17, జూన్ 2026, బుధవారం

పంచాంగము

*🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏*

        *📿పంచాంగం📿*

*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*తేదీ ... 17 - 06 - 2026,*

*వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )*

శ్రీ పరాభవ నామ సంవత్సరం,

ఉత్తరాయణం,

గ్రీష్మ ఋతువు,

*నిజ జ్యేష్ఠ మాసం,*

శుక్ల పక్షం,


తిథి : *తదియ* రా2.09 వరకు,

నక్షత్రం : *పునర్వసు* సా6.00 వరకు,

యోగం : *ధృవం* రా1.44 వరకు,

కరణం : *తైతుల* మ3.16 వరకు

                   తదుపరి *గరజి* రా2.09 వరకు


వర్జ్యం : *ఉ6.45 - 8.15*

                           మరల రా1.34 - 3.05 వరకు*

దుర్ముహూర్తము : *ఉ11.34 - 12.26*

అమృతకాలం : *మ3.45 - 5.15*

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : మిథునం,

చంద్రరాశి : మిథునం 

సూర్యోదయం : 5.29,

సూర్యాస్తమయం : 6.31,


               *_నేటి విశేషం_*

*🌙 చంద్ర దర్శనం మహిమ*


అమావాస్య అనంతరం శుక్ల పక్షంలో కనిపించే తొలి చంద్రకళలను దర్శించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్ర దర్శనం వల్ల మనశ్శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


చంద్ర దర్శన శ్లోకం:

దధిశంఖ తుషారాభం

క్షీరోదార్ణవ సంభవమ్ ।

నమామి శశినం సోమం

శంభోర్మకుట భూషణమ్ ॥


🌙 చంద్రుడిని దర్శించి ఈ శ్లోకాన్ని పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం


*🌿 తులసీ మహిమ*


బుధవారం తులసీదేవికి దీపారాధన చేసి, 11 లేదా 21 ప్రదక్షిణలు చేస్తే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రోక్తం.


తులసీదేవి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందువల్ల తులసీ పూజ ద్వారా విష్ణు అనుగ్రహం కూడా లభిస్తుంది.


*🕉️ బుధ గ్రహ ఆరాధన*

బుధుడు జ్ఞానం, వ్యాపారం, గణితం, వాక్చాతుర్యానికి కారకుడు.

బుధ గ్రహ మంత్రం

ఓం బుం బుధాయ నమః ॥


ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.


*🌺 నేటి ఆధ్యాత్మిక సందేశం*


"జీవితంలో సంపద కన్నా సద్బుద్ధి గొప్పది. సద్బుద్ధి ఉంటే సంపద, సంతోషం, గౌరవం అన్నీ స్వయంగా వస్తాయి.


🙏 ఈ రోజు తప్పక స్మరించవలసిన నామాలు


🔸 ఓం నమో నారాయణాయ

🔸 ఓం గం గణపతయే నమః

🔸 ఓం శ్రీ కృష్ణాయ నమః

🔸 ఓం బుం బుధాయ నమః


*🌺 సర్వేజనాః సుఖినో భవంతు 🌺*

            *_📿శుభమస్తు📿_*

*🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏**🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏*

        *📿పంచాంగం📿*

*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*తేదీ ... 17 - 06 - 2026,*

*వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )*

శ్రీ పరాభవ నామ సంవత్సరం,

ఉత్తరాయణం,

గ్రీష్మ ఋతువు,

*నిజ జ్యేష్ఠ మాసం,*

శుక్ల పక్షం,


తిథి : *తదియ* రా2.09 వరకు,

నక్షత్రం : *పునర్వసు* సా6.00 వరకు,

యోగం : *ధృవం* రా1.44 వరకు,

కరణం : *తైతుల* మ3.16 వరకు

                   తదుపరి *గరజి* రా2.09 వరకు


వర్జ్యం : *ఉ6.45 - 8.15*

                           మరల రా1.34 - 3.05 వరకు*

దుర్ముహూర్తము : *ఉ11.34 - 12.26*

అమృతకాలం : *మ3.45 - 5.15*

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : మిథునం,

చంద్రరాశి : మిథునం 

సూర్యోదయం : 5.29,

సూర్యాస్తమయం : 6.31,


               *_నేటి విశేషం_*

*🌙 చంద్ర దర్శనం మహిమ*


అమావాస్య అనంతరం శుక్ల పక్షంలో కనిపించే తొలి చంద్రకళలను దర్శించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్ర దర్శనం వల్ల మనశ్శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


చంద్ర దర్శన శ్లోకం:

దధిశంఖ తుషారాభం

క్షీరోదార్ణవ సంభవమ్ ।

నమామి శశినం సోమం

శంభోర్మకుట భూషణమ్ ॥


🌙 చంద్రుడిని దర్శించి ఈ శ్లోకాన్ని పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం


*🌿 తులసీ మహిమ*


బుధవారం తులసీదేవికి దీపారాధన చేసి, 11 లేదా 21 ప్రదక్షిణలు చేస్తే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రోక్తం.


తులసీదేవి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందువల్ల తులసీ పూజ ద్వారా విష్ణు అనుగ్రహం కూడా లభిస్తుంది.


*🕉️ బుధ గ్రహ ఆరాధన*

బుధుడు జ్ఞానం, వ్యాపారం, గణితం, వాక్చాతుర్యానికి కారకుడు.

బుధ గ్రహ మంత్రం

ఓం బుం బుధాయ నమః ॥


ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.


*🌺 నేటి ఆధ్యాత్మిక సందేశం*


"జీవితంలో సంపద కన్నా సద్బుద్ధి గొప్పది. సద్బుద్ధి ఉంటే సంపద, సంతోషం, గౌరవం అన్నీ స్వయంగా వస్తాయి.


🙏 ఈ రోజు తప్పక స్మరించవలసిన నామాలు


🔸 ఓం నమో నారాయణాయ

🔸 ఓం గం గణపతయే నమః

🔸 ఓం శ్రీ కృష్ణాయ నమః

🔸 ఓం బుం బుధాయ నమః


*🌺 సర్వేజనాః సుఖినో భవంతు 🌺*

            *_📿శుభమస్తు📿_*

*🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏*

ఈశ్వరే నిశ్చలా బుద్ధిః

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



ఈశ్వరే నిశ్చలా బుద్ధిః

దేశార్థం జీవనస్థితిః।

పృథివ్యాం బంధువద్వృత్తిః

ఇతి కర్తవ్యతా సతామ్.॥


పరమేశ్వరునియందు నిశ్చలమైన బుద్ధి కలిగి ఉండటం, దేశముకోసమే తన జీవితమని భావించటం, లోకులందరియందు బంధుభావన కలిగి ఉండటం సజ్జనుల కర్తవ్యం.


జీవితంలో ఆచరించవలసిన ఉత్తమమైన ధర్మాన్ని, మానవత్వాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది.



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

వాగ్బాటాచార్యుల

 వాగ్బాటాచార్యుల వారు వివరించిన భోజన పధ్ధతి -


ఆయుర్వేద చరిత్రలో వాగ్బాటాచార్యుల వారికి చాలా గొప్పస్థానం ఉన్నది. ఆయన రాసినటువంటి "అష్టాంగహృదయం" అనే గ్రంథం చాలా ప్రాచుర్యం పొందింది. వారు తెలియచేసిన

భోజనపద్ధతి గురించి మీకు వివరిస్తాను.


మనం తీసుకునే ఏ పదార్థం అయినా మోతాదుగా భుజించవలెను. ఈ మోతాదు జఠరాగ్నిని దీపనం చెందించును. తినగలిగినతలో గట్టిగా ఉండు పదార్దాలను సగమే తినవలెను . లఘుపదార్థాలను కడుపునిండా ఇక తినలేము అన్నంత అధికంగా తినకూడదు. అనగా మూడు వంతులు తిని కడుపులో ఒక వంతు ఖాళీగా ఉంచవలెను. మోతాదుకు తక్కువుగా భుజించకూడదు. దానివల్ల శరీరం యొక్క బలము , ఓజస్సు , పుష్టి నశించును. సకల వాతవ్యాధులు సంభవించును.


మన శరీరానికి అవసరం అయిన దానికంటే అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని భుజించుచున్న వాత,పిత్తాలను ప్రకోపింపచేయును . దీనివలన త్వరగా అలిసిపోయి నీరసం వచ్చుట, బలహీనత వంటి సమస్యలు వచ్చును. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కావోచ్చు . పదార్ధాలను అధికంగా భుజించటం ఒక్కటే దోషం కాదు. ఇష్టం లేని పదార్దాలు భుజించటం , కడుపుబ్బరం కలిగించునవి , సరిగ్గా పక్వము కానివి , గట్టిగా ఉండి అరుగుటకు బాగా సమయం తీసుకొనునవి, బాగా కారంగా ఉండునవి, చల్లబడిపోయినవి , అశుచిగా ఉండునవి , దాహాన్ని అధికము చేయునవి, ఆరిపోయి గట్టిగా అయినవి, నీళ్లలో ఉన్నవి , మొదలయిన పదార్దాలు కూడా జీర్ణం కావు. శోకం , కోపం , భయం చెంది ఉన్నప్పుడు తినిన ఆ పదార్దాలు కూడా జీర్ణం అవ్వవు.


భోజనం తరువాత అది పూర్తిగా అరగక పూర్వం మరలా భుజించకూడదు. సమయం కాని సమయంలో కొంచం కాని ఎక్కువ కాని భుజించరాదు . మలమూత్రములు సంపూర్ణంగా బయటకి వెడలిన తరువాత హృదయం నిర్మలమైనప్పుడు , వాత,పిత్త,కఫాలు స్వస్థానం నందు ఉన్నప్పుడు , త్రేన్పులు లేనప్పుడు , బాగుగా ఆకలి అవ్వుచున్నప్పుడు , జఠరాగ్ని పదార్దాలను జీర్ణం చేయు సమర్ధం అయి ఉన్నప్పుడు , శరీరం తేలికగా ఉన్నప్పుడు మాత్రమే భుజించవలెను .


భోజనకాలమున స్నానం చేసి శుచి అయ్యి , ఏకాంతంగా కూర్చుని పితృదేవతలు , బాలురు, అతిధులు వీరిని తృప్తులు కావించి తాను పెంచుతున్న పశుపక్ష్యాదులకు ఆహారం అందించి మనఃశుద్ధి కలిగి , ఎవరిని నిందించకుండా , మాట్లాడకుండా తనకు హితమైనది , తనయందు భక్తి కలిగినవారు పెట్టినది అయిన ఆహారంను భుజించవలెను.


ఉదరమును నాలుగు భాగాలుగా విభజించి రెండు భాగములను ఆహారపదార్థాల చేత , ఒక భాగం ఉదకాది ద్రవపదార్థాల చేత నిండింపవలెను . నాలుగో భాగం వాయుప్రసారానికి అనువుగా ఖాళీగా ఉంచవలెను. భోజనం అయిన వెంటనే చదువుట, నడుచుట, పడుకోవడం , ఎండలో ఉండటం, అగ్నికి సమీపాన ఉండటం , వాహనములు ఎక్కుట, ఈదుట, ఎగిరి దాటుట మున్నగునవి చేయకూడదు .


పైన చెప్పిన నియమాలు ప్రతి ఒక్కరు పాటించినచో మంచి ఆరోగ్యవంతులు అవుతారు.

ఆయుర్వేదం నందు ఒక సామెత ఉంది. "ఏకకాల భోజనే మహాయోగి , ద్వికాల భోజనే మహాభోగి , త్రికాల భోజనే మహా రోగి " అని దీనినిబట్టి చూడవచ్చు ఆయుర్వేదం మనం తీసుకునే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో. ప్రతిఒక్కరు నియమిత సమయంలో నియమిత ఆహారాన్ని తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు.


మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.