3, జులై 2024, బుధవారం

*శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 367*


⚜ *కర్నాటక  : హరనహళ్లి - హసన్*





⚜ *శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం*



💠 శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయం ..

ఇది భారతదేశంలోని కర్నాటకలోని హరన్‌హళ్లిలో మనుగడలో ఉన్న రెండు ప్రధాన చారిత్రక హిందూ దేవాలయాలలో ఒకటి . 

ఇది విష్ణువుకు అంకితం చేయబడిన త్రిగుణాలయం కాగా , మరొకటి - సోమేశ్వర ఆలయం, హరన్హల్లి తూర్పున కొన్ని వందల మీటర్ల దూరంలో శివునికి అంకితం చేయబడింది . 

రెండు దేవాలయాలు వేసారా-శైలి హొయసల నిర్మాణాన్ని ప్రతిబింబిస్తాయి మరియు 1230లలో ముగ్గురు సంపన్న సోదరులు - పెద్దన్న హెగ్గాడే, సోవన్న మరియు కేసన్నలచే పూర్తి చేయబడ్డాయి. 


💠 కేశవ దేవాలయం అని కూడా పిలువబడే లక్ష్మీనరసింహ దేవాలయం 13వ శతాబ్దపు హొయసల శిల్పకళకు పూర్తి మరియు మంచి ఉదాహరణ. 


💠 విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని 1235 లో హోయసల రాజు వీర సోమేశ్వరుడు నిర్మించాడు. 

13వ శతాబ్దానికి చెందిన ప్రముఖ హొయసల శిల్పులలో ఒకరైన మల్లితమ్మ, కేశవ ఆలయానికి ప్రధాన శిల్పి. 

ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కర్ణాటక రాష్ట్ర విభాగం కింద ఒక రక్షిత స్మారక చిహ్నం.



💠 ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది మూడు వేర్వేరు రూపాలలో శ్రీమహా విష్ణువుని ప్రత్యేక గర్భగుడిలో ఉంచబడింది. వారు వరుసగా కేశవ, వేణుగోపాల మరియు లక్ష్మీ నరసింహులు. 


🔆 ఆలయ చరిత్ర


💠  హరన్‌హళ్లి చరిత్రలో, ముగ్గురు ప్రముఖ సోదరులు, నిజేశ్వరభట్ట, సంకన్న మరియు గోపన్న, 1234 లో హరన్‌హళ్లి లక్ష్మీ నరసింహ ఆలయాన్ని నిర్మించారు. 

ఈ ఆలయాన్ని నిర్మించడానికి సోదరులు స్థానికుల నుండి ఉచితంగా భూములు పొందినట్లు రికార్డులు కూడా చెబుతున్నాయి. ఇంకా, హోయసల పాలకుడైన రాజు నరసింహ II, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సోదరులకు మరిన్ని భూములను మంజూరు చేశాడు.


💠 పై సమాచారంతో పాటు, హరన్‌హళ్లిలోని నరసింహ ఆలయాన్ని మొదట్లో కేశవ దేవాలయంగా పిలిచారని, ఆ తర్వాత వేణుగోపాల ఆలయంగా పిలవబడిందని కూడా శాసనాలు పేర్కొంటున్నాయి. 

యుద్ధంలో గెలిచిన తర్వాత వీర నరసింహ అనే రాజు ఇక్కడ మందిరాన్ని నిర్మించినప్పుడు దీనికి లక్ష్మీ నరసింహ ఆలయం అని పేరు వచ్చింది. 

ఈ వివరాలు మైసూర్‌లోని ఆర్కియాలజీ మ్యూజియంస్ అండ్ హెరిటేజ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిస్‌ప్లే బోర్డులో ఆలయ ప్రవేశద్వారం వద్ద ఉన్నాయి.


💠 ఆలయ నిర్మాణం : 

లక్ష్మీ నరసింహ దేవాలయం, హరన్‌హళ్లి, హోయసల నిర్మాణ శైలిని వెసర శైలిని కలిగి ఉంది. 

ఆలయం మూడు గర్భాలయాలను ప్రదర్శిస్తుంది, అయితే, వెలుపలి నుండి, ఇది ఒకటి మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. 


💠 కేశవ, వేణుగోపాల మరియు లక్ష్మీ నరసింహ, అందరూ శ్రీమహావిష్ణువు యొక్క రూపాలు, మూడు వేర్వేరు గర్భాలయాలలో ప్రతిష్టించారు. 


💠 కర్నాటకలోని నగ్గెహళ్లి , హోసహోళాలు మరియు జావగల్లులో ఉన్న ఇతర నరసింహ ఆలయాల మాదిరిగానే హరన్‌హళ్లిలోని నరసింహ ఆలయం నిర్మించబడింది  .

ప్రముఖ శిల్పి మల్లితమ్మ హోసహోలాలు, నుగ్గేహళ్లి మరియు సోమనాథపుర దేవాలయాలలో పనిచేయడమే కాకుండా ఈ ఆలయంలో తన అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాలను ఉపయోగించారు. 

మిగతా వాటితో పోల్చితే అలంకారంలో సాధారణ రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, హరన్‌హళ్లిలోని నరసింహ ఆలయం వాస్తవికతను ప్రదర్శిస్తుంది.


💠 లక్ష్మీ నరసింహ దేవాలయం, హొయసల ఆర్కిటెక్చర్. మూలం దినేష్కన్నంబడి

నరసింహ దేవాలయం ఒక వేదికపై స్థావరం కలిగి ఉంది, ఇది దృశ్యమాన ఆకర్షణను అందిస్తుంది మరియు ఆలయాన్ని ప్రదక్షిణ చేయడానికి భక్తులకు మార్గంగా పనిచేస్తుంది.


💠 హొయసల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తూ పుణ్యక్షేత్రాల గోడలు మరియు మందిరాలు అలంకారంగా ఉంటాయి. 

హరన్‌హళ్లిలోని నరసింహ ఆలయం సోమేశ్వర ఆలయానికి పశ్చిమాన కేవలం 300 మీటర్ల దూరంలో ఉంది. అలాగే, ఈ ఆలయం పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా యొక్క కర్ణాటక రాష్ట్ర విభాగం పాలనలో ఉంది.


💠 లక్ష్మీ నరసింహ ఆలయం, హరనహళ్లి సమయాలు :  

పర్యాటకులు హరన్‌హళ్లిలోని లక్ష్మీ నరసింహ ఆలయాన్ని ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించవచ్చు అలాగే ఆలయ ప్రవేశం కూడా ఉచితం.


💠 ఇది హాసన్ నగరానికి 36 కి.మీ, హళేబీడు నుండి 30 కి.మీ, మైసూర్ నుండి 135 కి.మీ, బెంగుళూరు నుండి 194 కి.మీ. 

హరన్‌హళ్లి నరసింహ ఆలయానికి రైలులో చేరుకోవడానికి అర్సికెరె రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది.

పసుపును ప్రసాదంగా

 🙏పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే ఏం చేయాలి.....?


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు.


🌸 శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. 

వాటికి మైల ఉండదు. అవేమిటంటే...


🌷1. పసుపు, 

🌷2. కుంకుమ,

🌷3. పూలు, 

🌷4. పళ్లు, 

🌷5. తమలపాకు, 

🌷6. వక్క, 

🌷7. పాలు, 

🌷8. పెరుగు, 

🌷9. నేయి, 

🌷10. తేనె, 

🌷11. కూరగాయలు,

🌷 12. తులసి, 

🌷13. గంధం అరగదీసే సానరాయి, 

🌷14. గంధం చెక్క


🌿వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. 


🌸అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.


🌿పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.


🌸దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. 


🌿గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు?


🌸పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు. 


🌿అయితే ఇకపై అలా చేయవద్దు.

ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు చేయాల్సిన విధాన క్రమం:


🌸1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.


🌿2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి.

 పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.


🌸3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.


🌿4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.


🌸5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.


🌿6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.


🌸7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.


🌿8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.


🌸9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.


🌿10. వ్యాపారం జరుగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కల్కి

 #కల్కి

తన ముద్దుల చెల్లెలు, గారాలపట్టీ అయిన దేవకీదేవిని, బావగారు వసుదేవుణ్ణీ రథాన తీసుకుని వెళుతుండగా అశరీరవాణి కంసుడితో చెబుతుంది...

‘మూర్ఖుడా, నీ చెల్లెలి అష్టమగర్భాన జన్మించబోయే కుమారుడు నీపాలిట యముడవుతాడు. అతని చేతిలో నీ మరణం తథ్యం!’

అక్కడినుంచి కంసుడికి ప్రాణభయం పట్టుకుంటుంది. చెల్లీబావలను చెరసాలలో పడేస్తాడు. వారికి జన్మించిన బిడ్డలందరినీ ఖండిస్తాడు. 

దేవకీవసుదేవులు తమ ఏడవ సంతానాన్ని రోహిణీగర్భానికి బదిలీ చేయిస్తారు. ఎనిమిదోవాడిని నందుని ఇంట్లో పెంపకానికిచ్చేస్తారు. లెక్కప్రకారం ఎనిమిదో గర్భాన్ని చంపాలని చూస్తే అదికాస్తా ఆడపిల్లయి కనబడుతుంది. జరిగిన మోసం అర్ధమైన కంసుడు కేవలం మధురలోనే కాకుండా యావత్ సామ్రాజ్యంలో ఉన్న పసివాళ్ళనందరినీ మట్టుబెట్టమని పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు మొదలైన రాక్షసులందర్నీ పంపిస్తాడు. ఇదంతా మనకు తెలిసిందే.

దాదాపుగా ఇదే మూలాధారం చేసుకుని కలిపురుషుడి పాత్రను సృష్టించారనిపిస్తుంది.

కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా వందలకొద్దీ స్త్రీలను గర్భవతుల్ని చెయ్యడం, వారినుంచి సీరమ్ సేకరించి తనలోకి ప్రవేశపెట్టుకోవడం కలిపురుషుడి తపన. అతనికి తెలుసు, కల్కి అవతరించబోతున్నాడని, అతను అత్యంత శక్తిమంతుడని. 

అనుకున్నట్లుగానే ఒకేఒక చుక్క సీరమ్‌తో తన వికృతరూపుని పోగొట్టుకుని, పూర్తి యవ్వనాకారాన్ని సాధించగలగడం చూస్తే అర్ధమవుతుంది రెండోభాగం ఎలావుండబోతుందో.

హిందూపురాణాల్ని ఆధారంగా చేసుకుని కథ రాసుకున్నారు. ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ, కర్ణుడు, అర్జునుడు మన కళ్ళకు కనబడతారు. కృష్ణుడు మాత్రం వినబడతాడు.

ఇంతకుమించి కథావివరాల్లోకి వెళ్లొద్దు.

అంతా బానేవుంది. కానీ ఈ మరియం, కైరా, రాయా, యాస్కిన్, రాక్సీ, రూమి, ల్యూక్, లిల్లీ, బానీ, సిరియస్, రోనీ, యూరీ, లియాన్.... ఏవిఁటీ పేర్లన్నీ?

చక్కగా లలిత, కమల, మాధురి, వైదేహి, నారాయణ, మోహన్, ప్రకాష్ అంటూ మనవాళ్ళ పేర్లే పెట్టొచ్చుగా? 

అంటే వాళ్లందరూ ఈ పానిండియా ప్రజలని మనం అర్ధం చేసుకోవాలా?

ఎక్కడ చూసినా ఇసక, దుమ్ము, ఇనుము. ఒక్క చుక్క నీటికోసం విలవిలలాడే ప్రజలు. కాంప్లెక్స్‌లో పనిచేసే కార్మికులు మాత్రం ఏ విప్రోనో, టీసీఎస్సో ఎంప్లాయిస్‌లా యూనిఫారాలేసుకుని లిఫ్టెక్కి పోతుంటారు.

అందరికీ అతీంద్రియ శక్తులుంటాయి. గాల్లో ఎగురుతుంటారు. వందలమంది యోధుల్ని మట్టికరిపించేస్తుంటారు. కానీ ‘ఇంటద్దె’ కట్టడానికి డబ్బులుండవు. అదియొక ప్రహసనము.

గర్భవతులందరూ మా ఎస్ఎన్‌సియూ ఇంక్యుబేటర్లలో చంటిపిల్లల్లా పడుకునివుంటారు. అక్కడే అన్నీ. విపరీతంగా రక్షణవలయం ఉంటుంది. 

ఇక సంబాలా అనే ద్వీపంలో జువ్వలు, విష్ణుచక్రాలు, భూచక్రాల్లాంటి ఆయుధాలతో వందలమంది మందలుమందలుగా ఉంటారు. ఒక చెట్టుకి దీపాలెట్టి ఏదో క్రైస్తవ భక్తిగీతం ట్యూనులో పాటపాడతారు. అది ఏ భాషాగీతమో తెలియరాలేదు.

వారందరికీ ఆధిపత్యం వహించేది మరియం అనబడే శోభన. ఆవిడని కమాండర్ మానస్ ఒకసారి అడుగుతాడు ‘మీ రెబల్స్ లక్ష్యం ఏమిట’ని

‘నీ అందం!' అంటుంది శోభన. 

కొంపదీసి ఈ శోభన ఆ మానస్‌గాడి ‘అందం’ చూసి ప్రేమించి మోసపోయిందేమో అదే ఫ్లాష్‌బాకేమో అనుకుని తనకు టూకీగా అప్పటికప్పుడు అల్లేసి ‘ఇదీకథ’  అని చెప్పేశాను కూడా.

తను నా డొక్కలో ఒక్క పోటు పొడిచి నవ్వుతూ అంది. 

శోభన అన్నది ’నీ అంతం!’ అనిట. 

ఏమి ఖర్మమొచ్చి పడినదిరా నా తెలుగుకు? 

ఇక సినిమా మొత్తం తెలుగు భాషను మేకలు చింపిన వాల్‌పోస్టరులా తయారుచేసి పడేశారు. ఒక్కరంటే ఒక్కరికీ భాషపట్లసరైన అవగాహన, గౌరవం లేవు. ఎన్నో తెలుగు చిత్రాలను నందమూరి, అక్కినేని, నటశేఖరవంటి దిగ్గజాలతో నిర్మించిన నిర్మాత అశ్వనీదత్తు గారు ఏదీ వినబడకుండా మర్యాదపూర్వకంగా మార్షల్ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నట్టున్నారు. ఈ గొడవంతా ఆయనకు అనవసరమనేమో?

మనం నిజంగానే అదేదో గ్రహంలో ఉన్నామన్న భావన కలిగించడంలో దర్శకుడు ఈ డైలాగుల ద్వారా నూటికి రెండువందలపాళ్ళూ విజయం సాధించాడు.

మన కారుణ్య, హేమచంద్ర, రేవంత్, అనురాగ్‌లాంటి అచ్చతెలుగు గాయకులుండగా ఆడెవడో ఎదవ ‘మాదవా...!’ అని ఏడుస్తుంటే ఐనాక్సులో సీట్లు కోసెయ్యాలనిపించింది. డిస్గస్టింగ్!

బ్రహ్మానందం ఇక కామెడీకి పనికిరారని నాలుగేళ్లక్రితమే ఒక పోస్టులో వాపోయాను. ఆయననలా ఇబ్బంది పెట్టి, తద్వారా మనందరినీ విసిగించి, ఆఖర్న పాప్‌కార్న్ సైతం డోక్కునేలా చెయ్యగలగడం అవసరమా అధ్యక్షా?

సినిమాలో ఏదైనా బాగుందీ, ఉత్సుకత రేపిందీ అంటే అది కమలహాసన్ సన్నివేశాలు మాత్రమే. భయపెట్టాడు నిజంగానే!

అమితాబ్. ఆ వయసులో ఆయన చింపేశాడు, చంపేశాడూ అంటూ రివ్యూలు రాస్తుంటే ఏమిటో అనుకున్నాను. నూటికి తొంభైతొమ్మిది శాతం ఫైటింగ్ సన్నివేశాలే ఆయనవి. అవన్నీ గ్రాఫిక్సే కదా? ముఖంలో హావభావాలు చూపే సన్నివేశాల్లో ముఖం చుట్టూ గోనెపట్టా కప్పుకుని ఉంటాడు. ఇక ఏముంది చింపడానికి?

దీపికా పడుకొనే ఎప్పుడూ పడుకునే ఉంటుంది. కాసేపటి తరవాత బయటపడి కథను ముందుకు నడిపిస్తుంది. తనకు శోభిత డబ్బింగుట! 

కృష్ణుడికి అర్జున్‌దాస్ డబ్బింగ్ చెప్పాడు. అతగాడి వాయిస్ మహాద్భుతంగా ఉంటుంది. కానీ సాంబార్ వాసనేస్తూ తమిళయాసలో వినబడింది. అదేపని హేమచంద్ర చేసివుంటే చాలా చాలా బావుండేది.

విజయ్ దేవరకొండ కాసేపే కనబడి రిలీఫిచ్చాడు. చూట్టానికి అర్జునుడిలా చాలా బావున్నాడు.  రెండో భాగంలో ఏరకంగా మాటాడబోతున్నాడో ఊహించుకుని ఇప్పట్నించీ దడుపు జొరాలవీ తెచ్చుకోవడం అనవసరం.

పశుపతి, అన్నాబెన్‌ల సన్నివేశాలన్నీ మాడ్‌మాక్స్ సిరీస్‌లో కనబడేవే! మనం కూడా తియ్యగలమని నిరూపించుకోవాలని తాపత్రయపడినట్లున్నాయి అవన్నీ!

దిశా పఠానీయో, పల్లీ బఠానీయో, ఓ సాంగేసుకుని వెళిపోయింది. అంతే! ఏదో ఆ కాసేపూ పువ్వులూ, నీళ్ళూ కనబడ్డాయని ఆనందంతో కేరింతలు కొట్టింది తను.

సంబాలా వారి రహస్య స్థావరం, వారి వివరాలను చెప్పమంటూ వేధించడం, వారికోసమై ఒకరు పుడతారని ఎదురుచూడటం.... ఇదంతా నార్నియా సినిమాను గుర్తుకుతెస్తుంది. 

మొత్తానికి కల్కి చిత్రం మాకు తిక్కరేగేలా చేసింది. భారీతనం అడుగడుగునా కనబడినా అదంతా మనకు అర్ధంకాని రీతిలో ఉంటుంది. మధ్యమధ్యలో ఎవరెవరో వచ్చి ఏదేదో చేస్తూ ఉంటారు. అన్నీ యంత్రాలు. ఒక ముసలమ్మ తమలపాకులు తింటూవుంటుంది. చిలకజోస్యం చెప్పేవాడుంటాడు. 

ఎఆర్, విఆర్, ఎఐ.... అంటూ అన్నిరకాల టెక్నాలజీలనీ వాడేశారు. కానీ కంటతడి తెప్పించలేకపోయారు.

నానాజాతిసమితిలా లబ్ధప్రతిష్టులందరినీ పెట్టుకున్నారు. కానీ మనసారా నవ్వించలేకపోయారు.

ఇక రెండోభాగమంటూ ‘రేపటికోసం’ ఎదురుచూట్టం అనవసరం.  

ఇది కేవలం నా అభిప్రాయం. చీల్చి చెండాడి, తగువులకి రాకండి. నాకంత టైము లేదు. కొట్టడానికి బస్సులేసుకుని కాంప్లెక్సుకి వచ్చెయ్యకండి. అనవసరంగా యూనిట్లు దండగ! 

.......కొచ్చెర్లకోట జగదీశ్

నీలకంఠ దర్శనం

 "నీలకంఠ దర్శనం " 


చప్పుడు కాకుండా గేట్ తీసి, వరండా లో పేపర్ చదువుకుంటున్న సీతారామయ్య ఎదురుగా నించుని, చాలా మెల్లిగా " నాన్నా" అన్నాడు గౌతమ్. ఉలిక్కిపడి తలెత్తి చూసారు ఆయన. ఎదురుగా పెద్ద కొడుకు నవ్వుతూ నించున్నాడు. ఆయన మొహం విప్పారింది సంతోషంతో. 

"యశో, ఎవరొచ్చారో చూడు" అంటూ కేకవేసారు 

బయటకువచ్చినయశోదనుభుజాలచుట్టచేతులువేసి"అమ్మా,ఎలావున్నావు?"అడిగాడు. 

యశోద కొడుకు రెండు చెంపల మీద చేతులు ఉంచి, గౌతమ్ తలను వంచి నుదిటి మీదా, తల మీదా ముద్దుపెట్టింది. 

సీతారామయ్య , " ఇద్దరు బిడ్డల తండ్రి నీ పెద్ద కొడుకు" అన్నారు నవ్వుతూ. 

అయితే ఏం, నా కొడుకు నా కెప్పుడూ చిన్నవాడే" అంటూ "మీరుకూడా రండి, ముగ్గురం కాఫీ తాగుదాం " అంది వంటింట్లోకి వెళుతూ. 

"కోడలు,పిల్లలేరి రా" అడిగింది యశోద.

" అబ్బా, అమ్మా, వచ్చిన నన్ను పట్టించుకోకుండావాళ్ళ గురించి భాదపడతావేం? ,వస్తారులే రెండ్రోజులు ఆగి" నవ్వుతూ అన్నాడు గౌతమ్.

కాఫీ తాగాక, "పద నాన్న ఇల్లు చూద్దాము" అంటూ లేచాడు గౌతమ్. .

సీతారామయ్య కో ఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ గా చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరు కొడుకులు ఆయనకు. పెద్దవాడు గౌతమ్, రెండోవాడు శరత్. ఇద్దరూ టీచర్లుగా స్థిరపడ్డారు. సీతారామయ్యకు పెన్షన్ తక్కువ, మిగతా పెర్క్స్ ఎక్కువ, తండ్రి ద్వారా తనకు సంక్రమించిన నాలుగెకరాల భూమిని , పెద్ద పెంకుటింటినీ జాగ్రత్తగా కాపాడుకొంటూ వచ్చాడాయన. ఆయన తక్కువ రెంట్ కి ఇంటిని అద్దెకిచ్చి, ఇల్లు పాడవకుండా చూసుకున్నాడు. ఆరువందల గజాల్లో ఉన్న ఇల్లు అది. రిటైర్ అవగానే పల్లెటూరులో ఉన్న తన ఇంటికి మారిపోయాడు. కొడుకులిద్దరూ తమ దగ్గిర ఉండమన్నారు,ఆయన సున్నితంగానే వాళ్ళ కోరికను తిరస్కరించి, సొంత గూటికి చేరుకున్నారు. 

వుద్యోగం చేస్తున్నంత కాలం అద్దె ఇళ్ళల్లో నానా పాట్లు పడిన యశోద, మరోమాట లేకుండా ఆయనను అనుసరించింది. గృహ ప్రవేశానికి వచ్చారు గౌతమ్, శరత్ , మళ్ళీ ఇప్పుడే గౌతమ్ రావటం.

గృహప్రవేశానికివచ్చినప్పుడుసరిగాగమనించలేదకానీ,ఇల్లుపెద్దగానేఅనిపించిందతనికి.ముందు బంగాళా పెంకులతో పెద్ద వరండా, తరువాత పెద్ద హాల్, హాల్ కి అటు, ఇటు రెండు బెడ్ రూమ్స్ చిన్న నడవా తర్వాత వంటిల్లు, దేవుడి గది . రెండు బెడ్ రూమ్స్ కి వాటి ప్రక్కన ఉన్న చిన్న గదుల స్థానంలో అటాచెడ్ బాత్ రూమ్స్ కట్టించారు సీతారామయ్య. 

అప్పటికప్పుడు పూరీ, కూరా చేసింది యశోద. టిఫిన్ తిని తీరిగ్గా ఇల్లు చూడటానికి వెళ్ళాడు గౌతమ్. పెరటి లో బావివుంది.వంగి బావి లోకి తొంగి చూసాడు , నీళ్లు స్వచ్ఛంగా, పై దాకా వున్నాయి.బావి చుట్టూ చప్టాకట్టి వుంది. దాని ప్రక్కనే అరటి చెట్లు, నీళ్లు తోడి,వాడితే వాటికి వెళ్లే నీళ్లతో, పచ్చగా వున్నాయి. 

కూర అరటి, పండు అరటి రెండూ వున్నాయిరా, కూర అరటి గెలని మీరంతా దసరాకి వచ్చినప్పుడు కొద్దామన్నది అమ్మ, పండు అరటి దసరాకి మగ్గ పెడుతుందట మీ అమ్మ"

సీతారాం గారు చెబుతున్నారు. యశోద వాళ్ళ వెనక నుంచుని, "రెండూ మీరంతా వస్తాయని కాసాయిరా " అన్నది నవ్వుతూ. 

తల్లి కళ్ళల్లోకి చూసాడు గౌతమ్, దసరా కి అంతావస్తారన్న ఆశ, సంతోషం ఆ కళ్ళల్లో. , 

పెరట్లో గోడవారగా వరుస పందిళ్లు, కాకర, బీర, సొర, పొట్ల అన్నీ వున్నాయి. వంగ, టమాటా, మిర్చి రెండేసి వరుసలు వేశారు. అన్ని రకాల ఆకు కూరలు చిన్న, చిన్న మళ్ళలో వేశారు. 

వుత్తరం వైపు రెండు మామిడి చెట్లు , సపోటా, నిమ్మ వున్నాయి. మూడో మామిడి చెట్టు కొంచం చిన్నగా ఉందికానీ కాయలతో వున్నది. 

" ఆది పునాస మామిడి రా , నాన్న వచ్చినప్పుడల్లా ఏదో ఒక మొక్క నాటి వచ్చేవారట, ఇప్పుడివన్నీ మనకు చక్కగా అన్ని ఫలాలు ఇస్తున్నాయి" అమ్మ కళ్ళలో అంతులేని తృప్తి. ఇంటి ముందుకెళ్లారు. ఓ మూల పారిజాత మొక్క వున్నది, నిండా మొగ్గలతో. దాని క్రింద చాప పరిచి వుంది .గౌతమ్ చాప కేసి చూస్తుంటే, " అమ్మ పొద్దున్నే పారిజాతాలు అన్నీ ఏరి, మాల కట్టి కృష్ణ విగ్రహానికివేస్తుంది ఓపిగ్గా" అన్నాడు ఆయన నవ్వుతూ.

కనకాంబరాలు, బంతి చామంతి ఓ పద్ధతి ప్రకారం చిన్న, చిన్న మళ్ళలో వేశారు.రంగు, రంగుల గులాబీలు అక్కడక్కడా విరగపూసి వున్నాయి. సన్నజాజి, విరజాజి, మల్లె గోడవారగా పెద్ద పందిళ్లు వేసి వున్నాయి. 

"ఇది ఇల్లా లేక ఏదైనా పుష్ప వాటికా" అనుకొంటూ ఆశ్చర్యం తో చూస్తుండి పోయాడు గౌతమ్. 

హఠాత్తుగా అతనికి అలెగ్జాండర్ పోప్ రాసిన "ode on solitude " గుర్తుకు వచ్చింది.

 అది పోప్ పన్నెండో ఏట రాసిన పోయెమ్. 


" Happy the man whose wish and care 

a few paternal acres bound 

content to breath his native air

in his own ground "   


పుట్టి పెరిగిన వూరిలో పచ్చి గాలి పీలుస్తూ, ప్రకృతి ఒడిలో సేద తీరుతూ, తనకు అవసరమైన ఆహారాన్ని తానే పండించుకుంటూ ఉండేదే అసలైన జీవితమంటాడు కవి. ఇక్కడ solitude అంటే భాదాకరమైన ఒంటరితనం కాదు, పరిపూర్ణమైన జీవన శైలితో కూడిన పచ్చని జీవితమని " తన తల్లీ తండ్రీ సంతృప్తిగా, సంతోషంగా జీవిస్తున్నారని అర్ధమయ్యింది గౌతమ్ కి. 

మధ్యాహ్నం అరటి ఆకులో భోజనం. యశోద తండ్రీ కొడుకుని వంటిట్లోనుంచి కదలనీయలేదు. పెరటిలోని గోంగూర తో పచ్చడి, ముద్దపప్పు, కాచిన నెయ్యి, ఆవకాయ, ఫ్రెష్ మెంతి కూర వేసి వండిన వంకాయ కూర, పొట్లకాయ పెరుగు పచ్చడి, పొగలు కక్కుతున్న పొలంలో పండిన బియ్యపు అన్నం, గడ్డ పెరుగు , ఎన్నో రోజుల తర్వాత కమ్మటి భోజనం తిన్నానన్న తృప్తితో లేచి చేయి కడుక్కున్నాడు గౌతమ్. 

సాయంత్రం వీధి గుమ్మానికి అటూ, ఇటూ వేసిన అరుగుల మీదపెద్దవాళ్ళు కూర్చుని చీకటిపడిందాకా మాట్లాడుకుంటున్నారు. అమ్మ ఫ్రెండ్స్ అమ్మకి వున్నారు. తండ్రి అన్ని పనుల్లో తల్లికి సాయం చేస్తున్నాడు, ఆయన ఎప్పుడూ అంతే.

ఆ రాత్రి బాగానే నిద్ర పట్టింది గౌతమ్ కి. కానీ తెల్లవారుఝామున ఒక కల. ఆ కలలో  

తల్లీ, తండ్రీ తనెంత ఆగమన్నా ఆగకుండా వెళ్లిపోతున్నారు. ఇద్దరూ వయసు మీదపడి వంగిపోయి నడుస్తున్నారు. వాళ్ళిద్దరి రూపంలో ఎంతో మార్పు, చాలా దయనీయంగావున్నారు. నాన్న, వంగిపోయిన అమ్మ చుట్టూ చేయి వేసి , :మాకు మేము ఒకరికొకరం ఆసరా" అన్నట్టుగా నడుస్తున్నారు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు గౌతమ్.

చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు.. తర్వాత లేచి, లైట్ వేసి తమ్ముడు శరత్ కి మెసేజ్ పెట్టాడు.

"శరత్ నువ్వు, నేను మన భార్యల ఆలోచన సబబే అనుకుంటూ నాన్నని పొలం, ఇల్లు అమ్మి మనదగ్గిర ఉంచుకోవాలని, అలా వచ్చిన డబ్బుతో పెద్ద అపార్ట్మెంట్స్ కొని వాళ్ళని మనతో పాటు ఉంచుకొని చూసుకోవాలని అనుకొన్నాము. కానీ ఇక్కడికొచ్చాక అది ఎంత తప్పుడు ఆలోచనో నాకు ర్ధమయ్యింది. 

నాన్న , మనిద్దరినీ ప్రేమతో పెంచి, చదువు చెప్పించాడు. మన కోసం వాళ్లిద్దరూ ఎంత పొదుపుగా జీవించారో నీకూ తెలుసు. నాన్న తన తండ్రి ఇచ్చిన ఆస్తిని ఎంతో గౌరవం తో ప్రేమతో నిలబెట్టుకున్నాడు. ఈ ఇంటిలో కానీ, పొలం లో కానీ మనకు ఏ హక్కు లేదురా. వాళ్లకు మన అవసరం కలిగినప్పుడు మనం వాళ్ళని బాగా చూసుకొందాము. వాళ్ళ రూట్స్ ని మనం పెకిలించే ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గమనిపించింది నాకు. ఈ అందమైన ప్రకృతి వడిలో వాళ్ళు ఈజీగా ఇంకో ఇరవై ఏళ్ళు బ్రతుకుతారు. రేపు వెళ్లి వదినా, పిల్లలని తీసుకొస్తాను.సెలవలు రాగానే నేను వచ్చేసాను, నువ్వు నీ ఫ్యామిలి తో వెంటనే బయల్దేరి రాగలవు" అంటూ ముగించాడు.

 అనుకున్నట్టుగానే శరత్ కూడా వచ్చేసాడు. గౌతమ్ మణి నీ, శరత్ సౌమ్య నీ తాము అనుకొన్న ఏ విషయాన్నీ పెద్దవాళ్ళతో చెప్పవద్దని హెచ్చరించారు. యశోద, సీతారామయ్య సంతోషానికి అవధులు లేవు. పిల్లలు ఎంతో కుతూహలంగా తిరుగుతున్నారు తోటంతా. వాళ్ళ అంతులేని ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులిస్తున్నాడు తాత. అంతలో ఆయన దృష్టి మామిడి చెట్టుమీద పడింది. మామిడి కొమ్మల్లో పాలపిట్ట. ఆయన పిల్లలని అరవవద్దని చెప్పి, పెద్ద మనవడిని అందర్నీ రమ్మనమని చెప్పారు.

పాలపిట్టను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో అది ఎక్కడా కనపడటమే లేదు. యశోద సంతోషం తో అన్నది" ఎంత అదృష్టం, ఇంకా దసరా వారం ఉండగానే మనకు ఈ నీలకంఠ పక్షి దర్శనమయ్యింది.శంకరా" అంటూ చేతులెత్తి నమస్కరించింది. అప్రయత్నగా అంతా నమస్కరించారు. ".

పిల్లలకు పాల పిట్టకు రామాయణ, మహాభారతాలలో ఎంత ప్రాశస్త్యం ఉందొ , అదే మన రాష్ట్ర పక్షి "అని వివరిస్తున్నాడు సీతారామయ్య. 

గౌతమ్ అనుకున్నాడు" అవును, నిజంగా అదృష్టమే, విజయానికీ, శాంతికి , శుభసూచకం ఈ పక్షి కనబడటం, అమ్మా,నాన్న గురించి తమకున్న ఆందోళనీ ఆలోచనల లోని అశాంతిని తొలగి పోయేలా దర్శనమిచ్చింది i " అనుకొంటూ ఆ పక్షి కేసి చూస్తూ నమస్కరించాడు. 


*భవానీ కుమారి బెల్లంకొండ*

03.07.2024. బుధవారం

 *భరత మాతకు జయము*

*శుభోదయం..🚩🚩*


03.07.2024.       బుధవారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు జ్యేష్ఠ మాస బహుళ పక్ష *ద్వాదశీ* తిథి ఉ.07.10 వరకూ తదుపరి త్రయోదశి తిథి,*రోహిణి* నక్షత్రం రా.04.07 వరకూ తదుపరి *మృగశీర్ష* నక్షత్రం,*శూల* యోగం ఉ.09.02 వరకూ తదుపరి *గండ* యోగం, *తైతిల* కరణం ఉ.07.10 వరకూ, *గరజి* కరణం సా.06.29 తదుపరి *వణిజ* కరణం ఉంటాయి.

*సూర్య రాశి*: మిథున రాశిలో  (ఆరుద్ర నక్షత్రంలో)

*చంద్ర రాశి*: వృషభం లో.

*నక్షత్ర వర్జ్యం*: రా.08.18 నుండి రా.09.52 వరకూ

*అమృత కాలం*: రా.1.00  నుండి రా.02.33 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.46

*సూర్యాస్తమయం*: సా.06.55

*చంద్రోదయం*:రా.03.52

*చంద్రాస్తమయం*: సా.04.39

*అభిజిత్ ముహూర్తం*: లేదు

*దుర్ముహూర్తం*: ఉ.11.54 నుండి మ.12.47 వరకూ.

*రాహు కాలం*: మ.12.21 నుండి మ.01.59 వరకూ

*గుళిక కాలం*: ఉ.10.42 నుండి మ.12.21 వరకూ

*యమగండం*: ఉ.07.25  నుండి 09.03 వరకూ


నిన్న ఏకాదశీ ఉపవాసం ఉన్నవారికి, ఈ రోజు పారణ సమయం సూర్యోదయం నుండీ  ఉదయం 07.10 వరకూ ఉంటుంది.


శుక్ల యజుర్వేదం,వాజసనేయీ సంహిత, కన్వ అధ్యాయం ప్రకారం, జ్యేష్ఠ బహుళ పక్ష ద్వాదశీ రోజు *కూర్మ జయంతి*. కాబట్టి శుక్ల   యజుర్వేదికులు ఈరోజు కూర్మ జయంతిని జరుపుకుంటారు.


ఈరోజు *మాస రోహిణీ వ్రతం*. జైన స్త్రీలు ప్రతి నెలా వచ్చే రోహిణీ నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉపవాసం ఉంటారు.


ప్రదోష సమయం లో త్రయోదశి తిథి ఉన్న కారణం గా, ఈ రోజు  *ప్రదోష వ్రతం*. శివ భక్తులు ప్రదోష సమయం లో రుద్రాభిషేకం చేస్తారు.


*సర్వార్థ సిద్ధి యోగం* ఈరోజు పూర్తి గా ఉంటుంది. ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, క్రొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం.


నారాయణ స్మరణం తో.....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నంబర్:6281604881.

జాగ్రత్త

 😭🙏::_*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*_


*హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి.*


మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తె హాస్పిటల్ లో అడ్మిట్ కావద్దు.


ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు. అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.


👤చాలా మంది  కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. పైన ఉన్నంత అందమైనది కాదు.


 మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా అబద్ధాలు అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్.


డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం అబద్దం. ముప్పై శాతమే నిజం.


SP బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.


😌ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. అదేదో హోటల్ అనుకున్నాడు. అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.రెండు కోట్లు  బిల్లు వసూలు చేశారు. శవాన్ని ఇచ్చారు.


దాసరి నారాయణ రావు, జయలలిత....ఇలా చాలా మంది చావుకు   రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, భయంకరమైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.


 తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు. వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. అది తప్పు.


అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి  కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది? 


ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా??


అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి ఆయన.


అందుకే మిత్రులారా హాస్పిటల్... అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి. సెకండ్ opinion తీసుకోండి. ఊరకే జొరబడ వద్దు.


అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం. కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.

కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి. ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు. హాస్పిటల్ కు పోతే రేపే ....


*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*


*అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ.*

________________________________

💯% Correct ఎన్ని గ్రూప్ లకైనా షేర్ చేయొచ్చు ఇది సగటు భారతీయుని మనస్సు లోని మాట, ఆవేదన, నగ్నసత్యం మన ప్రియతమ గౌరవ రాష్ట్రపతి మరియు ప్రధాని గార్లకు చేరేవరకు భారతఫౌరుని బాధ్యత గా బావించి  షేర్ చేద్దాం మిత్రులారా.......

అనురాగం కోరుకుంటారు

 *2028*

*కం*

రోగము లేనట్టి తతుల

రోగులనట ఛీదరించు రుగ్మత నున్నన్

రోగము తానొందగ నను

రాగము కోరుదురు జనులు  రయమున సుజనా.

*భావం*:-- ఓ సుజనా! రోగము తనకి లేనప్పుడు రోగులను చీదరించుకున్ననూ తనకు రోగం వచ్చినప్పుడు మాత్రం వెంటనే అనురాగం కోరుకుంటారు.  (తతి= సమయం/తరుణం).

*సందేశం*:-- రోగులను చూసి జాలిపడకపోయినా అసహ్యించుకోకుండా ఉంటే మనకు రోగం వచ్చినప్పుడు కనీసం అనురాగం పంచేజనులు దగ్గర కు రాగలరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

గుండెపోటుమరణాలు

 భారతదేశంలో గుండెపోటుమరణాలు   కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా  ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తుంచుకోండి.

 అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలోని హృద్రోగులకు వేలకోట్ల విలువైన మందులను విక్రయిస్తున్నాయి.

 కానీ మీకు ఏదైనా గుండె సంభందించి సమస్య ఉంటే, డాక్టర్ యాంజియోప్లాస్టీ చేయించుకోమని చెబుతారు.

 ఈ ఆపరేషన్‌లో, డాక్టర్ గుండె ట్యూబ్‌లో *స్టంట్* అని పిలువబడే స్ప్రింగ్‌ను చొప్పిస్తారు.

 ఈ స్టంట్ అమెరికాలో తయారు చేయబడుతుంది. మరియు దీని ఉత్పత్తి ధర కేవలం రూ.150-180.

 ఈ స్టంట్‌ను ఇండియాకు తీసుకొచ్చి 3నుంచి5 లక్షల రూపాయలకు విక్రయించి దోచుకుంటున్నారు.

 డాక్టర్లకు లక్షల రూపాయల కమీషన్ వస్తుంది. అందుకే యాంజియోప్లాస్టీ చేయించుకోమని పదే పదే అడుగుతారు.

 కొలెస్ట్రాల్, *బిపి* లేదా గుండెపోటుకు యాంజియోప్లాస్టీ ఆపరేషన్ ప్రధాన కారణం.

 ఇది ఎవరికీ ఎప్పుడూ విజయవంతం కాదు.

 ఎందుకంటే డాక్టర్ హార్ట్ ట్యూబ్ లో పెట్టే స్ప్రింగ్ బాల్ పాయింట్ పెన్ను స్ప్రింగ్ లాంటిది.

 అయితే కొన్ని నెలల్లోనే ఆ స్ప్రింగ్‌కి రెండు వైపులా  కొలెస్ట్రాల్ మరియు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.

 దీని కారణంగానే రెండోసారి గుండెపోటు వస్తుంది.

 మళ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని డాక్టర్‌ చెపుతారు.

 లక్షల రూపాయలు దోచుకుని నీ ప్రాణం తీస్తారు.

 ●●●●●●●●●●●●●●●●

 ఆయుర్వేద చికిత్స●

 *అల్లం రసం -* 

 ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.

 ఇది సహజ పద్ధతిలో నొప్పిని 90% తగ్గిస్తుంది.●

 *వెల్లుల్లి రసం* ●

 ఇందులో ఉండే *అల్లిసిన్* మూలకం కొలెస్ట్రాల్ మరియు బీపీని తగ్గిస్తుంది.

 దాంతో హార్ట్ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి.●

 *నిమ్మరసం* ●

 ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి.

 ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్●

 ఇందులో 90 రకాల మూలకాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని అన్ని నరాల *బ్లాక్సు* ను తెరుస్తాయి, కడుపుని శుభ్రపరుస్తాయి. మరియు అలసటను తొలగిస్తాయి.

 ●ఈ దేశీయ ఔషధాలు

ఇలా ఉపయోగించండి ●●

 1- ఒక కప్పు నిమ్మరసం తీసుకోండి;

 2- ఒక కప్పు అల్లం రసం తీసుకోండి;

 3- ఒక కప్పు వెల్లుల్లి రసం తీసుకోండి;

 4-ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి; ●●నాలుగింటినీ కలపండి. మరియు తక్కువ మంట మీద వేడి చేయండి, 3 కప్పులు మిగిలి ఉన్నప్పుడు, దానిని చల్లబరచండి;

 ఇప్పుడు మీరు

 దానికి 3 కప్పుల తేనె కలపండి.

 ●ఈ ఔషధం 3 స్పూన్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.

 అన్ని బ్లాక్సు open అయిపోతాయి.

 ●●●●●●●●●●●●●●●●

 ప్రతి ఒక్కరూ ఈ ఔషధంతో తమను తాము  రక్షించుకోండి.

 ●●●●●●●●●●●●●●●●

 గుండెపోటును ఎలా నివారించాలలి?          ●●●●●●●

 గుండెపోటు సమయంలో చాలా మంది ఒంటరిగా ఉంటారు కాబట్టి, వారికి ఎటువంటి సహాయం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

 గుండె పోటురాగానే మూర్ఛపోవడం ప్రారంభమవుతుంది. కేవలం 10 సెకన్లు మాత్రమే ఉంటాయి.

 అటువంటి స్థితిలో, బాధితుడు తీవ్రంగా దగ్గాలి. దగ్గు చాలా బలంగా ఉండాలి.

 ఛాతీలోంచి ఉమ్మి వచ్చేంతవరకు దగ్గాలి.

 సహాయం వచ్చే వరకు

  ప్రక్రియ పునరావృతం చేయాలి.

 తద్వారా హార్ట్ బీట్ సాధారణంగా 

గట్టిగా దగ్గడంవలన ఊపిరితిత్తులు శ్వాస

 ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది

బిగ్గరగా దగ్గడం వల్ల

 గుండె కుంచించుకుపోయి

 రక్త ప్రసరణ క్రమం తప్పకుండా

 నడుస్తుంది.

ఉత్తమమైనది

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 శ్లో𝕝𝕝 *భీతేభ్యశ్చాభయం దేయం*

       *వ్యాధి తేభ్యః స్తధౌషధం* |

      *దేయ విద్యార్థీనాం విద్యా* 

      *దేయ మన్నం క్షుధార్థినాం* ||


తా𝕝𝕝 *భయము చెందిన వానికి అభయదానము, రోగ పీడితులకు ఔషధ దానము, విద్యార్ధులకు విద్యాదానము, ఆకలిగొన్న వారికీ అన్నదానము చేయుట ఉచితమైనది, ఉత్తమమైనది*.....


 ✍️🌷🌹💐🙏

దుర్యోధనుని కూతు

 🙏🙏🙏🙏🙏

దుర్యోధనుని కూతురు లక్ష్మణను పెండ్లిచేసుకొన్న శ్రీకృష్ణుని కొడుకు ఎవరో మరి.

🦚🦚🦚🦚🦚

శ్రీకృష్ణుణుకి ఎనిమిది మంది భార్యలు. వారిపేర్లు (1) రుక్మిణి, (2) సత్యభామ, (3) జాంబవతి, (4) నగ్నజితి, (5) కాళింది, (6) మిత్రవింద, (7) భద్ర, (8) లక్ష్మణ. వీరినే అష్టభార్యలంటారు 

శ్రీకృష్ణుడి అష్టభార్యలకు ప్రతి ఒక్కొక్కరికి పదిమంది కొడుకులు జన్మించారు.

వారెవరంటే 


పట్టపుమహిషి రుక్మిణిదేవికి శ్రీకృష్ణునికి (1) ప్రద్యుమ్నుడు, (2) చారుదేష్ణుడు, (3) సుదేష్ణుడు, (4) చారుదేహుడు, (5) సుబారుడు, (6) చారుగుప్తుడు, (7) భద్రకారుడు, (8) చారుచంద్రుడు, (9)  విచారుడు, (10) చారుడు అనే కొడుకులు కలిగారు. 


వీరిలో ప్రద్యుమ్నుడి సంతానమే  శ్రీకృష్ణుని వారసులుగా ద్వారకనేలుతారు.


సత్యభామ వల్ల కృష్ణునికి (1) భానుడు, (2) సుభానుడు, (3) స్వర్భానుడు, (4) ప్రభానుడు, (5) భానుమంతుడు, (6) చంద్రభానుడు, (7) బృహద్భానుడు, (8) అతిభానుడు, (9) శ్రీభానుడు, (10) ప్రతిభానుడు అనువారు కలిగారు.


జాంబవతీ శ్రీకృష్ణులకు (1) సాంబుడు, (2) సుమిత్రుడు, (3) పురజిత్తు, (4) శతజిత్తు, (5) సహస్రజిత్తు, (6) విజయుడు, (7) చిత్రకేతుడు, (8) వసుమంతుడు, (9) ద్రవిడుడు, (10) క్రతువు  కలిగారు. 


సాంబుడు దుర్యోధనుని కుమార్తె లక్ష్మణను స్వయంవరంలో అపహరించి, కౌరవులతో పోరాడి ఓడి బందీగాదొరికి పెదనాన్న బలరాముడి ద్వారా విడుదలైతాడు. దుర్యోధనచక్రవర్తి తన గురువు  బలరాముడి మాటలను గౌరవించి సాంబుడికి తన  కుమార్తె లక్ష్మణను ఇచ్చి పెండ్లిచేశాడు.ఇలా శ్రీకృష్ణదుర్యోధనులు వియ్యంకులైనారు.


సాంబుడు అతని సహచరులు దుర్వాసుని గేలి చేయడం వలన ఆ మహముని శాపంతో సాంబుడి కడుపున ముసలం (రోకలి ) పుట్టి అశేషంగా యదువంశం నశిస్తుంది.

 

నాగ్నజితి, శ్రీకృష్ణులకు (1) వీరుడు, (2) చంద్రుడు, (3) అశ్వసేనుడు, (4) చిత్రగుడు, (5) వేగవంతుడు, (6) వృషుడు, (7) లముడు, (8) శంకుడు, (9) వసుడు, ( 10 ) కుంత  అనువారు కలిగారు. 


శ్రీకృష్ణుడికి కాళింది వలన (1) శ్రుతుడు, (2) కవి, (3) వృషుడు, (4) వీరుడు, (5) సుబాహుడు, (6) భద్రుడు, (7) శాంతి, (8)  దర్శుడు, (9) పూర్ణమానుడు, (10)  శోమకులు  జన్మించారు. 


లక్షణకు, శ్రీకృష్ణుడికి (1) ప్రఘోషుడు, (2)  గాత్రవంతుడు, (3) సింహుడు, (4) బలుడు, (5) ప్రబలుడు, (6) ఊర్ధ్వగుడు, (7) మహాశక్తి, (8) సహుడు, (9) ఓజుడు, (10) అపరాజితుడు అనేవారు కలిగారు.


మిత్రవింద, శ్రీకృష్ణులకు (1) వృకుడు, (2) హర్షుడు, (3) అనిలుడు, (4) గృద్ధుడు, (5) వర్ధనుడు, (6) అన్నడు, (7) మహాశుడు, (8) పావనుడు, (9) వహ్ని, (10) క్షుధి  పుట్టారు.


శ్రీకృష్ణ భద్రలకు   (1) సంగ్రామజిత్తు, (2)  బృహత్సేనుడు, (3) శూరుడు, (4) ప్రహరణుడు, (5) అరిజిత్తు, (6) జయుడు, (7) (9) సుభద్రుడు, (8) వాముడు, ఆయువు, (10) సత్యకుడు అనేవారు కలిగారు.


శ్రీకృష్ణుడికి అష్టభార్యల వలన కలిగిన కొడుకుల సంఖ్య > 80.

🙏🙏🙏🙏🙏

మహాపాత కాలను పోగొట్టే

 🙏🙏🙏🙏🙏

🌼పంచ మహాపాత కాలను పోగొట్టే పారిజాతపుష్పం🌼


పారిజాత పుష్పాలు 9రకాలు

🌼🌼🌼🌼🌼


1.ఎర్ర(ముద్ద)పారిజాతం

2.రేకు పారిజాతం

3.తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)

4.పసుపు పారిజాతం

5.నీలం పారిజాతం

6.గన్నేరు రంగు పారిజాతం

7.గులాబీరంగు పారిజాతం

8.తెల్లని పాలరంగు పారిజాతం

9.ఎర్ర రంగు పారిజాతం


ఎరుపు రంగు పారిజాతం తో విష్ణువును ఆరాధించరాదు.

ఎరుపు తమోగుణం

విష్ణువు సత్వగుణం.


పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి.

చెట్టు నుండి కోసి వాడరాదు.


పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగు కోకూడదని వరం పొందినది.


రంగు,..వైశాల్యం,..గుణం,దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి.


ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు.

ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.


భూ స్పర్శ,

మృత్తికా(మట్టి)స్పర్శ

జల స్పర్శ

హస్త స్పర్శ

తరువాత స్వామి

స్పర్శ.

ఈ 5 స్పర్శల తోను

పంచ మహా పాతకాలను

పోగొట్టేదే పారిజాతం.

🌼🌼🌼🌼🌼

ముఖ్యమైన విషయాలు

 🙏🌟🌟🌟🙏

*కొందరికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు...*


*పూజ* :-పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణ ఫలాన్నిచ్చేది.


*అర్చన*:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయ మైనది, దేవతలను సంతోషపెట్టేది.


*జపం*:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జివుణ్ణి , దేవుణ్ణి చేస్తుంది.


*స్తోత్రం*:- నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.


*ధ్యానం*:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.


*దీక్ష*:- దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది.సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.


*అభిషేకం* :- అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగు తాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరా తత్వాన్ని అందిస్తుంది.


*మంత్రం*:- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి నీ ఇస్తుంది.


*ఆసనం*:- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.


*తర్పణం*:- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


*గంధం*:- గంధంలో  సర్వ దేవత కొలువై ఉన్నారు. మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ అని దేవతలంతో అమ్మవారిని కోరారు. 


అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.


*అక్షతలు*:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ,నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.


*పుష్పం*:- పుణ్యాన్ని వృద్ధిచేసి, పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి.

మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది.


(ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగాతొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి.


*ధూపం:*- చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ప్రేత , పిశాచాలు పారిపోతాయి.


*దీపం*:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. 


పూజగది.

🙏🌟🌟🌟🙏

మనం_హిందువులం

 హిందూ బంధువులారా ...#మనం_హిందువులం అన్న మాటే గానీ ఇంతవరకూ మనలో చాలా మందికి మనదేశంలో మరియు వేరే ఇతర దేశాల్లో మన #హిందూ_సంస్థలు ఎన్ని? ఎంత వరకు పనిచేస్తున్నాయో? వాటి #ఉద్దేశాలేమిటి? అన్న అంశాలే  తెలియదంటే #హాస్యాస్పదమే! అంతెందుకూ... మన ఉభయ తేలుగు రాష్ట్రాల్లో ఉన్న సంస్థలు కూడా సరిగ్గా తెలియవు #మనలో చాలా మందికి. ఇక్కడ నేను సేకరించిన సమాచారం ప్రకారం కొన్ని #హిందూసంస్థల పేర్లు చెబుతాను మీకు నచ్చితే మీ దగ్గరలోని కార్యాలయాలకు వెళ్లి లేదా facebook లాంటి మాధ్యమం ద్వారా నైనా సంప్రదించి అక్కడ #సభ్యులుగా చేరండి !


●#RSS = రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

●#రాష్ట్రా సేవిక సమితి

●#హిందూ వాహిని 

●#హిందూ యువ వాహిని

●రాష్ట్రీయ సేవా భారతి 

●సహకార భారతి 

●విజ్ఞాన భారతి 

●సంస్కృతభారతి 

●#సంస్కార భారతి 

●#స్వదేశీ జాగరణ్ మంచ్ 

● #VHP = విశ్వహిందూ పరిషత్

●#ABVP=అఖిల భారత విద్యార్థి పరిషత్

●రాష్ట్ర ధర్మ ప్రకాషన్

●వనవాసి కళ్యాణ ఆశ్రం 

●#విద్యాభారతి 

●ఆరోగ్య భారతి

●రామకృష్ణా మిషన్ / మఠం 

● #భజరంగ్ దళ్ 

● గోరక్షా దళ్

● స్వాధ్యాయ్

●#శివశక్తి 

●#హిందూ జనశక్తి 

● #రాష్ట్రీయ శివాజీ సేన

● హిందూ పరివార్

● రామదండు

● ధర్మవీర్

● హైందవ శక్తి

● హైందవ సైన్యం

● పరుశురాం పరివార్ 

● గాయత్రీ పరివార్

● RHS = రాష్ట్ర హిందూ సేన 

● RDS= రాష్ట్రీయ దళిత సేన

● RDS

● RHP

● శ్రీ రామ సేన 

● రాష్ట్రీయ వానర సేన

● కురుక్షేత్రం

● మోక్షగీత

● మన గుడి

● హిందూ చైతన్య సమితి

● హిందూ ధర్మచక్రం

● ధానధర్మ చారిటబుల్ ట్రస్టు, 

● ఆంధ్రప్రదేశ్ హిందు దేవాలయాల పరిరక్షణ సమితి,

● ధర్మ వీర్

● ధర్మ సింధు

● ధర్మ ధ్వజం

● శివాజీ సైన్యం,

● హిందు నేషనల్ ట్రస్టు బ్యాంక్,

● జాంభవ జన జాగృతి సేన,

● జాంభవ సమాజం,

● జాంభవ ఉత్సవ కమీటి,

● హిందుస్థాన్ మోడీజమ్,

● సనాతన ధర్మ వేదిక,

● ఆది జాంభవ శ్రీరామ సైన్యం,

● సనాతన ధర్మం వేధం,

● జాంభవ సేన,

●  ఓ హిందు మేలుకో,

● ధర్మ జాగరణ సమితి ఆంధ్రప్రదేష్

● శ్రీరామ సైన్యం,

● హిందుస్థాన్ సమాచార్ 

● భారత వికాస్ పరిషత్

● అఖిల భారత సాహిత్య పరిషత్

● భారతీయ శిక్షణా మండల్ 

● ప్రజ్ఞా ప్రవాహ్

● #సామాజిక సమరసతా మంచ్ 

● భారతీయ ఇతిహాస సంకలన యోజన 

● పూర్వసైనిక సేవా పరిషత్ 

● భారతీయ కుష్టు నివారక సంఘ్ 

● సక్షమ 

● క్రీడా భారతి 

● లఘు ఉద్యోగ భారతి 

● అధివక్తా పరిషత్ 

● రాష్ట్రీయ సిఖ్ సంగత్ 

● దీన్ దయాళ్ శోభా సంస్థాన

● బాబా సాహెబ్ ఆప్టే స్మారక సమితి

● వివేకానంద కేంద్రం

● బాలకుటీర్ 

● మాతృ మండలి

● ధర్మజ్యోతి సేవా సంఘ్

● బాల సంస్కార కేంద్ర 

● సుదర్శన మహాసేన

● శ్రీ వేద నారాయణ ధర్మ రక్షణ సమితి

●AP రాష్ట్ర సాధు పరిషత్.

● #BJP= భారతీయ జనతా పార్టీ.  

ఇవే గాక ఇంకా 180 హిందూ సంస్థలు పనిచేస్తున్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు?


ఇక్కడ భారతదేశంలో #RSS సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో పనిచేసే హిందూసంస్థల పేర్లు 80% చెప్పాను. మిగతావి కూడా  హిందువుల కోసం పనిచేస్తున్న స్వతంత్ర్య భావాలు, స్వంత #సిద్ధాంతాలు గల సంస్థలు. ఇదంతా ఎందుకంటే రానున్న దశాబ్దకాలంలో  "హిందూ జనాభా తగ్గి" అన్యుల జనాభా పెరిగి మనం మైనారిటీలో పడిపోయే ప్రమాదమున్నది కాబట్టే . మాకెందుకులే అనే భావంతో ఇంతకుముందు ఇన్నాళ్లూ ఉన్నారేమో.. రాను రానూ తెలుగు రాష్ట్రాలు కూడా కేరళ, పశ్చిమ బెంగాల్ లా తయారయ్యే అవకాశముంది. కావున... ఇక ముందు మీరలా ఉండే అవకాశం లేదు  ఇప్పటికీ మించి పోలేదూ.. ఏదో ఒక హిందూసంస్థలో సభ్యులుగా చేరండి మనలను-మనం. మన హిందూ జాతిని రక్షించుకోవాలంటే ఎదో ఒక #హిందూసంస్థల్లో చేరడమే ఉత్తమము .రోజు రోజుకీ హిందుత్వ #కుదించుకు  పోతుందనే భావనతో... 

🌹🌹🌹🌹🌹

(సేకరణ)

రచనలు

 *రచనలు -  సభ్యుల స్పందన*.




మానవ అస్థిత్వములో  రచనలు అత్యంత కీలకమని  జ్ఞాన గ్రహణకు, అవగాహనకు ఇతివృత్తాలు అవసరమని ఇప్పటికే రూఢి అయిన విషయము యధార్థం.


రచన అనేది విశ్వజనీనము. అవి ప్రపంచములో, ఆ దేశపు స్థానాన్ని, ఆ రచయిత  స్థానాన్ని  తెలియ జేస్తాయి.  ప్రజలు ఎలా ఉండాలో గూడా ఉత్తమ, ఆదర్శ రచనలు  నేర్పుతాయి. రచయితల దృక్పథాన్ని రూపకల్పన చేస్తాయి. అందులోని సారాన్ని జనులకు తెలియజేస్తాయి, నైతికాంశాలను ప్రస్తావిస్తాయి.


భారతీయ రచనా సంప్రదాయంలో  రచనలు  మానసికంగా  రచయితలలో జీవిస్తాయి. వాటిని ప్రక్క వాళ్లకు (సమాజానికి) వినిపించటం ఆ రచయిత బాధ్యత.


*కొన్నిటిని మన కొరకు మాత్రమే ఉంచుకోవడము కుదరదు. ముఖ్యంగా ఆహారాన్ని, విద్యను, కళలను, సమాజ హితాన్ని ఇతరులకు గూడా ఇవ్వాలి, పంచాలి*.


రచన అనేది కేవలము వినోదాలకు, ఉల్లాసాలకు, ఉద్రిక్త, భావావేశాలు కల్గించుటకు మాత్రమే కాదు. అది చాలా ముఖ్యమైన సామాజిక బాధ్యత. *రచనలు సమాజ ఉద్ధరణకు తోడ్పడాలి*.


*రచనలలో  వేద, పురాణ, ఆధ్యాత్మిక అంశాలపై భాష్యాలు, అర్థ సహిత తాత్పర్యాలు, కథలు, గాథలు, అనువాదములు, కల్పితాలు, చారిత్రకాలు, పరిశోధనా గ్రంథాలు, ఆత్మ కథలు, సృజనాత్మకాలు,  గేయాలు, కావ్యాలు వగైరా వగైరా* 


*మన వద్ద నున్న ఊహాశక్తిని, జ్ఞానాన్ని  అందరికీ పంచక పోతే మనము సామాజిక బాధ్యతను విస్మరించినట్లే*.

 కథలు, నాటకాలు, రచనలు చదువరుల అనుభూతులకు సంబంధించినవి, వారిలోని చిత్తాన్ని  ప్రక్షాళన గావించి, కల్మశాన్ని తొలగించి ఆ వ్యక్తిని అజ్ఞానము నుండి విముక్తుడిని చేస్తాయి.


మూల్యాంకనము, పునర్మూల్యాంకనము, నిర్ధారణ, పునర్నిర్ధారణనలు, ప్రగతి మార్గంలో పయనించే వ్యక్తులు చేసే పనులు.

*సాహితీ మార్గములో ఈ పనులు చేసేది విమర్శకుడు*. సృజన కారుడికి ఉన్నట్లే విమర్శకునికి గూడా ఒక ధృక్పథం ఉంటుంది. *మెరుగైన సాహిత్య ప్రస్థానము కోసమే విమర్శ*.  రచనకు  సంబందించిన విషయ పరిచయం, సమీక్ష, విశ్లేషణ, విమర్శ అనే పేరు మీద జరిగే తతంగమే విమర్శ. *రచనలు ఎట్లున్నవో, ఎట్లా ఉండాలో చెబుతుంది విమర్శ*.కవులు, రచయితలకంటే నిశ్చయంగా *విమర్శకుడు* (CRITIC) అధికుడు.


సమాజము - సాహిత్యము రెండు వస్తు - శిల్పాలాగా పరస్పరాధారితాలు. 

ఈ మధ్యన చాలా వరకు శిల్పాన్ని వదిలి  వస్తువు గురించి మాట్లాడుతున్నారు.

"వస్తువు" కళగా మారటంలో తోడ్పడేది "శిల్పము". "వస్తువు" సాహితీ రూపంగా మారడానికి దోహద పడేది కూడా "శిల్పమే". *వస్తువును గ్రహించడము కొంత సులభమే, కానీ శిల్పాన్ని సాధించడము కష్టము*.అవుతే ఈ మధ్యన *శిల్పముపై* దృష్టి పెట్టే రచయితలు తక్కువగా కనిపిస్తున్నారు.


ఎవరో మెచ్చాలని పూవు పూయదు, పరిమళించదు.  పూవు పూయడం, పరిమళించడం దాని స్వభావం. ప్రకృతి తన సహజ పద్ధతులలో ముందుకు సాగుతూ ఉంటుంది. ఆలాగే రచయితలు ఎవరో మెచ్చాలని రచనలకుపక్రమించరు. రచయితల వ్యక్తిత్వం, అవగాహన, మూర్తిమతత్వం, సంస్కృతి, ప్రపంచ జ్ఞాన మిశ్రమాలతో రచనలు వెలువడుతాయి. 


రచనలను మెచ్చుకునుట, ప్రోత్సహించుట వలన రచయితలలోని శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను మరింత వెలికితీయడానికి, మరింత సాన బెట్టడానికి దోహదం చేస్తాయి. చదువరుల ప్రశంస మరియు మెప్పుదల రచయితకు శక్తికారకాలు. *ఇంతే కాకుండా రచనలను మెచ్చుకునుట వలన ఆయా విషయాలపై మనకున్న అవగాహన, మన ప్రతిభ, మన సంస్కారము కూడా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి*. 


సంప్రదాయ పరిరక్షణ, సమాజ నిర్మాణ,  సమాజ జాగృతి, సమాజాభివృద్ధి రచనలను ప్రత్యేకంగా  ఆదరిద్దాము, రచయితలను ప్రశంసిద్దాము.


ధన్యవాదములు.