25, డిసెంబర్ 2025, గురువారం

నరహరిని నమ్ముకొన్నను*

  *శ్రీహరి స్తుతి*


*కం.నరహరిని నమ్ముకొన్నను*

*పరిహారంబుల చూపుచుండు పరివేదనకున్*

*దొరుకును మార్గములెన్నో*

*కరములు జోడించినాను కైవల్యముకై*

నాకు తోడుగా

 హరి ఓం , - ఒక రోజు క్లాస్ లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి ఈ రోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది.

(ఆ అమ్మాయికి పెళ్లి అయి ఆరు నెలల కొడుకు ఉన్నాడు)

నీ లైఫ్ లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డ్ మీద రాయమని చెప్పింది లెక్చరర్.

తను ఫ్యామిలీ మెంబర్లు.. బంధువులు.. స్నేహితుల పేర్లను వ్రాసింది.

వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని ముగ్గురు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్.

తను బోర్డ్ పైన వ్రాసిన వాటిలో ముగ్గురు స్నేహితుల పేర్లను తుడిచివేసింది.

నీ లైఫ్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో 5గురి పేర్లను తుడిచివేయమని చెప్పింది లెక్చరర్.

తను ఐదుగురు బంధువుల పేర్లను తుడిచివేసింది.

అలా చెరుపుకుంటు పోగా చివరకు బోర్డ్ మీద అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఈ నలుగురి పేర్లు మిగిలాయి.

క్లాస్ రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.

ఇది ఆట కాదని అపుడు అర్దయింది అందరికి.

ఇపుడు మరో రెండు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్..

ఇది చాలా కష్టమైన పని అని తనకు అర్థమైంది..

చాలా బాధ పడుతూ అమ్మా, నాన్నల పేర్లను చెరిపింది తను.

మిగిలిన రెండింటిలో మరోకటి చెరపమని చెప్పింది లెక్చరర్.

తనకు కళ్ళవెంట నీళ్లు కారసాగాయి.. అచేతన స్థితిలో వణుకుతున్న చేతులతో తన కొడుకు పేరును చెరిపింది ఏడుస్తూ..!!

వెళ్లి నీ సీట్ లో కూర్చోమని చెప్పింది లెక్చరర్..!!

తర్వాత కాసేపటికి లెక్చరర్ తనను ఇలా అడిగింది..

నీకు జన్మనిచ్చిన తల్లి దండ్రులను కాదని.. నువు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని, బయటి వ్యక్తి అయిన భర్తను ఎందుకు ఎన్నుకున్నావు..?

క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దం అలుముకుంది..

తను ఏమి చెపుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరు.

తను బాధతో నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది..

ఎదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకంటే ముందే చనిపోతారు.. చదువు కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఎదో ఒకరకంగా నా కొడుకు కూడా నాకు దూరమవ్వక తప్పదు.

కానీ జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే..!!

ఒక్కసారిగా క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ... .......... - 🙏🙏 ..... - వలిశెట్టి లక్ష్మీశేఖర్ .... - Ph. 98660 35557. - HYD.25.12.2025.

పంచాంగం

 


బ్రహ్మజ్ఞానులకు స్వర్గము

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝  *తృణం బ్రహ్మవిదః స్వర్గః*

         *తృణం శూరస్య జీవితమ్‌* |

         *జితాsక్షస్య తృణం నారీ*

         *నిఃస్పృహస్య తృణం జగత్‌* ||


తా𝕝𝕝 *బ్రహ్మజ్ఞానులకు స్వర్గము (సుఖము), శూరవీరునకు జీవితము, జితేంద్రియునకు స్త్రీ, కోరికలు లేని వానికి ప్రపంచము,*

*తృణప్రాయముగా నుండును..... అనగా తుచ్ఛముగా భావింతురు* ..... 


✍️💐🌹🌸🙏

ఆంజనేయ స్తుతి

  🌸ఆంజనేయ స్తుతి🙏

సీస పద్యం

రామభక్త హనుమ రావయ్య వేగమే 

పావన హనుమయ్య పరమ పురుష

సంజీవ రాయుడా సర్వజ్ఞ సామీర

సత్వరమే రమ్ము సాధు చరిత 

పవనతనయ మము పాలింప వయ్యనీ

సేవయే మాకును చింత తీర్చు

జలధిని దాటియు జానకి జాడను 

తెలిపిన తేజస్వి ధీరహనుమ

తే,గీ సూర్యుని దరికి చేరియు శ్రుతులు నేర్చి

వ్యాకరణపండితుడవైన వాయుపుత్ర

రామసుగ్రీవులకుమైత్రి లక్షణముగ

నెరిపినట్టిప్రసన్నాంజనేయ శరణు 

సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

గోదాదేవి

  పెండ్లికల

గోదాదేవి


ప్రాణసమానభంగి కనుపాప నజస్రము గాచు రెప్పగన్

పాణితలమ్ము నందునుచి ప్రాక్కృతపుణ్య మటంచు నెంచి "శ్రీ

వాణియె వార్ధిపుత్రియొ భవానియొ బిడ్డగ వచ్చెనో! బహిః

ప్రాణవిధమ్ముగా సుత నుపాయన మట్లుగ శౌరి యిచ్చెనో! 81        

    

ఇవ్విధమున దర్కించుచు

మవ్వపు వన్నెల నడరగ మక్కువతోడన్

క్రొవ్విరి చే బట్టినటుల

అవ్వసుధామరుడెలమిని యంజలి నిలిపెన్. 82

                                                 ‌‌ ‌ 

వలవలయేడ్చు నంత తరువాటి తదీయకరమ్ము సోకగన్

కిలకిల నవ్వె నా శిశువు కేరుచు పాణిపదమ్ము లూపుచున్ 

మిలమిల లాడ నొప్పె మిరమిట్టులు గొల్పు విలోచనమ్ములున్

కలకల లాడె మోము, పసికందుకు నాతని గాంచినంతటన్. 83


తలిరుల జొంపమట్లు వెలిదమ్ముల పత్రము వోలె తూలసం

తులితమృదుత్వమై తనరి తోరపు మైజిగి నొప్పి దీప్తిలన్

నలుగునొ యంచు సంశయమునన్ నెఱిపేరిమి నెత్తబోయి భీ

తిలె పెరియాళువారు, లది దివ్యతనుత్వమహత్వమో!కదా! 89


కంజర్ల రామాచార్య

కుక్కలు విశ్వాసముతో

  కందము

కుక్కలు విశ్వాసముతో

మెక్కుచు యజమానిపెట్టు మెతుకులు తినుచున్

చక్కగ కావలి కాయును

నిక్కమ్మౌ శ్రద్ధతోడనింటిని విబుధా!


            🙏ప్రయాగ🙏

తరలశరీర సుందర

  హరిః ఓం నమః.

ఓం నమః శివాయ.


చ ll తరలశరీర సుందర! విదారితమన్మథగర్వ! దేవదే

       వర! గిరిజాస్మితాబ్జ ముఖభాస్కర భూతపతీ! మహేశ! శ్రీ

         హరివరమిత్ర శంకర మహాలయకార ! పరాత్పరా హరా! 

          శరణు సురాపగాధర! శశాంకకళాధర! కావుమీశ్వరా! ll


క ll హాలాహలముప్పొంగగ

      కీలము లాభీలమగుచు గీడ్పడజేయన్

       హేలాగతి విషమున్ ద్రావిన

        శూలీ! మహదేవ! సాంబ! స్తుతులన్ గొనుమా ll


        హర నమః పార్వతీపతయే శివ శివ శంభో కృపాకరా, హరా!


 ----- పరమహంస -----

నిత్యపద్య నైవేద్యం

  *నిత్యపద్య నైవేద్యం-2069 వ రోజు*

*మంచిమాటకు మంచి పద్యం-338. సేకరణ, పద్యరచన, సహజకవి, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు* , తెనాలి, 9347537635, *గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ,తెనాలి*


*మంచి మాట:*

    శీలం ఎక్కడ ఉంటే సత్యము, ధర్మము, ధైర్యము, న్యాయము, లక్ష్మీ.. అక్కడ ఉంటాయి.

    

 *తేటగీతి* 

శీలమెక్కడ యుండునో శ్రేష్టముగను 

సత్య ధర్మధైర్యములు, సహజమునగు 

న్యాయము మరియు శ్రీలక్ష్మి యచటె నుండు 

ఆర్య వాక్కులుగ దలంచి యాలకించు.

నేల ఉశిరిక

  నేల ఉశిరిక చెట్టు గురించి సంపూర్ణ వివరణ -  ఔషధోపయోగాలు .

   

నేల ఉశిరిక చెట్టును సంస్కృతంలో భూమ్యామలి , తమాలి , తాలి , తమాలికా , ఉచ్చట అని పిలుస్తారు .  ఆంగ్లము నందు Phyllanthus Amarus అని పిలుస్తారు . దీనిలో చాలారకాలు ఉన్నాయి . మనం ఔషధాల కొరకు ఉపయోగించునది సన్నని తెలుపుగల జీలగ ఆకుల వంటి ఆకులు , ఆకుల కింద సన్నని గట్టి కాయలు గల దానిని కొందరు , పొడవుగా కొంచం నలుపు రంగుగా ఉండు ఆకులు కలిగి , ఆకుల కింద కాయలు గల దానిని కొందరు వాడుదురు. రెండింటిలో జీలగ ఆకుల వంటి కురచ ఆకులది శ్రేష్టము. ఈ మొక్కలో సర్వాంగములు ఔషధోపయోగమే . ఇది ఎల్లప్పుడూ విరివిగా దొరుకును . దీనిలో ఎరుపు , తెలుపు కాడలు కలిగినవి కూడా ఉండును. ఎరుపు కాడ కలిగినదానిని రసవాదం నందు ఉపాయోగిస్తారు. తెల్ల కాడ కలిగిన దానితో సత్తు , వంగము , తాళకం వంటి లోహాలను భస్మం చేయుటకు ఉపయోగిస్తారు .

 ఔషధోపయోగములు  -

 *  రక్తప్రదరం అనగా స్త్రీలలో అధిక రక్తస్రావం కావడం . ఈ సమస్య ఉన్నవారు నేల ఉశిరిక గింజలను బియ్యపు కడుగుతో నూరి రెండు లేక మూడు దినములు సేవించిన రక్తప్రదరం తగ్గును. వేడి చేసే వస్తువులు తినకూడదు.

 *  వరసగా వచ్చు ఎక్కిళ్లు నివారణ కొరకు నేల ఉశిరిక చూర్ణమును పంచదారతో కలిపి తినినను లేక నేల ఉశిరిక రసమును రసం ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా లోపలికి నశ్యము చేసినను ఎక్కిళ్లు ఆగిపోవును .

 *  కంటి సమస్యలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరిక , సైన్ధవ లవణం రాగిరేకు యందు కాంజీకంతో నూరి నేత్రముల చుట్టూ పట్టువేసిన నేత్ర బాధలు అన్నియు శమించును . ఈ కాంజీకం ఆయుర్వేద దుకాణాల్లో లభ్యం అగును.

 *  వ్రణాలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరిక రసంలో పసుపు చూర్ణం కలిపి పుండ్లపైన రాయుచున్న అవి మాడిపోవును.

 *  స్త్రీలకు ఋతు సమయంలో వచ్చు నొప్పికి 25 గ్రాముల నేల ఉశిరిక రసములో 40 మిరియపు గింజల చూర్ణం కలిపి మూడోవ రుతుదినమున సేవించిన రుతుశూల , సరిగ్గా ఋతురక్తం జారీ కాకపోవటం వంటి సమస్యలు తగ్గును.

 *  ఉబ్బుకామెర్ల సమస్యతో బాధపడువారు నేల ఉశిరిక నీడన ఎండించి చూర్ణం చేసినది లేదా నేల ఉశిరి సమూల రసం పెరుగులో కలిపి కాని గోమూత్రంలో కలిపి కాని లోపలికి ఇవ్వవలెను . రసము మోతాదు 25 గ్రాములు .

 *  శరీరం పైన లేచు దద్దుర్లకు దీని ఆకును పుల్లటి మజ్జిగతో నూరి శరీరానికి పూసిన శరీరం పైన దద్దురులు నయం అగును.

 *  మధుమేహంతో బాధపడువారు నేల ఉశిరి రసం , మంచి పసుపు, నేరేడు గింజల చూర్ణం కలిపి శనగ గింజలంత మాత్రలు చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున వాడుచున్న మధుమేహం అదుపులోకి వచ్చును.

 *  జిగట విరేచనాలతో ఇబ్బంది పడువారు నేల ఉశిరి చూర్ణం , మెంతులు చూర్ణం కలిపి అరచెంచా చొప్పున మజ్జిగలో కలిపి తీసుకొనుచున్న జిగట విరేచనాలు తగ్గును.

 *  శరీరంలో రక్తహీనత వల్ల వొళ్ళంతా తెల్లగా పాలిపోయే పాండురోగ రోగులు నేల ఉశిరి వేర్లను  10 గ్రా మోతాదుగా మెత్తగా నూరి రసం తీసి అరగ్లాసు నాటు ఆవుపాలలో కలిపి రెండుపూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తుంటే క్రమంగా పాండురోగం హరించిపోయి రక్తవృద్ధి, రక్తశుద్ది జరుగును.  


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

 ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

         


         కాళహస్తి వేంకటేశ్వరరావు  

      

     అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  

                  9885030034

గుండె బలహీనత

  గుండె బలహీనత పోగొట్టు సిద్ద యోగములు  -

 

*  తవాక్షరి చూర్ణంని తేనెతో సేవించుచున్న గుండెకు మంచి బలం కలిగి గుండె బలహీనత తొలగును .

 

*  కోడిగుడ్డు సొన పాలతో బాగుగా కలియునట్లు చేసి దానిలో మిరియాల చూర్ణం , చక్కెర కలిపి ఉదయమే సేవించుచున్న బలహీనత తగ్గును. గుండెకు సత్తువ ఇచ్చును.

 

*  బెల్లపు పానకం లో మద్దిచెక్క చూర్ణంని కలిపి తాగిన గుండెజబ్బులు పోవును . దీర్గాయువుని ఇచ్చును.


 *  గోధుమలు , మద్దిచెక్క చూర్ణములను ఆవునెయ్యి మేకపాలలో వేసి పక్వముగా చేసి దానిలో చక్కర చేర్చి సేవించుచున్న గుండెజబ్బులు తొలగును . గుండె బలహీనత పొవును .


 *  మద్దిచెక్క చూర్ణం, నెయ్యి, పాలు కలిపి తాగుచున్న గుండె బలహీనత తగ్గును.

 

*  పెద్ద ముత్తువపులాగ చూర్ణంని పాలతో కలిపి తాగుచున్న గుండెబలహీనత , గుండెజబ్బు తగ్గును.

 

*  12 గ్రాముల స్వచ్ఛమైన తేనెను నీళ్లతో కలిపి ఉదయాన్నే తాగుచున్న గుండెజబ్బు నయం అగును.

 

*  మద్దిచెక్క చూర్ణంని పంచదారతో కలిపి తాగిన గుండెజబ్బు నయం అగును.

 

*  కటుకరోహిణి గంధమును గుండెకు పట్టువేసిన గుండెజబ్బు తొలగును .


 *  మారేడు వేరును కషాయంగా చేసి తాగుచున్న గుండెదడ హరించును .


 *  ఇంగువ 10 గ్రాములు , హారతి కర్పూరం 10 గ్రాములు  ఇవి రెండు నీళ్లతో నూరి గురిగింజలు అంత మాత్రలు చేసి పూటకి ఒకమాత్ర చొప్పున రోజూ రెండుపూటలా వేసుకొని అనుపానంగా 40 గ్రాములు జటామాంసి కషాయం తాగుచున్న యెడల గుండెదడ , ఆయాసం హరించిపోవును .

 

*  మూసామ్బారం నీళ్లతో నూరి గుండెలకు పట్టువేసిన యెడల గుండెలాగుట , పీకుట , ఆయాసం తగ్గును.


 *  గుండెల్లో మంట గా ఉంటే పుచ్చగింజలు 20 గ్రాములు నీటిలో రాత్రిపూట నానబెట్టి ఉదయమున ఆ నీటిలో ఆ గింజలను బాగా పిసికి పటికబెల్లం పొడి కొద్దిగా కలిపి ఆ తరువాత దానిని వడపోసి ఆ ద్రవమును తాగవలెను .

 

*  రావి ఆకులను నీళ్లలో నానబెట్టి మరునాడు ఉదయము దానిని వడబోసి తెల్లటి సీసాలో నిలువ ఉంచవలెను. ఆ ద్రావకం రోజుకి మూడుమార్లు 50ml చొప్పున తాగుచున్న గుండెదడ తగ్గును.

           


        పైన చెప్పిన వాటిలో కొలతలు లేకున్నచో 3 నుంచి 5 గ్రాములు చూర్ణపు మోతాదు తీసుకోవచ్చు . ద్రవపదార్థం 100 ml నుంచి 150 ml వరకు తీసుకోవచ్చు .  



ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .  

 

 గమనిక  -

      

         నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

          

          నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

              

       ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 

         

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034

కురుక్షేత్ర మహా సంగ్రామము.*

  🌹🦜🙏🏽🦜🌹

    22.12.2025

      సోమవారం 


 *అంశం..కురుక్షేత్ర మహా సంగ్రామము.* 

.................................................... 


 *ఉత్పలమాల...* 


దాయల క్రౌర్యనీతి, ఘన దౌత్యపు 

రీతియు, ద్వేషముల్, పగల్ , 


న్యాయము కానరాదు, గురునాజ్ఞల

వీడిన కౌరవేంద్రుడున్, 


మాయ దురోదరంబు, మతిమాలిన

స్నేహము, హీన సంస్కృతుల్ , 


సాయము సేయు గీతయును సాక్షిగ

నిల్చెగ సంగరంబునన్!!

..................................................... 

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

గంగానది నేలపైకి

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹

   ప్రతి విద్యార్థి ఒక భగీరథుడు కావాలి అనే ఒక గొప్ప సందేశంతో చక్కని గంగావతరణ కథను ఈ ఎపిసోడ్ లో అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. దేవ లోకంలో ప్రవహించే గంగానది నేలపైకి ఎందుకొచ్చింది? ఎలా వచ్చిందనే ప్రశ్నలకు ఈ కథలో సమాధానం లభిస్తుంది. పితరుల రుణం తీర్చుకోవడం ఎంత అవసరమో, దానిని ఎలా తీర్చుకోవాలో, అందుకు ఎంత కష్టపడాలో, దానికి ఎంతటి దివ్యమైన ఫలితం లభిస్తుందో ఈకథ వింటే అర్థమవుతుంది. పూర్తిగా వినండి మరి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

రఘురామచంద్ర పురుషోత్తమ

 హరిః ఓం నమః.

శ్రీసద్గురుపరంపరాభ్యాం నమః.

శాస్త్రార్థప్రతిపాదకం పరమకం సత్యప్రకాశాంతర్గతం

సాక్షద్బ్రహ్మపదదావలంబితచణం సాఫల్యసామర్థ్యకమ్ l  

సర్వవ్యాపితవ్యోమసామ్య మచలం సంశుద్ధబుద్ధ్యాత్మకం

సచ్చిత్సౌఖ్య రసైకలాభ మమలం శ్రీసద్గురుం భావయే ll


శ్రీసీతారామచంద్ర పరబ్రహ్మణే నమః.


ఓ రఘురామచంద్ర పురుషోత్తమ జానకినాధ మన్మథా

కార వినీలదేహ ఘనకార్ముకధారి ధరాధినేత దు

ర్వారమహాప్రతాప మునివందిత దివ్యపదారవింద గం

భీరవిరాజమానముఖ భీకరదైత్యవినాశ ఘోరసం

సారభయాపహార గణసాగర నన్ గృపజూప వేడెదన్ ll 


      జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.

        ---- పరమహంస ----

చిత్తూరు జిల్లా : తిరుపతి

 🕉 ధనుర్మాసం సందర్భంగా


🔅 చిత్తూరు జిల్లా : తిరుపతి 


🔅శ్రీ గోవిందరాజస్వామి ఆలయం : తిరుపతి:

🔅 తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల్లో కొందరు వెంకన్నకు పెద్దన్నగా చెప్పబడే శ్రీ గోవిందరాజస్వామిని ముందుగా దర్శించుకొంటారు.

తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి తల కింద కుంచం పెట్టుకుని దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. 


👉శ్రీ గోవిందరాజ స్వామి గుడి తిరుపతి పరిసరాల్లోని గుడులన్నిటికంటే పెద్దది. ఇక గుడి రాజగోపురం అత్యంత ఆకర్షణీయంగా వుంది. సుదూర ప్రాంతం నుంచే కనిపిస్తుంది. 

 

👉 ఈ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని నూతన పట్టణం ఏర్పడింది. అదే అభివృద్ధి చెందిన తిరుపతి మహానగరి. గోవిందరాజులు వెలసినారు కాబట్టి గోవిందరాజపట్టణం అనీ, రామానుజచార్యుల

వారు ప్రతిష్టించారు కనుక రామానుజపురం అనీ పిలిచేవారు. కాలక్రమేణ తిరుపతిగా మారింది. తిరు అంటే తమిళంలో శ్రీ అని అర్థం. శ్రీపతి అంటే వేంకటేశ్వరస్వామి అని కూడా అర్థం.


👉ఆ ఆలయ ప్రాంగణంలో పార్థసారథి శ్రీకృష్ణుడు (వేణుగోపాలుడు), ఆండాళ్ తదితర దేవాలయాలు ఉన్నాయి. విజయనగర శైలిలో నిర్మితమైన ముఖ మండపాలు, కళ్యాణ నుండపాలు అందులోని విశేష శిల్పసంపద అద్భుతంగా వుంది.


👉 తిరుపతి పట్టణంలో అడుగు పెడుతూనే యాత్రీకులను ముఖ్యంగా ఆకర్షించేది గోవిందుని రాజగోపురమే. ఆలయ రాజగోపురాన్ని మట్టి అనంతరాజు క్రీ.శ. 1624లో నిర్మించారు.


👉 శ్రీరామానుజా చార్యులు క్రీ.శ. 1129-30లో “ఎంబెరుమానార్' బిరుదాంకితమై తిరుమలకు వచ్చాడు.

 శ్రీ గోవిందరాజు విగ్రహ ప్రతిష్ట 24-2-1130 జరిగిందనే దానికి శాసన ఆధారాలున్నాయి.

రామానుజుని ఆదేశం ప్రకారం శయనమూర్తి విగ్రహ నిర్మాణం జరిగేటప్పుడు అనుకోని విధంగా మూర్తి భిన్నమయింది. భంగమయిన శయిన మూర్తి గోవిందుని అసలు విగ్రహాన్ని నరసింహాతీర్థం (మంచినీళ్ళ గుంట) ఒడ్డులో వదలి, ముహూర్త సమయం దగ్గరపడడంతో సున్నం (సుద్దతో విగ్రహాన్ని నిర్మించి ప్రతిష్టించారు. అందుకే శ్రీగోవింద రాజ స్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలుండవు. కేవలం "తైలకాపు" సేవలు మాత్రమే చేస్తారు.


👉ఈనాడు మనం చూస్తున్న విగ్రహం నిజమైన మూలవిరాట్ కాదు...శుద్ధతో చేసిన పెట్టుడు విగ్రహం. 


👉 చిదంబరంలో ఉత్సవ విగ్రహంగా వుండిన గోవింద రాజ స్వామి వారి విగ్రహం ఇక్కడ మూల విరాట్టు అయింది. అప్పటిటి వరకు మూల విరాట్టయిన వరద రాజ స్వామి విగ్రహం ఉత్సవ విగ్రహం అయింది.


👉 శ్రీ గోవిందరాజ స్వామి విగ్రహం ప్రతిష్ఠకు ముందే శ్రీ పార్థసారథి ఆలయం వుంది. ఇది ప్రధాన ఆలయం అనేదానికి కారణం మహా ద్వారానికి ఎదురుగా ఆలయం దక్షిణదిశలో శ్రీపార్థసారధి ఉత్తర దిశలో గోవిందుని ఆలయం వున్నాయి. 

శ్రీ అండాల్ అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక సన్నిధామం ఉంది.


👉ఈ ఆలయానికి రాజగోపురం (శ్రీమట్టి అనంతరాయల గోపురం) 7 అంతస్తులతోను , బంగారు కలశాలతోను నిటారుగ తిరుపతి పట్టణం మధ్యలో ప్రత్యేకతను సంతరించుకొని వుంది. 

ఈ గోపురం కాకుండా మరో రెండు గోపురాలున్నాయి. నడిమిగోపురం 15వ శతాబ్దంలో నిర్మితమయింది. ఈ గోపురపు అధిష్టానంలో గోడల పై రామాయణంలో రాముడు తన బాణంలో 7తాటి చెట్లను కూల్చిన దృశ్యం, భాగవతంలోని గోపికా వస్త్రాపహరణ దృశ్యాలను చెక్కబడి వుంది, అంతేకాక అనేక దేవతా మూర్తుల శిల్పాలు కూడా ఉన్నాయి.


👉 శ్రీపార్థసారధి ఆలయ ముఖమండపం కళ్యాణమండపం శ్రీకృష్ణదేవరాయల కళాభిరుచికి దర్పణం. ఇందులో శిల్పకళా నైపుణ్యం ప్రదర్శించబడింది. ముఖ్యంగా ఈ మండపంలో 4 విశిష్టమయిన నల్లరాతి స్థంభాల్లో ఎన్నో శిల్పాలున్నాయి. కేవలం ఐదారు అంగుళాల ఎత్తుగల కోలాట నృత్యభంగిమల శిల్పాలు వేదికపై కప్పులో వున్నాయి.


👉గోవిందుని ఆలయంలో వసంతమండపం, నీరాళీ మండపం, చిత్రకూట మండపం, కుంభ హారతి, లక్ష్మీదేవి మండపాలున్నాయి. ఆలయానికి అనుబంధంగా పుష్కరిణి ఉంది. దీనిని గోవిందరాజు పుష్కరిణి అంటారు. ఈ పుష్కరిణ లోనే తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ తెప్పోత్సవాలనే 'నీరాజోత్సవం' అని కూడా అంటారు.


👉 అనేక ఇతర సన్నిధానాలు ఈ ఆలయంలోని ప్రత్యేకత. 

శ్రీపార్థసారథి ఆలయం, గోదాదేవి గుడి (అండాళ్ సన్నిధి) శ్రీకళ్యాణ వేంకటేశ్వర ఆలయం, శ్రీలక్ష్మీ దేవి ( పుండరీక వల్లి తాయారు) గుడి, శ్రీభాష్యకారుల సన్నిధి (రామానుజాచార్యులు), శ్రీ తిరుమలనంబి, శ్రీమధురకవి ఆళ్వార్ల సన్నిధి. శ్రీ తిరుమంగై అళ్వారు. శ్రీవేదాంత దేశికుల సన్నిధులు వున్నాయి. విశేషంగా గోవిందుని ఆలయంలో దాదాపుగా ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం ఉంటుంది. అది ఆళ్వారుల వారోత్సవ, పక్షోత్సవ, నక్షత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి.


👉 ఎప్పుడూ కళకళాడుతుండే ఈ ఆలయంలో నిత్యకళ్యాణాలే అధికారులు, ఇతర ప్రభుత్వాధికారులు - జడ్జిలు - సాధారణంగా ఈ ఆలయానికి విచ్చేసి దర్శనాడులు నిర్వహించుకొని తమ మొక్కులు తీర్చుకుంటుంటారు,


కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ గుడికి రావాలంటే వెనుకంజ వేస్తారు. రాజకీయ హోదాలో గుడిలో కాలుపెడితే పదవి కాస్తా గోవిందా! ఇది మాత్రం బలమయిన నమ్మకం.

శీతలమ్మధికమై

 ఆ.వె.

భూతలమ్మునందు శీతలమ్మధికమై 

చలికి వడకజొచ్చె జనులు ఘనులు 

ధనువు వంగినట్లు తనువెల్ల వంగగా 

వంగి వంగి మసలె పవలురాత్రి 

*~శ్రీశర్మద*