెడు తలంపులు (ఆలోచనలు), ద్రోహ బుద్దులు శతృ భావము నశించి, సద్వర్తన (positive thoughts)అలవడుతుందని ఈ సంప్రదాయ అంతరార్థము. 


*హిందూ సనాతన ధర్మ ప్రాచీనుల ముందు చూపు అమోఘమే గాకుండా అనన్య సామాన్యము. సమాజంలో సజ్జనులే గాకుండా వివిధ మనః ప్రవృత్తుల వారు ఉంటారని ఊహించి, భావించి, దేవాలయాలలో శఠారి సంప్రదాయమును ప్రవేశ పెట్టడం వారి విజ్ఞతకు ఒక మచ్చు తునక*.


*గమనిక* అర్చక స్వాముల వారు భక్తుల శిరస్సుపై *శఠారి* ని మృదువుగా, వాత్సల్య పూరితంగా ఉంచాలి, ఆశీర్వదించాలి.


*ఆశీర్వచనం* ఆశీర్వచనాలు పలు విధాలు, ఒక్కొక్కసారి భక్తుల కోరికల తదనుగుణంగా ఆశీర్వదించవలసి ఉంటుంది. 

1) *సుఖీభవ* 

2) *దీర్ఘాయుష్మాన్ భవ* 

3) *దీర్ఘ సుమంగళి భవ*

4) *ఆయురారోగ్యమస్తు*

5) *పుత్ర  పౌత్రాభివృద్ధిరస్తు*

6) *యశో విభవ ప్రాప్తిరస్తు*

7) *ధార్మికో భవతు*

 

విశిష్ట ఆశీర్వచనాలు

1) *పశ్యేమ శరదశ్శతం*

  *జీవేమ శరదశ్శతం*

 *మోదామ శరదశ్శతం*

*నందామ శరదశ్శతం*

 *భవామ శరదశ్శతం*

*శృణువామ శరదశ్శతం*

జోక్చస్సూర్యందృశే....

అర్థం:- నిండా నూరేళ్ళు

 ఆ సూర్య భగవానుని చూడగలగాలి,వినగలగాలి, ఆనందంగా జీవించాలి.

2) *శతమానం భవతి శతాయు: పురుషశ్శతేన్ద్రియ ఆయుష్యేవేన్ద్రియే ప్రతి తిష్టతి*.

3) *శత మానం భవతి శత మనంతం భవతి, శత మైశ్వర్యం భవతి శత మితి శతందీర్ఘమాయుః* .


అర్చక స్వాముల వారు భక్తులందరిని తర తమ భేదం లేకుండా సమంగా చూడాలి. దేవాలయంలో మూర్తి, ప్రతిమ, చిత్తరువుల రూపంలో ఉన్న  భగవంతుడు అప్పటికప్పుడు మాట్లాడకపోయినా, అప్పటికప్పుడు బోధించక పోయినా దేవాలయంలో జరిగే వాస్తవాలను నిత్యజీవితంలో మనం చేసే పనులను *కాలం రూపంలో గమనిస్తూ ఉంటాడు,  సమాయానుసారము ఫలితాలను అందిస్తూ ఉంటాడు*.  

దేవాలయంలో ఉన్నది ఒక బొమ్మలాంటి మూర్తి, ప్రతిమ, చిత్తరువు అని  భావించరాదు. *యంత్ర, తంత్ర  మంత్ర సంయుక్తమైన శక్తి అని మరువరాదు*


*దైవాధీనం జగత్ సర్వం*

*మంత్రాధీనంతు దైవతం*

*తన్మంత్రంబ్రాహ్మణాధీనం*

*బ్రాహ్మణో మమ దేవతా*


*ఈ హెచ్చరిక సర్వులకు అంటే భక్తులకు, అర్చక స్వాములకు మరియు యాజమాన్య సిబ్బందికి వర్తిస్తుంది*. 


భక్తులందరూ అర్చక స్వాముల వారిని అర్థించి గూడా *శఠగోప్యము* ను పెట్టించుకోవాలి,  *ప్రభావితులు కావాలి*. 


ధన్యవాదములు.

*(సశేషము)*

పొట్టలోకి

 పొలం నుంచి , పొట్టలోకి విషం!


వ్యవసాయ రంగంలో చీడపీడల బెడద పెరుగుతోంది. నియంత్రణకు పురుగు మందులను విచ్చలవిడిగా వాడుతుండటంతో , తీరని నష్టం కలుగుతోంది. విష ప్రభావంతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార పదార్థాలూ విషతుల్యమవుతున్నాయి.


సాగులో చీడపీడలు, తెగుళ్ల సమస్యను అధిగమించేందుకు పలు మార్గాలున్నా, రసాయన మందులపై ఆధారపడక తప్పని పరిస్థితి రైతులది. 


"దేశంలో అత్యంత ప్రమాదకర పురుగు మందుల వాడకం ఏటేటా పెరుగుతోంది. ఆసియా పసిఫిక్ పెస్టిసైడ్స్ యాక్షన్ నెట్వర్క్ సర్వే, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల్లో ఇదే తేలింది. పిచికారీ సమయంలో అజాగ్రత్త వల్ల,దేశంలో ఏటా ఏడువేల మంది ప్రాణాల్ని బలిగొంటోందని జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక లోగడ పేర్కొంది.


పురుగుమందుల ఉత్పత్తిలో భారత మార్కెట్ ఏటికేడు విస్తరి స్తోంది. వినియోగంలో ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబా కింది. పురుగు మందులను పంజాబ్, హరియాణాలు అత్యధికంగా వినియోగిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణవే, తెలుగు రాష్ట్రాల్లో నకిలీ బీటీ పత్తి సాగు ఎక్కువ , దీనివల్ల పైరును రసం పీల్చే, కాయను తొలిచే పురుగు ఆశిస్తోంది. మిరప, హైబ్రిడ్ వరి రకాలనూ చీడపీడలు దెబ్బతీస్తున్నాయి. వీటిని తట్టుకునేందుకు రైతులు అశాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్నారు. మూణ్నాలుగు మందుల మిశ్రమాన్ని పిచికారీ చేస్తున్నారు. మోతాదుకు మించి వాడుతున్నా తెగుళ్లు, పురుగులు నియంత్రణలోకి రావడంలేదు. పైగా కొత్తరకం

తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. పల్లెల్లో కూలీల కొరత తీవ్రంగా వేదిస్తోంది. పంటపొలాల్లో కలుపుతీతకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దాంతో రైతులు కలుపు నాశిని విషాలపై ఆధారపడుతున్నారు. ఇవికూడా అత్యంత విషపూరితమైనవే. పిచికారీ వేళ అజాగ్రత్త వల్ల,క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధులకు దారితీస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది. ధూమపానం కంటే అత్యధిక ముప్పు దీంతో పొంచి ఉందని తాజాగా ఓ పరిశోధన వెల్లడించింది. భూమిలేని కూలీలకు పిచికారీ ప్రక్రియ ఉపాధి మార్గమైంది. కానీ, వారిలో 80శాతం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ఎలాంటి రక్షణ కవచం లేకుండా చాలామంది గాలికి వ్యతిరేక దిశలో పిచికారీ చేయడం, శక్తిమంతమైన విదేశీ స్ప్రేయర్లు వినియోగిస్తుండటంతో , మందు నీటి తుంపర్లు శరీరాన్ని తడిసి ముద్దచేస్తున్నాయి. నోరు, ముక్కు ,కళ్లు, చర్మం ద్వారా చేరుతున్న విషపూరిత రసాయనాలు అవయవాల పనితీరును దెబ్బతీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పొలాల్లో పనిచేసే మహిళలపై ఈ విష ప్రభావం కనిపిస్తోంది. వారిలో సంతానలేమి, గర్భవిచ్ఛిత్తి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.


తినే తిండితోనూ ప్రమాదమే


పంటలపై పిచికారీ చేసే విషాలు , లక్షిత పురుగుల్ని తాకేది కేవలం 0.01 శాతమేనని దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. పెస్టిసైడ్స్ ను విచ్చలవిడిగా వాడటంవల్ల లక్షల ఎకరాల్లో నేల సారాన్ని కోల్పోతోంది. సింథటిక్ రసాయనాల అవశేషాలతో మనం తినే అన్నం, కూర గాయలు, పండ్లు, పప్పుధాన్యాలు విషంగా మారుతున్నాయి. ఈ సమస్యకు సురక్షిత, సమగ్ర సస్యరక్షణ పద్ధతులే సరైన పరిష్కారమార్గాలు. స్థానిక సేద్య విధానాలను అన్నదాతలు అవలంబించడం శ్రేయోదాయకం. హాని చేయని పర్యావరణహితకర రసాయన, బయో పెస్టిసైడ్స్ తయారీ దిశగా కంపెనీలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఒక ఎకరానికి పెట్టే పెట్టుబడిలో రైతులు నాలుగింట ఒకవంతు పురుగు మందులకే వెచ్చిస్తున్నారని అంచనా ! సేంద్రియ సాగుతో ఈ భారం తప్పుతుంది. ఇలాంటి పర్యావరణ హితకర విధానాలను సాగు రంగానికి మరింత చేరువచేయాలి. ఈ బాధ్యత క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులదే. తక్కువ ధర ఆశజూపి గ్రామాల్లో అంటగడుతున్న నకిలీ, నిషేధిత ఉత్పత్తులెన్నో ఉన్నాయి. టాస్క్ఫోర్స్ బృందాలు అలాంటి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలి. క్రిమిసంహారక, పెస్టి సైడ్ మేనేజ్మెంట్ చట్టాల నిబంధనలను మరింత పదును తేల్చాలి. అప్పుడే సాగు రంగంతోపాటు ప్రజారోగ్యమూ సురక్షితమవుతుంది.


మాడుగుల గోపయ్య