18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 37

 

 ప్రశ్న పత్రం సంఖ్య: 37 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) తోలి పూజల వేల్పు ఎవరు

i ) వినాయకుడు   ii ) సుబ్రమణ్యస్వామి  iii )విష్ణుమూర్తి  iv ) బ్రహ్మదేముడు 

2) ఏదయినా పని చేసే ముందు ఎలక్ట్రీషన్ కరంటు ఉందొ లేదో తెలుసుకోవటానికి వాడే పరికరం 

i ) స్క్రూడ్రైవరు ii ) కటింగ్ ప్లేయర్ iii ) టెస్టర్ iv ) పానా 

3) చర్మవ్యాధులు రాకుండా ఇలా నివారించ వచ్చు  

i ) ప్రతి రోజు స్నానం చేయటం వలన   ii ) సంపెంగి నూనె పూసుకోవటం వలన iii ) అత్తరు పూసుకోవటం వలన iv ) సెంట్ పూసుకోవటం వలన

4) రామాయణంలో ________వేట  

i ) జింకల ii ) తాటకి iii ) పిడకల iv ) పులి

5) చిరస్మరణీయుడు అనగా 

i ) ఎప్పటికి స్మరణకు రానివాడు   ii ) అప్పుడప్పుడు స్మరించదగిన వాడు iii ) ఎప్పుడు స్మరించదగిన వాడు  iv ) దుర్మార్గుడు . 

 6) సీతాదేవికి ఆ పేరు ఎలావచ్చింది 

i ) జనక రాజు కూతురు కాబట్టి   ii ) నాగలి చాలు నందు దొరికినందున iii ) సీతాఫలం చెట్టుక్రింద దొరికినందుకు iv ) యాజ్ఞవల్క్ మహర్షి యజ్ఞం చేయించినందుకు 

7) పంచ భీములలో ఒకరు

 i ) దృతరాష్టుడు ii ) జరాసంధుడు iii ) భార్గవుడు iv ) విశ్వామిత్రుడు

8) పురాణాలూ ఎన్ని

i ) 14 ii ) 19 iii ) 18 iv ) 24

9) దనం మూలం ఇదం జగత్ అనగా

i ) దనమే అన్నిటికి కారణం అని ,   ii ) జగత్తు మొత్తం ధనమే అని   iii ) ములలో ధనము ఉంటుందని   iv ) ధాన్యము కూడా దనం అని 

10) మనిషి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది

i ) కాలేయము   ii ) గుండె  iii ) మూత్ర పిండాలు iv ) జీర్ణాశయము 

11) గజ స్నానం అని ఎప్పుడు ఉపయోగిస్తాము అనగా

i ) ఏనుగు చేసే స్నానం ii ) కుక్క స్నానం    iii ) స్నానం సంపూర్ణంగా చేయనప్పుడు   iv ) సబ్బు లేకుండా స్నానం చేసినప్పుడు 

 12) సింహ బలుడు అని ఈయనని అంటారు

i ) కీచకుడు ii ) మారీచకుడు iii ) సైన్ధవుడు iv ) అత్రి మహర్షి

13) ఎప్పుడు సంపద కలిగిన

i ) అప్పుడు రాబందులు వచ్చును ii ) అప్పుడు రోగములు వచ్చును iii ) అప్పుడు కళ్ళు నెత్తికి ఎక్కును iv ) అప్పుడు బంధువులు వత్తురు 

14) అరుణోదయం అనగా

i ) సూర్యోదయానికన్నా ముందు యెర్రని కాంతి ii ) చేంద్రోయంకన్నా ముందు శ్వేతకాంతి iii ) సూర్యోదయం iv ) చేంద్రోదయం 

15) ఇంటి స్లాబులో సిమెంట్, కంకర, ఇసుక కలిపే నిష్పత్తి

i ) 1,2,4 ii ) 1,3,4 iii ) 2,3,5 iv ) 2,2,3

16)  కపర్ది అనునది ఈ దేముడికి సంబందించినది

i ) పరమ శివుడు ii ) విష్ణు మూర్తి   iii )బ్రహ్మ దేముడు   iv ) ఇంద్ర దేముడు. 

17) జాతక శాస్త్ర ప్రకారం మనిషి గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు బ్రతక వచ్చు.

i ) 75 సంవత్సరాలు   ii ) 87 సంవత్సరాలు iii ) 100 సంవత్సరాలు iv ) 120 సంవత్సరాలు

18)భూ ప్రపంచంలో భూమి ఎన్నవ వంతు వున్నది. 

i ) 1/3 ii ) 1/2 iii ) 1/5 iv ) 1/9

19) లా అఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అనునది ఈ శాస్త్రంలో చదువుతాం.

i ) ఇంగ్లీష్ ii ) ఎకనామిక్స్  iii ) చరిత్ర  iv )   రాజనీతి శాస్త్రం 

20) తనదుర సందులేదు కానీ మెడకోక ______

i ) తబలా     ii ) డోలు iii ) వీణ iv ) పియానో

ఇంద్రునికి కలిగిన శాపము*

 _*మాఘమాసం*_

          🌹 _*శుక్రవారం*_🌹

🎋 _*ఫిబ్రవరి 18వ తేది 2022*_🎋


   _*🚩మాఘ పురాణం🚩*_

 🌴 _*17 వ అధ్యాయము*_🌴


🕉🎋🌹🌹🌹🌹🎋🕉️


*ఇంద్రునికి కలిగిన శాపము*


☘☘☘☘☘☘☘☘


వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. రాజా ! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగాతీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువనుమహాముని మాఘమాసస్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమదమహర్షి యిట్లు పలికెను. సూర్యుడు మకరరాశిలో నున్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతఃకాలమున నదీస్నానము చేసిన వారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు.


పూర్వము తుంగభద్రా నదీతీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని యొకడు ఆశ్రమమును నిర్మించుకొని యుండెను. మిత్రవిందుని భార్య అతిలోకసుందరి , ఆమె యొకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములనారబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో గలసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడామెను చూచి మోహపరవశుడయ్యెను. అమెనెట్లైన పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగివచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును , ఆమె చేష్టలను గమనించుచుండెను.


మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యముగ ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను , విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశయై ఇంద్రునిపొందు అంగీకరించెను , కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ల యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని యడిగెను. నేనింద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకుపోలేక భూలోకముననే యుండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటును విడిచి గంగాతీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమునువిడిచి పరమాత్మలో లీనమయ్యెను.


ముని శాపమువలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచటనుండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదకుచు నదీతీరములయందు సముద్రతీరము నందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీస్నానము చేసి తీరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి, మునులు వారిట్లనిరి.


దేవతలారా వినుడు మేము చేయువ్రతము మాఘమాసవ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున తటాకాదులందు స్నానము చేయుట శ్రీమహావిష్ణుపూజ , పురాణ పఠనము , యధాశక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘమాసమున చేసిన మాధవస్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అదృష్టమనంతము. మాఘశుద్ధ చతుర్దశియందు గోదానము , వృషోత్పర్జనము , తిలదానము ఆవూప దానము , పాయసదానము , వస్త్రకంబళములదానము , విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములైయుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలును దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖుచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును డేవతలిట్లు స్తుతించిరి.


*స్వామీ:* నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీయనుగ్రహము లేనిదే యెవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ ! యిట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితిలయముల నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయ మైనప్పుడు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్పమరెవరును యెరుగజాలరు. కర్మప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ , ఇంద్రుడు మొదలైన దేవతలు , పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు , నారదుడు , ప్రహ్లాదుడు , ఉర్దవుడు మొదలగు ఉత్తమపురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.


దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునొందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకలవాడై , పూర్వమువలె దివ్య శక్తులను పొంది మమ్ము రక్షింపగలడు , కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయపుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.


దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాపపీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వగ్ధుడగునా ? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు , దేవతలారా ! మాఘమాసస్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము , సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి నొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాసకాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగాతీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకీచన్నీటి స్నానము బాదాకరము నేను స్నానము చేయజాలను. మీకు ఆశక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలసి స్నానము చేసెను. గంధర్వును భార్య మాఘస్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.


ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తెలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృస్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని , పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *" విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.


దేవతలారా ! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

పంతులమ్మ

 ఈ రోజు *పంతులమ్మ* అను *మాదిరెడ్డి సులోచన*  గారి నవలా పరిచయం.  


72 నవలలు రాసిన మాదిరెడ్డి సులోచన చాలా గొప్ప రచయిత్రి.  ఎక్కువగా మధ్య తరగతికి సంబంధించిన సామాజిక స్థితిగతులే ఆమె రచనలకు ఆధారం.  అలాగే స్త్రీ జనాభ్యుదయం కోరి రాసిన నవలలు కూడా ఉన్నాయి.  


ఈ కోవకు చెందిన మంచి కథాంశం గల నవల  పంతులమ్మ.  స్త్రీ లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే చదువు చాలా అవసరం. వ్యక్తిత్వం, సంస్కారం అలవడాలంటే చదువు ద్వారానే సాధ్యం అవుతుందని ఈ రచయిత్రి అభిప్రాయం.  అప్పుడే దేశాభ్యుదయంలో పురుషునితో పాటు సమానంగా స్త్రీ రాణించగలదని ఈమె నమ్మకం ఈ  పంతులమ్మ  నవలలో మనకు కనబడుతుంది.  


బాల్యవితంతువైన సుచరిత సంప్రదాయ బద్ధమైన జీవనశైలే ఈ నవల కథాంశం.  టీచర్ గా పనిచేస్తున్న సుచరితకు అనేక సమస్యలు, కొన్ని అవమానాలు ఎదురౌతాయి.  ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీ నిలబడాలంటే చాలా కష్టం.  ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి.  ఐనా ఇవన్నీ సుచరిత నిర్భయంగా ఎదుర్కొంటూ తన వృత్తికి కళంకం రానీయకుండా అటు స్టూడెంట్స్ అభిమానానికి  ఇటుపై అధికారుల మన్ననలు పొందుతూ తన వృత్తిలో రాణిస్తూ తన విశిష్ట వ్యక్తిత్వంతో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా కీర్తిశిఖరాలను అందుకుని మహిళాలోకానికి మార్గదర్శకురాలవుతుంది.  


ఉపాధ్యాయురాలి వృత్తిలో సాదకబాధలను బాగా వివరించారు.  151 పేజీల  పంతులమ్మ నవల ఏకబిగిన చదివేలా చేస్తుంది కథనం.  అందరూ ముఖ్యంగా ప్రతీ స్త్రీ తప్పక చదవాల్సిన మంచి నవల ఇది.  ఈ నవల ద్వారా ఎంతో నేర్చుకోగలం.  


రచయిత్రి దురదృష్టవశాత్తు 1983లో సరిగ్గా ఈరోజే గ్యాస్ సిలిండర్ ప్రేలుడుకు గురై మరణించారు.  అప్పటికి  సులోచన గారి వయసు 48 ఏళ్ళు మాత్రమే.  ఈ దుస్సంఘటన జరగకపోయి ఉంటే మరిన్ని మంచి నవలలు ఆమె కలం ద్వారా వచ్చుండేవి. 


రచయిత్రి  మాదిరెడ్డి సులోచన 39వ వర్ధంతి సందర్భంగా ఆవిడకు మన నివాళులు.

చినజీయర్ స్వామీజీ

 ఎవరీ చినజీయర్ స్వామీజీ..? ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చి స్వామీజీగా ఎందుకు మారారు..?




చాలా మందికి చినజీయర్ స్వామీజీ గురించి తెలిసే ఉంటుంది.


 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అన్న పేరు చాలా మందికి తెలియదు. కానీ చిన జీయర్ స్వామీజీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. 


ఆయన టీవీలలో కూడా పలు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ.. ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారు.


రెండు తెలుగు రాష్ట్రాలలోను చినజీయర్ స్వామీజీ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 


ఇటీవల హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


ఇందులో భాగంగానే భారీ సమతా మూర్తి రామానుజాచార్యుల వారి పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఇందుకోసం ప్రధాని మోడీ కూడా విచ్చేసారు. దీనితో ఈ అంశం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. 


ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేయడంలో చినజీయర్ స్వామివారు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ప్రజలందరి దృష్టి ఈ విగ్రహం పైనే ఉంది. 


దీనితో.. చినజీయర్ స్వామీజీ ఎవరు..? ఆయన జీవితం ఎక్కడ ప్రారంభమైంది..? అంటూ ఆయన గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు.


చినజీయర్ స్వామి ఓ సాధారణ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1956 సంవత్సరం నవంబర్ 3 తేదీన, దీపావళి రోజున ఆయన జన్మించారు. అలమేలు మంగతాయారు, వేంకటాచార్యుల వారు చినజీయర్ స్వామి వారి తల్లి తండ్రులు.


 చినజీయర్ స్వామివారికి తల్లితండ్రులు మొదటగా పెట్టిన పేరు శ్రీమన్నారాయణాచార్యులు. ఆయన గౌతమ విద్యాపీఠంలో వైష్ణవ సంప్రదాయాలు, వేద గ్రంధాలపైన శిక్షణ పొందారు. అలాగే నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వద్ద సంస్కృతాన్ని, తర్క శాస్త్రాన్ని అభ్యసించారు.


అలాగే రాజమండ్రిలోనే ఓరియంటల్ స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నారు. అయితే.. ఆ సమయంలోనే ఆయన తండ్రిగారు స్వర్గస్తులయ్యారు. దీనితో.. ఆయనపై కుటుంబ పోషణ భారం పడింది. దీనితో ఆయన ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నారు. 


ఉద్యోగం కోసం ఒక్క చేతి సంచితో హైదరాబాద్ కు చేరుకున్నారు. మొదట్లో ఎన్నో చేదు అనుభవాల తరువాత ఒక చిన్న ఉద్యోగం లభించింది. ఇక్కడే టైపు, షార్ట్ హ్యాండ్ ను కూడా నేర్చుకున్నారు. తరువాత ఆ ఉద్యోగంలో మరో పైమెట్టు ఎక్కారు.



ఆ సమయంలో అనగా 1975 నాటికి ఓ సారి పెద్ద జీయర్ స్వామిజీ కాకినాడకు విచ్చేసారు. ఓ యజ్ఞం నిమిత్తం ఆయన విచ్చేసారు. యజ్ఞ క్రతువు సాగిస్తుండగా.. అనుకోకుండా.. పెద్ద జీయర్ స్వామిజీ తో శ్రీమన్నారాయణాచార్యులకు (ప్రస్తుతం చిన జీయర్ స్వామిజీ) పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో తనకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని పెద్ద జీయర్ స్వామిజీ కోరడంతో.. ఆ పని తానే చేస్తానని, అప్పటికే తానూ టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నానని చినజీయర్ స్వామిజీ పేర్కొన్నారు.



అలా ఇంట్లో తల్లి వద్ద అనుమతి తీసుకున్న శ్రీమన్నారాయణాచార్యులు పెద్ద జీయర్ స్వామీజీ వెంటే తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 23 సంవత్సరాల వయసులో ఆయన తల్లి అనుమతితోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. 


ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన గీతాజ్యోతి ఉద్యమాన్ని ప్రారంభించారు. భగవద్గీత కు ప్రాచుర్యం తీసుకురావడంతో పాటు సమాజంలో బద్ధకాన్ని తొలగించి.. ప్రజల మధ్య సౌభాతృత్వ భావనని పెంపొందించే లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. 


అయితే.. చినజీయర్ స్వామిజీ వారు ఇక్కడితో ఆగలేదు.

అంధుల కోసం కాలేజీలు కట్టించారు. వారికి కళ్ళు లేకున్నా కంప్యూటర్ శాస్త్రంలో నిపుణులు అవ్వాలని కృషి చేసారు. అంధులకు శిక్షణ ఇవ్వడం కోసం నిపుణులను కూడా నియమించారు.


 అంతే కాదు.. సమస్త జీవకోటికి జ్ఞానాన్ని అందించే వేద విద్య సారాన్ని అందరికి అందించడం కోసం ఆయన ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు. వేద పాఠశాలలను గురుకుల పాఠశాలలుగా తీర్చిదిద్దారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసారు.


 అంతే కాదు, ఆయన 12 నెలల్లో 12 భాషలను నేర్చుకున్నారు. శ్రీరామ నగరం, శంషాబాద్ లో జిమ్స్ అనే ఆసుపత్రిలో ఉచిత వైద్య విధానాన్ని అమలు చేసి వైద్యరంగాన్ని కూడా అనుగ్రహించారు. 


పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వచ్చి, నేడు ప్రపంచానికే సమతామూర్తిని అందించిన ఘనత చినజీయర్ స్వామీజీకే దక్కుతుంది...🙏


సేకరణ...


💐💐💐💐💐💐💐💐💐💐

_హిందువులు

 *_హిందువులు 500 సంవత్సరాల క్రితం జావాను విడిచిపెట్టారు!_*


 _హిందువులు 300 ఏళ్ల క్రితమే ఆఫ్ఘనిస్థాన్‌ను విడిచిపెట్టారు!_


 _హిందువులు 200 సంవత్సరాల క్రితం ఆగ్నేయాసియాను విడిచిపెట్టారు!_


 _హిందువులు 100 సంవత్సరాల క్రితం తక్షశిల విడిచిపెట్టారు!_


 _80 ఏళ్ల క్రితం హిందువులు బర్మాను విడిచిపెట్టారు!_


 _70 ఏళ్ల క్రితం హిందువులు పాకిస్థాన్‌ను విడిచిపెట్టారు!_


 _హిందువులు లాహోర్ (పంజాబ్), కరాచీ (సింధ్) నుండి వెళ్లిపోయారు!_


 _40 ఏళ్ల క్రితం హిందువులు బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టారు_


 _30 ఏళ్ల క్రితం హిందువులు కాశ్మీర్‌ను విడిచిపెట్టారు_


 _25 ఏళ్ల క్రితం హిందువులు అస్సాం విడిచిపెట్టారు!_


  *_మనకు తెలియకుండానే 20 ఏళ్ల క్రితమే హిందువులు కేరళను విడిచి వెళ్లడం ప్రారంభించారు.  కాసరగోడ్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది హిందువులు కర్ణాటకకు వలస వచ్చారు._*


 _హిందువులు నేడు బెంగాల్‌ను విడిచి వెళ్తున్నారు!_, హైదరాబాద్ పాతబస్తీని విడిచి వెళ్తున్నారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే...😢😢😢         --10ఏళ్ళ తర్వాత తమిళ నాడు లోని కొన్ని ప్రాంతాలను,ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను విడిచి వెళ్ళనున్న హిందువులు.


 _15 ఏళ్ల తర్వాత బీహార్ వదిలి వెళ్లనున్న హిందువులు!_


 _25 ఏళ్ల తర్వాత హర్యానాలోని మేవాడ్ ను వదిలి వెళ్లనున్న హిందువులు!_


 *_30 ఏళ్ల తర్వాత ఢిల్లీ, వదిలి వెళ్లనున్న హిందువులు!_*


 *_ఈ పరిస్థితిలో 40 ఏళ్ల తర్వాత హిందువులు భారతదేశాన్ని వదిలి వెళ్లిపోతారు._*


 *_హిందువులారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు?  మీరు ఎక్కడికి వెళతారు ??_*


 *_గుర్తుంచుకోండి, హిందువులు ఉన్నంత వరకు భారతదేశం ఉంటుంది!_*


 *_విభజిస్తే తెగతెంపులు!_*


 *_వ్యవస్థీకృతంగా ఉండండి, సురక్షితంగా ఉండండి, ఐక్యంగా ఉండండి!  గుడ్డిగా సెక్యులర్‌గా ఉండటం మానేయండి._*


 *_తెలివిగా ఉండండి.  మీ భవిష్యత్తు మరియు మీ పిల్లలు మరియు మనవళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించండి._*


 *_హిందువుల ఏకైక దేశం భారతదేశం.  మిమ్మల్ని మీరు రక్షించుకోండి...🚩🚩🚩🚩🚩*

#హిందువుల_ఐక్యత_వర్ధిల్లాలి 🚩

జై భారత మాత 🚩

జై హింద్ 🚩🇮🇳

జై శ్రీరామ్ 🚩 

జై సనాతన ధర్మం 🚩 🕉️ 🙏 

🇮🇳🇮🇳🇮🇳🇮🇳

అలం కిల లలజ్జిరే*

 శ్లోకం:☝️

 *అలం కిల లలజ్జిరే*

    *సపది చిత్రగుప్తాదయః |*

 *స ఏవ పురుషాగ్రణీమ్-*

    *అవతు దేవ దక్షోఽసి చేత్ ||*


అన్వయం: _(హే  దేవ !) సపది చిత్రగుప్తాదయః అలం లలజ్జిరే కిల ! | (యది) దక్షః అసి చేత్ , సః ఏవ పురుషాగ్రణీమ్ అవతు ||_


భావం: ఓ దేవుడా! చిత్రగుప్తుడు మొదలగువారు కూడా తమకు రోజూ అలవాటైన పని (పాపాల చిట్టాలు రాయడం) కూడా చేయలేకపోతున్నామే! అని సిగ్గుపడిపతున్నారు. (అంటే తాను చిత్రగుప్తుడికి చేతులు నొప్పి పెట్టి ఇక రాయలేనన్ని పాపాలు చేశానని భక్తుడు గొప్పలు చెప్పుకుంటున్నాడు !) కనుక దేవా ! నీవే ఆర్తత్రాణ పరాయణుడవైతే, ఈ మహాపురుషుడిని రక్షించి నిరూపించుకో ! ( ప్రహ్లాదుడు, అంబరీషుడు, గజేంద్రుడు వంటి పుణ్యాత్ములను రక్షించడం కాదు. ) 🙏