11, జూన్ 2024, మంగళవారం

పుత్రోత్సాహం



                   *పుత్రోత్సాహం

                    ➖➖➖✍️


"అమ్మా ! నువ్వు ఇలా నిర్లిప్తంగా కూర్చుని ...నీ ప్రమేయం లేదు అన్నట్టుంటే ...నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు! నాన్నలేని లోటు పూరించడం కష్టమే కానీ,  నీ మౌనం భరించడం ఇంకా కష్టంగా ఉంది!  అన్ని ఏర్పాట్లు చేసినా ఇంకా ఏదైనామిస్ అయ్యామేమోనని మనసు పీకుతోంది. 12వ రోజు సమారాధన కోసం నాన్నకు ఇష్టమైన ఐటమ్స్ కొన్ని పురమాయించాను! నువ్వు కూడా కొన్ని విషయాలు చెప్తే నాకు బాగుంటుంది!" 


కొడుకు సురేంద్ర మాటలకు దీర్ఘంగానిట్టూర్చింది వర్ధని!


"నాకేం తెలుసురా ఏం చెప్పాలో !ఇన్నాళ్లు నాన్న ఏది చెప్తే అదే మనం  చేసాం. ఆయన ఈ లోకాన్ని విడిచి పోయినా ఆయన ఇష్టాయిష్టాలు ఇంకా నువ్వు గౌరవిస్తున్నావ్ అంటే, అది మా పూర్వజన్మ సుకృతం! నీకు ఏది బాగుంది అంటేఅదే చెయ్యి నాయనా!"


"ఆయనతోనే నా జీవితం అయిపోయింది. 45 ఏళ్ల దాంపత్యంలో చిన్నపిల్లలా ఆయన చిటికెన వేలు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాను. ఆయన ఏది మంచిది అంటే అదే చేశాను. నాకంటూ ప్రాథమ్యాలు, ప్రాధాన్యతలు ఉంటాయనికూడా నాకు తెలియదు! సుమంగళి గా ఉండాలని పూజలు చేశాను, నోములు నోచాను.  ఇహ ఆ భాగ్యం లేకుండాపోతోంది !నన్ను బోడమ్మను చేసి ఇంట్లో కూర్చో పెడతారు! ".. ‌ ఆఖరి మాటలు అంటుంటే దుఃఖం తన్నుకొచ్చింది వర్ధనికి! 


తల్లి మాటలకు కలతచెంది ఆర్ద్రతతో ఆమె తలను తన చేతులతో చుట్టి, గుండెకు పొదువుకున్నాడు కొడుకు! 


"నాన్నలేకపోతే ఏంటమ్మా నేనున్నాను కదా నీకు! నేను అన్నీ చూసుకుంటాను !బెంగ పడకు!"... అంటూ మాటిచ్చాడు సురేంద్ర!


బంధుమిత్రులు, ఇరుగుపొరుగు లు ఎంత ముఖం చిట్లించినా.. తన తల్లి తన మంగళ చిహ్నాలను తీయడం లేదనిసుస్పష్టం చేశాడు!. ఎందుకో ఆమెకే మనసొప్పక మంగళసూత్రాలు, నల్లపూసలు, మట్టెలు తీసేసింది వర్ధని! 


తల్లిని దర్జాగా తీసుకువచ్చి తండ్రి కూర్చునే సోఫా లో కూర్చోబెట్టాడు సురేంద్ర!  వచ్చినవారు చేసేదిలేక కాస్త జీలకర్ర నోట్లోవేసుకుని , ఆమెను పలకరించి భోజనాలకు లేచారు! 


సురేంద్ర  అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ గా ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్నాడు. అతనితో పనులు చేయించుకున్న వారు, పనులు ఉన్నవారు , ఉపకారాలు పొందినవారు అతని దృష్టిలో పడడానికి...ఇదో ఒక మంచి అవకాశంగా భావించారు! బస్తాలతో కూరలు బుట్టల తో పళ్ళు డబ్బాలతో నేతి స్వీట్లు, మిఠాయిలు, కేన్ల కొద్దీ పాలు, పెరుగులు నెయ్యిలు, బస్తాలతో  బియ్యం, అపరాలు ఒక్కటేమిటి అవసరానికి మించి వంద రెట్లు తెచ్చిపడేసారు ఇంటినిండా! 


ఎవరేంటి తెచ్చినా కాదనలేదు సురేంద్ర! పరోక్షంగా అవి కొందరు అసహాయుల పోషణార్ధం పనికి వస్తాయనుకున్నాడు! 


దాన ధర్మాలు, బ్రాహ్మణ దక్షిణలు భూరిగా ఇచ్చుకుని.. నలుగురు ‘ఆహా’ అని అనుకునే లాగా పూర్తిచేశాడు పితృకార్యాన్ని సురేంద్ర! ఇంటి పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ లో వెయ్యి మందికి పైగా సంతర్పణ భోజనం చేశారు! మరో వెయ్యిమందికి వండించి, శివార్లలో ఉన్న వృద్ధాశ్రమాలకు పంపించాడు సురేంద్ర! మిగిలిన  సామానులు...కొంత  విరాళం జోడించి..‌పిల్లలహోమ్  కు పంపేసాడు! 



రెండు రోజుల్లో  బంధువుల నిష్క్రమణతో ఇల్లు ఖాళీ అయిపోయింది! సెలవు అయిపోవడంతో కూతురు ఢిల్లీకి ప్రయాణం కట్టింది! వెళ్లేముందు పదేపదే తల్లి చుట్టూ తిరుగుతూ..." నాన్న నా గురించి ఏదైనా చెప్పారా ?    నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా అమ్మ.. " అంటూ అన్యాపదేశంగా ఏదో అడగాలని ప్రయత్నిస్తోంది! తల్లిని తనతో రమ్మని అడిగే ధైర్యం ఆమె చేయలేకపోతోంది! 

ఆ మహానగరంలో తల్లికి అదనపు సౌకర్యాలు కలగజేసే పరిస్థితులు ఆమెకు ప్రస్తుతం లేవు! పైగా కొండంత కొడుకు అండ వదిలి తల్లి తనతో వస్తుందన్న ఆశ కూడా , ఆమెకు లేదు! 


వర్ధనికి కూతురు ఆంతర్యం అర్థమయ్యింది! కోడల్ని పిలిచింది!           "స్వర్ణా!  లాకర్ లో ఉన్న నా బంగారాన్ని నువ్వు సగంతీసుకుని, మిగిలిన సగం మీ ఆడపడుచు కియ్యి".. ‌ అంటూ బ్యాంకు లాకరు తాళం కోడలు చేతిలో పెట్టింది!


"బంగారంలో సగమే  అంటే.. ఈ ఇంట్లో కూడా నాకు సగం ఇచ్చి తీరాలి".... అంటూ... మొహం గంటు పెట్టుకుంది కూతురుధరణి! 


వర్థని జవాబిచ్చే లోగానే, సురేంద్ర  అక్కడ ప్రత్యక్షమయ్యాడు! “స్వర్ణా! అమ్మ కు తాళం ఇచ్చేసేయ్!     ధరణి! అమ్మ ఇప్పుడుబంగారం పంచేసేది ఏమీ లేదు! అవన్నీ అమ్మకు కావాలి!     నాన్న పోవడంతో, అమ్మ జీవితమేమీ ముగిసిపోలేదు!  ముందు ముందు... తన చేతుల మీద జరగాల్సిన శుభకార్యాలు ఉన్నాయి! ఈ ఇల్లు కానీ, ఈ నగలు కానీ అమ్మ   తనచివరి క్షణం వరకు అనుభవించి ..తన తదనంతరం ఆమె కోరుకున్న వారికి ఇచ్చే హక్కు... పూర్తిగా తనదే! ఢిల్లీలో నీ ఫ్లాట్ కోసం పదేళ్ల క్రితమే డబ్బు తీసుకున్నావు! ప్రస్తుతం అమ్మకు మిగిలి ఉన్న ఈ కాస్త ఆస్తి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు! ఇంటి ఆడపిల్లగా నీకు న్యాయమే చేస్తాం! నీ పుట్టింటి మీద నీకున్న హక్కులన్నీ అలాగే భద్రంగా ఉంటాయి! ఆనందంగావస్తూ పోతూ... పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళు! అమ్మని మాత్రం బాధ పెట్టొద్దు ఏవిధంగాను!" కాస్త గట్టిగాచెప్పాడు సురేంద్ర! 


పక్క గదిలో పెట్టెలు సర్దుకుంటున్న అల్లుడికి ఈ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి! వచ్చినప్పటి నుండి చూస్తున్నాడు. సురేంద్ర ఎంత శ్రద్ధగా పితృకార్యం చేసాడో, ఎంత ఆత్మీయంగా తల్లినీ, ఇతర బంధువులనూ ఆదరిస్తున్నాడో! తల్లి పట్ల సురేంద్ర చూపిస్తున్న ప్రేమ... తన నిబద్ధతను నిలదీసినట్టు గా అనిపించింది అల్లుడికి! 


ఉద్యోగంలోనూ, హోదా లోను, ఆస్తి లోనూ సురేంద్ర కు ఏ మాత్రం తక్కువ కాదు తను! కానీ తండ్రి పోయినపుడు అపరకర్మలన్నీ “మమ” అనిపించి, గయలో పిండం పెట్టి చేతులు దులుపుకున్నాడు!  ఒక్కగానొక్క కొడుకు గా తన తల్లినిఆదరించక పోగా, అన్ని వసతులు ఉన్న రిటైర్మెంట్ హోమ్ లో పెట్టి తన బాధ్యత తీరింది అనుకుంటున్నాడు!     భార్య చేతిలో తోలు బొమ్మలా ఆడుతూ తల్లిని దూరం చేసుకున్నాడు తను! 


ఈరోజు సురేంద్ర మాటలు వింటుంటే, అతనిలో..మాతృ వాత్సల్యం నిద్ర లేచింది ! ఏదో దిశానిర్దేశం జరిగినట్లు అనిపించింది! 


దిగ్గున లేచి పక్క గదిలోకి వెళ్ళాడు! సురేంద్ర భుజంమీద స్నేహంగా చేతితో తట్టి, ”సురేంద్ర నువ్వు చెప్పింది అక్షరాలనిజం ! నీ లాంటి కొడుకు ఉంటే ఏ తల్లి అయినా భర్త లేకపోయినా నిబ్బరంగా గుండెల మీద చెయ్యి వేసుకునిబ్రతకగలదు! చెప్పాలంటే ధరణికి ఏమి లోటు లేదు! ఇలా తండ్రి పోయిన వెంటనే పుట్టింట్లో తన హక్కులను సాధించుకోవడం అంత మంచి పని కాదు!  తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను! అత్తయ్య గారు!  మీరు ఎలాంటిబెంగ పెట్టుకోకుండా హాయిగా ఆరోగ్యంగా ఉండండి !మేము ప్రతి రోజు మీతో మాట్లాడుతూ ఉంటాం! ఏ అవసరం వచ్చినా, ధరణి మీకు సహాయంగా వస్తుంది! ఇది నా మాటగా తీసుకోండి!".. ‌‌ మనసు నిండుగా, ఆదరంగా మాట్లాడిన అల్లుడినిచూసి చాలా నిశ్చింతగా అనిపించింది వర్ధనికి! 


మర్నాటి కల్లా ధరణి వెళ్ళిపోయింది! తల్లికి... తమ ఇంట్లో ..గాలి , వెలుతురు ధారాళంగా వచ్చేటటువంటి మంచిగదిని అన్ని సౌకర్యాలతో... తయారుగా ఉంచమని ...స్వర్ణను, పిల్లలను ఇంటికి పంపేసాడు సురేంద్ర! తల్లి కొడుకుల మాత్రమేమిగిలారు ఆఇంట్లో! ఆ రాత్రంతా తండ్రి స్మృతులను  తల్లి తో వల్లె వేశాడు సురేంద్ర! మౌన శ్రోతగా అన్నీ వింటూకూర్చుంది వర్ధని! ఆ స్మృతులలో వీలయినన్ని మంచివే ఏరి మాట్లాడుతూ ఎన్నో చేదుజ్ఞాపకాల ప్రసక్తే తేని కొడుకు సంస్కారానికి ముగ్దురాలయింది ఆమె! 


 ఆమె మరో ప్రస్థానంలో మొదటి ఉషోదయం అయ్యింది! ఆరింటికి తల్లి ఇచ్చిన కాఫీ తాగి.. "అమ్మా! కావలసినవన్నీ సర్దేసు కొన్నావు కదా! మరో గంటలో బయలుదేరాలిమనం!  ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆఫీస్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది! "... అన్నాడు సురేంద్ర! 


కొన్ని క్షణాల మౌనం తరువాత...." నేను కొన్నాళ్ళు ఇక్కడే , మన ఇంట్లో ఉందామని అనుకుంటున్నానురా!  ఇల్లుపాడుపెట్టడం నాకు ఇష్టం లేదు"... తడబడుతూ చెప్పింది వర్ధని కొడుకుతో! 


"ఇల్లేమీ పాడవదు అమ్మా! పని వాళ్ళని పంపి బాగు చేయిస్తూ ఉంటాను! నువ్వు ఒక్కతివే ఒంటరిగా ఇక్కడ ఉండలేవు !నాన్న జ్ఞాపకాలు నిన్ను వదలవు! నువ్వు మాతో ఉండడమే సరి ! నాకు కూడా చాలా నిశ్చింతగా ఉంటుంది!" అన్నాడు సురేంద్ర! 


"లేదు నాన్నా.. నన్ను అర్థం చేసుకో! నేను ఉండగలను! కొత్తమార్పులను వెంటనే తీసుకోలేను! నాకు కొంచెం సమయంకావాలి! ప్లీజ్!".... అంటూ బేలగా అభ్యర్ధించింది కొడుకును! 


బేలగా అన్నా... తల్లి మాటల్లోని దృఢత్వాన్ని గుర్తించాడు అతను! తన మాటలతో ఆమె నిర్ణయం వీగిపోదని అర్థంఅయింది! ఎక్కువ రెట్టించకుండా

"సరే అమ్మా! నీ ఇష్టం! ఏ అవసరం ఉన్నా క్షణాల్లోనే నీ ముందుంటా!” అని, తల్లికిమాటిచ్చి సురేంద్ర కూడా వెళ్ళిపోయాడు! 


  ఇల్లు ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయింది! పెద్దగా దిగులు అనిపించలేదు వర్ధనికి! తోటలోకి వెళ్ళింది. అడ్డదిడ్డంగాపెరిగి, వ్యాపించిపోయిన కొమ్మలతో... 

రకరకాల మందారాలూ, నిత్యమల్లిచెట్లు, వందేళ్ళనాటి ఫలసాయంలేని చెట్లు... తోటంతా నీడలు పరుస్తూ! ఆ చెట్ల వలన ఇరుగుపొరుగులతో శాశ్వత శతృత్వాలు! అయినా మారని భర్త మొండివైఖరి తలుచుకుని భారంగా నిశ్వసించింది వర్ధని. 


ఎంత విచిత్రమయిన మనిషో ఆయన. తా పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అనే వ్యవహారం! పురాతనమయిన భావాలూ, ఆచారాలు! పొదుపు పేరిట అతికూడిక... ఇంటి ఆడపడుచులకు కూడా పూచికపుల్ల ఇవ్వనంత! అత్తగారి ఇత్తడి సామాన్లు, రాచ్చిప్పల్లో వంట. పెళ్ళయిన ఇరవై యేళ్ళకు వరకూ కుంపటి వంటే! ఆరోగ్యం పేరు చెప్పి పత్యపు తిండి. నెలకు కేజీ నూనె వాడకం కూడా ఎక్కువే! తన పుట్టిల్లు మధ్యతరగతయినా... సుష్టుగా అన్ని ఆధరువులతో భోంచేసేభోజనప్రియులు! “


“కొడుకు చేతికందే వరకూ ..ఏడాదికి మూడుచీరలే! పోనీ లేదా పోదా అంటే.. ఎగువమధ్యతరగతి నేపధ్యం. మంచిజీతమొచ్చే ప్రభుత్వ ఉద్యోగం! తన అభిప్రాయాలసాధనలో ఒకరకమైన నిరంకుశత్వం ఆయనది! తనకంటూ బంధువులూ, స్నేహబాంధవ్యాలూ నెరిపే అవకాశం ఇవ్వకుండా... ఇంటిని పుస్తిని చేసిన మహానుభావుడు ఆయన!”


“మెరిట్ లో మెడిసిన్ లో సీట్ తెచ్చుకున్న సురేంద్రను , డాక్టర్ అవ్వడానికి పదేళ్ళు పడుతుందని, మెడిసిన్ చెయ్యనివ్వకుండా, బలవంతంగా 

బీ. ఫార్మసీ లో పెట్టారు. ఇరవై యేళ్ళకే ఇంట్లోంచి బయటకెళ్ళిపోయి, స్కాలర్ షిప్స్, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ, తండ్రి నుండి ఆర్ధికసహాయం ఆశించకుండా ఎంతో పైకి వచ్చాడు కొడుకు. తండ్రి దూరంచేసుకున్న బాంధవ్యాలను తన ఆత్మీయతతో దగ్గర చేసుకున్నాడు. తను జీవితంలో ఎదుగుతూ, ఎందరికో చదువులకూ, ఉద్యోగాలకూ చేయూతనిచ్చాడు. “


“చెప్పాలంటే కొడుకుని చూసే ఇప్పుడు తమను బంధువులు గౌరవించే స్థాయికి , నైతికంగా , సామాజికంగా ఎదిగాడుసురేంద్ర! కూతుర్ని నెత్తిమీద దేవతలా చూస్తూ, ఆడింది ఆట పాడింది పాటగా సాగించి,  కొడుకును మాత్రం ఆంక్షల సంకెళ్ళతో అనుక్షణం క్రమశిక్షణ పేరిట దండిస్తూ, అవమానిస్తూ ఉన్న తండ్రికి ఎప్పుడూ గౌరవం తక్కువ చెయ్యలేదు ! తండ్రి మూర్ఖత్వం, నిరంకుశత్వం వలన తను ఎన్నో కోల్పోయినా, ఒక్కరోజూ తండ్రిని ద్వేషించలేదు!      ఆయన ఇన్నేళ్ళకు కళ్ళుతెరిచి, వాడి మంచితనం అర్ధమయ్యి, కాస్త మృదుత్వం అలవాటుచేసుకుని, కొడుకుతో అనుబంధం పెంచుకునేసమయానికి ... మనిషే లేకుండా పోయారు! “....వర్ధని ఇలాంటి ఆలోచనలతోనే రోజులు గడిపేస్తోంది. 


“ఇప్పుడు తనకు కావలసినది వండుకునే స్వేచ్ఛ ఉంది. కానీ తినడానికి మనసే లేదు. ఎక్కడికయినా వెళ్ళే స్వతంత్రంఉంది. కానీ ఎక్కడికెళ్ళాలో తెలీదు. “ఎంత పరాధీన తను! “.... వేము తిన్నంత చేదు ఆమె మనసులో! వారం కన్నాఎక్కువ ఉండలేకపోయింది ఆ ఇంట్లో ఒంటరిగా! దానికి పరిష్కారమూ సురేంద్రే చేసాడు. 


మంచి ప్రణాళికతో... అన్ని ఏర్పాట్లూ చేసి, వర్ధనినీ, తమతోనే వుండే అత్తగారినీ, ధరణి అత్తగారినీ, ఇద్దరు మేనత్తలనూ కాశీ, ప్రయాగ, చార్ ధామ్, వైష్ణోదేవి యాత్రలకు పంపించే ఏర్పాటుచేసాడు! 


 భర్త పోయి నెలరోజులవ్వక మునుపే యాత్రలంటే లోకం నవ్వుతుందని... వర్ధని ససేమిరా అనేసింది. సురేంద్ర తల్లితోఒకటే అన్నాడు! “అమ్మా! జీవితం చాలా చిన్నది. ఇప్పటికే అరవైయేళ్ళు అసఫలంగా, పంజరంలో చిలుకలా గడిపేసావు. ఇక నుంచి  ప్రతిక్షణం, నువ్వు కోల్పోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోవాలి! చేద్దామనుకున్నవీ, చూద్దామనుకున్నవీ మొదలుపెట్టాలి! నీకు నేనున్నానమ్మా! జీవితం మళ్ళీ మొదలుపెట్టు!! వెళ్ళిపోయిన వారి గురించి వగస్తూ కూర్చుని లాభంలేదు” అంటూ తల్లికి ధైర్యం చెప్పాడు! 


వర్ధనికి తన జీవితంలో రెండవ అధ్యాయంమొదలయ్యింది! 


 రెండునెలల యాత్రలు, మరో రెండునెలలు ధరణి దగ్గర గడిపాకా.... సంతృప్తి చెందిన మనసు, మొట్టమొదటిసారి లోకాన్ని చూసిన ఆనందం, తన చుట్టూ ఇంత నాగరికత ఉందా అన్న విభ్రమంతో తిరిగివచ్చింది వర్ధని. 


ఇల్లు బాగుచేయిస్తున్నానని, తల్లిని తమింట్లోనే పెట్టాడు సురేంద్ర! స్వర్ణతల్లి విద్యావంతురాలు, మంచి క్రియాశీలకురాలు. వర్ధనికి ఓపిగ్గా వివరిస్తూ...ఫోన్ లో ఫేస్ బుక్, వాట్సప్ పరిచయం చేసింది. ఎందరో పరోక్ష మిత్రబృందాలతో, సాహితీసౌరభాలతో వెలుగులీనే ఫేస్ బుక్ వర్ధనికి చక్కని కాలక్షేపంగా మారింది. 

కొడుకు సేకరించిన ఎన్నో అపురూపమైన పుస్తకాల నిధి మరో పెన్నిధి అయ్యింది ఆమెకు. భర్త తనలో పెంచి, పోషించిన నిర్లిప్తత, నిరాశ, విరక్తి.... మెల్లమెల్లగా కరిగిపోతున్నాయి! జీవితం నవనవోన్మేషంగా మారుతోంది. పిల్లలూ, పువ్వులూ, పుస్తకాలూ, పరిసరాలూ ఎన్నోనేర్పుతున్నారు! 


తండ్రి సంవత్సరీకాలు కూడా ఎంతో శ్రద్ధగా పూర్తిచేసాడు సురేంద్ర! మాఘమాసం రాగానే, “రా అమ్మా! నీ ఇల్లుచూసుకుందువు గాని”... అంటూ వర్ధనిని బయలుదేరదీసాడు! ఆ వీధిలో బీటలువేసిన , నాచుపట్టిన గోడల్లోంచి రావిచెట్లు తొంగిచూస్తూ, అడవిలాంటి తోటతో , దిష్టిబొమ్మలా ఉండే తమ ఇల్లు- ఎంతో అందంగా, అధునాతనంగా, విశాలంగా తయారయ్యి ఉండడం చూసి, ఆమె సంభ్రమమొందింది. ముందుగా ఆమెను ఆకర్షించినది నందన వనంలాంటి తోట. 


“అయ్యో! మామిడిచెట్టు, చింతచెట్టు ఏవిరా?”.... అంది కొడుకుతో! “అమ్మా! నేను కొన్నిరోజులు వాటితో మాట్లాడానమ్మా. మీరు పెద్దవారయిపోయారు. మీవలన ఈ స్వార్ధపూరిత అనాగరికులకు ఇబ్బందిగా ఉంది. మీ అనుమతితో మిమ్మల్ని తొలిగించవచ్చా! మీ కొమ్మలకు అంట్లు కట్టించి... నా తోటలో మీ వంశాన్ని కొనసాగిస్తా!”.... అంటూ వాటిని ప్రార్ధించేవాడినమ్మా! నమ్మూ, నమ్మకపో.... అవి రెండునెలల్లో వృద్ధాప్యం వచ్చినట్టు పూర్తిగా వడలిపోయి, మోడులయ్యాయి! అప్పుడే వాటిని కొట్టించి, ఆ కలపంతా మనింటికే వాడాను.“ అన్నాడు సురేంద్ర! 

వర్ధనికి ఏమీఆశ్చర్యం అనిపించలేదు. కొడుకు అచ్చం తన పోలికే! కష్టమొచ్చినపుడు ఆ మాకులతోనే పంచుకునేది. అవి కూడా విన్నట్టేఉండేవి! 


 క్రింద మూడు, పైన మూడు అత్యంత సౌకర్యకరమైన పడకగదులు వేయించాడు. లేలేత భానుకిరణాలు పడుతుంటే ధ్యానం చేసుకోవడానికి అనువుగా చక్కని సన్ రూమ్ , తను కోరుకునే విధంగా.. విశాలమయిన పూజామందిరం, అందమైన తంజావూరు దేవతామూర్తుల పటాలతో మనోజ్ఞంగా చేయించాడు! అన్నిటికన్నా మిన్న వంటగది! మొత్తం అధునాతనంగా, సౌకర్యంగా! ఆనుకున్న పాంట్రీలో.... అన్ని వరుసల్లో... రకరకాల సైజుల్లో... అమర్చినస్టీలుడబ్బాలను, గాజుసీసాలను చూసి... వర్ధని కళ్ళలో మెరుపు, పెదాల మీద చిన్నచిరునవ్వు మెలిచాయి! ఇవన్నీ భర్తహయాంలో తన తీరని కోరికలు! సరుకులన్నీ చిన్నచిన్న పొట్లాలు కట్టించి, చెక్కబీరువాలో   పెట్టించి తాళం వేసే వారాయన- తను దానధర్మాలు, దుబారా చేస్తుందని! 


“నా కొడుక్కు అన్నీ తెలుసు తన గురించి! తన మనసులోని ప్రతి భావన, స్పందన, కోరిక, ఉద్వేగం...సమస్తం ఎరుకే ఈ పిల్లవాడికి!”... అనుకుంటూ 

ఆ అమ్మమనసు పుత్రవాత్సల్యంతో ఉప్పొంగిపోయింది! 


 ఒక మంచిరోజు తల్లిని యజమానురాలి హోదాలో... గౌరవంగా ...తమజంటతో సమానంగా,పీటలమీదకూర్చుండపెట్టి గృహప్రవేశం చేయించాడు సురేంద్ర! తండ్రి తదనంతర ఆస్థులన్నీ తల్లి పేరిటకు మార్పించాడు! వర్ధని, స్వర్ణ తల్లితో పాటూ... ధరణి అత్తగారు కూడా ఆ ఇంటికే మారిపోయారు! ఇంట్లో పనులకు, వంటకు హెల్పర్స్ ను పెట్టాడు. వారికి సౌకర్యవంతంగా ఉండే విశాలమైన కారు కొని, డ్రయివర్ తో సహా, గుమ్మంలో పెట్టాడు! మేడమీద కు స్వర్ణా, పిల్లలతో... దిగిపోయాడు! 


 గృహప్రవేశం నాడు మేనత్తలు ముగ్గురినీ పిలిచి, వారు గతంలో అన్నగారిని అడిగి, భంగపడ్డ తమ తల్లిగారిబంగారం, మూడెకరాల భూమిపత్రాలు వారి చేతిలో పెట్టి,...” అత్తా! ఇది మీ అందరి ఇల్లూ కూడా! మీకు కావలసినన్నిరోజులు ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకోండి. మీకు ఏ అవసరానికయినా ఈ మేనల్లుడు ఉన్నాడని మర్చిపోకండి!”.... అంటూ ఆప్యాయంగా చెప్తుంటే.... వాళ్ళు కన్నీటితో...పరమానందభరితులయ్యారు! 


“వదినా! నీ కడుపున రాములవారే పుట్టారు వీడి రూపాన! మా అన్నయ్యకు ఈ పుత్రోత్సాహం చూసే యోగం లేదు. వీడిని రాముడని ఎందుకు అన్నామంటే, ఒకవేళ దశరధుడు , కౌసల్య తన తోనే ఉండివుంటే.. సంపద ఉన్నా, లేకపోయినా... అయోధ్యలో నయినా , అడవిలోనయినా రాములవారు తల్లితండ్రులను ... అదే ప్రేమతో, వైభవంతో, అక్కరతో... లోటనేది రానీయకుండా చూసుకుని వుండేవారు నీ కొడుకులా!”...అంటూ... ఆ కన్నతల్లి కడుపు సంతోషంతో నింపేసారు! 


 ఆ విధంగా తల్లికి స్వయంప్రతిపత్తిని కల్పించి, సాధికారంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా బ్రతకడానికి మార్గం సుగమం చేసిపెట్టాడు సురేంద్ర! తల్లి మనసులో తండ్రిచేసిన ప్రతి అవమానాన్ని, ప్రతి గాయాన్ని తన బాధగా అనుభవించాడు అతను ఇన్నాళ్ళూ! తనకు శక్తి ఉన్నా... కొడుకు స్వార్జితంతో పూచికపుల్ల కూడా ముట్టననే తండ్రిఅసహనంతో, విచిత్ర వైఖరితో సర్దుకుంటూ...అతను పడ్డ మనక్షోభ ఇన్నాళ్ళకు ఉపశమించింది. ఆయనకు సజీవంగా ఏమీ చెయ్యలేకపోయినా, ఆయన మరణానంతరం ఆయన పేరిట పేదవిద్యార్ధులకు స్కాలర్ షిప్, వృద్ధాశ్రమాలకు విరాళాలరూపంలో ఇస్తూ... పితృూణం తీర్చుకుంటున్నాడు! 


ఇది మలుపులున్న కధ కాదు! కానీ ఆదర్శవంతుడైన ఒక కొడుకు కధ! ఎందరో స్ఫూర్తిగా తీసుకోవలసిన ఒకనీతికథ! తల్లిదండ్రులు, సమాజం నాకేమిచ్చిందని... ప్రశ్నించకుండా... ‘వీరికి  నేనేమి చెయ్యగలను’... అని ఆలోచిస్తూ , బాధ్యతలు సక్రమంగా, సంతోషంగా నిర్వహిస్తూ, కార్యాచరణలో పెట్టే క్రియాశీలి కధ! 


పుత్రోత్సాహము తండ్రికీ

పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని బొగడగా

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

Panchaag


 

పద్నాలుగు లోకాలు

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*పురాణాలలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి అని చెప్తారు కదా. అవి ఏమిటి? వాటి పేర్లు, వాటి విశిష్టతలు*..


భూలోకంతో కలిపి, భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు:-


1) *భూలోకం* - ఇచ్చట స్వేదజాలు (చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ॥), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు, పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు.


2) *భువర్లోకము* (భూలోకము పైన) - ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుప్యాలైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు కలరు.


3) *సువఃలోకము లేక సువర్లోకము లేక స్వర్గలోకము* (భువర్లోకము పైన) - ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వృద్ధాప్యం, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసం లేదు.


4) *మహర్లోకము* (సువర్లోకము పైన) - ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు.

ఆదిత్యయోగీ..


5) *జనోలోకము* (మహర్లోకము పైన) - దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ, భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో, ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువురూ, ఈ జనలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుదురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.


6) *తపోలోకము* (జనోలోకము పైన) - ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో, ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలం అక్కడనే ఉండి, కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో, అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుదురు.


7) *సత్యలోకం* (తపోలోకము పైన) - ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు, ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కరు పొంది, తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగం తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకంలో కూడా, అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు, వేదాంతవిచారణలు గావిస్తుంటారు.

ఆదిత్యయోగీ..


*భూలోకానికి కింద ఉండేవి అధోలోకాలు (7)*:-


1) *అతల లోకం* - ఇందులో అసురులు నివసిస్తుంటారు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున, అధిక మద సంపన్నులు.


2) *వితల లోకం* (అతలలోకం కింద) - ఇక్కడ పార్వతీ-పరమేశ్వరుల వీర్యం ‘ఆఢకం‘ అనే నది, సువర్ణ జల ప్రవాహాంతో నిండి ఉండును. అనేక భౌతిక సుఖాలతో పాటు, ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు.


3) *సుతల లోకము* (వితల లోకం కింద) - సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు, బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. అయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాస్తున్నాడు.


4) *తలాతల లోకం* (సుతల లోకం కింద) - ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు.


5) *మహాతలము* (తలాతలలోకము కింద) - ఇక్కడ క్రదుపుత్రులైన (వినత క్రదువలు) కాద్రవేయులు(సర్పాలు), సహస్రాది శిరస్సులతో కూడినవారై, మహా బలవంతులై, కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.


6) *రసాతలము* (మహాతలం కింద) - ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.


7) *పాతాళము* (రసాతలం కింద) - ఇక్కడ నాగలోకాధిపతియైన వాసుకి మొదలు, సర్ప సమూహములన్నీ కామరూపధారులై, సుఖసంతోషాలతో ఉన్నారు. మహా ప్రళయ కాలంలో ఈ చతుర్ధశ భువనాలు పరబ్రహ్మంలో లీనమగును...


*సర్వేజనాసుఖినోభవంతు*🙏


🌹🌹🌹🌹🌹🌹                                                     🪷⚛️✡️🕉️🌹

కొబ్బ‌రికాయ‌

 🥥🍌🥥🍌🥥

పూజా కార్య‌క్ర‌మాల‌కు కొబ్బ‌రికాయ‌ల‌ను, అర‌టి పండ్ల‌నే ఎక్కువ‌గా వాడ‌డాన్ని మీరు గ‌మ‌నించుంటారు. 

🥥🍌🥥🍌🍌

కొబ్బ‌రికాయ‌, అర‌టి పండ్లకు ప‌విత్ర‌మైన ఫ‌లాలుగా పేరు..పూర్వ‌కాలం నుండి వీటినే పూజా కార్య‌క్ర‌మాల్లో ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. 


ఎందుకంటే ఈ రెండూ ఎంగిలికాని పండ్ల కేట‌గిరీలోకి వ‌స్తాయి. కాయ‌ల నుండి చెట్లుగా మారే క్ర‌మంలో మిగితా వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది.


కొబ్బ‌రి_కాయ :


ఇత‌ర పండ్లు తిని గింజ‌ను నాటితే అవి మ‌ళ్లీ చెట్లుగా మార‌తాయి. ..కానీ కొబ్బ‌రి మాత్రం మొత్తంగా నాటితేనే మ‌రో చెట్టును ఇస్తుంది.. ఎంగిలి ప‌డ‌ని పండు మాత్ర‌మే కొత్త చెట్టును ఇస్తుంద‌న్న‌మాట‌!


అర‌టి:


అర‌టి కూడా అంతే పండు తిని కేవ‌లం తొక్క‌తో కొత్త చెట్టును పుట్టించ‌లేము…మొత్తంగా నాటితేనే కొత్త అర‌టి వ‌స్తుంది.


కాబ‌ట్టి ఎంగిలి ప‌డ‌ని ఈ పండ్ల‌ను ప‌విత్ర‌ఫ‌లాలుగా భావించి దేవుడికి స‌మ‌ర్పిస్తార‌ట‌.

🥥🍌🥥🍌🥥

హిందువు

 🙏🚩🙏🚩🙏

నేను హిందువుగా గర్విస్తున్నాను. ఇది చదివితే మీరు కూడా గర్విస్తారు.

🚩🚩🚩🚩🚩

#Christianity

యేసు ఒక్కడే

బైబిల్ ఒక్కటే

అయినప్పటికీ, లాటిన్ కాథలిక్, సిరియన్ కాథలిక్, మార్తోమా, పెంటెకోస్ట్, సాల్వేషన్ ఆర్మీ, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, ఆర్థడాక్స్, జాకోబైట్ వంటి

 146 వర్గాలు* తమలో తాము కొట్టుకుంటూ తమ వర్గానికి చెందని ఏ ఇతర వర్గానికి చెందిన చర్చికి హాజరు కావు.


#Islam

అల్లా ఒక్కడే,

ఖురాన్ ఒక్కటే,

ప్రవక్త ఒక్కరే. కానీ

ఇప్పటికీ షియా, సున్నీ, అహ్మదీయా, సూఫీ, ముజాహిదీన్ వంటి 

13 వర్గాలు ఒకరి పై ఒకరు రక్తపు దాహంతో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వేర్వేరు మసీదులు ఉన్నాయి. కలిసి కూర్చొని నమాజ్ చేయకూడదు. ఎప్పుడూ మతం పేరుతో ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశ్యంతో ఉంటారు.


 సనాతన ధర్మం


 1280 మత గ్రంథాలు, 10 వేలకు పైగా కులాలు, లెక్కలేనన్ని పండుగలు మరియు పబ్బాలు, లెక్కలేనన్ని దేవుడు మరియు దేవతలు. లక్షకు పైగా ఉపకులాలు, వేల మంది ఋషులు, వందలాది భాషలు. అయినా ఇప్పటికీ, హిందువులందరూ అన్ని దేవాలయాలకు వెళ్లి అన్ని పండుగలను జరుపుకుంటారు. తమలో తాము శాంతియుతంగా నాగరికంగా జీవిస్తారు. ఇతర వర్గం మాత్రమే కాదు మతాలను గౌరవిస్తూ ఆదరిస్తూ పరమత సహనాన్ని పాటిస్తారు.


అనంత సృష్టి అంత ఒక్కటే అందులో నీ ప్రతిదీ అందరికీ సమానమే సృష్టి ఉద్భవించినది ఏళ్ళలులేని సృష్టి అందులో ప్రతిదీ అందరికొరకు


కొందరు ప్రవక్తల ద్వారా మతాలను కల్పించినారు


లోక సమస్త సుఖినో భవంతు

భారత దేశం యే దేశం మీద దండ యాత్రలు యుద్ధాలు చెయ్యలేదు శాంతి కమక మైన దేశమే మన భారత దేశం 

ధర్మ దేశం ఆధ్యాత్మిక దేశం 


ఇదే హిందూ మతం సనాతనం యొక్క గొప్పతనం

అలాంటప్పుడు హిందువులు హిందూ మతం గురించి ఎందుకు గర్వపడకూడదు? మేము హిందువులమని గర్వంగా చెప్పండి🚩


🚩జై శ్రీరామ్🚩

ఓం నమః శివాయ

🙏🚩🙏🚩🙏

దశవిధ స్నానాలు

 💦💦 *దశవిధ స్నానాలు* 💦💦


1.నదీజల స్నానం:-

దేహ పరిశుభ్రత కోసం చేయు స్నానం.

2.మంత్ర స్నానం:-

మార్జన మంత్రాలతో మార్జనమును జరుపుకొనుట.

3.పార్థివ స్నానం:- 

పవిత్ర ప్రదేశముల యందలి  మృత్తికలను దేహమునకు రాచుకొనుట.

4.ఆగ్నేయ స్నానం:- 

త్రాయుషం జమదగ్నే హి యను మంత్రముల చే  భస్మమును దేహం నిండా పూసుకొనుట. 

5. వాయవ్య స్నానం:-

గోవుల గిట్టలచే వెలువడిన ధూళిని దేహమునకు పూసుకొనుట.

6.దివ్య స్నానం:-

ఉత్తరాయణంలో ఎండ కాయుచున్నప్పుడు  వర్షము కురిసిన యెడల ఆ వర్షము నందు స్నానము ఆచరించుట.

7.సారస్వత స్నానం:-

వేద వేత్తలగు పండితులతో "నీవు స్నాతుడవు అయితివి" అని చెప్పబడుట.

8..మానస స్నానం:-

నిర్మల చిత్తముతో భగవంతునితో ధ్యానింపుట.

9. ధ్యాన స్నానం:-

విష్ణు లేక విప్ర పాదోదకములతో గానీ, తులసీ మిశ్రిత జలములతోగానీ, ప్రోక్షింపుకొనుట.

10.కపిల స్నానం:- 

తడిగుడ్డతో దేహమును తుడుచుకొనుట.

ఔషధముతో పనియుండదు.

 దినాంతే చ పిబేత్ దుగ్ధం

నిశాంతే చ పిబేత్ జలం|

భోజనాంతే పిబేత్ తక్రం

వైద్యతః కిం ప్రయోజనమ్?...



రాత్రిపూట పాలు, వేకువజామున మంచినీళ్ళు, భోజనాంతమందు మజ్జిగ త్రాగుచున్నవానికి, వైద్యునితో గాని, ఔషధముతో  గాని పనియుండదు.

భగవంతుడి భాష*

 2909A-1.0404c-6.110624-5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


           *భగవంతుడి భాష*

                ➖➖➖✍️


*మనసులోని ఆలోచనల్ని వ్యక్తం చేయడానికి మనం భాషను సముచిత మైన సాధనంగా వినియోగించు కుంటున్నాం. భాషాపటిమ లేనప్పుడు అభినయం, హావభావాల ద్వారా వ్యక్తంచేస్తున్నాం. మరి భగవంతుడికి కూడా భాషేదైనా ఉన్నదా? ఆ భాష ఏమిటి, ఎలా ఉంటుంది, ఆ భాష ద్వారా ఏం చెబుతున్నాడు, మనం దాన్ని ఎలా గ్రహిస్తున్నాం? ఇలాంటి సందేహాలు కలగడానికి ఆస్కారముంది.*


*నశ్వరమైన ఈ శరీరానికే భాష ఉన్నప్పుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైన పరమాత్మకు మాత్రం భాషెందుకుండదు? ఉంది. భాషంటే మాటలా, వాక్యాలా, శబ్దాలా? మౌనం కూడా భాషేనా? రమణమహర్షి మౌని. ఆయన భాష మౌనమే. ఆయన బోధలూ మౌనంద్వారానే భక్తులకు సంప్రాప్తించాయి. దక్షిణామూర్తి మౌనసాధనం ద్వారానే జ్ఞానబోధ చేశాడు. అలాగే మహానుభావులెందరో మౌనంగా ఉంటూనే తత్వబోధ చేశారు. భగవంతుడూ మౌనంగానే ప్రకృతి ద్వారా మనకు జ్ఞానం ప్రసాదించాడు.*


*నదులు, పర్వతాలు, వృక్షాలు, కొమ్మలు, కాయలు, పూలు, పండ్లు, మేఘాలు, గాలి, నేల- వీటన్నింటి ద్వారా పరమేశ్వరుడు మనకెన్నో అమూల్య సందేశాలు అందజేస్తున్నాడు. జ్ఞానసంపదను పంచి పెడుతున్నాడు.*


*ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రతి వస్తువూ మనకు సౌఖ్యాన్ని, ఆనందాన్ని అందజేస్తోంది. సూర్యుడు వెలుగునిస్తున్నాడు. చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు. పూలు పరిమళాలిస్తున్నాయి. నదులు నీటినిస్తున్నాయి. మబ్బులు వర్షిస్తున్నాయి. పక్షులు కిలకిలారావాలతో ప్రకృతిని పులకింపజేస్తున్నాయి. పొలాలు సస్యాలనిస్తున్నాయి. గోవులు క్షీరధారలిస్తున్నాయి. గాలి శ్వాస ద్వారా సకల ప్రాణి కోటికీ మనుగడనిస్తోంది. సృష్టిచక్ర నిర్వహణకు ఒక్కో వస్తువుకు, ఒక్కో రకమైన సామర్థ్యం, శక్తీ ఏర్పాటు చేశాడు భగవంతుడు.*


*అన్నీ మౌనంగా జరిగిపోతున్నా అవన్నీ భగవంతుడి భాషలే. వాటిలో వాక్యాలు, మాటలు ఉండవు. అన్నీ వేటికవే పరమాత్మ సంకేతాలు అందినట్టుగా, తమ తమ విధులను క్రమం తప్పకుండా నిర్వర్తిస్తున్నాయి. అనంతకోటి నామధేయాలున్నట్టే ఆయనకు అనంతకోటి భాషలూ ఉన్నాయి. ఎవరికి ఏ భాష ద్వారా కర్తవ్యబోధ చేయాలో అలా చేస్తున్నాడు. అలాగే మనకు తన మౌన భాష ద్వారా అనేక విధాలైన బోధలు చేస్తున్నాడు. వాటిని గ్రహించటం, ఆచరించటం- మన సుకృతం, వివేకం, ఆసక్తి మీద ఆధారపడ్డాయి.*


*వేదాలు, శాస్త్రపురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీతాది పవిత్రగ్రంథాల ద్వారా మనకెన్నో ధార్మిక విషయాలు, నీతి సిద్ధాంతాలు నిర్దేశితమయ్యాయి.*


*తపస్సంపన్నులు, మునులు, రుషులు, బుధులు, వేదజ్ఞులు, పౌరాణికులు, పండిత శ్రేణులు, ప్రవక్తలు మనకు పరమాత్మ భాష ద్వారానే రసానంద సిద్ధిని కలగజేస్తున్నారు. మన సుఖ జీవనయాత్రకు ఉపయోగపడుతున్న విషయ పరిజ్ఞానమంతా పరోక్షంగా ఆయన భాషా వ్యవహారమే. ఒక్క మనిషి తప్ప ప్రకృతిలోని ప్రత్యణువూ నిస్వార్థంగా సేవచేస్తోంది. ఆ సేవలు, సుఖాలు పొందిన మానవుడు మాత్రం కృతజ్ఞతాహీనుడై ప్రవర్తిస్తున్నాడు. అందుకే ప్రకృతినుంచి పరమాత్మ భాషను, భావాన్నీ, సందేశాన్నీ గ్రహించి, తదనుగుణంగా నడచుకోవాల్సి ఉంది.*


*అనంతమైన భగవంతుడి భాషల్లో కొన్ని మనకు బాగా తెలిసినవే. అవే సత్యం, అహింస, ప్రేమ, పరోపకారం, భూతదయ, సచ్ఛీలం, క్రమశిక్షణ, సమయపాలన, నిస్వార్థబుద్ధి, త్యాగశీలత, ధర్మం, దానం, నమ్రత, వాత్సల్యం, విధినిర్వహణ... ఇలాంటివి. ఇవన్నీ మనకు ఎంత బాగా తెలుసో, అంత బాగా మనసుకు దూరంగా ఉంచుతాం. అందుకే భగవంతుడి భాష అవగతం కాదు. ఆ సద్గుణాలన్నింటినీ మహానుభావులెందరో ఎప్పుడో సుగ్రాహ్యం చేసుకున్నారు. ఆచరించి చూపారు.*


*కనుక, వారందరికీ భగవద్భాష సుబోధకమే అయింది. ప్రధానంగా గ్రహించవలసింది- భక్తి ఒక్కటే మనల్ని ఎక్కువ దూరం తీసుకెళ్లలేదు. ఆర్తుల సేవ దానికి తోడైతేనే ఆధ్యాత్మికంగా ముందుకు పురోగమించగలం.*


 *అప్పుడే మనం భగవద్భాషను సంపూర్ణంగా సాకల్యంగా అవగాహన చేసుకున్నవాళ్లమవుతాం. సద్గురువు మార్గప్రదర్శనంలో సముచితమైన శిక్షణ పొంది, సాధనచేసి సార్థక జీవన ప్రస్థానం సాగిస్తే భగవంతుడి భాషలన్నీ మనకు అర్థమైనట్టే.*


*జీవించి, వికసించి, తత్వాన్ని తెలుసుకొని, ముక్తిని పొందడమే జీవితం. 'నేను' అనే మాటకు అర్థం తెలుసుకో గలిగితే, ఆ మాటను హృదయం నుంచి తొలగించగలిగితే భగవద్భాషా పరిజ్ఞానం పొందగలిగినట్టే! అదే మనం సాధించగలిగే మహత్కార్యం, మహావిజయం. అందుకే వీలైన్నన్ని భగవంతుడి భాషల్ని నేర్చుకునేందుకు ప్రయత్నిద్దాం.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774.

లింక్ పంపుతాము.దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

అదృష్టం_ దురదృష్టం

 *🔔   _శుభోదయం_    🔔*


       *_విలువైన మాటలు చెప్పే వాళ్ళు దొరకడం మన అదృష్టం_*

      *_కానీ అవి విలువైన మాటలని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం._*

కష్టాలు మన మంచికే

 


కష్టాలు మన మంచికే

                 

ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు... ఏమిటి స్వామీ నాకీ కష్టాలు? ఇవి ఎప్పటికి తీరేను? అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు?’


శిష్యుడి వంక దయగా చూస్తూ అడిగాడు.  గురువు గారు ‘నేనో చిన్నకథ చెప్తాను వింటావా?’


తలూపాడు శిష్యుడు. ఆయన కథ చెప్పసాగాడు...


“ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఓ సీతాకోక చిలుక గూడుని చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించ సాగాడు. ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుక గా మారిన అందులోని గొంగళి పురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనించాడు. 


అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రం లోంచి బయటికి రావడం సాధ్యం కావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు.. 


ఆ సీతాకోకచిలుకకి సాయపడాలన్న ఆలోచన కలిగిందతనికి, దాంతో చిన్న కత్తెరని తీసుకుని ఆ గూడు గోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు. 


ఆ రంధ్రం లోనుంచి సీతాకోకచిలుక బయటికి వచ్చింది. అయితే దాని శరీరం ఉబ్బి ఉంది. రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది.”


తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను.


“ఆజీవి ఆ గూడులోనే మరికొంత కాలం ఉండి ఉంటే, దాని శరీరంలోని ద్రవం రెక్కల్లోకి ప్రవహించి, అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది. అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్దది చేసుకుని స్వేచ్ఛగా ఎగిరి పోయేది. కాని, అతడి లోని దయతో కూడిన తొందరపాటు తనం వల్ల ఇది అతను గ్రహించలేదు.


అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే ఆసన్న మవుతాయి. మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మనమీద దయతలచి మధ్యలో తీసేయడు. లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం. దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదం ఉంటుంది.!


అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గూడుని పాడుచేసి దాని ఎదుగుదలకి అడ్డుపడ్డట్టుగా, మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలని అనుభవించకుండా అడ్డుపడడు. మనకు ఎదుగుదలశక్తి వచ్చేవరకు ఎదురుచూస్తాడు.


     *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

యద్భావం తద్భవతి

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


          *అందరికీ శుభోదయం!*

                 ➖➖➖✍️


*మనం శుభం జరగాలని మనసా,వాచా,కర్మణా వాంఛిస్తే                     అదే జరుగుతుంది.*


*’యద్భావం తద్భవతి’ అన్నారు పెద్దలు.*


  *అందుచేత అందరికీ మంచి మాత్రమే జరగాలని కోరుకుందాం.*


*సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని దీవించే పవిత్ర వేదప్రవచనాన్ని మననం చేసుకుందాం.*

*అదే …*👇

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాః సమస్తాః సుఖినో భవంతు!* అని....!


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀👇


మీకు మీ కుటుంబ సభ్యులందరకూ

వేదపండితులచే...

నేటి వేద ఆశీర్వచనములు...!


మీకు నేడు అన్నియు శుభములు కలుగుగాక...!!✋


👇👇👇👇👇👇👇👇👇👇

కర్మ ఫలము

 *అసాధ్యమైనదానికోసం వెతకకండి - నష్టాన్ని చూసి బాధ పడకండి* 


 మనుషులలో వింత పాత్రలు,ప్రవర్తనలు ఉన్నాయి. అసాధ్యమైన వాటి కోసం కొందరు ఆశపడతారు. పోగొట్టుకున్న వాటిపై కొందరు విలపిస్తున్నారు. ఈ రెండు రకాలు కేవలం అజ్ఞానం.

 సాధించలేని వస్తువు ఎంత తీవ్రమైన కోరికను పొందలేదనేది వాస్తవం. కాబట్టి అలాంటి వాంఛలో ప్రయోజనం ఏమిటి? ఉదాహరణకు, చంద్రకాంతి మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దాని కారణంగా, చంద్రుడిని మన తలుపు మెట్ల వద్ద ఉంచాలని ఆశించడం సాధ్యమేనా?

 అదేవిధంగా, కోల్పోయిన వస్తువులపై బాధపడటం (ఏడ్వడం) వల్ల ఉపయోగం లేదు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది విపరీతంగా దుఖిస్తారు. సన్నిహితులు మరియు ప్రియమైనవారి మరణంతో కొంతమంది విపరీతంగా దుఖిస్తారు. మరికొందరు ఇష్టపడే వస్తువులను కోల్పోయినప్పుడు తీవ్రంగా భాధ పడతారు. వారు తిరిగి రాలేరు; లేదా పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందలేరు . అటువంటి పరిస్థితులలో, నష్టం గురించి ఏడ్వడం అజ్ఞానం తప్ప మరొకటి కాదు.

 కొందరువ్యక్తులుబాధపడుతున్నప్పుడు వారి సమతుల్యతను కోల్పోయి భగవంతుని, శాస్త్రాల సమర్థత గురించి అవహేళన చేస్తారు. అది చాలా తప్పు.

మన కర్మ ఫలముల పరిణామాలను మనం మాత్రమే భరించాలి. దానికోసం ఇతరులను నిందించకూడదు. అలా చేయడం అజ్ఞానం.అందువల్ల, అజ్ఞానానికి తావు ఇవ్వకుండా అందరూ తెలివిగా వ్యవహరించాలి.

 

 *राप्यमभिवाञ्यमभिवाञ्छन्नषटंटं छन्ति्ति|* 

 *स्स्वपि न्मुह्ति नराःडितबुद्धयः ||* 


 *--జగద్గురుశ్రీ శ్రీ భారతీ తీర్థ* 

 *మహాస్వామి వారు*

కర్పూరం కథ

 *మనం పూజలో వాడే కర్పూరం కథ తెలుసా.*


🚩🚩🚩🚩🚩🚩🚩🚩


🌸కర్పూరం భారతీయులు ఎక్కువగా పూజాది కార్యక్రమాల్లో వాడే పదార్థం. ఇది అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పి నివారణకి కర్పూరం బాగా పనిచేస్తుంది. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్గా కర్పూరాన్ని ఉపయోగిస్తారు. కర్పూరం కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కర్పూరాన్ని కాటుకలో వాడుతారు. అయితే కర్పూరంలో అనేక రకాలున్నాయి. వీటితో అనేక ప్రయోజనాలూ ఉన్నాయి. 


కర్పూరం ఎన్ని రకాలు?

🌸కర్పూరం చెట్టు గురించి కర్పూరంతో ఆరోగ్యం గురించి, కర్పూరం సువాసన గురించి తెలుసుకుందాం. కర్పూరం అనేది మనకి తెలిసినంత వరకు సుగంధం గానూ, కొన్ని వంటకాలలోనూ, పూజా కార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ, పారదర్శకం గానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము. ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమొముం క్యాంఫొర (కుటుంబం: లారేసీ ) అనే చెట్టు నుండి లభ్యమవుతుంది.


🌸కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మల నుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద గాట్లు పెడతారు. ఆ గాట్ల లోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి.. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో వీటిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్ లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.


కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా ఉపయోగ పడుతుంది. పచ్చ కర్పూరం: 

కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరం తోనే చేస్తారు.


హారతి కర్పూరం:

టర్పంటైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారు చేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.


రస కర్పూరం: 

చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.


భీమసేని కర్పూరం: 

సహజంగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు.


సితాభ్ర కర్పూరం: 

ఇది తెల్లని మేఘం లాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.


హిమవాలుక కర్పూరం: 

ఇది మంచులాంటి రేణువుల్లా ఉంటుంది.


ఘనసార కర్పూరం: 

ఇది మేఘం లాంటి సారం కలిగి ఉంటుంది.


హిమ కర్పూరం:

ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.


ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి. కర్పూరం వలన అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.


కర్పూరంతో కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:

* గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.


* అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.


* పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.


* నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. 


* కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధి వల్ల ఏర్పడిన గాయం మీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.


* కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.


* అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.


* కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు.


* మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.


* జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.


* అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.


* పురుగుల మందులు, చెడు వాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెద పురుగులు నిర్ములనకు ఉపయోగిస్తుంటారు

🚩🚩🚩🚩🚩🚩🚩🚩

పౌర బాధ్యతలు

 *పౌర బాధ్యతలు -  ఎన్నికలు*




భారత దేశ పౌరులమైన మనకు స్వాతంత్రము వచ్చి   ఇప్పటి వరకు   77 సంవత్సరాలు, 75 గణతంత్ర దినోత్సవములు జరుపుకొని ఉన్నాము. ఇంత సుదీర్ఘ కాలం తర్వాత గూడా మనం అనుకున్నంత, కావల్సినంత పౌర కర్తవ్య భావన (Civic sense) పెంచుకోలేదేమో అన్న అభిప్రాయం కలుగుతున్నది. 


నాయకులు (వారూ  పౌరులే) ఉద్యమ కాలంలో మరియు ఎన్నికల సమయాలలో గొప్ప గొప్ప ఆదర్శాలు, ఆకర్షిత తాయిలాలు ప్రకటించి జనాలను మభ్య పెట్టడం, తీరా అధికారంలోకి వచ్చాక నాయకుల (అధిక శాతము) ధోరణి మరియు ఆచరణ వారి పూర్వ వాగ్దానాల ప్రకారం ఉండకపోవడం సర్వ సాధారణమైనది. 


నాయకుల (అధిక శాతము) మాటలకు, వాగ్దానాలకు మోసపోవడం సామాన్య  ప్రజల అమాయకత్వమా, లేక వారి వ్యక్తిగత స్వార్థమా, ఏది ఏమైనా సమాజం అంధకారంలోనే ఉన్నదను విషయము నిర్వివాదాంశము. *దేశ అభివృద్ధి, భద్రత మరియు భవిష్యత్తు గురించి ఏమాత్రము ఆలోచించని బాధ్యతా రాహిత్య మనుగడనే అధికులు ఇంకా కొనసాగిస్తున్నారన్నది రుజువైన పరమ సత్యము*. ఇందుకు నిరక్ష్యరాస్యులు మరియు అక్షరరాస్యులు సమాన బాధ్యత వహించాల్సి ఉంటుంది.


నిరక్షరాస్యులు (illiterate) తమ స్వార్థ మరియు తాత్కాలిక ప్రయోజనాలశించి, సుదీర్ఘ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే  ప్రలోభాలకు లొంగడము, అనర్హులను ఎన్నుకోవడము. అక్షరరాస్యులు (educated) దేశ   పరిపాలనా సౌలభ్యము తద్వారా అభివృద్ధి మరియు భద్రత కొరకు అనువైన ఎన్నికలను నిర్లక్ష్యము చేయడం, క్షమించరాని తప్పిదమే గాకుండా ఇటువంటి నిర్లక్ష్య చర్య దేశానికి అరిష్టమే. *మనం పౌర ధర్మాలను, కర్తవ్యాలను పాటించడం లేదను విషయానికి వేరే (ఇతర)  నిదర్శనాలెందుకు*.


.

కనకధారా స్తవం*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *నమోఽస్తు దేవ్యై భృగునందనాయై*

       *నమోఽస్తు విష్ణోరురసి స్థితాయై*,

       *నమోఽస్తు లక్ష్మి కమలాలయాయై*

       *నమోఽస్తు దామోదర వల్లభాయై*. (14)


               { _/  *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: పుత్రికయు, విష్ణువు యొక్క వక్షఃస్థలంలో నెలకొన్నదియు, పద్మాసనాసీనురాలు, కేశవుని ప్రియురాలగు లక్ష్మీదేవికి వందనాలాచ రిస్తున్నాను.

ఆకులు చెప్పిన పాఠాలు."*

 *"ఆకులు చెప్పిన పాఠాలు."*


*మామిడి ఆకు* - "ప్రతీ శుభ కార్యంలోనూ నేను తప్పని సరి. నేను లేనిదే ఏ శుభకార్యం జరుగదు" అంది గర్వముగా. దేవుడు చిన్నగా నవ్వాడు. తలుపు గుమ్మానికి తల క్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు.


*కరివేపాకు* - "వంటలలో నేను లేనిదే రుచి లేదు" అంది గర్వముగా. తినేటప్పుడు కరివేపాకుని ఏరి పార వేసే ఆలోచనను మనిషికి కలిగించాడు.


*అరటి ఆకు* - "ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు. నేను మీకంటే గొప్ప" అని అన్నది. దేవుడు ఆలోచించాడు. అరటి ఆకు తిన్న తరువాత దాని బ్రతుకు చెత్తకుప్పలో పడేటట్లు చేశాడు.


*తమలపాకు* -"నేను శుభ కార్యాలకే కాదు, నన్ను తాంబూలం గా వేసుకొంటే నోరు ఎర్రగా పండుతుంది. నాకు సాటి ఎవరూ లేరు" అన్నది. దేవుడు దాని పొగరు అణచాలను కొన్నాడు. తమలపాకు నమిలి రసం మ్రింగి, తరువాత బయటకు ఉమ్మేసేలా చేసాడు.


*తులసి ఆకు:* "నన్ను కూడా దేవుని పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం" అంది వినయంగా. దేవుడు సంతోషించాడు. తన మెడలో హారంగా, తన పాదాల చెంత తులసీదళంలా భక్తులు సేవించే తీర్ధంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు.


*నీతి* - "నేను, నా వల్లే," అనే అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు. వినయంగా వున్నవారు ఉన్నత స్థానం పొందుతారు.


(సేకరణ)

_జూన్ 11, 2024_*

 ॐ శుభోదయం  ॐ 

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

     *_జూన్ 11, 2024_*  

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*గ్రీష్మ ఋతువు*

*జ్యేష్ఠ మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *పంచమి* సా5.48

వారం: *భౌమవాసరే*

(మంగళవారం)

నక్షత్రం: *ఆశ్రేష* రా12.24

యోగం: *వ్యాఘాతం* సా6.02

కరణం: *బాలువ* సా5.48

వర్జ్యం: *మ12.24-2.06*

దుర్ముహూర్తము: *ఉ8.04-8.56*

*రా10.53-11.37*

అమృతకాలం: *రా10.41-12.24*

రాహుకాలం: *మ3.00-4.30*

యమగండం: *ఉ9.00-10.30*

సూర్యరాశి: *వృషభం*

చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *5.28*

సూర్యాస్తమయం: *6.29*

*లోకాః సమస్తాః*

  *సుఖినోభవంతు*

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యావందనం 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము.

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ 11.06.2024

మంగళ వారం (భౌమ వాసరే) 

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠ మాసే శుక్ల పక్షే పంచమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ 

జ్యేష్ఠ మాసే  శుక్ల పక్షే పంచమ్యాం

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.28

సూ.అ.6.30

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం 

శుక్ల పక్షం

పంచమి సా.5.44 వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం ఆశ్రేష రా.12.18 వరకు.

అమృతం రా. 10.35 ల 12.18 వరకు. 

దుర్ముహూర్తం  ఉ.8.04 ల 8.56 వరకు.

దుర్ముహూర్తం రా.10.53 ల 11.37 వరకు. 

వర్జ్యం మ. 12.19 ల 2.02 వరకు.

యోగం వ్యాఘాత సా. 6.00 వరకు. 

కరణం బాలవ సా. 5.44 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా.3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ఉ.9.00 ల 10.30 వరకు. 

***********   

పుణ్యతిధి జ్యేష్ఠ శుద్ధ పంచమి. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

జప మాలలు

 జప మాలలు  -  ఫలితాలు.


 * స్వచ్చమైన స్పటిక మాలతో జపం చెస్తే రాజ్యాధికారం, లభించును. సర్వ భోగములు సిద్ధించును. గుణవంతులైన సంతానం లబించును.

 

 * ముత్యాల మాలతో జపం చేస్తే సర్వ శాస్రములు, సర్వ విద్యలు నాలుక పై తాండవ మాడును.

 

 * పగడ మాలతో జపం చేసిన లోకం లొని సమస్త మానవులు, జంతువులు, పశువులు, క్రూర జంతువులు ను వశీకరణం చేసుకొవచ్చు .

 

 * ఇంద్ర నీల మణుల మాలతో గాని , మరకత మణుల మాలతో కాని జపం చేయడం వలన శత్రు భయంకరులు అవుతారు.

 

 * బంగారు మాలతో జపం చేయడం వలన అష్టైశ్వర్యములు పొందుదురు.

 

 * మాణిక్య మాలతో జపం చేసిన వారు తాను కొరిన కన్యను పొందుదురు.

 

 * పాదరస గులికలతో  కూర్చబడిన మాలతో జపం చేసిన సమస్త ప్రయోజనములు పొందగలుగు శక్తి వంతులగురు .


  

         ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

భోజ కాళిదాస కథలలో

 భోజ కాళిదాస కథలలో ఎక్కువ కథలు భోజుడి ఔదార్యాన్నీ ,కాళిదాసు కవిత్వ మహాత్వాన్నీ ప్రశంసిస్తూ 

చెప్పేవి కొన్ని కథలలో కాళిదాసు యుక్తితో సమస్యల నుంచి తప్పించుకోవడం గురించి చెప్తారు.యిది అలాంటి కథ.


ఒక దూరదేశం లో దుర్యోధను డనే కవి వుండేవాడు.ఆయన కాళిదాసు కవిత్వము గురించీ ఆయన పొందుతున్న సత్కారాలను గురించీ విన్నాడు.భోజుడి రాజ్యం లో కాళిదాసునే భోజుడికంటేఎక్కువ గౌరవిస్తారానీ విన్నాడుదుర్యోధనుడు స్వయం గా మంచి విద్వాంసుడూ.కవీ దానికి తోడు మహా భక్తుడు,దేవీ ఉపాసకుడు కూడా.అయితేనేమి కొంచెం అసూయా పరుడు.కాళిదాసును మించిన కవిత్వం చెప్పాలనే కోరిక తో 

దేవిని గూర్చి తపస్సు చేశాడు.దేవి ప్రత్యక్ష మైంది.మాతా!నాకు కాళిదాసు ను మించిన కవితా పాటవాన్ని ప్రసాదించు.కాళిదాసును ఓడించాలని నాకోరిక. అని అడిగాడు..అప్పుడు దేవి భక్తా! నీ కోరిక లో ఈర్ష దాగి వుంది అది నీకు మంచిదికాదు.కాళిదాసు నా భక్తుడు.నా వరం తోనే మహా కవి యైన వాడు.ఆయన తో నీకు పోటీ కూడదు.అయినా తపస్సు చేసి నన్ను మెప్పించావు కాబట్టి,నీకు ఆ శక్తిని ప్రసాదిస్తున్నాను. కానీ 

రాబోయే పౌర్ణమి నాటికి భోజుడి ఆస్థానం చేరితే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ఆ శక్తి పనిచేస్తుంది. అని చెప్పి అంతర్ధాన మైంది.


సంతోషం తో తన పరివారాన్ని తీసుకొని ధారనగారానికి వెళ్లి నగర శివార్లలో విడిది చేసి 

  పొర్ణమి నాడు తను 

  రాజాస్థానానికి వస్తున్నానని కబురు పంపాడు.


ఆ సాయంత్రం కాళిదాసు రోజు లాగే కాళీమాతను పూజిస్తూండగా దేవి పలుకులు వినిపించాయి కాళిదాసా! రేపు మీ ఆస్థానం చేరబోతున్న దుర్యోధన కవికి ఈ ఒక్క రోజుకూ నేను నిన్ను ఓడించగల శక్తి ప్రసాదించినాను.ఈ ఒక్కరోజూ దుర్యోధనుడిని గెలవటానికి నేను ఏమీ సహాయం చేయలేను.నీ వేమయినా జాగ్రత్త పడతావేమో నని నిన్ను హెచ్చరిస్తున్నాను.అని చెప్పి మాయమై పోయింది.


.కాళిదాసు ఒక యుక్తి పన్నాడు.గడ్డి మోపులు అమ్మేవాడిలాగా వేషం వేసుకొని ఊరిబయట వున్నగుడారాలలో విడిది చేసిన దుర్యోధనుడి పరివారాల దగ్గరికి వెళ్లి గుర్రాలకు కావలిసిన మేత కారు చౌకగా అమ్మాడు.రాత్రయిపోయిందని సాకు చెప్పి అక్కడే వుండి పోయాడు. 


గుడారం లో దుర్యోధనుడికి నిద్ర పట్టలేదు,కాళిదాసుకూ  నిద్ర పట్టలేదు.యిద్దరికీ రేపేంజరుగుతుందో నని ఆందోళనా భయం.దుర్యోధనుడు తెల్లవారక ముందే తన గుడారం నుంచి బయటికి వచ్చిఅక్కడే తిరుగుతున్నాడు. 


కాళిదాసు అయన ప్రక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడు.పడమటి దిక్కున చంద్రుడు యింకా ప్రకాశిస్తున్నాడు.సూర్యోదయం యింక కాలేదు.పక్షుల కలకలా రావాలు అప్ప్దప్పుడే మొదలవుతున్నాయి.ప్రకృతి ఎంత అందం గా వున్నది. ఇదంతా  చూస్తుంటే నీ హృదయం స్పందించడం లేదా?అని అడిగాడు.దుర్యోధనుడు మారువేషం లో వున్న కాళిదాసును.గడ్డి అమ్ముకునే వాడిని నాకవన్నీ 

ఏమి తెలుస్తాయి?మీరే  ఏదైనా మంచి వర్ణన  చెప్పండి వింటాను అన్నాడు.అయితే విను

అంటూ ఈ శ్లోకం చెప్పాడు దుర్యోధన కవి.


 

చరమగిరి కురంగీ శృంగ కండూయనేన 

స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః 


అంటే అర్థ మయిందా?నీకు కాలేదనుకుంటాను నేను చెప్తాను అన్నాడు.చిత్తం అవసరం లేదండీ.కాళిదాసు గారి గుర్రాలకు కూడా నేనే గడ్డి అమ్ముతాను అక్కడి సేవకులతో మాట్లాడుతుంటాను.కాళిదాసుగారి కవిత్వం అప్పుడప్పుడూ వింటూ వుంటాను మరీ కఠిన  మైనవి అర్థం కావు కానీ ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలు అర్థం చేసుకోగలను.అన్నాడు.దుర్యోధనుడు నివ్వెర పోయి ఏదీ చెప్పుచూద్దాం అన్నాడు.


చరమగిరీ అంటే పడమటి కొండ కురంగీ అంటే లేడి శృంగం అంటే క్మొమ్ము కండూయనం అంటే దురద పోయేలా హాయి కలిగించేలా మెల్లగా గీరటం.అంతరిందో:కురంగః అంటే ఆ చంద్రుని లోపల కనిపిస్తున్న లేడి.

(చంద్రుడికి హరిణాంకుడు అని పేరు.మధ్యలో హరిణం వున్నవాడు.అని అర్థం)వెరసి మీరనేది పడమటికొండ అనే లేడి తన కొమ్ములతో చంద్రుడి లో వున్న లేడికి హాయి గొలిపేలా గీరుతూ వుంటే అది నిద్రావస్థ లోకి యిప్పుడు జారుకుంటున్నది అని అంతే కదా కవిరాజా! అన్నాడు.అమాయకత్వం నటిస్తూ.ఆరి పిడుగా అని ఆశ్చర్య పోయాడు దుర్యోధనుడు.గడ్డి అమ్ముకునే వాడికే యింత పాండిత్యం వుంటే యిక ఆస్థానం లోని కవులేంతటి వారో అని అతనికి వణుకు పుట్టింది.పైకి మాత్రం డాంబికంగా చూశావాఅలంకారం యెంత బాగా వేశానో అన్నాడు దుర్యోధన కవి.

.అలంకారానికేమి స్వామీ అద్భుతం గా వున్నది.కాకపొతే నాదొక చిన్న సందేహం

'చరమగిరి కురంగీ' అన్నారు కదా!కురంగీ అంటే ఆడలేడి.ఆడ లేడికి కొమ్ములు వుండవు కదండీ మీరు యే భావం తో చెప్పారో వివరం చెప్పరా?అన్నాడు కాళిదాసు


.దుర్యోధనుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.తను పప్పులో కాలేశాడు.వీడే తన కవిత్వం లో తప్పులు చూపిస్తున్నాడే అని కొంత ఆందోళన పెరిగింది.


పైకి మాత్రం ఆ ఏదో తెల్లవారు ఝాముననె నిద్రకళ్ళతో ఆశువుగా రెండు ముక్కలు చెప్పానులే నువ్వు కనుక్కో గలవో లేదో అని నిన్ను పరీక్షించ డానికి చెప్పాను అన్నాడు. 

 ఇది అద్భుతమైన ఊహండీ ఇలాంటి తప్పులు సవరించడం నేను కాళిదాసు గారి దగ్గర నేర్చుకున్నానండీ! మీరు నన్నుప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను దీన్ని సవరించి చెప్తానండీ మీకు నచ్చుతుందో లేదో తెలియదు.


.

మీ శ్లోకం లో కురంగీ కి బదులుగా 'తుండీ' అని మారిస్తే సరిపోతుందండీ తుండి అంటే ముట్టే అని అర్థం వస్తుంది కదండీ అందుకని సరిపోతుంది.మిగతా రెండు పాదాలూ చెప్పేయండి.అన్నాడు.


శ్లోకం పూర్తి  చెయ్యటం అంటే గడ్డిమోపులు అమ్మినంత సులభం కాదు.అలంకారం,ధ్వనీ రసం అన్నీ సరిచూసుకోవాలి కదా!వున్న పళాన చెప్పేది కాదు అన్నాడు.నిజమే లెండి అవన్నీ ఆలోచించి మీరు శ్లోకాన్ని ఎలా పూరిస్తారో నాకు తెలియదు కానీ నేను పూరిస్తాను చూడండి.  నేను  కాళిదాసు గారు పండితులతో ముచ్చటిస్తూ వుంటే  విని నాకూ కొంచె పూర్తి  చెయ్యటం అబ్బింది లెండి అని  ఈ శ్లోకం చెప్పాడు.

 


'పరిణత రవి గర్భ వ్యాకులా పౌరుహూతీ 

దిగపి ఘన కపోతీ హుంకృతై:క్రంద తీవః 


మీరు పడమటి దిక్కు గురించి రెండు పాదాలు చెప్పారు.తూర్పుదిక్కు గురించి మిగతా రెండు పాదాలూ 

చెప్తే సరిపోతుంది కదా! అని చెప్పాను..పౌరుహూతి అంటే తూర్పు దిక్కు కదండీ 'పరిణత రవి గర్భ వ్యాకుల'

అంటే సూర్యుడిని గర్భం లో వుంచుకొని నెలలు నిండిన వనితలా ప్రసవ వేదన తో కేకలు పెడుతున్నది కదండీ అదిగో 'ఘన కపోతీ హుంకృ తై క్రందతీ యివ" అంటే పక్షుల పెద్ద పెద్ద అరుపుల రూపం లో ఆమె ప్రసవ వేదన పడుతున్నట్లు అనిపించడం లేదూ?అంటూ అప్పుడే లేచి కలకలా రావాలు చేస్తున్న పక్షులను చూపించాడు.కాళిదాసు.శ్లోకం పూర్తయింది.


చరమగిరి కురంగీ తుండ కండూయ నేన

స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః 

పరిణత రవి గర్భ వ్యాకులా పౌర హూతీ 

దిగపి, ఘన కపోతీ హుంకృతై :క్రందతీవః 


పడమటి కొండ అనే ఆడ లేడి తన ముట్టెతో చంద్రుడిలో వుండే హరిణాన్ని  దానికి హాయి గోలిపేలా గీరుతున్నది.  ఇక  తూర్పుదిక్కు సూర్యుడిని తన గర్భం లో దాచుకొని నెలలు నిండిన వనిత ప్రసవ వేదన పడుతున్నప్పుడు చేసే ఆక్రందనల్లాగా పక్షుల కిలకిలా రావాలు అనిపిస్తున్నాయి. 


దుర్యోధనుడికి ఆ కవిత్వ సౌందర్యానికి ఒళ్ళు పులకరించింది.తనకు రాజాస్థానం లోపరాభవం తప్పదని 

భయం వేసి దేవీ కటాక్షం మీద కూడా నమ్మకం పోయి ఈ కవుల ముందు తాను  నిలువ లేనని పించి 

అప్పటికపుడే తన సేవకులందరినీ లేపేసి తెల్లవారక ముందే సపరివారం గా వూరు విడిచి వెళ్లి పోయాడు.


కాళిదాసు ' మాణిక్యవీణా ముపలాలయంతీం' అని అమ్మవారిని స్తోత్రం చేసుకుంటూ ఇల్లు చేరాడు. 


(భోజ కాళిదాసు కథలు చమత్కార శతం పుస్తకము నుండి)

తల్లి చేసిన పుణ్యం

 ☝️ శ్లోకం 

సుశీలో మాతృ పుణ్యేన

 పితృపుణ్యేన బుద్ధిమాన్ ।

ధార్మికో పూర్వపుణ్యేన

 స్వీయపుణ్యేన భాగ్యవాన్ ।।



భావం : ఏ వ్యక్తియైనా తన తల్లి చేసిన పుణ్యం వలన మంచి శీల సంపద కలవాడవుతాడు. తండ్రి చేసిన పుణ్యం వలన బుద్ధిమంతుడవుతాడు. తమ వంశపూర్వికులు చేసిన పుణ్యం వలన ధర్మాత్ముడవుతాడు. తాను స్వయంగా చేసిన పుణ్యం వలన ధనవంతు డవుతాడు.

పంచాంగం 11.06.2024 Tuesday.

 ఈ రోజు పంచాంగం 11.06.2024  Tuesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష: పంచమి తిధి భౌమ వాసర: ఆశ్రేష నక్షత్రం వ్యాఘాత యోగ: బాలవ  కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పంచమి సాయంత్రం 05:31 వరకు.

ఆశ్రేష రాత్రి 11:41 వరకు.


సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:46


వర్జ్యం : మధ్యాహ్నం 11:34 నుండ 01:18 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:21 నుండి 09:13 వరకు తిరిగి రాత్రి 11:10 నుండి 11:54 వరకు.


అమృతఘడియలు : పగలు 09:57 నుండి 11:41 వరకు..


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

తిరుపతి ఆలయంలో రాయల విగ్రహాలు

 *మీకు తెలుసా?*

*శ్రీవారికి రాయలు  సమర్పించుకున్న ఆభరణాలు  ఎన్ని?* 

*తిరుపతి ఆలయంలో రాయల విగ్రహాలు ఎందుకు ఉన్నాయి?*

*రాయలవారు తిరుపతికి ఎన్ని సార్లు వచ్చారు*

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° సువర్ణాక్షరాలతో లిఖించబడిన చరిత్ర....

దేశభాషలందు తెలుగులెస్స అని చాటిన కీర్తి....

వజ్రాలను వీధుల్లో రాసులుగా పోయించిన ఘనత....

సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా ప్రఖ్యాతి....

కృష్ణదేవరాయల సొంతం !


విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు జనరంజకంగా పాలించాడు.  అందుకే ప్రజలు రాయలవారిని దేవుడిగా భావించారు. కాగా రాయలవారు తిరుమల వెంకటేశ్వరస్వామిని మనసారా ఆరాధించాడు ! మొక్కులు చెల్లించుకున్నాడు. శ్రీనివాసుడికి అపురూప కానుకలు సమర్పించిన మహారాజుల్లో దేవరాయలది మొదటి వరస! 


👉తిరుమల దర్శనం - ఆభరణాలు 


రాయలవారు తన జీవితకాలంలో....1513 నుంచి  1521 మధ్యకాలంలో ఎనిమిది సార్లు  వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నట్టు 

శాసనాలు ఆధారంగా తెలుస్తున్నది. తిరుమల  శాసనాల్లో మాత్రం  ఏడుసార్ల దర్శనం తాలూకు వివరాలు లభ్యం అవుతున్నాయి.  దర్శనం సమయంలో అత్యంత విలువైన  వెలకట్టలేని ఆభరణాలను శ్రీవారికి సమర్పించారని కూడా ఈ శాసనాలు చెబుతున్నాయి.


తిరుమల ఆలయంలో లభ్యమైన 1200కు పైగా శాసనాల్లో.... 50 శాసనాలు  కృష్ణరాయలవారికి సంబందించినవే. ఈ శాసనాలు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఉన్నాయి. వీటిలో కృష్ణదేవరాయలుతో పాటుగా ఆయన దేవేరులైన తిరుమలాదేవి, చిన్నాదేవిల ప్రస్తావన ఉన్నది.


▪️మొదటిసారి దర్శనం


1513, ఫిబ్రవరి 10 వ తేదీన కృష్ణదేవరాయలు మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంలో....


1 )  3.3 కేజీల నవరత్న కిరీటం,

2)  ముత్యాలు పొదిగిన మూడుపేటల కంఠహారం,

3)  25 వెండి హారతి పళ్లాలు

4 )శ్రీనివాసుడి ఏకాంతసేవలో ఉపయోగించే రెండు బంగారు గిన్నెలు దేవేరులైన చిన్నాదేవి, తిరుమలదేవిల సమేతంగా ప్రత్యేకంగా సమర్పించారు.


▪️రెండవసారి దర్శనం


1513, మే 2 వ తేదీన రెండు నెలల వ్యవధిలో కృష్ణదేవరాయలు రెండోసారి తిరుమలకు యాత్ర చేసాడు..ఈ సందర్భంలో


5 ) వజ్రాలు, కెంపులు, పచ్చలు, రత్నాలు పొదిగిన   

      662 గ్రాముల మొలతాడు

7) వైజ్రవైఢూర్యాలు పొదిగిన కత్తి,

8) 132 గ్రాముల నిచ్చకం కఠారి,

9) ముత్యాలతో కూడిన కఠారి,

10) వజ్రాల కఠారి,

11) 98 గ్రాముల వజ్రాల పతకం,

12) 168 గ్రాముల నిచ్చకం భుజకీర్తుల జోడు,

13) 205 గ్రాముల బంగారుపేట,

14)  276 గ్రాముల వజ్రాలమాల

15 ) 573 గ్రాముల వజ్రాల భుజకీర్తులు,

16)  ఉత్సవమూర్తులను అలంకరించేందుకు 380 గ్రాముల బరువైన మూడు వజ్ర కిరీటాలు

సమర్పించుకున్నాడు


▪️మూడవసారి దర్శనం


 1513, జూన్‌ 13 వ తేదీన  ఒక నెల  వ్యవధిలో దేవరాయలవారు మూడోసారి శ్రీవారిని దర్శించుకున్నాడు.

ఈ సందర్భంలో....


17) జతలకొద్ది బంగారు గిన్నెలు 

18) జతలకొద్ది నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు

వీటితో పాటుగా 

19) నిత్య నైవేద్యాల  నిమిత్తం ఐదు గ్రామాలను   దానముగా రాసి ఇచ్చాడు


ఇదే సమయంలో ప్రతి ఏటా తమిళనెల  తైమాసంలో తన తల్లిదండ్రుల ఆత్మోద్ధరణ  కోసం  ఉత్సవం ప్రారంభించారు.


▪️నాల్గవసారి దర్శనం


1514, జులై 6 వ తేదీన తన జైత్రయాత్రలో భాగంగా  తిరుమలేశుని  నాల్గవమారు దర్శించుకున్నాడు. ఆ సమయంలో కృష్ణదేవరాయలు ఉదయగిరి కోటను జయించి విజయనగరానికి తిరిగివెళుతున్నాడు. తన  విజయానికి జ్ఞాపకంగా సతీ సమేతముగా శ్రీవారికి కనకాభిషేకం చేశాడు.

20)  30వేల బంగారు వరహాలతో ఈ అభిషేకం  

       గావించాడు.

21)  250 గ్రాముల బంగారు త్రిసరం దండ, రెండు    

        వజ్రాల కడియాలు ఇచ్చుకున్నాడు.


22)వేంకటేశ్వరుడి నిత్యారాధనకు తాళ్లపాక గ్రామాన్ని దానంగా రాసిచ్చాడు.

23) ముత్యాలు, పచ్చలు, వజ్రాలు పొదిగిన 225న్నర గ్రాముల చక్రపాదకం   తిరుమలాదేవి తరుపున సమర్పించడం జరిగింది.

 24 ) చిన్నాదేవి తరుపున  _

200 గ్రాముల వజ్రాలు పొదిగిన మూడు కంఠమాలలు,

25 ) నిత్య కైంకర్యాల కోసం ఓ గ్రామం,

సమర్పించడం జరిగింది.


▪️ ఐదవసారి దర్శనం


1515, అక్టోబరు 25 వ తేదీన రాయలవారు...

కళింగ వరకు తన విజయనగర సామ్రాజ్యం విస్తరించిన  శుభ సమయాన్ని పురస్కరించుకొని ఐదవసారి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నాడు.

ఈ విజయోత్సాహంలో


26) 27 కేజీల బరువున్న మకరతోరణాన్ని కానుకగా ఇచ్చాడు.


▪️ఆరవసారి దర్శనం


1517, జులై 2వ తేదీన....కళింగ

దేశాన్ని పూర్తిగా స్వాదీనపరుచుకుని  తిరుగులేని మహారాజుగా రాయలవారు  ఆరవసారి తిరుమల సందర్శించారు. ఈ సందర్బంగా....


27) వేంకటేశ్వరుడి ఆనంద నిలయానికి 30 వేల వరహాలతో బంగారు తాపడం చేయించాడు .

ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం 1518 సెప్టెంబరు 9న పూర్తయింది

28) స్వామి వారికి ప్రత్యేకంగా బంగారు కంఠమాల 29) విలువైన బంగారు పతకం

సమర్పించుకున్నాడు


▪️పట్టపురాణులతో తన విగ్రహం


ప్రస్తుతం భక్తులు  తిరుపతి యాత్ర వెళ్లి   శ్రీవారిని దర్శించడానికి ముందు కృష్ణరాయమండపంలోకి ప్రవేశిస్తారు. ఈ మండపం కుడివైపున కృష్ణదేవరాయలు విగ్రహం తన దేవేరుల తో కలిసి ఉంటుంది. శ్రీచక్ర శుభనివాసుడికి ఈ విగ్రహాలు భక్తి పూర్వకంగా ప్రణమిల్లుతున్నట్టు ప్రతిష్టితులై కనిపిస్తారు. ఈ విగ్రహాలను  దేవస్థానం వారు  ప్రతిష్టించలేదు. కృష్ణదేవరాయలు  వారే  స్వయంగా  తన ఆరవసారి తన దర్శనంలో భాగంగా

ఆలయంలో ప్రతిష్టించుకున్నారు. తనకు అంతులేని సంపదను రాజ్యాన్ని ఇచ్చిన శ్రీవారి చెంతన తాను శాశ్వతంగా మిగిలిపోయి  తిరుమల వైభవాన్ని మహిమను చాటుతూనే ఉండాలనే ఉద్దేశంతో రాయలు వారు  విగ్రహరూపంలో  ఇక్కడ మిగిలిపోయారు.రాజైనా మహారాజైనా దేవుడి ముందు దాసోహులే కదా! 


▪️ఏడవసారి దర్శనం


518, అక్టోబరు 16 వ  తేదిన దేవేరి తిరుమలాదేవితో కలిసి రాయలవారు  ఏడవమారు తిరుమలకు వచ్చాడు. కమలాపురం శాసనాల్లో ఈ సమాచారం ఉన్నది.ఈ యాత్రకు సంబంధించిన ఆధారాలు తిరుమల శాసనాల్లో లేవు కాబట్టి, ఈ సందర్బంగా సమర్పించుకున్న  కానుకల వివరాలు  లభ్యం కావడం లేదు.


▪️ఎనిమిదవసారి దర్శనం


క్రీ.శ. 1521, ఫిబ్రవరి 17 వ తేదీన కృష్ణదేవరాయలు  తిరుమల శ్రీవారిని ఎనిమిదవమారు 

దర్శనం  చేసుకున్నాడు. ఈ సందర్భంలో...


30) రత్నాలు పొదిగిన వింజామర..

31) 31 కేజీల 124 గ్రాముల మకర తోరణం 

32) నవరత్న ఖచిత పీతాంబరం..

33) 10 వేల బంగారు వరహాలు

34)  రత్నాలు, పచ్చలు, నీలాలు పొదిగిన కుళ్లాయి, సమర్పించుకున్నాడు.


👉స్వామివారి విశిష్టత


స్వామివారి విశిష్టత, తిరుమల వైభవం, రాయలు సమర్పించుకున్న ఆభరణాలు, ఈ మొత్తం వివరాలు

డా..సాదు సుబ్రమణ్యశాస్త్రిగారు తన 

 ""‘తిరుపతి శ్రీ వెంకటేశ్వర"" పుస్తకంలో రాసారు. ఈ పుస్తకం 1921లో ప్రచురించబడింది. ఈ పుస్తకం ప్రకారం పైన తెలిపిన ఆభరణాలు మాత్రమే  కాకుండా, వెలుగులోకి రాని మరెన్నో ఆభరణాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది.🙏


సేకరణ  : *~శ్రీశర్మద*

8333844664 


సర్వేజనాసుఖినోభవంతు 🙏

మంగళవారం,జూన్ 11,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


మంగళవారం,జూన్ 11,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం

తిథి:పంచమి సా5.48 వరకు

వారం:మంగళవారం(భౌమవాసరే)

నక్షత్రం:ఆశ్రేష రా12.24 వరకు

యోగం:వ్యాఘాతం సా6.02 వరకు

కరణం:బాలువ సా5.48 వరకు

వర్జ్యం:మ12.24 -2.06

దుర్ముహూర్తము:ఉ8.04 - 8.56 మరల రా10.53 - 11.37.

అమృతకాలం:రా10.41 - 12.24

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి: వృషభం

చంద్రరాశి: కర్కాటకం 

సూర్యోదయం:5.28

సూర్యాస్తమయం:6.29


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

హనుమజ్జయంతి ప్రత్యేకం - 11/11

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం -  11/11

       (ఈ నెల 1వ తేదీ హనుమజ్జయంతి) 


XI. హనుమ - శ్రీరాముడు 


1.మొదటిసారి వచ్చి చూసి,  హనుమ పలికిన మాటలు విన్న శ్రీరాముని వ్యాఖ్య : 


    ఇట్టి గుణగణములు గల కార్యసాధకులైన దూతలు ఏ రాజువద్ద ఉంటారో, 

    ఆ రాజు కార్యములు ఆ దూతలచే నిర్వర్తించబడి సిద్ధిస్తాయి. 


ఏవం గుణగణైర్యుక్తా 

యస్య స్యుః కార్యసాధకాః I 

తస్య సిధ్యన్తి సర్వార్థా 

దూతవాక్యప్రచోదితాః ॥ 

             - కిష్కింధ 3/35 


2.సీతాన్వేషణకై వానర భల్లూక  సైన్యం నలుదిశలా పంపబడుతున్నప్పుడు,  హనుమగూర్చి శ్రీరాముడు : 


    మహాతేజశ్శాలియైన ఆ శ్రీరాముడు, 

    ఉద్యమము చేయడంలో చాల సమర్థుడైన ఆ హనుమంతుని చూచి, 

    ఇంద్రియములు మనస్సు ఆనందంతో నిండగా, 

    తన పని పూర్తి అయినట్లు భావించాడు. 

    పిమ్మట ఆ రాముడు సంతోషిస్తూ, 

    సీతకు ఆనవాలు కోసమై,    

    తన నామధేయం చెక్కిన ఉంగరాన్ని హనుమంతునకు ఇచ్చాడు.


తం సమీక్ష్య మహాతేజా 

వ్యవసాయోత్తరం హరిమ్ I 

కృతార్థ ఇవ సంవృత్తః 

ప్రహృష్టేన్ద్రియమానసః ৷৷ 

దదౌ తస్య తతః ప్రీత| స్వనామాఙ్కోపశోభితమ్ I 

అఙ్గులీయమభిజ్ఞానం 

రాజపుత్ర్యాః పరన్తపః ৷৷ 

          - కిష్కింధ 44/11,12 


3.సీతామాత జాడ తెలుసుకొనివచ్చిన హనుమ గూర్చి శ్రీరాముని ప్రశంస, సత్కారం : 


   "కార్యము చేయుటకై నియుక్తుడైన హనుమంతుడు ఆ పనిని సాధించినాడు. తనను ఏ మాత్రము తేలికపరచుకోలేదు. సుగ్రీవునకు సంతోషం కలిగించాడు. 

    హనుమంతుడు ఇప్పుడు సీతను చూచివచ్చి, నన్నూ రఘువంశమునూ, మహాబలుడైన లక్ష్మణునీ ధర్మానుసారము రక్షించినాడు. 

    కానీ నేను, ఈ ప్రియవార్తను చెప్పిన ఇతనికి తగు ప్రాయమును చేయజాలకున్నాను. 

    అదియే దీనుడనైన నా మనస్సును చాలా పీడిస్తోంది. 

    అట్టి మహాత్ముడైన హనుమంతునికి, ఈ సమయమున నేను, 

    నా సర్వస్వమైన ఆలింగనమును ఇస్తున్నాను."  


తన్నియోగే నియుక్తేన 

కృతం కృత్యం హనూమతా I 

న చాత్మా లఘుతాం నీతః 

సుగ్రీవశ్చాపి తోషితః ।। 

అహం చ రఘువంశశ్చ 

లక్ష్మణశ్చ మహాబలః I 

వైదేహ్యా దర్శనేనాద్య 

ధర్మతః పరిరక్షితాః ।। 

ఇదం తు మమ దీనస్య 

మనో భూయః ప్రకర్షతి I

యదిహాస్య ప్రియాఖ్యాతుః 

న కుర్మి సదృశం ప్రియమ్ ।।         

ఏష సర్వస్వభూతే 

పరిష్వఙ్గో హనూమతః I 

మయా కాలమిమం ప్రాప్య  

దత్తస్తస్య మహాత్మనః ।।

                   - యుద్ధ 1/10,11,12,13 


    హనుమని ప్రార్థిస్తూ, హనుమ చూపిన శ్రీరామ సేవా మార్గంలో పయనించి, స్వామి అనుగ్రహం పొందుదాం. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్                    


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - జే‌ష్ట మాసం - శుక్ల పక్షం  -‌ పంచమి  - ఆశ్రేష -‌‌  భౌమ వాసరే* (11.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*