14, నవంబర్ 2020, శనివారం

స్తోత్ర రత్నావళి

 స్తోత్ర రత్నావళి

1. ప్రార్థన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే

2.గణనాయకాష్టకం

ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం

లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్||         1

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం

బాలేందుశకలం మౌళా వందేహం గణనాయకమ్||         2

చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం

కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్||         3

పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్

గజవక్ర్తం సురశ్రేష్ఠం కర్ణ చామర భూషితమ్||         4

మూషికోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే

యోద్దుకామం మహావీరం వందేహం గణనాయకమ్||         5

యక్ష కిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరై స్సదా

స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్||     6

అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితమ్

భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్||         7

సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితమ్

సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకమ్||         8

విద్యావినయ విజయ వైభవాలకీ సర్వకార్యసిద్ధికీ పఠించవలసిన అష్టకమిది.

ఫలము: గణాష్టక మిదం పుణ్యం యః పఠేత్ త్సతంతం వరః

               సిద్ద్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్||

3. శివస్తోత్రం (దేవకృతం)

నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే

రక్తపింగళనేత్రాయ జటామకుట ధారిణే||     1

భూత భేతాళ జుష్టాయ మహాభోగపవీతినే

భీమాట్టహాసవక్ర్తాయ కపర్దిస్థాణవే నమః||    2

పూషదంత వినాశాయ భాగానేత్రహనే నమః

భవిష్యద్వృష్ట చిహ్నాయ మహాభూతపతే నమః||    3

భవిష్యత్త్రి పురాంతాయ తథాంధక వినాశినే

కైలాస వరవాసాయ కరికృత్తినివాసినే||    4

వికరాళోర్ద్వ కేశాయ భైరవాయ నమోనమః

అగ్నిజ్వాలా కరాళాయ శశిమౌళి కృతేనమః||    5

భవిష్యత్ కృత కాపాలివ్రతాయ పరమేష్టినే

తథా దారువన ధ్వంసకారిణే తిగ్ముశూలినే||    6

కృతకంకణభోగీంద్ర నీలకంఠ త్రిశూలినే

ప్రచండ దండహస్తాయ బడబాగ్ని ముఖాయచ||    7

వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమోనమః

దక్షయజ్ఞవినాశాయ జగద్భయకరాయ చ||    8

విశ్వేశ్వరాయ దేవాయ శివశ్శంభో భవాయ చ

కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః||    9

ఏవం దేవైస్తృత శ్శంభు రుగ్రధన్వా సనాతనః

ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే||    10

(వరాహ పురాణే దైవకృత శివస్త్రోత్రం సంపూర్ణం)

ఫలం: శ్రీమంతం, సామంతం, శివసాక్షాత్కారాది

4. సరస్వతీ ద్వాదశనామ స్త్రోత్రము

సరస్వతీ త్వియం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ

హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ||    1

ప్రథమం భారతీనామం ద్వితీయం చ సరస్వతీ

తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహనా||    2

పంచమం జగతీఖ్యాటం షష్టం వాగీశ్వరీ తథా

కౌమౌరీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ||    3

నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయినీ

ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ||    4

బ్రాహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యం యఃపఠేవ్నరః

సర్వసిద్ధి కరీం తస్య ప్రసన్నా పరమేశ్వరీ||    5

సా మే వస్తూనే జిహ్వాగ్రే బ్రహ్మరూపీ సరస్వతీ||

ఇతి శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రమ్ సంపూర్ణం||

ఫలం: సర్వవిద్యా ప్రాప్తి – వాక్శుద్ధి

5. శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకుమతో

నియతారుణి తాతుల నీలతనో

కమలాయత లోచన లోకపతే

విజయీభవ వేంకట శైలపతే||        1

శ చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ

ప్రముఖాఖిల దైవత మౌళిమణే

శరణాగతవత్సల సారనిధే

పరిపాలయ మం వృషశైలపతే||        2

అతివేలతయా తవదుర్విషహై

రనువేల కృతైరపరాధశతైః

భరితం త్వరితం వృషశైలపతే

పరయా కృపయా పరిపాహిహరే||        3

అధివేంకటశైల ముదారమతే

ర్జనతాభిమ తాధిక దానరతాత్

పరదేవతయా గదితా న్నిగమైః

కమలాదయితా న్న పరంకలయే||        4

కలవేణు రవా వశ గోపవధూ

శతకోటి వృతాత్స్మర కోటి సమాత్

ప్రతిపల్లవి కాభిమాతాత్సుఖదాత్

వసుదేవసుతా న్న పరం కలయే||        5

అభిరామ గుణాకర దాశరథే

జగదేక ధనుర్ధర ధీరమతే

రఘునాయక రామ రమేశవిభో

వరదోభవ దేవ దయాజలధే||        6

అవనీ తనయా కమనీయకరం

రజనీకర చారుముఖాంబురుహమ్

రజనీచర రాజ తమోమిహిరం

మహనీయ మహం రఘురామమయే||    7

సుముఖం సుహృదం సులభం సుఖదం

స్వనుజం చ సుఖాయ మమోఘశరమ్

అసహాయ రఘూద్వాహ మన్య మహం

న కథం చ న కంచన జాతు భజే||        8

వీణా వేంకటేశం న నాథో న నాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి

హరే వేంకటేశం ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ||    9

అహందూరతస్తే పదాంభోజయుగ్మ

ప్రణామేచ్చయాగత్య సేవాం కరోమి

సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం

ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ||        10

అజ్ఞానినా మయాదోషా నశేషా న్విహితాన్ హరే

క్షమస్వతం క్షమస్వతం శేషశైల శిఖామణే||    11

శ్రీవేంకటేశ్వర స్తోత్రమ్ సమాప్తం

ఫలం: శ్రీవెంకటేశ్వరానుగ్రహ ప్రాప్తి

6. శ్రీ ఆదిత్యహృదయము

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్    1

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్

ఉపగమ్యా బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషిః            2

అగస్త్యోవాచ:

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్

యేన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి            3

ఆదిత్యహృదయం పుణం సర్వ శత్రు వినాశనమ్

జయావహం జపే న్నిత్య మక్షయం పరమం శుభమ్    4

సర్వమంగళ మాంగల్యం సర్వపాప ప్రణాశనమ్

ఛింతాశొక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమమ్    5

రశ్మిమంత సముత్యంతం దేవాసుర నమస్కృతమ్

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్    6

సర్వ దేవాత్మకో హ్యేష తేసస్వీ రశ్మిభావనః

ఏష దేవాసుర గణాణ్ లోకాణ్ పాతి గభస్తిభిః    7

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనధః కాలో యమ స్సొమో హ్యపాంపతిః    8

పితరో వసవ స్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః

వాయు ర్వహ్నిఃప్రజాః ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః    9

ఆదిత్యస్సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణ సదృసో భానుః స్వర్ణరేతా దివాకరః    10

హరిదశ్వ స్సహస్రార్చి స్సప్తసప్తి ర్మరీచిమాన్

తిమిరోన్మథన స్సంభు స్త్వాష్టా మార్తాండ అంశుమాన్    11

హిరణ్యగర్భ స్త్రిశిరో స్తపనో భాస్కరో రవిః

అగ్నిగర్భో దితేః పుత్ర శ్శంఖ శ్శిశిరనాశనః    12

వ్యోమనాథ స్తమోభేదీఋగ్యజు స్సామ పార్గః

ఘనవృష్టి రపామ్మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః    13

ఆతపీ మండలీ మృత్యుః పింగళ స్సర్వతాపనః

రవి ర్విశ్వో మహాతేజో రక్తస్సర్వభవోద్భవః     14

నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావనః

తేజసా మపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే    15

నమః పూర్వాయ గిరయే పశ్చిమా యాద్రయే నమః

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః    16

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః    17

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మప్రబోధయా మార్తాండాయ నమో నమః    18

బ్రహ్మేశానాచ్యు తేశాయ సూర్యాయాదిత్య వర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః    19

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః    20

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మనే

సమస్తమోభినిగ్నాయ రవయే లోకసాక్షినే    21

నాశయ త్యేషవైభూతం తథైవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః    22

ఏష సుప్తేషు జాగత్రి భూతేషు పరినిష్ఠితః

ఏష చై వాగ్నిఘోత్రం చ ఫలం చై గాగ్ని హోత్రిణాం    23

వేదా శ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫల మేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వాణ్యేషురవిః ప్రభుః    24

ఏన మాపత్షు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ

కీర్తయన్ పురుషః కశ్చి న్నవసీదతి రాఘవ     25

పూజయ స్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిం

ఏత త్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి    26

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఎవ ముక్త్వా తదాగస్త్యో జగామచ యథాగతం     27

ఏత చ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా

ధారయామాససుప్రీతోరాఘవః ప్రియతాత్మవాన్    28

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్ష మవాప్నుయాత్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్    29

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వయత్నేన మహతా వధే తస్య దృతో భవత్    30

అథ రవిరవద న్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వ రేతి 31

7. సూర్యాష్టకమ్

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదే మమం భాస్కర

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమో స్తుతే!!    1

సప్తాశ్వరథమారుఢం ప్రచండం క్శ్యపాత్మజమ్

శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    2

లోహితం రథమారూఢం సర్వలోక పితామహమ్

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    3

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేహ్శ్వరమ్

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    4

బృంహితం తేజసాంపుంజం వాయురాకాశ మేవచ

ప్రభుస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్    5

బంధూకపుష్ప సంకాశం హారకుండల భూషితమ్

ఏకచక్ర ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    6

విశ్వేశం విశ్వకర్తారం మహాజేజః ప్రదీపనమ్

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    7

శ్రీవిష్ణుం జగతానాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదమ్

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్    8

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనమ్

అపుత్రో లభతేపుత్రం దరిద్రో ధనవాన్ భవేత్    9

అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే

సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా    10

స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే

న వ్యాధి శోక దారిద్ర్యం, సూర్యలోకం స గచ్ఛతి    11

8. సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రము

అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే

అసమాన బలా యార్తరక్షకాయ నమోనమః    1

ఆదిత్యా యాది భూతాయ ఆఖిలాగమ వేదినే

అచ్యుత్యాయాఖిలాజ్ఞాయ అనంతాయ నమోనమః    2

ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయేంద్రాయ భానవే

ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తేనమః    3

ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే

వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః    4

ఉజ్జ్వలా యోగ్రరూపాయ ఊర్ద్వగాయ వివస్వతే

ఉద్యత్కిరణజాలాయ హృషీ కేశాయ తే నమః     5

ఊర్జస్వలాయ వీర్యాయ నిర్జరాయ జయాయ చ

ఊరుద్వయాభావ రూపయుక్త సారథయే నమః    6

ఋషివంద్యాయ ఋక్చాస్త్రే ఋక్షచక్ర చరాయ చ

ఋజుస్వభావ చిత్తాయ నిత్యస్తుతాయ తే నమః    7

ౠకార మాతృ కావర్ణ రూపాయోజ్వల తేజసే

ౠక్షాధినాథ మిత్రాయ పుష్కరాక్షాయ తే నమః    8

ఇప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయచ

కనత్కనక భూషాయ ఖద్యోతాయ నమోనమః    9

ఐనితాఖిల దైత్యాయ సత్యానంద స్వరూపిణే

అపవర్గ ప్రదాయార్త శరణ్యాయ నమోనమః    10

ఏకాకినే భగవతే సృష్టి స్థిత్యంతకారిణే

గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః    11

ఐశ్వర్యద్రాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే

దశది క్సంప్రకాశాయ భక్తవశ్యాయ తేనమః    12

ఓజస్కరాయ జయినే జగదానంద హేతవే

జన్మమృత్యు జరావ్యాధి వర్జితాయ నమోనమః    13

ఔన్నత్య పదసంచార రథస్థా యాత్మ రూపిణే

కమనీయకరా యాబ్జవల్లభాయ నమోనమః    14

అంతర్బహీర్ ప్రకాశాయ అచింత్యా యాత్మరూపిణే

అచ్యుతాయా మరేశాయ పరస్మై జ్యోతిషే నమః    15

అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే

తరుణాయ వరేణ్యాయ గ్రహాణం పతయేనమః    16

ఓం నమో భాస్కరాయ దిమధ్యాంత రహితాయచ

సౌఖ్యప్రదాయ సకల జగతాం పతయేనమః    17

నమస్సూర్యాయ కవయే నమోనారాయణాయచ

నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః    18

ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ

ఓం ఐ మిష్టార్దధాయస్తు సుప్రసన్నాయ నమో నమః     19

శ్రీమతే శ్రేయస్సే భక్తకోటి సౌఖ్య ప్రదాయినే

నిఖలాగమవేద్యాయ నిత్యానందాయతే నమః    20

యో మానవ స్సంతత మర్క మర్చయన్ పఠేత్ ప్రభాతే విమలేన చేతసా

ఇమాని నామాని చ నిత్య పుణ్యం ఆయుర్థనం ధాన్యముపైతి నిత్యం    21

ఇమం స్తవం దేవవరస్య కీర్తయే చ్ఛృణోతియో యం నుమనాస్సమహితః

స ముచ్యతే శోకదవాగ్ని సాగరా ల్ల భేత సర్వా న్మనసో యథేప్సి తాన్    22

ఫలం: సర్వాభీష్టసిద్ధి, శోకవినాశనం

9. చంద్రశేఖరాష్టకం

చంద్రశేకర చంద్రశేకర చంద్రశేకర పాహిమాం

చంద్రశేకర చంద్రశేకర చంద్రశేకర రక్షమాం||

రత్న సాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం

శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం

క్షిప్రదగ్దపురత్రయం త్రిదశాలయై రభివందితం

చంద్రశేఖర మాశ్రయే కిం కరిష్యతి వైయమః    1

పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం

ఫాలలోచన జాతపావక దగ్దమన్మధ విగ్రహం

భస్మ దిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః     2

మత్తవారనముఖ్యచర్మకృతో త్తరీయ మనోహరం

పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం

దేవసింధు తరంగశీకర సిక్తశుభ్రజటాధరం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః    3

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం

శైలరాజసుతాపరిష్కృత చారువామ కళేబరమ్

క్ష్వేళనీలగళం పరళ్వథ ధారణం మృగధారిణమ్

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః    4

కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం

నారదాదిమునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరం

అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం

చంద్రశెఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః    5

భెషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం

దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం

భుక్తిముక్తి ఫలప్రదం సకలాఘసంఘ నిబర్హణం

చంద్రశెఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః    6

భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిపంజరం

సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం

సోమవారుణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం

చంద్రశెఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వైయముః    7

విశ్వసృష్టి విధాయినం పున్ రేవపాలన తత్పరం

సమ్హరం త మపి ప్రపంచ మశేషలోక నివాసినం

క్రీడయంత మహర్నిశం గణనాథయూధ సమన్వితం

చంద్రశేఖర మాత్రయే మమ కిం కరిష్యతివై యమః     8

మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్ని ధౌ

యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయంభవేత్

పూర్ణమాయుర రోగతా మఖిలార్ధ సంపద మాదరం

చంద్రశేక్షర ఏవ తసదదాతి ముక్తి మయత్నతః    9

సంసార సర్పస్య దష్టానాం జంతూణా మవివేకినాం

చంద్రశెఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం    10

రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిం

నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి    11

కాలకంఠం కలామూర్తిం కాలాగ్నిం కాలనాశనం

నమామి సిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి    12

అనంతమవ్యయం సాంట మక్షమాలాధరం హరం

నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి    13

ఆనంద పరమం నిత్యం కైవల్యపద కారనం

నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి    14

దేవ దేవం జగన్నాథం దేవేశం వృషభద్వజం

నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి    15

స్వర్గాపవర్గ దాతారం సృష్టి స్థిత్యంతకారణం

నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి    16

గంగాధరం శశిధరం శంకరం శూలపాణినం

నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి    17

భస్మోద్దూళితసర్వాంగం నాగాభరన భూషితం

నమామి శిరసాదేవం కిన్నో మృత్యుః కరిష్యతి    18

మార్కండేయకృతం స్తోత్రం యః పరేచ్ఛివసన్నిధౌ

తస్య మృత్యుభయం నాస్తి సత్యం సత్యంవదామ్యహం

శివేశాన మహాదేవ వాసుదేవ సదాశివ

కల్పాయు ర్దేహిమే పూర్ణం యావదాయురరోగతాం    

10. శ్రీరాజరాజేశ్వర్యష్టకము

అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్లా ఉపాపార్వతి

కాళీహైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ

సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా

చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    1

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ

వాణీపల్లవపాణి వేణుమురళీగాన ప్రియాలోలినీ

కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణీ

చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    2

అంబానూపుర రత్నకంకణధరీ కేయూరహారావళీ

జాజీపంకజ వైజయంతిలహరీ గ్రైవేయ వైరాజితామ్

వీణావేణు వినోదమండితకరా వీరాసనే సంస్థితా

చిద్రూపీ వర్రదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    3

అంబారౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ

బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా

చాముండా శ్రితరక్ష పోషజననీ దాక్షాయనీ పల్లవీ

చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    4

అంబా శూలాధనుః కుశాంకుశధరీ అర్ధేందు బింబాధరీ

వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమా సేవితా

మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మహేశ్వరీ అంబికా

చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    5

అంబా సృష్టివినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా

గాయత్రీ ప్ర్రణవాక్షరామృతరసః పుర్ణానుసంధీకృతా

ఓంకారీ వినుతా సురార్చితపదా ఉద్దండ దైత్యాపహా

చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    6

అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యామహాదేవతా

యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యా వై జగన్మోహిని

యా పంచప్రణవాది రేఫజననీ యా చిత్కళామాలినీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    7

అంబాపాలిత భక్తరాజి రనిశం అంబాష్టకం యఃపఠేత్

అంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్యమవ్యాహతా

అంబాపావనమంత్రరాజపఠనా ద్యంతేన మోక్షప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!    8

ఫలం: ఆధ్యాత్మిక జ్ఞానప్రాప్తి, సర్వవాంఛాసిద్ధి.

11. పార్వతీ వల్లభ నీలకంఠాష్టకమ్

నమో భూతనాథం నమో దేవ దేవం నమః కాలకాలం నమో దివ్యతేజం

నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకఠం||    1

సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైఅవపూజ్యం సదా శుద్ధ భస్మం

సదా ధ్యానయుక్తం సదాజ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    2

శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానాం సదాచర్మ వేష్టమ్

పిశాచం నిశొచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    3

ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం

కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    4

శిరశ్సుద్ధ గంగా శివా వామభాగం బృహద్దీర్ఘ కేశం సదామాం త్రినేత్రం

ఫణీనాగకఋనం సదా బాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    5

కరే శూలధారం మహాకష్టనాశం సురేశం పరేశం మహేశం జనేశం

ధనేశస్తుతేశం ధ్వజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    6

ఉదాసం సుదాసం సుకైలాస వాసం ధరానిర్ధరం సంస్థితం హ్యదిదేవం

అజ హేమకల్పద్రుమం కల్పసేవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    7

మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజా నాం పఠంతం శివం వేదశాస్త్రం

అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    8

సదా భావనఠ స్సదా సెవ్యమానం సదా భక్తి దేవం సదా పూజ్యమానం

సదాతీర్థవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం||    9   

ఫలం:ఇష్టకామ్యర్ధసిద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి.

12. శ్రీ అన్నపూర్ణాష్టకము

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ

నిర్దూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీన

ప్రాలేయాచల వంశాపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్నేశ్వరీ||    1

నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ

ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజుకుంభాంతరీ

కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||    2

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ

చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ

సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరి

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నా పూర్ణేశ్వరీ||    3

కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమా శంకరీ

కౌమారీ నిగమార్ధగోచరకరీ ఓంకార బీజాక్షరీ

మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||     4

దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాదోదరీ

లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ

శ్రీవిశ్వేశమనః ప్రమోదనకరీ కాశీ పురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||     5

ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ

కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ

స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీ పురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||    6

ఉర్వీ సర్వజయేశ్వరీ దయాకరీ మాతాకృపాసాగరీ

నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నా పూణేశ్వరీ||    7

దేవీ సర్వవిచిత్రరత్న రచితా దాక్షాయణీ సుందరీ

వామాస్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ

భక్తాభీష్టకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||    8

చంద్రార్కనల కోటికోటి సదృశా చంద్రాంశు బింబాధరీ

చంద్రారాగ్ని సమాన కుండలభరీ చంద్రార్క వర్ణేశ్వరీ

మాలాపుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||    9

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతాకృపాసాగరీ

సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ

దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబకరీ మాతాన్న పూర్ణేశ్వరీ||    10

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాం దేహీ చ పార్వతి||    11

మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః

భాందవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్||    12

ఫలం: ఇహానికి ఆకలి దప్పులూ – పరానికి ఏకలి తప్పులూ కలగపోడం.

13. కాలభైరవాష్టకం

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం

వ్యాళయజ్ఞసూత్ర మిందు శేఖరం కృపాకరం

నారదాది యోగిబృంద వందితం దిగంబరం

కాశిపురాధినాథ కాలభైరవం భజే||        1

భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పఠం

నీలకంఠ మిప్సితార్ధదాయకం త్రిలోచనం

కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం

కాశిపురాధినాథ కాలభైరవం భజే||        2

శూలటంక పాశ దండపాణి మాది కారణం

శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం

భీమవిక్ర్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం

కాశిపురాధినాథ కాలభైరవం భజే||        3

భుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం

భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహం

నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కటిం

కాశిపురాధినాథ కాలభైరవం భజే||        4

ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం

కర్మపాశమోచకం సుశర్మ దాయకం విభుం

స్వర్ణకర్ణ కేశపాశ శోభితాంగ మండలం

కాశిపురాధినాథ కాలభైరవం భజే||        5

రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం

నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం

మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్ర భీషణం

కాశిపురాధినాథ కాలభైరవం భజే||        6

అట్తహాస భిన్న పద్మజాండకోశ సంతతిం

దృష్టిపాతనష్ట పాపతజాల ముగ్రనాశనం

అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం

కాశిపురాధినాథ కాలభైరవం భజే||        7

భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం

కాశివాసి లోక పుణ్యపాపశొధకం విభుం

నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం

కాసిపురాధినాథ కాలభైరవం భజే||        8

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తి విచిత్రపుణ్యవర్ధనం

శోక మోహ దైన్యలోభ కోపతాప నాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం||    9

ఫలం: మనశ్శంతి, ఆధ్యాత్మిక జ్ఞానం

14. శ్రీ దుర్గాష్టోత్తర శనామ స్తోత్రము

ఓం దుర్గా శివా మహాలక్ష్మీర్మహౌగౌరీచ చండి కా

సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా||    1

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా

భూమిజా నిర్గుణాధార శక్తి శ్చానీశ్వరీతథా||     2

నిర్గుణా నిరహంకారా సర్వగర్వ విమర్దినీ

సర్వ్వలోక ప్రియా వాణీ సర్వ విద్యాధిదేవతా||    3

పార్వతీ దేవమాతా చ వనేఎశా విధ్యవాసినీ

తేజోవతీ మహామాతా కోటిసూర్య సమప్రభా||    4

దేవతా వహ్నిరూపా చ సతోజా వర్ణరూపిణీ

గుణాశ్రయా గుణామధ్యా గుణత్రయ వివర్జితా||    5

కర్మజ్ఞాన ప్రదా కాంతా సర్వసమ్హార కారిణీ

ధర్మజ్ఞానా ద్థర్మనిష్టా సర్వకర్మ వివర్జితా||    6

కామాక్షీ కామసంహంత్రీ కామక్రోధ వివర్జితా

శాంకరీ శాంభవీ శాంతా చంద్ర సూర్యాగ్ని లోచనా||    7

సుజయా జయభూమిష్టా జాహ్నవీ జనపూజితా

శాస్త్రా శాస్త్రమయా నిత్యశుభా చంద్రార్ధమ స్తకా||    8

భారతీ బ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా

బ్రాహ్మీనారయాణీ రౌద్రీ చంద్రామృత పరిశృతా||    9

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యధికాణీ

బ్రహ్మాండకోటి సంస్థానా కామినీ కమలాలయా||    10

కాత్యాయనీ కలాతీతా కాల సంహారకారిణి

యోగనిష్టా యోగిగమ్యా యోగిధ్యేయా తపస్వినీ||    11

జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్ట ఫలప్రదా

భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ||    12

స్వధా నారీ మధ్యగతా షడధారాది వర్ధినీ

మోహతాంశుభవా శుభ్రా సూక్ష్మామాతా నిరాలసా||    13

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా

సర్వజ్ఞాన ప్రదానందా సత్యా దుర్లభరూపిణీ||    14

సరస్వతీ సర్వగతా సర్వభీష్ట ప్రదాయీనీ||    15

ఫలం: సర్వభయ నివారణం, శత్రువినాశనం

15. విశ్వనాథాష్టకం

గంగాతరంగ రమణీయ జటాకలాపం

గౌరీ నిరంతర విభూషిత వామభాగం

నారాయణ ప్రియ మనంగ మదాప హారం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    1

వాచమగోచర మమేయ గుణస్వరూపం

వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం

వామేన విగ్రహవరేణ కళత్రవంతం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||     2

భూతాధిపం భుజగభూషణ భూషితాంగం

వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం

పాశాంకు శాభయవరప్రద సూలఫణిం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    3

శీతాంశు సోభిత కిరీట విరాజమానం

ఫాలేక్షణానల విశోషిత పంచబాణం

నాగాధిపా రచిత భాసుర కఋనపూరం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    4

పంచాననం దురిత మత్తమతంగజానాం

నాగాంతకం దనుజపుంగవ పన్నగానాం

దావానలం మరణశోక జరాటవీనాం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    5

తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం

ఆనందకంద మపరాజిత మప్రమేయం

నాదాత్మకం సకల నిష్కళ మాత్మరూపం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    6

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం

పాపేరతించ సునివార్య మనస్సమాధౌ

ఆదాయ హృత్కుమల మధ్యగతం పరేశం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    7

రాగాదిదోష రహితం స్వజనానురాగం

వైరాగ్య శాంతినిలయం గిరిజా సహాయమ్

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం

వారాణసీ పురపతిం భజ విశ్వనాథం||    8

వారణసీ పురపతేః స్తవం శివస్య

వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః

విద్యాం శ్రియం విపులసౌఖ్య మనంతకీర్తిం

సంప్రాప్య దేహవిలయే లభతేచ మోక్షం||    9

విశ్వనాథష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే||    10

ఫలం: ధనధాన్యాలూ, విద్యా విజయాలూ, ఇహపర సర్వసౌఖ్యాలు

16.శ్రీ ఉమాష్తోత్తర శతనామ స్తోత్రము

ఉమా కాత్యాయనీ గౌరీ కాళీ హైమవ తీశ్వరీ

శివాభవానీరుద్రాణీ శర్వాణీ సర్వమంగళా||    1

అపర్ణా పార్వతీ దుర్గా మృడాణీ చండికాంబికా

ఆర్యాదాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజా||    2

స్కందమాతా దయాశీలా భక్తరక్షాచ సుందరీ

భక్తవశ్యా చలావణ్యనిధి స్సర్వ సుఖప్రదా||    3

మహాదేవీ భక్తమనోహ్లాదినీ కఠినస్తనీ

కమలాక్షీ దయాసారా కామాక్షీ నిత్యయౌవానా||    4

సర్వసంసత్ప్రదా కాంతా సర్వసం మోహినీ మహీ

శుభప్రియా కంబుకంఠీ కల్యాణీ కమలప్రియా||    5

సర్వేశ్వరీ చ కలశహస్తా విష్ణుసహూదారీ

వీణనాద ప్రియా సర్వదేవ సంపూజితాంఘ్రీకా||    6

కదంబారణ్య నిలయా వింధ్యాచల నివాసినీ

హరప్రియా కామకోటి పీఠస్థా వాంఛితార్ధదా||    7

శ్యామాంగాచంద్రవాదనా సర్వవేదస్వరూపిణీ

సర్వశాస్త్ర స్వరూపా చ సర్వ దేవమాయీ తథా||    8

పురుహూతస్తుతా దేవీ సర్వవేద్యా గుణప్రియా

పుణ్య స్వరూపిణీ వేద్యా పురుహూత స్వరూపిణీ||    9

పుణ్యోదయా నిరాధారా శునాసీరాదిపూజితా

నిత్యపూర్ణా మనోగమ్యా నిర్మలానంద పూరితా||    10

వాగీశ్వరీ నీతిమతి మంజులా మంగళప్రదా

వాగ్మినీ వంజులా వంద్యా వయోవస్థా వివర్జితా||    11

వాచస్పతి ర్మహాలక్ష్మీ ర్మహామంగళనాయికా

సింహాసనమయీ సృష్టి స్థితి సంహారకారిణీ||    12

   

మహాయజ్ఞా నేత్రరూపా సావిత్రీ జ్ఞానరూపిణీ

వరరూపధరా యోగా మనోవాచా మగోచారా||    13

దయారూపాచ కాలజ్ఞా శివ ధర్మపరాయణా

వజ్రశక్తి ధరాచైన సూక్ష్మాంగీ ప్రాణధారిణీ||    14

హిమ శైలకుమారీచ శరణాగతరక్షణీ

సర్వాగమస్వరూపాచ దక్షిణా శంకరప్రియా||    15

దయాధారా మహానాగాధారిణీ పురభైరవీ

నవీన చంద్రమశ్చూడప్రియా త్రిపురసుందరీ||    16

ఫలం: పవిత్రత – ప్రశాంతత

17. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం

హే స్వామినాథ కరుణాకర దీనబంధో

శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో

శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ

వల్లీసనాథ మమదేహి కరావలంబమ్||        1

దేవాది దేవసుత దేవగణాధినాథ

దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద

దేవర్షి నారాయణద మునీంద్ర సుగీతకీర్తే

వల్లీ సనాథ మమదేహి కరావలంబమ్||    2

నిత్యాన్నదాన నిరతాఖిల రోగాహారిన్

తస్మా త్ప్రసాద పరిపూరిత భక్తకామ

శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప

వల్లీసనాథ మమదేహి కరావలంబమ్||        3

క్రౌం చాసురేంద్ర పరిఖండన శక్తిశూల

పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే

శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్ర వాహ

వల్లీసనాథ మమదేహి కరావలంబమ్||        4

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య

దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తమ్

శూరం నిహత్య సురకోటిభి రీడ్యమానం

వల్లీసనాథ మమదేహి కరావలంబమ్||        5

హారాదిరత్న మణియుక్త కిరీటహార

కేయూర కుండల లసత్కవ చాభిరామ

హే వీర తారక జ యామరబృంద వంద్య

వల్లీ సనాథ మమదేహి కరావలంబమ్||    6

పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః

పంచామృతైః ప్రముదితేంద్ర ముఖై ర్మునీంద్రైః

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ

వల్లీ సనాథ మమదేహి కరావలంబమ్||    7

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా

కామాదిరోగ కలుశీకృత దుష్టచిత్తమ్

సిక్త్వాతు మా మవ కళాధర కాంతికాంత్యా

వల్లీ సనాథ మమదేహి కరావలంబమ్||    8

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమా

తే సర్వేముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదితః||    9

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్దాయ యఃపఠేత్

కోటిజన్మ కృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి||    10

ఫలం: సర్వవాంఛా ఫలసిద్ధి – సర్వపాపనాశనం

18. శ్రీ ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రం

ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం

జగద్భీతి శౌర్యం తుషారాద్రి ధైర్యం

తృణీభూత హేతుం రణోద్యద్విభూతిం

భజే వాయుపుత్రం సవిత్రా ప్తమిత్రం||                1

భజే హేమరంభావనీ నిత్యవాసం భజే బాలభామ ప్రభాచారుభాసం

భజే చంద్రికా కుంద మందారహాసం భజే సంతతం రామభూపాల దాసమ్||        2

భజే లక్ష్మణప్రాణ రక్షాతిరక్షం భజే తోషి తానేక గీర్వాణపక్షం

భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం భజే రామనామాతి సంప్రాప్త రక్షమ్||        3

కృతాభీల నాదమ క్షితిక్షిప్త పాదమ ఘనాక్రాంత భృంగం కటిస్థోరుజంఘం

వియద్వ్యాప్త కేశం భుజాశ్లేషితాశ్మం జయశ్రీ సమేతం భజే రామదూతం||        4

చలద్వాల ఘాతం భ్రమ చ్చక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం

మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం భజే ఆంజనేయం ప్రభుం వజ్రకాయం||        5

రణేభీషణే మేఘ నాదే సనాధే సరూపర్ణే మారోప్వణా మిత్రముఖ్యే

ఖగానాం ఘనానాం సురానాం చ మార్గే నటంతం భ్రమంతం హనుమంతమీడే||        6

ఘనద్రత్న జంభారి దంభోళిధారం ఘనద్దంత నిర్ధూత కాలోగ్రదంతం

పదాఘాత భీతబ్ధి భూతాధివాసం రణక్షోణిదక్షం భజే పింగళాక్షం||        7

మహోగ్రాహ పీడాం మహోత్పాత పీడాం మహారోగ పీడాం మహోతీవ్ర పీడాం

హరత్యాస్తుతే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ఠ రామప్రిమాయ||        8

సుధాసింధు ముల్లంఘ్య నాథో ప్రదీప్త స్సుధాచౌషిధీస్తా ప్రగుప్త ప్రభావాః

క్షణద్రోణ శైలస్య సా రేణ సేతుం వినాభూ స్వయంక స్సమర్దః కపీంద్రా||        9

నీరంతక మావిశ్వలంకావిశంకో భవానేన సీతాటి శోకాపహారీ

సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరుజంఘ స్తుతామర్త్య సంఘః||        10

రమానాథ రామక్షమానాథ రామం అశోకే సశోకాం విహాయ ప్రహర్షం

వనాంతద్ఘనాం జీవనాం దానవానాం విపాట్య ప్రహర్షాత్ హనుమ త్వమేవ||        11

జరాభారతో భూరిపీడాంశరీరే నిరాధారణారూఢ గాఢ ప్రతాపీ

భవద్పాద భక్తిం భవద్భక్తి రక్తిం కురు శ్రీమనూమత్ప్రభో మే దయాళో||        12

మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా న జానంతి తత్త్వం నిజం రాఘవస్య

కథంజాయ తే మీదృ శేనిత్యమేవ ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే||        13

నమస్తే మహాసత్త్వ బాహ్వాయ తుభ్యం నమస్తే మహావజ్ర దేహాయ తుభ్యం

నమస్తే వరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యం||        14

నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదావాయుపుత్రాయ తుభ్యం

నమస్తే సదా పింగళాక్షయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యం||        15

హనుమద్భుజంగ ప్రయాతం ప్రభాతే పి వా చార్థరాత్రో పి మర్త్యః

జప న్నశ్యతో పి ప్రముక్తో ఘజాలో సదా సర్వదా రామభక్తిం ప్రయాతి||        16

ఫలం: పాపనాశన్, శ్రీరామభక్తి ప్రాప్తి.

19. విష్ణు శతనామ స్తోత్రం

వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినం

జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుఢద్వజం||    1

వరాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకం

అవ్యక్తం శాశ్వతం విష్ణుం అనంత మజ మవ్యయం||    2

నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తి భాజనం

గోవర్ధనోద్దరం దేవం భూధరం భువనేశ్వరం||    3

వేత్తారం యజ్ఞ పురుషం యజ్ఞేశం యజ్ఞవాహకం

చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమం||    4

వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాసనం

త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందికేశ్వరం||    5

రామం రామం హయగ్రీవం భీమం రౌద్రం భవోద్భవం

శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగళం మంగళాయుధం||    6

దామోదరం దయోపేతం కేశవం కేశిసూదనం

వరేణ్యం వరదం విష్ణుం ఆనందం వసుదేవజం||    7

హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమం

సకలం నిష్కళం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతం||    8

హిరణ్య తనుసంకాశం సుర్యాయుత సమప్రభం

మేఘశ్యామం చతుర్బాహు కుశలం కమలేక్షణం||    9

జ్యోతిరూప మరూపం చ స్వరూపం రూపసంస్థితం

సర్వజ్ఞం సర్వరూపస్థవం సర్వేశం సర్వతో ముఖం||    10

జ్ఞానం కూటస్థ మచలం జ్ఞానప్రదం పరమం ప్రభుం

యోగీశం యోగనిష్ణాతం యోగినం యోగ రూపిణం||    11

ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుం

ఇతి నామశాతం దివ్యం వైష్ణవం ఖలు పాపహం||    12

వ్యాసేన కథితం పూర్వం సర్వపాప ప్రణాశనం

యఃపఠేత్ ప్రాతరుత్థాయ స భావే ద్వైష్ణవోనరః||    13

సర్వ పాపవిశుద్ధాత్మా విష్ణు సాయుజ్య మాప్నుయాత్

చాంద్రాయణ సహస్రాణి కన్యాదాన శతాని చ||    14

గవాంలక్ష సహస్రాణి ముక్తిభాగీ భావేన్నరః

అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః||    15

ఫలం: పాపనాశనం, వైకుంఠప్రాప్తి, వెయ్యి చాంద్రాయణ వ్రతాలు – వంద కన్యాదానాలూ – కోటి గోదానాలూ – ఒక అశ్వమేధం చేసిన పుణ్యం కలుగుతుంది.

20. శివాష్టకం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వానాథం

జగన్నాథ నాథం సదానంద భాజం

భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం

శివం శంకరం శంభు మీశానమీడే!||    1

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం

జటాజూట గంగాతరంగై ర్విశాలం శివం శంకరం శంభు మీశానమీడే||    2

ముదామాకరం మండనం ముండయంతం మహామండలం భస్మభూషా దారంతమ్

అనాదిం హ్యపారం మహామోహరూపం శివం శంకరం శంభు మీశానమీడే||    3

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశనం సదా సుప్రకాశం

గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభు మీశానమీడే||    4

గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్న గేహం

పరబ్రహ్మ బ్రహ్మాదిభి ర్వంద్యమానం శివం శంకరం శంభు మీశానమీడే||    5

కపాలం త్రిశూలం కరాభ్యాం దథానం పదామ్భోజ నమ్రాయ కామం దధానం

బలీవర్దమానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభు మీశానమీడే||    6

శరచ్చంద్ర గాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం

అపర్ణా కళత్రం సదా సచ్ఛరిత్రం శివం శంకరం శంభు మీశానమీడే||    7

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం

శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశానమీడే||    8

స్వయం యః ప్రభాతే నర శ్శూలపాణేః పఠేత్ స్త్రోత్రరత్నం త్విహ ప్రాప్యరత్నం

సుపుత్రం సుభాగ్యం సుమిత్రం కళత్రం విచిత్రై స్సమారాధ్య మోక్షం ప్రయాతి||    9

ఫలం: సత్కళత్ర, సత్పుత్ర, సకలసంపదా ప్రాప్తి.

God


 

అరణ్యపర్వము – 26

 అరణ్యపర్వము – 26


వైవస్వత మనువు వృత్తాంతం


ధర్మరాజు మార్కండేయుని ” వైవసత్వ మనువు ఏ విధంగా ప్రభావితుడైయ్యాడు ” అని అడిగాడు. మార్కండేయుడు ” ధర్మజా! చాక్షుస మన్వంతరంలో వైవసత్వుడు పది వేల సంవత్సరాలు తపస్సు చేసాడు. ఒకరోజు వైవసత్వుడు ఒక జలాశయంలో స్నానం చేసి ఒడ్డున ఉండగా ఒక చేప తీరానికి దగ్గరగా వచ్చి ” అయ్యా ! ఈ జలాశయంలో నా కంటే బలవత్తరమైన జలచరములు ఉన్నాయి. నన్ను వేరే చోటికి తీసుకు పో. నీకు నేను ఉపకారం చేస్తాను ” అని అడిగింది. వైవసత్వుడు ఆ చేపను తీసుకు వెళ్ళి ఒక బావిలో విడిచిపెట్టాడు. ఆ చేప పెద్దది అయింది ” అయ్యా! నాకు ఈ బావి చాలడం లేదు వేరే ప్రదేశానికి తీసుకు వెళ్ళు అని అడిగింది.


అది విని వైవసత్వుడు ఆచేపను మరింత పెద్ద బావిలో విడిచిపెట్టాడు. కొన్నాళ్ళకు ఆ బావి కూడా చాలలేదు. ఆ చేప కోరిక మేరకు దానిని ఒక మడుగులో వదిలి వేసాడు. కొద్ది రోజులకు ఆ మడుగు కూడా చాలకపోవడంతో దానిని సముద్రంలో వదిలి వేసాడు. ఆ చేప వైవసత్వుని చూసి ” అయ్యా! కొద్ది రోజులలో ప్రళయం రాబోతుంది. అన్ని సముద్రాలు కలవబోతున్నాయి . దీనిని మన్వంతర సంధి అంటారు. నీవు ఒక ఓడను నిర్మించు అందులో అన్ని రకాల ధాన్యాలు, ఔషధాలు నింపు. సప్తఋషులతో కలసి ఆ ఓడ ఎక్కి నన్ను తలచుకో. నేను నీకు మేలు చేస్తాను ” అని చెప్పింది.


వైవసత్వుడు అలాగే ఒక ఓడను నిర్మించి ధాన్యాలతోను, విత్తనాలతోనూ నింపి సప్తఋషులతో సముద్రాన్ని చేరాడు. ఆ చేపను మనసులో తలిచాడు. ఇంతలో ఆ చేప వచ్చింది. ఆచేప తలపై ఒక కొమ్ము ఉంది. ఆ ఓడ తాటిని తన కొమ్ముకు తగిలించుకుని సముద్ర మధ్యానికి తీసుకు వెళ్ళింది. ఆ తరువాత కుంభవృష్టి కురవడం మొదలై సముద్రాలన్నీ ఏకం అయ్యాయి. భూమి జలమయం అయ్యింది. ఆ చేప అనేక వేల సంవత్సరాలు ఆ ఓడను లాగుతూ ఉంది. ప్రళయం అంతరించింది. ఆ చేప వైవసత్వుని సప్తఋషులను చూసి “అయ్యా! ప్రళయ కాలంలో నేను మిమ్మల్ని కాపాడాను. ఈ వైవసత్వుడు మరలా సృష్టి కొనసాగించగలడు ” అని చెప్పింది ” అని ధర్మరాజుతో చెప్పాడు.


కల్పాంతం

ధర్మరాజు మార్కండేయుని ” మహర్షీ ! నీవు చిరంజీవివి ఎన్నో ప్రళయాలు చూసావు. ఈ చరాచర జీవరాశుల సృష్టి స్థితి లయలను ఎన్నో సార్లు చూసావు. ఈ లోకాలు ప్రళయకాలంలో ఎలా ఉంటాయి? ” అని అడిగాడు. మార్కండేయుడు ” ధర్మజా! నూవు అడిగిన ఈ ప్రశ్నకు సాక్షాత్తు విష్ణు మూర్తి స్వరూపమని చెప్ప బడుతున్న శ్రీకృష్ణుని అనుమతితో సమాధానం చెబుతున్నాను. సావధానంగా వినుము ” అని చెప్పసాగాడు. ” కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని నాలుగు యుగములు. ఇవి పన్నెండు వేల దివ్య సంవత్సరములు. ఈ నాలుగు యుగములు కలసి ఒక మహా యుగం అని పిలువబడతాయి. ఇలాంటి మహా యుగాలు వెయ్యి కలిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు ఔతుంది.


అలాంటి బ్రహ్మదివసము ఆఖరున నూరు సంవత్సరాల వరకు తీవ్ర అనావృష్టి ఏర్పడుతుంది. సూర్యుడు తీవ్రంగా ఉంటాడు. విపరీతమైన గాలులు వీస్తాయి. అంతలోనే మేఘాలు కమ్ముకుంటాయి. ఉరుములు మెరుపులతో విపరీతంగా వర్షం కురుస్తుంది. నదులు సముద్రాలు నిండి పోతాయి. అనావృష్టి అంతరించి అతి వృష్టి వస్తుంది. భూభాగమంతా జలమయం ఔతుంది. గాఢాంధకారం భూమండల మంతా వ్యాపిస్తుంది. ఇంతలో బ్రహ్మ ఆజ్ఞ మేరకు ఆ మేఘాలను విపరీతమైన గాలి వీచే చెదరగొడతాయి. బ్రహ్మదేవుడు అప్పుడు ఆ ఘోరమైన నీటి మధ్య పద్మంపై నిద్రిస్తాడు. ఈ విధంగా కల్పాంతం ఔతుంది. ఇలాంటి కల్పాలు ఎన్నో గడిచాయి. ఇక ముందు ఎన్నో రానున్నాయి.

రామాయణమ్ 216

 రామాయణమ్ 216

....................

సుగ్రీవుడు ,తార ,అంగదుడు వీరు మువ్వురినీ ఓదార్చి ఇక చేయవలసిన కార్యము గురించి ఆలోచించమని రాముడు తెలుపగా లక్ష్మణుడు సుగ్రీవుని సమీపించి వాలి శరీరానికి దహన సంస్కారాలు జరిపించవలెనని తెలిపి అందుకు కావలసిన ప్రయత్నములు చేయమని సూచించినాడు .

.

వెంటనే సుగ్రీవుడు శ్రేష్టమైన గంధపుచెక్కలను బాగా ఎండిన అనేకములైన కాష్టములను తెచ్చుటకై వానరులను ఆజ్ఞాపించెను .

.

అన్ని ద్రవ్యములను తెచ్చుటకు అంగదుడు పంపబడెను .

.

తారుడు వాలి శరీరమును మోయుటకోరకు ఒక శ్రేష్టమైన పల్లకి తెచ్చెను . 

.

వానరవీరులు వాలి శరీరాన్ని ఎత్తి ఆ పల్లకి లో ఉంచి పల్లకిని భుజములకేక్కించుకొని మోయసాగిరి .

.

తార మొదలైన స్త్రీలు అనుసరించి వెళ్లిరి

.

ఒక నదీతీరమున చుట్టూ జలమున్న నిర్జనమైన ఒక ఇసుక తిన్నెపై చితిని ఏర్పాటు చేసి ఆ చితిపై వాలిశరీరాన్ని ఉంచారు వానరులు.

.

అప్పుడు అంగదుడు చితికి నిప్పంటించి అప్రదక్షిణముగా తిరిగెను. వానరు లంతా నది వద్దకు వెళ్లి వాలి కి జల తర్పణములు చేశారు.

.

దహన సంస్కారమైన పిమ్మట సుగ్రీవుడు రాముని వద్దకు వెడలి అంజలి ఘటించి నిలిచెను .

.

అంత హనుమంతుడు రామునితో రామా ! ఈ సుగ్రీవునకు నీవు అనుమతినిచ్చిన ఎడల కిష్కింధకు వెళ్లి యధాశాస్త్రము రాజ్యాభిషిక్తుడై కార్యములను చక్కబెట్టగలడు అని తెలిపాడు .

.

అప్పుడు రాముడు హనుమంతునితో హనుమా !నేను ఈ పదునాలుగేండ్లు గ్రామములో గానీ పట్టణములలో గానీ ప్రవేశించను మీరే అతనిని తీసుకొని వెళ్లి రాజ్యాభిషిక్తునిగావించండి అంగదుని యువరాజుగావించండి అని పలికెను .


రామాయణమ్ 217

...............

రామాజ్ఞ ప్రకారము సుగ్రీవునకు పట్టాభిషేకము ,అంగదునకు యువరాజ పట్టము కట్టుటనిర్విఘ్నముగా జరిగిపోయినవి.

.

 సుగ్రీవుడు రుమను మరల చేపట్టి నాడు .సంతోషముతో ఈ విషయములన్నీ రామచంద్రునకు నివేదించినాడు.

.

అది శ్రావణ మాసము !వర్షరుతువు ప్రారంభమైనది .

నదులన్నీ నిడుకుండలలాగా ఉన్నాయి ,

మేఘములు బారులు తీరి జలధారలు వర్షిస్తున్నాయి ,

.

ఆ సమయము సీతాన్వేషణకు అనుకూలము కాదు.


 ,కార్తీకమాసమువరకు ఆగవలసినదే ! అప్పటివరకు సుగ్రీవునకు అనుమతిచ్చి తానూ తమ్మునితో గూడి అందమైన ప్రస్రవణ పర్వత గుహనొకదానిని అనుకూలముగా ఉన్నటువంటిది చూసి అందు నివసింప నిశ్చయించినాడు రాఘవుడు,

.

రాఘవుడు ఒక రోజు ఆ గుహ సమీపమునందున్న ఒక నదిని చూశాడు. అది చాలా నిండుగా ప్రవహిస్తున్నది .

ఆ నదిని చూడగానే అందమైన వస్త్రములు ధరించిన కన్నెపిల్లలా తోచింది ఆయనకు.

.

 ఆ నది ఒడ్డున ఉన్న వానీర ,తిమిర,వాకుల,కేతక,హింతాల,తినిస,నీప ,వేతస వృక్షాలు రకరకాల రంగుల పూవులతో నిండుగా ఉంది ఆ నదీ కన్య ధరించిన ఉత్తమ వస్త్రములుగా కనుపించినవి రాముని కంటికి !

.

ఆ నదికి దగ్గరగా కూతలు కూయుచూ నదిమీదుగా ఎగురుతున్న పక్షుల కిలకిలారావములు ఆ నదీమసుందరి నవ్వులా ఉన్నవట ఆ నదీ గమన శబ్దము ఆ సుందరి కాలి అందియల సవ్వడి వలే వినిపించినదట. 

.

ఆ నదీ మధ్యభాగమున తెల్లని ఇసుకతిన్నెలు ఆ నదీ కన్య నవ్వుమోము వలే తళతళ మెరిసిపోతున్నవట..

అందమైన ఊహలతో అనుక్షణము ప్రక్కన సీత లేదే అనే విరహవేదనతో కాలము గడుపుతున్నాడు జానకీమనోహరుడు.


రామాయణమ్ 218

...............

లక్ష్మణా! నామనస్సులో దుఃఖభారము అధికముగా ఉన్నది ,

దానిని దాటే మార్గమేది ? 

.

వర్షాకాలమా ప్రయాణమునకు అనుకూలము కాదె !

దీనిని దాటుటేట్లు ? 

.

చూడబోతే రావణుడా బలవంతుడైన శత్రువు ! 

ఈ మూడింటినీ దాటుట ఎట్లు ? 

.

వర్ష ఋతువులో అందమైన ప్రకృతిని ఆస్వాదించలేక అనుక్షణము సీతను గుర్తుకు తెచ్చుకుంటూ పిచ్చివాడవుతున్న అన్నను జాగ్రత్తగా ఓదారుస్తూ వస్తున్నాడు లక్ష్మణుడు!

.

వారి పరిస్థితి ఇలా ఉంది!

.

అక్కడ కిష్కింధలో !

.

సుగ్రీవుడు ఎంతోకాలానికి లభించిన సుఖాలవ్వటముచేత వాటిలో మునిగి తేలుతున్నాడు ,సమయము ఎలా గడిచిపోతున్నదో గమనించే స్పృహలో కూడా లేడు.

.

 భార్య రుమ ,ఇష్టురాలైన తార ఇరువురూ లభించారు.

మగువ ,మదిర ఈ రెండూ అతనిని కట్టిపడవేసినవి.దర్శనము మంత్రులకు కూడా కరువయ్యింది.

.

ఆయనను ఎవరూ సమీపించే సాహసము చేయలేకపోతున్నారు.

.

ఈ పోకడలన్నీ ఒకరు గమనిస్తూనే వున్నారు !

.

ఆయనే బుద్దిమంతులలో శ్రేష్ఠుడైన హనుమంతుడు .. 

.

అప్పటికీ వర్షాకాలము గడచిపోవచ్చింది. 

.

మేఘముల మెరుపులు తగ్గిపోయి నిర్మల మైన ఆకాశము

 కనపడ జోచ్చింది .

 రాత్రుళ్ళు అంబరాన తెల్లని వెన్నెల పూతలతో కడు రమణీయంగా కనపడుతున్నది . .

.

సుగ్రీవుని సమీపించాడు హనుమంతుడు ...

.

ఇలా పలికాడు!

.

నీవు నీ రాజ్యాన్నీ రుమనీ తిరిగి సంపాదించుకున్నావు .

గొప్ప యశస్సు నీ స్వంతమైనది .

.

ఇక నీవు నీ మిత్రుల కార్యములు సాధించుటమీద దృష్టి నిలపవలె !

.

తగు సమయమును గుర్తించుచూ మిత్రుల విషయములో ఎల్లప్పుడూ బాగుగా ప్రవర్తించువాని రాజ్యము ,కీర్తి, ధనము వృద్ది పొందును .

.

రాజా ! ఏ రాజుకైతే స్నేహితులు ,సైన్యము,ధనాగారము,

ప్రభుత్వ శక్తీ ఈ నాలుగూ సమముగా ఉండునో అతనే గొప్ప రాజ్యమును తన స్వంతము చేసుకోనగలడు.

.

ఎవడు తన మిత్రుని కార్యమును సాధించుటకు ఉత్సాహము చూపడో అతడు సకల అనర్ధములను ఎదుర్కొనవలసి ఉండును!

17-18-గీతా మకరందము

 17-18-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - రాజసిక తపస్సును గూర్చి చెప్పుచున్నారు -


సత్కారమానపూజార్థం 

తపో దమ్భేన చైవ యత్ | 

క్రియతే తదిహ ప్రోక్తం 

రాజసం చలమ ధ్రువమ్ ||


తాత్పర్యము:- ఇతరులచే తాను సత్కరింపబడవలెనని, గౌరవింపబడవలెనని, పూజింపబడవలెనని డంబముతో మాత్రమే చేయబడు తపస్సు అస్థిరమై, అనిశ్చితమైనట్టి ఫలముగలది (లేక చపలమైనట్టి రూపముగలది) ఈ ప్రపంచమున రాజసిక తపస్సు అని చెప్పబడినది.


వ్యాఖ్య:- కొందఱు తమ తపస్సునుజూచి ఇతరులు తమ్ము సత్కరించెదరను భావముతో తపస్సుచేయ నారంభింతురు. అది సదుద్దేశ్యముతోను, హృదయపూర్వకముగను స్థిరమైయుండదు. దాని ఫలితమున్ను అట్లే చపలముగ, అనిశ్చితముగ నుండును. కావున విజ్ఞులిద్దాని ననుసరించరాదు.


ఒరసబ్5:- రాజసతపస్సు ఎట్టిది?

ఉత్తరము:- సత్కారమానపూజాదులకొఱకై డంబముతో చేయబడునది రాజసతపస్సనబడును. 

ప్రశ్న:- అది యెట్టి ఫలితము గలిగియుండును? ఎట్టి స్వరూపము గలిగియుండును?

ఉత్తరము:- అస్థిరమై అనిశ్చితమైనట్టి ఫలము గలిగియుండును. చంచల, అనిశ్చితస్వరూపము గలిగియుండును.

నేను* కథ

 ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన *నేను* కథ..


*భగద్గీత , వేదాంతం , మనకు బోధించేది ఏమిటి?*


*త్వమేవాహమ్‌*


కన్న తల్లి కడుపు లోంచి బయట పడి,

తొలి సారి ఊపిరి ని పీల్చిన క్షణం నుంచి, 

పుడమి తల్లి కడుపు లోకి చేరుకునేందుకు,

ఆఖరి సారి ఊపిరి ని విడిచి పెట్టడం దాకా సాగే ప్రస్థానం

 పేరే


 నేను = నేనే


ఈ నేను

ప్రాణ శక్తి అయిన "ఊపిరి" కి మారు పేరు.

ఊపిరి ఉన్నంత దాకా *నేను* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది.

జనన మరణాల మధ్య కాలం లో సాగే జీవన స్రవంతి లో 

ఈ *నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. 

మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.

ఈ *నేను* లోంచే *నాది* అనే భావన పుడుతుంది.


ఈ *నాది* లోంచి  


1.నా వాళ్ళు, 

2.నా భార్య, 

3.నా పిల్లలు, 

4.నా కుటుంబం, 

5.నా ఆస్తి, 

6.నా ప్రతిభ, 

7.నా ప్రజ్ఞ, 

8.నా గొప్ప... 


అనేవి పుట్టు కొచ్చి 

చివరికి 

ఈ *నేను* అనే భావన

భూ మండలాన్ని కూడా మించి పోయి,

ఆకాశపు సరిహద్దు ను కూడా దాటి పోయి, 

నిలువెత్తు విశ్వ రూపాన్ని దాల్చి 


*అహం* గా ప్రజ్వరిల్లుతుంది.


*అహం* అనే మాయ పొర కమ్మేసిన స్థితి లో 


ఈ *నేను*  *నేనే సర్వాంతర్యామిని* 

అని విర్ర వీగుతుంది.

నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.


1. పంతాల తో 

2. పట్టింపుల తో, 

3. పగల తో

4. ప్రతీకారాల తో 


తన ప్రత్యర్థి ని సర్వ నాశనం చేయడానికీ సిద్ధ పడుతుంది.


1 .బాల్య, 

2.కౌమార, 

3.యౌవన, 

4.వార్ధక్య 

దశల దాకా విస్ఫు లింగ తేజం తో విజేత గా నిలిచిన

*నేను* అనే ప్రభ ఏదో ఒక నాడు మృత్యు స్పర్శ తో కుప్ప కూలి పోతుంది.

వంది మాగధులు ఎన్నో ప్రశంసలు చేసిన శరీరం కట్టె లా మిగులుతుంది.

సుందరీ మణులతో మదనోత్సవాలు జరుపు కొన్న దేహం నిస్తేజం గా పడి ఉంటుంది.

సుఖ భోగాల తో, అష్టైశ్వర్యాల తో తుల తూగిన *నేను* 

చుట్టూ చేరిన బంధు మిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువు గా మారుతుంది.

కడసారి చూపుల కోసం, 

కొన్ని ఘడియల పాటు ఆపి ఉంచిన విగత జీవి కి అంతిమ యాత్ర మొదలవుతుంది.

మరు భూమి లో చితి మంటల మధ్యే సర్వ బంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

మొలకు చుట్టిన ఖరీదైన కౌపీనం తో సహా, మొత్తం గా కాలి బూడిద అవుతుంది.


*1.నేనే* శాసన కర్తను, 


 *2.నేనే* ఈ భూమండలానికి అధిపతిని, 


*3.నేనే* జగజ్జేతను... 

అని మహోన్నతం గా భావించిన


 *నేను* 


లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. 

రోజు మారుతుంది.


*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన నేను* కథ 

అలా సమాప్త మవుతుంది.

అందుకే ఊపిరి ఆగక ముందే 


*నేను* 


గురించి తెలుసు కో అంటుంది భగవద్గీత.

చితి మంటలను చూస్తున్నప్పుడు కలిగేది,

శ్మశాన వైరాగ్యం మాత్రమే. 

అది శాశ్వతం కానే కాదు.


నేను గురించిన సంపూర్ణ మైన అవగాహన తో ఉన్నప్పుడే,

పరిపూర్ణమైన 'వైరాగ్య స్థితి' సాధ్యమవుతుంది.

వైరాగ్యం = (అంటే) అన్నీ వదిలేసు కోవడం కానే కాదు. 

దేని మీదా మోహాన్ని కలిగి ఉండక పోవడం.

తామరాకు మీద నీటి బొట్టు లా జీవించ గలగడం.

స్వర్గ నరకాలు ఎక్కడో లేవు. 

మన లోనే ఉన్నాయి.

మనిషి కి, ఆత్మ దృష్టి నశించి బాహ్య దృష్టి తో జీవించడమే (అంటే) = నరకం

అంతర్ముఖుడై నిత్య సత్య మైన ఆత్మ దృష్టి ని పొందగలగడం (అంటే) = స్వర్గం.


ఈ జీవన సత్యాన్ని తెలియ చేసేదే వేదాంతం.


1. నిజాయతీ గా,

2. నిస్వార్థం గా, 

3.సద్వర్తన తో,

4. సచ్ఛీలత తో 

5.భగవత్‌ ధ్యానం 

తో జీవించ మనేదే

*వేదాంతసారం*.


*అహం బ్రహ్మాస్మి* (అంటే) =

*అన్నీ నేనే*.

అనే స్థితి నుంచి

*త్వమేవాహమ్‌* (అంటే) = *నువ్వే నేను* 

అని 

భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకో గల తాదాత్మ్య స్థితి ని చేరుకో గలిగితేనే


*మానవ జన్మకు సార్థకత*


🙏సర్వే జనా సుఖినోభవంతు🙏

సందేశము

 *🧘‍♂️మాస్టర్ ఇ.కె. గారి సందేశము🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩


  *రామకృష్ణ పరమహంసకి గొంతులో కేన్సరు వచ్చిందట, రమణమహర్షికి కూడా కేన్సరు వచ్చిందట పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంగా పీడిస్తుందని కొందరు చెబుతారు. మరికొందరు రామకృష్ణ పరమహంసనీ, రమణమహర్షిని అవతార మూర్తులు అంటారు. ఇదంతా గందర గోళంగా ఉంది. ఇలాంటి విషయాలను గూర్చి ఏమని అర్థం చేసుకోవాలి?*



*వ్యాధులు, బాధలు గలవారు సిద్ధపురుషుల దర్శన, స్పర్శన సాన్నిధ్యములు అనుభవించుట వల్ల వీలైనంత వరకు తొలగిపోవటం లోకానుభవసిద్ధమే. అలా వారికి తొలగినపుడు అవి ఆ సిద్ధ పురుషులకి సంక్రమిస్తాయి అన్నది కూడా వాస్తవమే. కాని ఇది సిద్ధ పురుషులందరి యెడల సత్యం కాదు. వారు వారు సాధించిన మార్గంలోని సంకల్పాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క యోగసిద్ధుడు రోగార్తులను ఆశీర్వదిస్తూ అది తాను స్వీకరిస్తున్నాను అని నమ్ముతాడు. ఇలా నమ్మటం అతనిలో మిగిలి ఉన్న అహంకారాన్ని సూచిస్తుంది. మరియొక సిద్ధపురుషుడు తనలో ఉన్న పరమాత్మ నామం వల్ల రోగార్తుల బాధలు తొలగిస్తాడు. అట్టి వానికి ఏమీ అంటవు‌. కనుక సంక్రమించవు. శ్రీ చంద్రశేఖరసరస్వతి స్వామి,ఆనందమయి మా... లాంటివారు   మున్నగువారు ఈ తరగతివారు.*

 


*పై రెండు తరగతులలో మొదటి తరగతి వారు బట్టలు ఉతికి ఆ నీళ్ళు ఒక తొట్టిలోనికి పట్టినట్లు చేస్తారు. మరొక తరగతివారు విద్యుత్ ప్రసారాన్ని రాగి తీగెలు ప్రసరింపచేసినట్లు చేస్తారు. మొదటి తరగతి వారి సంకల్పం వల్ల బాధలు వారికి సంక్రమిస్తాయి. రెండవ తరగతి వారి సంకల్పం వల్ల తమలో నుండి ప్రవహించి సూర్యరశ్మి ద్వారా అంతర్యామిలోనికి అంతరిస్తాయి. కాబట్టి ఆయా సాధన మార్గాలను అనుసరించి సిద్ధులకు వ్యాధులు సంక్రమించటం, సంక్రమించకపోవటం ఉంటుంది.*

 


*ఇన్ని చెప్పినా అప్పటి మానవజాతి యొక్క దుష్ఫలితాలు మాత్రం ఏ సిద్ధపురుషుని మీదుగాను వెళ్ళక తప్పదు. వాటి పరిణామాలే జీససు సిలువ వేయబడటము, కృష్ణుడు బాణంతో కొట్టబడటం, గాంధీ పిస్టలుతో పేల్చబడటం మొదలైనవి. ఈ తరగతికి చెందినవే రామకృష్ణ పరమహంస, రమణమహర్షి కేన్సరు మొదలైనవి.*



*గర్భిణియైన స్ర్తీకి తన గర్భంలో భాగాలే శిశువు రక్షణకి మావి, పొరలుగా ఏర్పడుతాయి‌. కాని అది అనారోగ్యకరమైన శిశువైతే తల్లి శరీరంలో పెరిగిన భాగాలే సెప్టిక్ విష సంక్రమణం మొదలైనవి జరిగి‌ తల్లి శరీరానికి విపత్కరంగా పరిణమిస్తాయి. ఈ‌ విధంగా నాలుగు ప్రక్కల‌ కలిసి సమన్వయించుకుంటేనే గాని‌ పెద్దల జీవితాలను గురించిన రహస్యాలు సవ్యంగా బోధపడవు. ఇంతకీ సత్యం అనేది నిదానించి చూచిన వాడి సొత్తు.*


🕉🌞🌏🌙🌟🚩

దీపావళీ పండగ గురించి

 దీపావళీ పండగ గురించి 

శ్రీ బ్రహ్మ శ్రీ చాగంటి కోటశ్వరరావు గారు వ్యాసం. 



 దీపావళి పండగ ప్రత్యేకముగా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒకటి అలక్ష్మీ పరిహారము, రెండు జీవోన్నతి. 


దరిద్రముతో బాధపడుతున్నవాళ్ళు, కలిసిరాని వాళ్ళు, దుఃఖిస్తున్నవాళ్ళు  దీపావళి పండగనాడు చెయ్యవలసిన విధిని సక్రమముగా పాటిస్తే  లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లోనుండి అలక్ష్మి వెళ్ళిపోతుంది. దరిద్రముతో బాధపడుతున్నవాళ్ళని వాళ్ల పాపాన్ని తీసేసి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించడం కోసం దీపావళి తిధి వచ్చింది.


జీవోన్నతి అంటే మనం ఈశ్వరుడు ఎలా బ్రతకద్దని చెప్పాడో అలాంటి పనులు ప్రతీరోజూ చాలా చేస్తుంటాము. ఈశ్వరుడు  ఎలా బ్రతకమన్నాడో ఆ పనులు చాలా తక్కువ చేస్తాము అప్పుడు అవి పాపములు.  ఉదాహరణకి సూర్యోదయమునకు ముందు నిద్రలేవాలి,  లేవట్లేదు,అసుర సంధ్య వేళ పడుకోకూడదు. పడుకుంటున్నాము. ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లు తాళం వేసి ఎక్కడకీ వెళ్ళకూడదు.  తాళం పెట్టి ఊళ్ళు వెళ్ళడము వలన  ఇంట్లో ఈశ్వరుడికి  నైవేద్యం  లేదు. ఇవన్నీ దోషములు.  మరి ఈ దోషాలన్నీ ఎలా పోతాయి?పాపాలు  పోగొట్టుకుని నరకభయాన్ని దూరం చేసుకోవడానికి ఉపయోగపడేది దీపావళి నాటి అమావాస్య తిధి.


 పాపం నుండి విముక్తి చేస్తుంది అంటే ప్రతీ ఏడాదీ తప్పులు చేసేసి దీపావళి చెయ్యమని కాదు. సాధ్యమయినంత తగ్గిస్తూ మన చేతిలో లేక జరిగిపోయింది అనుకున్న దానికి పరిహారం కోసం కనీసములో కనీసం దీపావళి పండగ జాగ్రత్తగా చేసుకోవాలి.

దీపావళి పండగనాడు అలక్ష్మి పోవాలి, జీవోన్నతి జరగాలి అంటే ఏమి చెయ్యాలి? 


దీపావళి స్నాన విధి:


తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిధౌ వశేత్. అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే 


అని శ్లోకం చెప్తూ దీపావళి అమావాస్య రోజు తెల్లవారుఝామున స్నానం చెయ్యాలి.


తైలే లక్ష్మీ ఆ ఒక్కరోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నూనెలో లక్ష్మి ఉండదసలు కానీ ఆ ఒక్క తిధినాడు  నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.

ఇంతకీ స్నానం అసలు ఎప్పుడు చెయ్యాలి?

ఇంకా ఒక ఝాము తెల్లవారడానికి ఉందనగా అంటే తెల్లవారుఝామున నాలుగూ, నాలుగున్నర మధ్యలో లేచి ఒంటికి, తల మీద నువ్వుల  నూనె రాసుకుని పైన చెప్పిన శ్లోకం చెప్తూ స్నానం చెయ్యాలి. స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అలక్ష్మి పోతుంది. మరి పాపం ఎలా పోతుంది?పాపము గంగా స్నానము చేత పోతుంది


 అందరము ప్రతిరోజు గంగాస్నానం చెయ్యలేము కానీ పరమేశ్వరుడు మినహాయింపుని ఇచ్చాడు. దీపావళి అమావాస్య తెల్లవారడానికి ఇంకా ఒక్క ఝాము ఉన్నదనగా ఎక్కడ తటాకము కానీ, నుయ్యి కానీ ఉన్నచోట,  ఇంకా చెప్పాలంటే నీరు ఉంటే అక్కడ ఆ ఒక్క రోజు ఒక్క తెల్లవారు ఝామునందు మాత్రమే,  ఒక్కసారే  గంగ ప్రవేశిస్తుంది.


ఒకవేళ  దరిద్రముతో బాధపడుతు అనుకున్నది ఏదీ కలిసిరావట్లేదు చాలా బాధలో ఉన్నామని అనుకుని నివారణకు ఒక మార్గం దొరకాలి అంటే ఇలా స్నానం చెయ్యాలి.


దక్షిణాయణ పుణ్య కాలములో కాశీ వెళ్ళకుండా గంగా స్నానం సంకల్ప సహితముగా చెయ్యడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి తిధి ఒక్క దీపావళి అమావాస్య మాత్రమే. 


గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు 


అని ఏమీ మంత్రం చెప్పకపోయినా దీపావళి అమావాస్య రోజు తెల్లవారుఝామున స్నానం చేస్తే గంగా స్నానం చేసిన  ఫలితం  ఖాతాలో వేస్తారు. గంగా స్నానం చేస్తే ఏమి అవుతుంది?  


పరమేశ్వరుడి  శరీరాన్ని తగిలి భూమి మీదకి వచ్చినటువంటి గంగలో మునక వేసినా, నాలుక మీద వేసుకున్నా, స్నానం చేసినా లేదా  "గంగ,గంగ,గంగ" అని మూడు మాట్లు అన్నా కానీ ఆఖరికి కాశీలో చాలా కాలం ఉండి గంగా స్నానం చేసి చనిపోయే వేళకి కాశీలో లేకుండా చనిపోయినా కాశీలో చనిపోయారన్న  ఫలితం వేస్తారు.


దీపావళి అమావాస్య నాడు జీవుడు అభ్యున్నతిని ఎలా పొందాలి?


జీవుడికి అభ్యున్నతి అంటే? మనలో ఉన్న జీవుడు వచ్చే జన్మలోకూడా వేరొక శరీరములోకి వెడతాడు ఆ జీవుడు. అక్కడ పాపం లేని కారణం చేత చక్కగా సంతోషముగా హాయిగా బ్రతకగలగాలి అంటే గంగా స్నానం చెయ్యాలి. ఆ గంగా స్నానాన్ని  గుమ్మం కదలకుండా చెయ్యగలిగిన అవకాశం ఒక్క దీపావళి అమవాస్య నాడే. 


  యధార్ధముగా చెప్పాలంటే  నరకద్వారము చూస్తామేమో అన్న భయం లేనివారు  ఎవరూ  ఉండరు. అందరికీ ఉంటుంది.ఆ భయం పోగొట్టడానికీ, ప్రశాంతమైన స్థితిలో ఈశ్వరసేవకులు వచ్చి అంత్యకాలములో  తీసుకెళ్ళేటట్లు అనుగ్రహం పొందాలి అంటే దానికి ఒక్క దీపావళి అమావాస్య నాడే అవకాశం. అందుకే అమావాస్య నైమిత్తిక తిధి, అమావాస్య పితృ తిధి, అమావాస్య అటు దైవ శక్తితో ఇటు పితృ దేవతా తిధితో కలిసి శక్తి పొందిన ఒకే ఒక అమావాస్య దీపావళి అమావాస్య.


ఇన్ని లక్షణాలు ఉంటాయి  దీపావళి అమావాస్యలో.


"నేను దేహం విడిచిపెట్టేసినప్పుడు నాకు యమ భటులు కనపడకూడదు. ఈశ్వర భటులు   కనపడాలి" అనే కోరిక ఉన్నవాళ్ళు దీపావళి అమావాస్య రోజున స్నానం చేసినప్పుడు ఏమి చెయ్యాలి?. 


ఒంటికి నూనె రాసుకోవడం ఒకటే కాకుండా చెయ్యవలసినది ఇంకొక విధి, ఉత్తరేణి చెట్టు తెచ్చుకుని చుట్టూ త్రిప్పుకుని స్నానం చెయ్యడం. ఆ చెట్టుని ఏదో  అలా వేళ్ళతో ఉన్నదానిని తీసుకొచ్చి కడిగేసి ఓ కొమ్మ తెచ్చుకుని స్నానం చెయ్యకూడదు.


ఉత్తరేణి చెట్టుని పైకి తీసినప్పుడు మట్టి పెళ్ళలతో సహా ఆ చెట్టు పైకి లేవాలి. అంటే  మొక్కని పైకి పీకితే మట్టి బెడ్డలతో ఉండేటట్లుగ పైకి తీయాలి. అంటే బాగా నీళ్ళు పోసి పైకి తీస్తే అది మట్టితోటి పైకి వస్తుంది. అలా మట్టితోటే తెచ్చుకోవాలి. మట్టితోటే తెచ్చుకుని, స్నానం చేసేటప్పుడు ఆ ఉత్తరేణి చెట్టుని తనకు తానే త్రిప్పుకోవాలి. ఎవరో త్రిప్పరు దృష్టి దోష పరిహారార్ధం తనకి తానే త్రిప్పుకోవాలి. ఆ త్రిప్పుకునేటప్పుడు మాత్రం ఒక శ్లోకం చెప్పాలి


శీతలోష్ఠ  సమాయుక్తా సకంటక దళాన్వితా

హరపాపం అపామార్గ భ్రామ్యమానః పునః పునః 

అని చెప్పాలి.


ఒక్కమారు త్రిప్పుకోకూడదు. కనీసములో కనీసం మూడు మార్లు త్రిప్పాలి. ఆ చెట్టుని పట్టుకుని తలచుట్టూ త్రిప్పుకుని ఈ శ్లోకం చెప్పాలి


ఈశ్వరా! ఇదిగో ఉత్తరేణి చెట్టుని తెచ్చాను. శీతలోష్ఠ సమాయుక్తా అంటే మట్టిపెళ్ళలతో ఉన్నటువంటి ఈ ఉత్తరేణి చెట్టుని తెచ్చాను. ఇది  

సకంటక దళాన్వితా ఇది చిన్న చిన్న ముళ్ళతోటీ ఆకులతోటీ ఉన్నది. అటువంటి ఈ చెట్టు  


హరపాపం ఇది నా పాపములను అన్నింటినీ కూడా పోగొడుతుంది

అపామార్గ-ఓ ఉత్తరేణి చెట్టు

భ్రామ్యమానః పునః పునః-నేను మళ్ళీ మళ్ళీ త్రిప్పుకుంటున్నాను ఈ చెట్టుని అని  ఉత్తరేణి చెట్టు నాలుగైదు మార్లు తల చుట్టూ త్రిప్పుకుని ప్రక్కకి పారేసి ఆరోజు నిర్భయముగా దక్షిణ దిక్కుకి తిరగాలి.


దక్షిణ దిక్కుకి తిరిగి యగ్నోపవీతం ఉన్నవాళ్లయితే యమధర్మరాజు గారికి తర్పణ ఇస్తారు ఆరోజున -యమాం తర్పయామి-యమాం తర్పయామి-యమాం తర్పయామి- అంటూ యముడికి తర్పణ ఇవ్వాలి. కనీసములో కనీసం యముడికి తర్పణ ఇవ్వకపోతే యమధర్మరాజు గారి మీద ఒక స్తోత్రం ఉన్నది అది ఒక్క దీపావళి  అమావాస్య రోజే చదవాలి. పోనీ ఆ నామాలు అవీ రాసుకోవడం,  చదవడం భయం అంటే కనీసములో కనీసం ఈ ఉత్తరేణి చెట్టు తిప్పేసి స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి "ఓ యమ ధర్మరాజా! నీకు నమస్కారం" అని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకి తిరిగి స్నానం చెయ్యాలి.


స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టలు మీదనే స్నాన చెయ్యాలి. దిగంబరముగా చేస్తే ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. అందుకని దిగంబరముగా చెయ్యకూడదు. చిన్న తువ్వాలో ఏదో కట్టుకుని చెయ్యాలి.


ఇలా దీపావళి అమావాస్యని ఎవరు చేస్తారో వాళ్ళకి జీవోన్నతి, లక్ష్మీ కటాక్షము కలిగి, అంత్యకాలములో  ఈశ్వర భటులు  తీసుకెళ్ళేటట్లుగా, మరణించాక నరకద్వార దర్శనము లేకుండా  భగవంతుడు అనుగ్రహిస్తాడు.

స్వస్తి🙏🙏🙏🙏

కాలభైరవుడు ఎవరు

 కాలభైరవుడు ఎవరు? శివాలయం బయట ఎందుకు ఉంటాడు?


కాలభైరవుడిని పరమేశ్వరుడి పరిపూర్ణ అవతారంగా భావిస్తారు. బ్రహ్మవిష్ణువులను ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన ఆ మహాశక్తిమంతుడు... దుష్టశిక్షకుడిగా, గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు.


భైరవః పూర్ణ రూపోహి శంకరస్యపరాత్మనః 

మూఢాస్తంవై నజానంతి మోహితాశ్శివమాయయా 

...అంటుంది శతరుద్రసంహితం. శివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి. భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు. పక్కనే కాలభైరవక్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో మనం పట్టించుకోం. లోపలికెళ్లాలన్న ఆలోచనా రాదు. అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు. పరమశివుడు మనల్ని ఓరకమైన మాయాలో పడేస్తాడట. దీంతో... కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయాపొర తొలగిననాడు... పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కట్టెదుట దర్శనమిస్తాడు. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైంది. భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.


ఎవరీ కాలభైరవుడు... 

శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు కూడా ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు. అంతలోనే...సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను సృష్టించాడు పరమేశ్వరుడు. దీంతో, మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది. ‘పిచ్చి మహర్షులూ! పరమతత్వం గురించి చెప్పేదేముంది? నేనే ఆ మహాతత్వాన్ని. స్వయంభువును నేను. విధాతను నేను. సృష్టిస్థితిలయ కారకుడినీ నేను. మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే..’ అంటూ ప్రగల్బాలు పలికాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి. మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయాపొర కమ్మేసింది. ‘కాదుకాదు...నేనే గొప్ప’ అంటూ వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికెళ్లారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి ‘యదంతస్థ్సాని భూతాని యత్సర్వం ప్రవర్తరే...’ - సకల ప్రాణుల్నీ తనలో లీనం చేసుకున్నవాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషుడు పరమేశ్వరుడిని కొనియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని నిర్ధారించింది. అంతలోనే...దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు.


ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహంతో వూగిపోయాడు. భృకుటి ముడిపడింది. అందులోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు. అతడే కాలభైరవుడు. భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించేవాడిగా ‘పాపభక్షు’ అయ్యాడు. కాలభైరవుడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. శివుడి ఆదేశాన్ని అనుసరించి ...తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికేశాడు కాలభైరవుడు. కానీ, ఆ తల కిందపడిపోకుండా భైరవుడి చేతికి అంటుకుపోయింది. అంతలోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు. దీంతో, నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో కాలుపెట్టగానే, మహాద్భుతం జరిగినట్టు...కపాలం వూడిపడింది. దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే ‘కపాలమోచన’ దివ్యతీర్థంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. స్థానికులు ‘లాట్‌ భైరవ’ అని పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. కార్తికమాసంలోని కృష్ణపక్ష అష్టమినే...కాలాష్టమిగా, కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించుకునే వారూ ఉన్నారు. ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు.


పరమశివుడి ఆదేశం ప్రకారం...కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి. ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా క్షేత్ర పాలకుడిని సందర్శించుకోవడం ఆచారం. ఇక్కడ అష్టభైరవుల ఆలయాలున్నాయి. విశ్వనాథుడి ఆలయానికి కొద్దిదూరంలో కాలభైరవమూర్తి దర్శనమిస్తాడు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిచడం ఈ క్షేత్ర ప్రత్యేకత. మణికర్ణికాఘాట్‌ ప్రాంతంలో కాలభైరవుడిని మశాన్‌ (శ్మశాన)బాబాగా కొలుస్తారు. ఉజ్జయినిలో వెలసిన కాలభైరవుడు కూడా మహాశక్తిమంతుడని భక్తుల విశ్వాసం. దిల్లీ నగరంలోనూ కాలభైరవ క్షేత్రం ఒకటుంది. అసితాంగ భైరవుడూ, రురు భైరవుడూ, చండ భైరవుడూ, క్రోధ భైరవుడూ, ఉన్మత్త భైరవుడూ, కపాల భైరవుడూ, భీషణడూ, సంహార భైరవుడూ... ఇలా ఎన్నో రూపాల్ని ధరించాడు కాలభైరవుడు. ఒక్కో రూపాన్ని ఉపాసిస్తే, మనలోని ఒక్కో దుర్గుణం తొలగిపోతుందని సాధకులు చెబుతారు.

అరణ్యపర్వము – 25

 అరణ్యపర్వము – 25

సరస్వతీ గీత


బ్రాహ్మణ క్షత్రియ స్వరూపములు


ఆ తరువాత మార్కండేయుడు ” ధర్మజా! నీకు బ్రాహణ క్షత్రియ స్వరూపాలను గురించి చెప్తాను విను అని చెప్ప సాగాడు. పూర్వం అత్రి మహర్షి తపస్సు చేసు కోవడానికి అడవికి పోతూ భార్యను పిలిచి ” నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను. నీవు నీ పుత్రుల వద్ద ఉంటావా? నాతో వస్తావా? ” అని అడిగాడు. అందుకు ఆమె ” నాధా! పుత్రుల పోషణకు తగిన ఏర్పాటు చేయకుండా మీరు వెళ్ళడం ధర్మం కారు. కనుక మీరు వైన్యమహారాజును అడిగి కొంత ధనం తీసుకు రండి ” అన్నది. అది విని అత్రి వైన్యమహారాజు దగ్గరికి వెళ్ళి దగ్గరకు వెళ్ళాడు. ఆసమయంలో వైన్యమహారాజు అశ్వమేధయాగం చేసి బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తున్నాడు. అత్రి ఆయన దగ్గరకు వెళ్ళి ” రాజా ! నీవు బ్రహ్మదేవునితో సమానుడవు. ఇంద్రునితో సమానుడవు. నీవు సమస్త జనులకు ఈశ్వరుడవు. నీకు అన్ని ధర్మములు తెలియును. నీతో సమానమైన రాజు ఈ భీమి మీద లేడు. అందరూ ఋషులు నిన్ను పొగుడుతారు ” అన్నాడు. అక్కడే ఉన్న గౌతమ మహర్షి ఇది విని ఆగ్రహించి ” కేవలం ధనం కోసం జంకు లేకుండా మానవమాతృడైన రాజును ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు అని పొగడటం తగునా? ” అని అన్నాడు. అత్రి ” ఏది యుక్తము ఏది యుక్తము కాదు అని తెలియకుండా మాట్లాడ వద్దు. నీతివంతుడై, పరాక్రమ వంతుడై, నిర్మలుడై సమస్త లోకాన్ని పాలించే రాజు ధర్మానికి మూలం అటువంటి రాజును ప్రశంసించడం నాకు తగదా? ” అని బదులు చెప్పాడు. గౌతముడు ” కేశములు తెల్లబడినంత మాత్రాన నీవు జ్ఞానివి కాదు. సభలో జ్ఞానవృద్ధులకు మాత్రమే విలువ కదా ” అన్నాడు. అత్రి గౌతముల వాదన విన్న కశ్యపుడు అనే మహాముని విని ” అయ్యా ! ఈ వివాధం మనం తీర్చలేము. సనత్కుమారుడు అనే మహామునిని అడుగుదాము ” అన్నాడు.


సనత్కుమారుని తీర్పు


తరువాత అందరూ సనత్కుమారుని దగ్గరకు పోయి అత్రి గౌతముల వాదన వివరించారు. సనత్కుమారుడు ” అత్రి నిజమే చెప్పాడు. ఈ భూమి సమస్తము తన భుజస్కందాల మీద మోసే సుక్షత్రియుడు అందరిని కాపాడే ప్రభువు. కనుక శత్రువులను సంహరించి అందరిని కాపాడే రాజే ఈశ్వరుడు, బ్రహ్మ. రాజు జనులందరికి పూజ్యుడు. అతని రక్షణలో సజ్జనులు, మునులు తమ తమ విధులు చక్కగా నెరవేర్చగలరు. అందరూ అతని ఆజ్ఞాబద్ధులే. రాజే సామ్రాట్టు, విరాట్టు అదృష్టాన్ని జయించిన వాడు. సత్యసంధుడు, ధర్మాత్ముడు, సక్రమంగా పాలించేవాడు అని వేదాలలో వర్ణించారు. పూర్వం అధర్మమునకు భయపడి బ్రాహ్మణులు తమ తేజస్సును రాజులయందు నిక్షేపించారు. అప్పటి నుండి బ్రాహ్మణ్యం వలన క్షాత్రం ప్రవర్తిసుంటుంది. కనుక బ్రాహ్మణ్యము క్షాత్రము ఒక దానిని ఒకటి ఆశ్రయించుకుని ఉన్నాయి. సూర్యుడు చీకటిని తరిమినట్లు క్షత్రియుడు బ్రాహ్మణులను సేవించి తేజోవంతుడై అధర్మాన్ని అణచి ధర్మాన్ని నిలబెడతాడు కనుక క్షత్రియుడు అధికం అని చెప్పవచ్చు ” అన్నాడు. అప్పుడు వైన్యమహారాజు అత్రికి కావలసినంత ధనం ఇచ్చాడు.


సరస్వతీ గీత


ఆ తరువాత మార్కండేయ మహర్షి ” సరస్వతి గీత గురించి చెప్పడం ప్రారంభించాడు. పూర్వం తార్క్ష్యుడు అనే మహాముని సరస్వతీ దేవిని ఆరాధించాడు. సరస్వతీ దేవి ప్రత్యక్షంకాగానే తార్క్ష్యుడు ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు ” అమ్మా! మానవుడు ఆచరించ వలసిన ధర్మం ఏది? మానవుడు ఏవిధంగా పుణ్యాత్ముడై పుణ్య లోకాలకు వెళతాడు? ” అని అడిగాడు. సరస్వతీదేవి ఈ విధంగా జవాబిచ్చింది. ” ఎన్నో వేదములు చదివిన బ్రాహ్మణుడు ఎన్నో యజ్ఞాలు చేసి పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళతాడు. మంచి పాలు ఇచ్చే ఆవును దానంగా ఇచ్చే బ్రాహ్మణుడు కూడా స్వర్గానికి పోతాడు. ఆవు శరీరం పై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. మంచి కోడె ఎద్దును దానం చేసిన వాడికి పది ఆవులను దానము చేసిన పుణ్యం లభిస్తుంది. వస్త్రదానం చేసిన వాడు చంద్రలోకం పోతాడు. బంగారం దానం చేసిన వాడు స్వర్గలోకం చేరతాడు. ఏడు సంవత్సరాలు అగ్నిదేవుని నేతితో ప్రీతిగా హోమం చేసిన వాడు తన పదునాలుగు తరాల పితృ దేవతలతో స్వర్గానికి పోతాడు. ఎల్లప్పుడూ శుచిగా ఉంటూ నిరంతరం అగ్ని హోత్రం చేసిన వాడు గోలోకం చేరతాడు. ఎందుకంటే అగ్నిహోత్రం నా స్వరూపం. సకల యజ్ఞ సంభారాలు నాకు సంభందించినవే. నేను అగ్నిహోత్రం ముఖంనుండి పుట్టాను. నేను విద్వాంశులందరి సందేహం తీర్చగలను. ఎల్లప్పుడూ వేదం చదువుతూ దాన ధర్మములు చేయు తపోధనులు శోకము అనేది తెలియకుండా ఎక్కడ నివసిస్తారో నేను అక్కడ నివసిస్తాను. యగ్న యాగాదులు చేసిన పుణ్యాత్ములు మరణానంతరం నా లోకానికి చేరగలరు ” అని సరస్వతి చెప్పింది ” ధర్మరాజుకు చెప్పాడు.

రామాయణమ్ 213

 రామాయణమ్ 213

................

రామ బాణము చేత కొట్టబడి నేలబడియున్న భర్తను చూడగానే దుఃఖము వెల్లువలా పొంగుకుంటూ వచ్చి ఆర్యపుత్రా అంటూ అరుస్తూ 

వాలి మీదబడి కౌగలించుకుంది తార .

.

ఆ స్పర్శకు మెల్లగా కళ్ళు విప్పాడు వాలి .

.

ఏల నన్ను పలుకరింపవు?

.

 తారా !అంటూ ఏల దగ్గరకు తీసుకొనవు?

.

 మెత్తటి పట్టుపరుపులమీద పవ్వళించు నా స్వామీ నీకు ఇట్టి కఠినశిలలె పానుపుగా అమరినవా ప్రభూ !

నాకన్నా నీకు భూమియే గొప్ప ప్రియురాలైనదా ? 

.

ఎంత కఠినమైనది నా హృదయము నేల మీద పడియున్న నిన్ను చూసికూడా వేయి వ్రక్కలు కాలేదు ! 

.

సుగ్రీవుని భార్యను అపహరించి అతనిని రాజ్యమునుండి వెడలగోట్టినావు. 

నేను చెప్పిన హిత వచనములు చేవికేక్కించుకొనకపోతివి కదా !

కడకు ఈ దురవస్థ నీకు ప్రాప్తించినది గదా !

.

నాయనా అంగదా! నీ తండ్రిని బాగుగా చూడుము ఇకపై ఆయన దర్శనము నీకు దొరకదు .

.

నాధా !

నీ కుమారుని ఓదార్చవయ్యా .

వాడి శిరస్సుమీద ఎప్పటివలెనే ముద్దుపెట్టుకోవయ్యా !

.

దీనముగా విలపిస్తున్న తారను సమీపించి హనుమంతుడు ఓదార్చసాగాడు.

.

బలహీనమైన ప్రాణముతో నెమ్మదిగా శ్వాస పీలుస్తున్న వాలి ,తన ఎదుట ఉన్న తమ్ముని చూసి .....

సుగ్రీవా ,నేను నీకు చేసిన దోషములను లెక్కచేయక ము ,

.

మనమిరువురము కలిసి సుఖపడటము విధాత రాయలేదు  కావుననే ఈ విధముగా జరిగినది .

.

నీవు ఇప్పుడే వానర రాజ్య పట్టాభిషిక్తుడవు కమ్ము ! 

ఒక్క మాట ! 

ఈ అంగదుడు సుకుమారుడు, వీడికి ఏ కష్టము కలుగ కుండా పెంచుకున్నాను. వీడికి ఏ లోపము రాకుండా చూసుకోగలవా?

 ,ఇది నా చివరి కోరిక ! 

.

సుగ్రీవా ! సుషేణుని కుమార్తె ఈమె ! చాలా సునిశితమైన ప్రజ్ఞకల ఈ తార అకస్మాత్తుగా వచ్చు ఉపద్రవముల విషయములలో ఎల్లప్పుడూ చేయవలసిన కర్తవ్యాన్ని గురించి చక్కగా బోధించగలదు.

గురి తప్పని బుద్ది కలది.

.

సుగ్రీవా ! రామ బాణము నీ ప్రాణము కూడా నిస్సందేహముగా హరించగలదు ,నీవుఆయన కిచ్చిన మాట నిలబెట్టుకోలేని పక్షములో !కావున ఆయన కార్యము నెరవేర్చుము.

.

ఇదుగో ఈ బంగరుమాలను తీసుకో ,ఇది సదా జయలక్ష్మినిచ్చే ప్రశస్తమైన మాల ,నేను మరణించకముందే తీసుకో ! 

.

అని సుగ్రీవునకు మాల ఇచ్చి అంగదునివైపునకు తిరిగి ,

నాయనా నీవు ఎట్లు ప్రవర్తించిననూ నేను నిన్ను సదాసర్వదా లాలించు చుంటిని .ఇప్పుడు నీవు మునుపటివలె ప్రవర్తించినచో చిన్నాన్న ఇష్టపడడు........


రామాయాణమ్ 214

................

నాయనా అంగదా !సుగ్రీవునితో స్నేహములేని వారితో గాని ,

అతని శత్రువులతోగానీ కలిసి 

తిరుగకుము,ప్రభువైన సుగ్రీవుని కార్యము నిర్వర్తించుటయందే 

నీ శక్తియుక్తులు ప్రదర్శించుము, అన్య విషయములలో వలదు. 

.

అతనికి ఎల్లప్పుడువశుడవైఉండుము .

.

నీవు ఎవరి విషయములలో ఎక్కువ ప్రేమ చూపవలదు ,అటులనే ఎక్కువ ద్వేషమూ వలదు రెండూ చెడ్డవే !అందుచేత నీవు మధ్యేమార్గ స్పష్ట దృష్టి అలవరుచుకొనుము.

.

ఈ మాటలు చెపుతూ చెపుతూ ఉన్నప్పుడు ఆయనకు బాణము గ్రుచ్చుకోనుటవలన కలిగిన వేదన అధికము కాజోచ్చెను.

.

 మాటలాడుచుండగనే కండ్లు తేలవేసి కోరలు వెళ్ళబెట్టి ప్రాణములు వదిలి వేశాడు మహాబలి వాలి.

.

ఒక్కసారిగా వానరలోకమంతా గొల్లుమన్నది.

.

వాలి శరీరమును కౌగలించుకోనుటకు తారకు బాణము  అడ్డము  వచ్చుట గమనించిన సుగ్రీవుడు నీలుని ఆ బాణము పెరికి వేయమనగా, నీలుడు రామబాణమును వాలి శరీరమునుండి బలముగా లాగి అవతల పారవైచెను .

.

బాణము తో పాటుగా వాలి శరీరమునుండి రుదధిరధారలు, 

అవి చూడగనే తార కంటి నుండి 

అశ్రుధారలు ఒకేసారి  పెల్లుబికి ప్రవహించాయి.

.

అన్న మరణానికి చింతిస్తూ సుగ్రీవుడు రామునితో ,రామా నా అన్న మరణించిన పిదప నాకు ఈ రాజ్య మెందులకు నేను కూడా అతనితోటే ఆ చితిలోనే ప్రవేశిచెదను .

.

ఓ రామా నాకు అనుమతి నీయవయ్యా!

.

 నేను లేక పోయిననూ నీ కార్యము మా వానర వీరులు నిర్వర్తించగలరు,

 రామా నాకు బ్రతుకు మీద ఆశ లేదు నేను  కూడా  చనిపోవుటకు అనుమతించుమా రాఘవా అని హృదయ విదారకముగా రోదిస్తున్న సుగ్రీవుని చూసి రాముని మనస్సులో క్షణకాలము విషాదము ఆవహించింది.

.

అంతట వానరులందరూ కలిసి భర్త శరీరము పై పడి ఏడుస్తున్న తారను బలవంతముగా అక్కడినుండి తొలగించగా ఆవిడ కాళ్ళూ చేతులూ విలవిలా కొట్టుకుంటూ ఆయననుండి దూరము కాలేక అక్కడనే యుండుటకు ప్రయత్నించసాగింది .

.

అప్పుడు అందరూ కలసి ఆవిడను అక్కడనుండి లేపినప్పుడు ఆవిడ ఒకసారి రాముని చూసింది ..

.

ఆ చూపులో ఎన్ని అర్ధాలొ!


రామాయణమ్ 215


పరుగు వంటి నడకతో రాముని సమీపించింది తార .

.

ఓ రామా ఊహించరాని రూపము నీది 

ఎదిరింపరాని వీరము నీది 

జితేన్ద్రియుడవీవు 

పరమ దార్మికుడవీవు 

ఓర్పున పృధివీ సముడవు 

నేర్పుగల వాడవు 

సామర్ధ్యమున్నవాడవు .

.

మహాబలశాలివై అందమైన రూపముతో గొప్ప ధనుస్సు ధరించి దివ్యదేహ వైశిష్ట్యముతో విరాజిల్లుతున్నవాడవు ! 

.

ఓ వీరుడా !

ఏది నా మగని చంపినా బాణము ? 

దానితోనే నన్ను కూడా చంపవయ్యా!  

నేను కూడా అతనునున్న చోటికే వేళ్ళగలదానను .

.

నేను లేక అతనక్కడ ఉండలేడయ్యా! 

స్వర్గములో ఇటుఅటుచూసి నేను కనబడక పోయినచో అప్సర స్త్రీలను కూడా దగ్గరకు రానీడయ్యా ఆయన !

.

సీత లేక నీవు ఎలా కృంగి కృశించి పోవుచున్నావో నేను కూడా వాలి లేక అంతే కృశించి పోయెదను !

.

విరహమన్న ఏమో నీకు బాగుగా తెలియును కదా!

.

 ఇంత సుందర ధరిత్రిలో ఈ పర్వత ప్రాంతమందు కూడా సీత పక్కన లేక నీవు బాధ పడుటలేదా?


 నాకెందుకయ్యా ఈ వియోగ వ్యధ !

నన్ను కూడాచంపివేయుమయ్యా ! 

.

భార్యా భర్తలిరువురూ ఒకటే శరీరము !

.

ఈ శరీరము కూడా వాలి శరీరములో భాగమేనయ్యా

 అందుకే నన్ను కూడా కడతేర్చుము !రామా

 నీకు స్త్రీ హత్యా దోషమంటదు రఘురామా !

.

రాముడు తార విలాపములన్నీ విన్నాడు . 

.

ఓ తారా నీవిటుల శోకించుట తగదు.

 ఇట్టి విపరీతపు ఆలోచనలు మానివేయుము 

ఈ లోకమునకు సృష్టి కర్త బ్రహ్మ!

సుఖదుఖములనూ ఆయనే ఏర్పరచినాడు ,

నీవు పూర్వపు ఆనందమునే మరల పొందగలవు ,

నీ కుమారుడు యౌవరాజ్య పట్టాభిషిక్తుడు కాగలడు.

శూరుల భార్యలు ఇట్లు విలపించరు. 

అని అనేక విధములుగా ఓదార్చినాడు శ్రీరామచంద్రుడు .

17-17-గీతా మకరందము

 17-17-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇంతదనుక శారీరక, వాచిక, మానసిక తపస్సులనుగూర్చి చెప్పి, ఇక సాత్త్విక, రాజసిక, తామసిక తపస్సులను వివరించుచున్నారు -


శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః | 

అఫలాకాంక్షిభిర్యుక్తైః  

సాత్త్వికం పరిచక్షతే || 


తాత్పర్యము:- ఫలాపేక్షలేనివారును, నిశ్చలచిత్తులును (లేక, దైవభావనాయుక్తులును) అగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ (పైనదెలిపిన శారీరక, వాచిక, మానసికములను) మూడు విధములైన తపస్సును సాత్త్వికమని (సాత్త్వికతపస్సని) (పెద్దలు) చెప్పుచున్నారు.


వ్యాఖ్య: - "శ్రద్ధయా” అను పదమునకు "పరయా” అను విశేషణమును చేర్చుట వలన సామాన్యశ్రద్ధ చాలదనియు, మిక్కుటమైన శ్రద్ధ, లేక ఉత్తమమైన శ్రద్ధ అవసరమని విదితమగుచున్నది. ఏలయనగా సాధకునకు మధ్యమధ్య ఏవైన అంతరాయములు గలిగినచో అల్పమగు శ్రద్ధ చలించిపోవచ్చును. అందుచే అపరిమితమగు శ్రద్ధతో, విశ్వాసముతో, పట్టుదలతో గూడుకొనియున్నప్పుడు మాత్రమే మాయను దాటవీలగును.


"నరైః” - ఇచట నరులు అని చెప్పబడినదే కాని జాతిమతకులాదు లెవ్వియు పేర్కొన బడలేదు. కావున మానవులందఱును పరమార్థలక్ష్యమును సాధించుటకు, భగవంతుని అన్వేషించుటకు అర్హులేయని గీతాచార్యులు తేల్చిచెప్పివైచిరి.


“యుక్తైః” - భగవంతునితో, ఆత్మతత్త్వముతో, పరమార్థసాధనతో కూడిక (యోగము) కలవారు, ప్రాపంచికదృశ్యజాలముతో కూడిక తగ్గించుకొని, భగవద్ధ్యానపరులై యుండువారు, నిశ్చలచిత్తులు యుక్తులనబడుదురు.


దీనినిబట్టి సాత్త్వికతపస్సు నాచరించువారు మూడు సద్గుణములు గలిగియుండవలెనని తేలుచున్నది. అవి యేవియనిన - (1) వారు పరమ శ్రద్ధతో గూడియండవలెను (2) ఫలమును గోరక కర్మలనుచేయవలెను (3) నిశ్చలచిత్తము, లేక భగవద్ధ్యానపరులై గలిగియుండవలెను - ఇట్టి ఉత్తమ స్వభావములు గలిగి పైనదెల్పిన త్రివిధ (శారీరక, వాచిక, మానసిక) తపస్సుల నాచరించుచో అది సాత్త్విక తపస్సనబడును.


పప్రశ్న:- సాత్త్వికతపస్సనగా నెట్టిది?

ఉత్తరము:- (1) అత్యంత శ్రద్ధతో (2) ఫలాభిలాషారహితముగ (3) నిశ్చలచిత్తుడై (లేక, దైవధ్యానపరుడై) పైన దెలిపిన త్రివిధతపస్సులను చేయుటయే సాత్త్వికతపస్సనబడును.

విద్యా న శోభతే పుంసః

 శ్లో:- విద్యా న శోభతే పుంసః ౹

                  యది న స్యాత్ రసజ్ఞతా ౹

                  లవణేన వినా శాకాః ౹

                  సుపక్వా అపి నిష్ఫలా:  

                                     

భా:-సమాజంలో నేడు విద్యార్జనా మార్గాలు, మాధ్యమాలు, వనరులు విస్తారంగా అభివృద్ధి చెందాయి. అక్షరాస్యులు, విద్యాధికులు,వివిధ శాస్త్ర పరిశోధనా కుశలురు, విద్యా నిపుణులు కాలానుగుణంగా పెరిగారు. ఉన్నతస్థానాలను అలంకరిస్తున్నారు. అభినందనీయమే. మనిషి ఎన్ని విద్యలను గడించినా, ఆ విద్య ఆధారంగా ఉన్నత పదవులు చేపట్టి, కొన్ని కోట్లు గడించినా అతనిలో "రసజ్ఞత" అనే సుగుణం లోపిస్తే ఆ విద్యకు విలువ గాని, రాణింపు గాని ఉండవు. సభ్య సమాజంలో ప్రేమాదరాభిమానాలు చూరగొనలేడు. వాసనలేని పూవువలె నిరూపయోగంగా ఉండిపోతాడు. ఎలా? పసందైన విందు కోసం అన్నము, కూరలు వండి సిద్ధం చేశారు. నలభీమపాకమని అందరూ ప్రశంసించారు. తీరా చూస్తే కూరల్లో ఉప్పు వేయడం మరచిపోయారు. ఇక రుచేముంటుంది? అందరూ పెదవి విరిచారు. చప్పబడి పోయారు. ఉప్పు లేని కూరల్లాగానే, మంచి చెడు గ్రహింపజాలని ఇంగితజ్ఞానం లేని చదువు కూడా నిష్ఫలమని సారాంశము.అందుకే "రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు" అని తీర్మానించాడు భాస్కర శతక కర్త,*.

*శ్రీ స్వామి వివేకానందులు

 *శ్రీ స్వామి వివేకానందులు తన శరీరాన్ని విడిచే ముందర చెప్పిన మాటలు..*

🕉🌞🌎🌙🌟🚩


*ఇక దేనికీ నేను విచారపడను. ఊహాతీతమైన ప్రశాంతతను పొందుతున్నాను. అది సుఖం కాదు, దుఃఖమూ కాదు. వాటికి అతీతమైనది.. ఇప్పుడు నేను ఆ ప్రశాంతతను సమీపిస్తున్నాను. అది శాశ్వత నీరవత (నిశ్శబ్దం). ఇప్పుడు నేను విషయాలను వాటి యథార్థ స్థితిలో, ప్రతిదాన్ని, ఆ ప్రశాంతతకి, దాని పరిపూర్ణ స్థితిలో చూడగోరుతున్నాను.*



 *"ఎవడి ఆనందం వాడిలోనే ఉందో, ఎవడి కోరికలు వాడిలో మాత్రమే ఉన్నాయో, అతడు తన పాఠాలు నేర్చుకున్న వాడు.." అనేక జన్మల, స్వర్గాల, నరకాల, పరంపరలనుండి, మనం ఇక్కడ ఉండి నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఇదే - తన ఆత్మను తప్ప కోరదగింది, అడగవలసింది మరొకటి లేదు. "నేను పొందగల సర్వోత్కృష్టమైనది నా ఆత్మే.." "నేను ముక్తుణ్ణి..", కాబట్టి నేను ఆనందించడానికి మరేమి అవసరం లేదు. "అనంత కాల పర్యంతం నేను ఒక్కణ్ణే. ఎందుకంటే నేను భూతకాలంలో ముక్తుణ్ణి. ఇప్పుడు వర్తమానంలోనూ ముక్తుణ్ణి. ఇక భవిష్యత్తులోనూ ఎల్లప్పుడూ ముక్తుణ్ణిగానే ఉంటాను.." ఇది వేదాంతతత్త్వం. ఇంతకాలం సిద్దాంతాన్ని బోధించాను. కాని ఓ, ఆనందం..! నేనిప్పుడు దాన్ని నిత్యం సాక్షాత్కరించుకుంటున్నాను. అవును, నేను "ముక్తుణ్ణి.." "నేను ఏకమేవా ద్వితీయం (రెండవది లేని వాడనుగా ఉన్నాను..)"*



*మాసిపోయిన బట్టను పారవేసినట్లు నేను ఈ శరీరాన్ని త్యజించి బయటకు పోవడం మంచిదయుండవచ్చు. కాని పని చేయడం మాత్రం విరమించను. భగవంతునితో ఐక్యాన్ని లోకంలోని యావన్మంది గుర్తించే వరకు నేను వారికి ప్రేరణను కల్పిస్తూనే ఉంటాను..*



*నా ఆశయాన్ని క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు:- మానవాళికి వారిలోని దివ్యత్వాన్ని బోధిస్తూ, ఆ దివ్యత్వాన్ని జీవితంలో ప్రతిక్షణం ఎలా అభివ్యక్తం చేయాలో నేర్పడం.*


*- స్వామి వివేకానంద.*


🕉🌞🌎🌙🌟🚩

అమ్మ ప్రేమ

 అస్సాంలోని ఒక గ్రామంలో ప్రతి రోజు రాత్రి కుక్కలు ఎక్కువగా మొరుగుతుంటే  వారికి ఈ లాక్డౌన్ సమయంలో దొంగలేమైనా  వస్తున్నారేమో అని సీసీ  కెమెరాను  పెట్టించారు..  అప్పుడు దొరికిన చిత్రమే నట ఇది.. 

ఈ ఆవును కొత్తగా కొన్నారు కనక వారికి అర్థం కాక కొన్న చోట వెళ్లి విచారించగా, 

ఒక చిరుత  పుట్టిన 20 రోజులకే  తల్లిని కోల్పోవడంతో  ఆ చిరుతకు గ్రామ ప్రజలు ఈ ఆవు  దగ్గర పాలు పట్టించారంట,  

కాస్త పిల్ల చిరుత పెద్దది అవడంతో తీసుకెళ్లి అడవిలో దింపేశారు..  

ఆ చిరుత తనకు పాలు పట్టించిన  ఆ ఆవుని తల్లిగా  భావించి  ఆవును చూడడం కోసం వచ్చేదట,  

ఆవును పక్క ఊరికి  అమ్మేయడంతో  అమ్మ ప్రేమ వెతుకుంటూ చిరుత అక్కడికి  వచ్చిందంట..  

పాలు తాగినందుకు  క్రూర  మృగమైన  చిరుత తన ప్రేమను చాటుకుంటుంటే  అదే అమ్మ పాలు తాగుతున్న  మనం మాత్రం అమ్మను వయసుపెరగడంతో  ఆనాధా శ్రమాలకు  పంపుతున్నాము..

సీతారామలక్ష్మణులు

 సీతారామలక్ష్మణులు వనవాసం ముగించుకొని తిరిగి వచ్చిన రోజు.

దీపావళి🎊🎉

సత్యాకృష్ణులు నరకుణ్ణి వధించి లోకానికి ప్రకటించిన రోజు

దీపావళి🎊🎉

బౌద్ధులు సనాతనులతో మైత్రిని కోరుతూ లక్ష్మీ దేవీ ని పూజించడం మొదలు పెట్టిన రోజు

దీపావళి🎊🎉

జైనుల ౨౪ వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు నిర్యాణం చెందిన రోజు

దీపావళి🎊🎉

జహంగీర్ చెర నుండి సిక్కు గురువు ఇతర రాజులతో పాటు విడుదల అయిన రోజు

దీపావళి🎊🎉

పార్శీలు సంపూర్ణ భారతీయులుగా ప్రకటించిన రోజు

దీపావళి🎊🎉

 సంధికాలపు కీటకాలను బాణసంచా తో చంపి, నూనె దీపాలతో గాలిని శుద్ధి చేసి రోగ సంక్రమణ తగ్గించే రోజు

దీపావళి🎊🎉

 అందరికి దీపావళి శుభాకాంక్షలు...🍧🎉🎊🎉🎊🎉🎊🎊🎉🎊🎉🎊

సుభాషితాలు

-----   సుభాషితాలు --------------

 

భీమంబై తలఁ ద్రుంచి ప్రాణములఁ బాపెం జక్ర మా శుక్రియన్,

హేమక్ష్మాధర దేహముం, జకితవన్యేభేంద్ర సందోహముం,

గామక్రోధన గేహమున్, గరటి రక్తస్రావ గాహంబు, ని

స్సీమోత్సాహము, వీత దాహము, జయశ్రీ మోహమున్, గ్రాహమున్.

 

భావము:- రివ్వున పోయి, చక్రాయధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం మేరు పర్వతమంత పెద్ద దేహం గలది, అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది, కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారల రుచిమరిగినది, అంతులేని ఉత్సాహంతో అలసటలేకుండ పోరాడుచున్నది, గెలుపుని నమ్మకంగా కోరుతున్నది. విష్ణుచక్రం వెళ్ళి అలాంటి మొసలి శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది.

 

అడిగినయట్టి యాచకుల ఆశ లెరుంగక లోభవర్తియై

కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వానికె

య్యెడల; అదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్

కుడువగ నీనిచో కెరలి గోవులు తన్నును గాక భాస్కరా!

 

తాత్పర్యం: భాస్కరా! దూడలను తాగనియ్యక పాలు తీసుకోవాలని సిద్ధపడితే ఆవులు పాలియ్యవు సరి కదా తంతాయి. అలాగే ఏదో యిస్తారని ఆశతో వచ్చి చేయిచాచి అడిగే వారికి లోభితనముతో లేదు పొమ్మంటే ధర్మ దేవత ఆ లోభికి ధనం ఎప్పటికీ రాకుండా చేస్తుంది. అడిగిన వారికి ఎంత కొంత యిస్తూ ఉంటే ధనం ఏదో విధంగా వస్తూ ఉంటుంది. కాబట్టి యాచించే వారిని చులకనగా చూచి "లేదుపో" అని అనకూడదు.

 

 

భక్తుడిలా ఉండాలి- ధూర్జటి .

మ: నిను సేవించిన కష్టముల్ కలుగనీ , నిత్యోత్సవం బబ్బనీ ,

నను మాన్యుండననీ , మహాత్ము డననీ , సంసార మోహంబు పై

కొననీ , జ్ఙానము గలుగనీ ,గ్రహగతుల్ కుందింపనీ , మేలు వ

చ్చిన రానీ , యవి నాకు భూషణములే! శ్రీ కాళహస్తీశ్వరా !

కాళహస్తీశ్వర శతకము-- ధూర్జటి.

లోకంలో భక్తులు అనేక రకాలుగా కనిపిస్తారు. సుఖాలు వచ్చి నంతవరకూ ,తమకోరికలు తీరుతున్నంత వరకూ భగవంతుణ్ణి చాలా ఘనంగా పూజిస్తూ ఉంటారు.కాస్తంత కష్టంవచ్చిందా దేవుడు లేనేలేడనీ , ఉంటే యింత భక్తులమైన మమ్మల్ని

యిలా తిప్పలు పెడతాడా ?అనీ నిందిస్తూ ఉంటారు. అది భక్తికాదంటాడు ధూర్జటి. ఈపద్యంలో అదే వివరించాడు.

" ఓకాళహస్తీశ్వరా! నిన్ను ఆరాధించే సమయంలో నాకు కష్టాలు కలిగినా , సుఖాలే (భోగములు) భోగాలే కలిగినా, నన్ను గొప్పవాడని సంభావించినా , మహాత్ముడని మెచ్చుకొన్నా , సంసారమోహమే నన్ను ఆవరించినా , జ్ఙానము వరించినా , గ్రహగతులు వక్రించినా( గ్రహబాధలకు లోనయినా) మంచి జరిగినా , చెడుజరిగినా , అంతా నీయనుగ్రహముగానే భావిస్తాను. సుఖదుఃఖాదులను నీవొసగిన కానుకలు గానే , భూషణములుగానే స్వీకరిస్తాను. నన్ను అనుగ్రహించ వయ్యా!"- అంటున్నాడు.

ఇదిగో యిదీ పరిణతి చెందిన భక్తి. యెండకు రంగు వెలసిపోయే గుడ్డలా ,నీటికి కరగిపోయే సుద్ధలా, క్షణక్షణానికీ

రంగులు మార్చే ఊసర బిల్లిలా ఉంటే వాడేం భక్తుడూ? అదేంభక్తి ? అచంచల మైన విశ్వాసంతో పరమేశ్వరార్చన చేయండి.! కార్తీకమాస పవిత్రతను సొంతం చేసికోండి. పరమేశ్వరానుగ్రహం పొందండి! తథాస్తు!

 

 

ఛిన్నాపిరోహతి తరు: క్షీణోప్యుపచీయతే శ్చంద్ర:

ఇతి విమృశంతః  సంతః  సంతప్య౦తే న తే విపదా.

                  తా:-- చెట్లను కొట్టివేసిన మరల చిగురించు చున్నవి; క్షీణ చంద్రుడు మరల పరిపూర్ణుడగుచున్నాడు; ఇట్టి ఉదాహరణలు చూచిన  ఆపదలు కాపురముండవని తెలియుచున్నది కదా! కావున సత్పురుషులెన్నడూ ఆపత్సమయములో అధైర్యము నొందరు.

----------------------------------------

సంపత్తో కేవలం చిత్తం  సాధో రాపదికర్కశం 

సుకుమారం మధౌ పత్రం  తరో: స్యాత్ కఠినం శుచౌ 

              తా:--సాధుజనుల మనసు సంపదలతో కరుణతో బహు ఆర్ద్రములై యుండును, ఆపదలలో 

వజ్రమువలె కఠినముగా నుండును.  ఎలాగైతే వసంతకాలమునందు వృక్షములు మృదువైన చిగుళ్లు, ఆకులతో వుండి, గ్రీష్మము రాగానే మోడువారి ఉండడం చూస్తున్నాము గదా!

 

యస్మిన్ జీవతి జీవంతి బహవ స్సతు జీవతు

కాకోపి కిం న కురుతే చంచ్వా స్వోదర పూరణం

 

  తా:--  ఎవడు జీవించి వున్నచో పదిమందికి జీవిక కలుగుతూ వుంటుందో అట్టి వాని బ్రతుకే బ్రతుకు.కానీ కేవలం తన పొట్ట మాత్రమే నింపుకోను వానిది బ్రతుకు కాదు. కాకి మాత్రం

ఆ పని చేయడం లేదూ? కేవలం తనకోసమే కాకుండా యితరులకోసం బ్రతికే వాడే

ఉత్తముడు అని కవి యొక్క భావం

---------------------------------------

విప్రాణాం జ్ఞానతో జైష్ట్యం

క్షత్రియాణాం తు వీర్య:

వైశ్యానాం ధాన్య ధనదః

శూద్రాణా మేవ జన్మతః

                          తా:--    బ్రాహ్మణులలో పెద్దరికం వారి జ్ఞానము వల్లనే నిర్ణయించ బడుతుంది.క్షత్రియులలో

బలము, శౌర్యము చేతనే పెద్దరికం నిర్ణయించ బడుతుంది. వైశ్యు లలో ధనము,ధాన్యములతోనే తోనే పెద్దరికం నిర్ణయించ బడుతుంది. శూద్రులలో మాత్రమే వయస్సు చేత నే పెద్దరికం నిర్ణయించ బడుతుంది.

 

     ఏనాడైనను వినయము

   మానకుమీ మత్సరమున మనుజేశులతోఁ 

   బూనకు మసమ్మతయు బహు

   మానమునను బొందు మిదియె మతము కుమారా!

 

ఓ కుమారా! ఎన్నడునూ వినయ స్వభావమును వీడరాదు. ఈర్ష్యా అసూయలతో తమ కంటే పెద్దవారితో కలహించుట పనికిరాదు. పేదవారి కోపం పెదవికి చేటు అనే నానుడిని మనస్సునందుంచుకొని మెలగుము.అట్లు చేసినచో నీకు సంఘంలో గౌరవ మర్యాదలబ్బును. సన్మానాలు జరుగును.

 

 

ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా

రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ

కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా

త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ.

 

భావం: పెద్దల కందఱికి మ్రొక్కి, వంచిన శరీరము గలవాడనై గురువైన రఘునాధభట్టునకు నమస్కరించి, కవిశ్రేష్ఠులను పొగడి, కార్య లాభమునకై యొక శతకంబును వ్రాసెదను. దీని నిష్టముతో గైకొనుము దాశరథీ కరుణాపయోనిధీ.

దీపావళి భావబీజావళి

 ." 

 

దీపావళి భావబీజావళి

 "మీ హృదయం నందన వనం 

మీ వదనం దేదీప్యమానం 

మీ దరహాసం కోటి దీప  కాంతుల 

భాసమానం కావాలని" 

ఆకాంక్ష  అందుకోండి ఈ మా శుభాకాంక్ష


--తమిళనాడు లో దీపావళినాడు ముగ్గు వేసి మధ్యలో దీపపుసేమ్మే వెలిగించి పూజ చేస్తారు.దీప లక్ష్మి కొన్ని షరతుల పైన మీ ఇంటికి వస్తుందట .

ద్వార బంధాల పై తోరణమ్ములు కట్టి స్వాగతం బనిన లాభంబు లేదు

వెండి పళ్ళేర మందు పిండి వంటలు పెట్టి ఆథిత్యమనిన సంప్రీతి లేదు.

దివ్వెల తోటలో పువ్వులు పూయించి సత్కారమనిన హర్షమ్ము లేదు.

వైభవం బీనగా బాణ సంచా కాల్చి కనుల విందు అనిన సౌఖ్యమ్ము లేదు.

ముందు మీ గుండెలందున ముసురుకున్న

కరుడు కట్టిన కటిక చీకటుల దునిమి (చంపి)

వెలుగు జెండాల నెత్తు డవ్వేళ నేను

దీప లక్ష్మిగా మీ ఇంట తేజరిల్లుదు.

ముందు మనం మన గుండెల్లో కరుడు కట్టిన దుష్ట భావాల చీకట్లను చీల్చుకో గలిగితే

దీపలక్ష్మి మన ఇళ్ళకు వస్తుంది వెలుగు నిస్తుంది,మానవ కళ్యాణ మవుతుంది.

విదురనీతి

 *విదురనీతి*


*అశ్రుతశ్చ సమున్నద్ధః దరిద్రశ్చ మహామనాః*

*అర్థాంశ్చాకర్మణా ప్రేప్సుః మూఢ ఇత్యుచ్యతే బుధైః*


చదువు లేకుండా మిడిసి పడుతూ ఉంటాడు. పేదవాడు అయి కూడా గొప్ప గొప్ప కోరికలు కలిగి ఉంటాడు. పని చెయ్యకుండా సొమ్ముల్ని పొందాలనుకుంటాడు. ఇలాంటి వాడు పండితులచే మూఢుడు అనిపించుకొంటాడు.


=================

 కూపం వినా గృహం మప్రశస్తం ౹*

అని విన్నాను అది ఇందులోని కాదా వివరించగలరు

ధార్మికగీత - 80*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 80*

                                     *****

     *శ్లో:-  సూపం వినా భోజన మప్రశస్తం ౹*

             *యూపం వినా యాజన మప్రశస్తం ౹*

             *ధూపం వినా పూజన మప్రశస్తం ౹*

             *దీపం వినా మైధున మప్రశస్తమ్ ౹౹*

                                      *****

*భా:- మానవ జీవనసరళిలో అను నిత్యం ముడివడి, విడదీయరాని  అంశాలు నాలుగున్నాయి. అవేమిటో పరిశీలిద్దాం. 1. "సూపము":-  అంటే పప్పు. శతాబ్దకాలం క్రితం "పప్పన్నం" ఎప్పుడు పెడతారండీ! అని ఆడిగేవారట. అది ఎంత అలభ్యమో, అరుదైనదో నాటి స్థితిగతులకు  అద్దం పడుతోంది. కేవలం పెళ్లిసందడి; సంపన్నుల ఊరబంతి;  ఆలయ సహపంక్తి భోజనాలలో మాత్రమే అన్నంతో పప్పు వడ్డించేవారట.  కాన పప్పు లేని భోజనం ప్రశస్తమైనదికాదు. 2. "యూపము":- అనగా వధ్యశిల. యజ్ఞ యాగాదుల నిర్వహణలో జంతువులను బలి ఇచ్చే సంప్రదాయం ఉండేది. బలియైన జీవాలను దేవతకు నైవేద్యం పెట్టేవారు. యాగనియమాల ననుసరించి యూపం లేని  యాగం ప్రశస్తము కాదు. 3. "ధూపము":- అంటే పొగ.  ధూపదీపనైవేద్యాల నిమిత్తం ప్రతి గుడికి ప్రత్యేకించి మడులు, మాన్యాలు ఆనాటి ఉదారులు భూరి విరాళంగా ఇచ్చేవారు. ఇంటిలోగాని,గుడిలోగాని  ధూపము లేనిదే పూజాప్రారంభం సముచితం కాదు. 4. "దీపము":- భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మ వంటిది, విదేశీయులచేత  ప్రశంసాపా త్రమైనది మన కుటుంబ వ్యవస్థ. అట్టి కుటుంబానికి ప్రతీక దంపతులు. చిరుదీపము కూడా లేని, భార్యాభర్తల పవిత్ర అనురాగానికి సంకేతమైన దాంపత్యక్రీడ సంప్రదాయం కానే కాదు. తేజోవంతమైన సంతానానికి దీపం ఆలంబనము. సనాతన ధర్మాలను, సదాచారాలను తృణీకారభావంతో విడనాడడం ఆధునిక నాగరికత అనిపించుకోదని నేటి తరానికి చెప్పవలసిన బాధ్యత మన పెద్దలదని గుర్తించి వర్తించాలి*.

                                  *****

                   *సమర్పణ  :   పీసపాటి*   

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

మిత్రం

 గీర్వాణవాణి 

  వ శ్లోకం.

 భావానువాదం    

గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏


89.విద్యా మిత్రం ప్రవాసేషు , భార్యా మిత్రం గృహేషు చ ,

వ్యాధితస్యౌషధం మిత్రం , ధర్మో మిత్రం మృతస్య చ.


దూరప్రాంతంలో ఉన్నప్పుడు విద్య, ఇంటిలో భార్య , వ్యాధిపీడితునకు ఔషధం, మరణించినవానికి ధర్మము స్నేహితులు.

తమసోమా జ్యోతిర్గమయ*

 *తమసోమా జ్యోతిర్గమయ*

https://t.me/Teluguvelugu2/54

చతుర్దశి అమావాస్యకు దారితీసినట్లుగానే నరకాసుర సంహారం దీపావళి పర్వదినానికి తోవ చూపిందని పెద్దలమాట. పూర్వం నరకుడు అనే రాక్షసుడు లోక కంటకుడై చెలరేగినప్పుడు, వాడి బాధలను తట్టుకోలేక ఇంద్రాది దేవతలందరూ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారని, అప్పుడు మహావిష్ణువు కృష్ణుడిగా సత్యభామాసమేతుడై వాణ్ని సంహరించి, లోకానికి పట్టిన పీడను వదిలించాడని పురాణగాథ. నరకాసురుణ్ని చంపిన రోజు ఆశ్వీయుజ బహుళ చతుర్దశి కావడం వల్ల ఈ దినాన్ని ‘నరక చతుర్దశి’ అని పిలవడం సంప్రదాయంగా మారింది. దుష్టరాక్షసుడి వధానంతరం మరుసటి రోజైన అమావాస్యనాడు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి, పండుగ జరుపుకోవడం పరిపాటిగా మారింది.

నరక చతుర్దశికి, నరకాసురుడికి సంబంధం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నా, మరొక ధార్మిక విషయం నరక చతుర్దశితో ముడివడి ఉందనేది యథార్థం. మానవులు మరణానంతరం నరకానికి, ఆ తరవాత స్వర్గానికి వెళ్తారని ప్రగాఢ విశ్వాసం. నరకలోకం అంధకారమయంగా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళినవారు చీకటిలోనే మగ్గుతుంటారని, దారి చూపడంకోసం భూలోకంలోని వారసులు దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. పితృదేవతలకు నరకంలో చీకట్లు తొలగాలంటే, వారి కోసం భూమిపై దీపాలు వెలగాలన్న భావనతో దీపావళినాడు దీపాలను వెలిగిస్తారు. అంతేకాదు- దీపదానాలూ చేస్తారు. యముడి ప్రీతికోసం తర్పణాలు విడుస్తారు. ఇవన్నీ పితృదేవతలకు నరకలోక బాధలు లేకుండా చేయడానికే అనేది ఈ పండుగలోని పరమార్థం. ఆశ్వీయుజ బహుళ చతుర్దశినాడు ఎవరు దీపాలు వెలిగిస్తారో వారి పితరులు (మరణించిన తండ్రులు, తాతలు) నరక లోకాన్ని వీడి స్వర్గలోకం వైపు ప్రయాణిస్తారని ధర్మశాస్త్రం చెబుతోంది.

నరక చతుర్దశినాడు అభ్యంగనస్నానం విశేషమైన అంశం. తిలలు అంటే నువ్వులు. వాటి నుంచి తీసిన ద్రవమే తైలం. ఒంటికి తైలాన్ని మర్దన చేసుకొని తలస్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడంవల్ల శరీరం ఆరోగ్యవంతం కావడమేగాక, మానసికంగానూ ప్రశాంతత లభిస్తుందని పెద్దలమాట. రాబోయేది హేమంత రుతువు. అంటే చలికాలం. చలికాలం రాగానే శరీరం అంతా పగులువారుతుంది.  తైలమర్దనవల్ల శరీరం నిగనిగలాడుతూ తళుకులీనుతుంది.

అమావాస్య లక్ష్మీదేవి జన్మదినమని విశ్వాసం. లక్ష్మీదేవి తాండవించే ఈ శుభదినాన దీపాలు వెలిగించి, సిరిసంపదలు కోరుతూ లక్ష్మీపూజలు చేయడం మానవాళికి అలవాటు. బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు, ముత్యాలు... ఇలా అమూల్యమైన సంపదలన్నీ లక్ష్మీస్వరూపాలే. దీపావళినాటి రాత్రి అమూల్య సంపదలను పూజించి, దినదినాభివృద్ధిని కోరడం కనిపిస్తుంది. వర్తకవాణిజ్య రంగాల వారికి దీపావళి అత్యంత పూజ్యదినం.

మనిషి తన జీవితంలో అనుక్షణం వెలుగుకోసం తపిస్తాడు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే వేదసూక్తి మానవుడి మనోభావానికి అద్దం పడుతుంది. వెలుగులకోసం తపించే మనిషికి వెలుగులు కురిపించే దీపావళి పండుగ అంటే ఎంతో ఇష్టం.

నరకం నుంచి విముక్తి కావడం, తేజోమయ స్వర్గలోకానికి చేరుకోవడం అనే ప్రధాన లక్ష్యాలు- ఈ పండుగను విశ్వమనోహరంగా చేస్తున్నాయి. సూర్యచంద్ర నక్షత్ర కాంతులతో ఆకాశం ఎలా వెలిగిపోతుందో, అలాగే జీవితమంతా పర్వదినాల వెలుగులతో సుఖశాంతులను కురిపించాలని కోరడమే మానవాళి కర్తవ్యం.

ఈనాడు అంతర్యామి

✍ డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

సేకరణ

భార్గవ శర్మ

*

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏


కరోమి త్వ త్పూజా0 సపది సుఖదో మే భవ విభో !

విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా:ఫలమితి 

పునశ్చ త్వా0 ద్రస్టు0 దివి భువి వహన్ పక్షిమృగతా 

మదృష్ట్వా తత్ ఖేదం కథ మిహసహే శంకరవిభో ! 



పరమేశ్వరా ! నిన్ను పవలు రేయందున

            భక్తితో నర్చింతు ముక్తి కొఱకు

ఫలితంబుగా నాకు బ్రహ్మత్వమునుగాని

           విష్ణుత్వ మీయంగ వేడలేను

యారీతి నీవీయ హంస రూపముగాని

           పంది రూపము గాని పొంది నేను

శిరసు పాదంబులన్ చేరుట కొఱకును

           దివి భువి మార్గాల తిరుగవలయు

అట్లు నినుగాంచజాలక యలసి సొలసి

చింతలోనుండి బ్రతుకగ చేతగాదు

యీశ్వరా ! యట్టి దశ నాకు నీయవలదు

భక్త మందార ! పశుపతే ! పాప నాశ ! 23 ***




కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణై:

వసన్ శంభో రగ్రే స్పుటఘటిత మూర్థా0జలిపుట:

" విభో ! సాంబ ! స్వామిన్ ! పరమశివ ! పాహీతి " నిగదన్ 

విధాతౄణా0 కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః



కైలాసశిఖరాన కాంచనసౌధాన

            ప్రమథగణ సమేత భాసుడైన

పరమేశ్వరుని దివ్య పావన సన్నిధిన్

           చేతులు జోడించి చేరి నిలచి

నవనిత శిరసుతో నత్యంత భక్తితో

           తనువెల్ల పులకించ దర్శనమున

" పశుపతీ ! యీశ్వరా ! పాహిమాం ". యనుచునూ

           భక్తితో యెలుగెత్తి పలుకుచుండి

దివ్యమైనట్టి యానంద స్థితిని పొంది

భక్తిభావంబు నందున పరవశించి

నిమిషముగ బ్రహ్మకల్పాల నెంచి మదిని

యెపుడు గడుపుదు నీశ్వరా ! యెఱుగ నైతి . 24 #



  ✍️గోపాలుని మధుసూదన రావు 🙏

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*వంట..వడ్డన!*


"మాకు అంటు వచ్చింది..ఇంకొక పదిహేను రోజుల పాటు మేము రాలేము.." 


ఒకానొక శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత, శ్రీ స్వామివారి మందిరం వద్ద శని, ఆదివారాల్లో జరిగే అన్నదానానికి వంటచేసే మనిషి ఫోన్ చేసి చెప్పిన మాట అది..


సోమవారం నుండీ శుక్రవారం దాకా శ్రీ స్వామివారికి నైవేద్యాలూ..మందిరం వద్ద అన్నదానానికి కావాల్సిన వంటా వార్పూ చేయడానికి విడిగా ఒక బ్రాహ్మణ వంటమనిషి వున్నాడు..ఆయనే శని, ఆదివారాల్లో శ్రీ స్వామివారికి నైవేద్యాలు కూడా చేసి పంపుతారు..శ్రీ స్వామివారి నైవేద్యాలకు ఏ ఇబ్బందీ లేదు..ఎటొచ్చీ..శని ఆదివారాల్లో జరగాల్సిన అన్నదాన కార్యక్రమమే సందేహం లో పడింది..అప్పటికప్పుడు సుమారు వేయిమందికి వంట తయారు చేసే మనిషి, అతనికి సహాయకులూ కావాలి..ఎలా?..తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసాము..ఎవ్వరూ అందుబాటులోకి రాలేదు..


శనివారం మధ్యాహ్నం సుమారు మూడువందల మందికి చేయాలి..దానికి నైవేద్యాలు తయారుచేస్తున్న వంట బ్రాహ్మణుడే ముందుకొచ్చి..చేసి పెట్టారు..అంతవరకూ జరిగిపోయింది..ఇక అసలు సమస్య..శనివారం సాయంత్రం..ఆదివారం మధ్యాహ్నం.. ఈ రెండుపూటలూ వంట చేసే మనిషి కావాలి..మా ప్రయత్నాలన్నీ కొరగాకుండా పోయాయి..అప్పటికి మధ్యాహ్నం మూడు గంటలవుతున్నది..కనీసం మరో అరగంట లోపల వంట ప్రయత్నం మొదలైతే తప్ప..రాత్రికి వచ్చే వేయిమంది పైచిలుకు భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేయలేము..


శ్రీ స్వామివారి సమాధి ముందు మౌనంగా నిలబడ్డాను..మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని.."స్వామీ..నీదే భారం..పరీక్షా నీదే..పరిష్కారమూ నీదే..ఏమీ చేయలేని ఆశక్తత తో వున్నాను..ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండకూడదు అనే సంకల్పాన్ని నెరవేర్చు..ఇంతకు మించి ఈ సమయం లో కోరేది ఏమీ లేదు తండ్రీ!!.." అని ప్రార్ధించాను..ఎందుకో నాలో ఒక్కసారిగా ధైర్యం వచ్చింది..ఇక ఫర్వాలేదు..శ్రీ స్వామివారే ఏదో ఒక రూపంలో పరిష్కారం చూపుతారనే గట్టి విశ్వాసం కలిగింది..


శ్రీ స్వామివారి సమాధి ముందు నుంచి నేను ఇవతలికి వచ్చాను..మా సిబ్బంది దగ్గర ముగ్గురు నలుగురు గుమికూడి వున్నారు..నన్ను చూసి.."అయ్యా..వీళ్ళు మాలకొండకు వచ్చి దర్శనం చేసుకొని..ఈరాత్రికి ఇక్కడ నిద్ర చేస్తారట..ట్రాక్టర్ లో సుమారు ముప్పై మంది వచ్చారు..అన్నదానానికి బియ్యం, ఇతర సరుకులు, కూరగాయలు తెచ్చారట..వీలైతే వాళ్ళు తెచ్చిన సరుకులు ఈరోజు రేపు వాడమన్నారు.." అన్నారు.


"సరుకుల గురించి సమస్య కాదు కదా?..వంటచేసేవాళ్ళు లేక కదా మనం ఇబ్బంది పడుతున్నది.." అన్నాను కాస్త అసహనంగా..


మా వాళ్ళు ఆ మాటే వాళ్ళతో చెప్పారు..వాళ్ళు గబ గబా మా దగ్గరకు వచ్చి.."అయ్యా..మాలో ముగ్గురు వంట చేసే వాళ్ళున్నారు..వాళ్లకు సహాయకరంగా ఉండటానికి..అంటే కూరగాయలు తరిగిపెట్టడానికి, గిన్నెలు శుభ్రం చేసి పెట్టడానికి..మేమూ..మా లోని ఆడవాళ్ళూ ఉన్నాము..మీరొప్పుకుంటే..స్వామివారికి మేము తెచ్చిన సరుకులతో అన్నదానానికి పదార్ధాలను తయారుచేసి వడ్డిస్తాము..మాకూ తృప్తిగా ఉంటుంది.." అన్నారు..


ఒక్కక్షణం నా చెవులను నేనే నమ్మలేకపోయాను..సమాధి లో కూర్చున్న స్వామివారు అభయం ఇచ్చినట్లుగా అనిపించింది..అన్నదానానికి వంట చేసిపెడతాము అనే మాటే అమృతం లాగా వినిపించింది..సంతోషంగా ఒప్పుకున్నాను..వాళ్లకు కావాల్సిన పాత్రలు అన్నీ మా వాళ్ళు క్షణాల్లో ఇచ్చేసారు..ఆ శనివారం రాత్రి కి ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్నదాన కార్యక్రమం జరిగిపోయింది..అంతేకాకుండా..ఆదివారం మధ్యాహ్నం కూడా వాళ్లే వండి వడ్డించారు..ఏ ఒక్క భక్తుడూ ఇబ్బంది పడలేదు..తన దగ్గరకు వచ్చే భక్తుల ఆకలిని శ్రీ స్వామివారు సమాధిలో కూర్చునే గమనించి తీరుస్తున్నారు..ఆపద తీరిపోయిందని మేము ఎంత ఆనందపడ్డామో..తమకు అన్నదానం చేసే అవకాశం వచ్చిందని వాళ్ళూ అలానే ఆనందపడ్డారు..ఇంకొకసారి ఇలాటి అవకాశం కల్పించమని నాకూ..మా సిబ్బందికి మరీ మరీ చెప్పి వెళ్లారు..


శ్రీ స్వామివారి మందిరం వద్ద ఇటువంటి అనుభవాలు కోకొల్లలుగా చూసాము మేము..భక్తులకు ఇబ్బంది ఏర్పడబోయే ప్రతిసారీ శ్రీ స్వామివారు మమ్మల్ని ఆదుకుంటూనే వున్నారు..శ్రీ స్వామివారు మన దగ్గర నుంచి ఆశించేది కేవలం శరణాగతి తో కూడిన భక్తి విశ్వాసాలే..మరేదీ కోరుకోరు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. సెల్..94402 66380 & 99089 73699).

Padmanabha Swamy temple





 

Annapurna





 

Little class teacher


 

కరక చతుర్థి వ్రతo

 కరక చతుర్థి వ్రతo


స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే 'కరక చతుర్థి' వ్రతాన్ని కార్తీక బహుళ చవితి రోజున చేస్తారు....

సాధారణంగా కార్తీక పౌర్ణమితో కార్తీకమాస విశిష్టత పూర్తవుతుందని చాలామంది అనుకుంటూ వుంటారు గానీ ... ఇందులో నిజంలేదు. కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే సోమవారాలే కాదు ... మిగతా రోజులు కూడా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. ఈ రోజుల్లో కూడా ఆచరించదగిన నోములు ... వ్రతాలు ఎన్నో చెప్పబడ్డాయి.

కార్తీక పౌర్ణమి రోజున అనేక దీపాలను వెలిగించి ... శివయ్యకి ఆనందాల హారతులు పట్టిన తరువాత, 'కార్తీక బహుళ పాడ్యమి' ... ' కార్తీక బహుళ విదియ' ... 'కార్తీక బహుళ తదియ' వస్తాయి.

కార్తీక బహుళ పాడ్యమి రోజున 'లావణ్యా వ్రతం' ... కార్తీక బహుళ విదియ రోజున 'అశూన్య వ్రతం' ... కార్తీక తదియ రోజున 'భద్రావ్రతం' చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని చెప్పబడుతోంది. ఇక ఆ తరువాత వచ్చే 'కార్తీక బహుళ చవితి' కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగివుంటుంది. స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే 'కరక చతుర్థి' వ్రతాన్ని ఈ రోజున చేస్తారు.

అత్యంత శక్తిమంతమైన ... మహిమాన్వితమైన వ్రతాలలో ఒకటిగా కరక చతుర్థి వ్రతాన్ని భావిస్తుంటారు. ఈ కారణంగా చాలామంది ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ... ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, చంద్రోదయం వరకూ ఉపవాసం చేయాలి. శివ పార్వతులతో కూడిన గణపతిని పూజించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి వుంటుంది. 

ప్రవచనములు