13, ఏప్రిల్ 2025, ఆదివారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🚩🌷🌹

*🌞ఆదివారం 13 ఏప్రిల్ 2025🌞*

          *రామాయణం*

ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


     *వాల్మీకి రామాయణం*

            *7 వ  భాగం*                     

```

అలా వాళ్ళు ప్రయాణిస్తూ శోణానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు, ఆ ప్రాంతం ఫలాలు, పుష్పాలతో చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత ఆనందంగా, అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు…  “పూర్వకాలంలో బ్రహ్మ కుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసురాజు అనే నలుగురు కుమారులు కలిగారు. ఆ నలుగురు యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, ‘మీరు నలుగురూ నాలుగు నగరాలని నిర్మాణం చెయ్యండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి” అని ఆదేశించాడు.


అప్పుడు వాళ్ళు కౌశాంబీ, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అనే నాలుగు నగరాలని నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురములో. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉంది, శోణానది ఈ 5 పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది, అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది.


కుశుడి రెండవ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరు కుడా ఘ్రుతాచి అనే అప్సరసకి, కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు, మెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్లి పాటలు పాడుకుంటూ, వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో  అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి…  “మీరు చాలా అందంగా ఉన్నారు, కాని మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతోకాలం ఉండలేరు, కొంత కాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది, కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను పెళ్ళిచేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు” అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు.


వెంటనే ఆ నూరుగురు కన్యలు ఏక కంఠంతో...```


*”కుశనాభ సుతాః దేవం సమస్తా సుర సత్తమ |*

*స్థానాత్ చ్యావయితుం దేవం రక్షామః తు తపో వయం ||*

*మా భూత్ స కాలో దుర్మేధః పితరం సత్య వాదినం |*

*అవమన్యస్వ స్వ ధర్మేణ స్వయం వరం ఉపాస్మహే ||*

*పితా హి ప్రభుర్ అస్మాకం దైవతం పరమం చ సః |*

*యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||*```


మాదగ్గర అపారమైన తపఃశక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము, మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్ళంటూ జరిగితే, అది ధర్మాత్ముడైన మా తండ్రిగారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాము కాని మా అంతట మేము నిర్ణయించుకోము, ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు” అని ఆ కన్యలందరూ ఏక కంఠంతో చెప్పారు.


వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరములలోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వం కల్పించాడు, దానివల్ల వారందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు.


తరవాత ఆ కన్యలందరూ కుశనాభుడి దగ్గరికి వెళ్లి జరిగినది చెప్పారు.


అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, “అమ్మా! మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని...```

*క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః |*

*క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ ||*```


స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మా! నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు, మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు, అందం అంటే ఇదే. ఓర్పే దానం, అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పే, ఓర్పుకి మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతోంది” అని చెప్పాడు.


అదే సమయంలో చూళి అనే ఒక మహర్షికి, ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో... “నేను నీకు ఏమిచెయ్యగలను” అని అడిగారు.


అప్పుడామె.... “నేను ఎవరికీ భార్యని కాను, కాని అపారమైన తపఃశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన                  నీ వలన, శారీరక సంపర్కం లేకుండా, మానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి” అని అడిగింది.


అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుడిని సోమదకి ప్రసాదించారు.


పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు, కాపిల్యము అనే నగరంలో ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి, వాళ్ళు మళ్లీ పూర్వ సౌందర్యాన్ని పొందారు.


అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది” అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.


ఈ వృత్తాంత్తం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు.


*రేపు...8వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

.

అన్నపూర్ణ దేవి మందిర*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

    *అన్నపూర్ణ దేవి మందిర*

        *ప్రదక్షిణ ఫలితం*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాకపక్షి ఉండేది. అది ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశమార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది. అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది. ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడిఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకొనేది.*


*ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది. అలా చాలాకాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది. ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది. రెండు కల్పాలపాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది.*


*ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగశిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది. పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు. పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు.*


*బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత, భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్లెదుట ఎప్పుడూ కనిపిస్తుండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకొన్నాడు.*


*యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు. వీటన్నిటితోపాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి.*


*అతడి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆనోటా ఆనోటా ప్రజల అందరికీ చేరాయి. గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటిశక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుండేవారు.*


*అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒక రోజు రాజు దగ్గరకు బయలుదేరారు. మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకారభావాన్ని కొంచమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్లి నమస్కరించి, పూజించి, అతిథి సత్కారాలను చేసి, ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు. యోగక్షేమపరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు.*


*అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా, అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల సాధనకోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు, క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు.*


*ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్లీ చెప్పసాగాడు.*


*గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు.*


*ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి రెండు కల్పాలపాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు.*


*తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మాహాత్మ్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు.*


*కాశీ అన్నపూర్ణావిశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి.*


*కాశి నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది.*


*కాశీ వెళ్లినప్పుడు తప్పకుండా విశ్వనాథ,అన్నపూర్ణ మందిర ప్రదక్షిణం చేయండి.*


*ఓం అన్నపూర్ణాయై నమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                *విరచిత*

         *”శివానందలహరి”*

            *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శివ పాదారవిందమును భజింపవలసిన ఆవశ్యకతను గూర్చి శంకరులు ఈ శ్లోకమున చెప్పారు.*


*శ్లోకము : 73*


*భూదారతా ముదవహద్య దపేక్షయా*

   

*శ్రీ భూదార ఏవ కిమతః  సుమతే లభస్వ*

   

*కేదార మాకలిత ముక్తి మహౌషధీనాం*

   

*పాదారవింద భజనం పరమేశ్వరస్య!*



*తాత్పర్యము:-*


*ఓ సుబుద్ధీ ! ఏ పాదాన్ని చూడాలని, లక్ష్మీ భూ భర్తయైన విష్ణువే వరాహత్వమును ధరించాడో సాలోక్యము , సమీప్యము, సారూప్యము, సాయుజ్యము అనే ముక్తులనే గొప్ప ఓషధులు పండించడానికి భూమియైన పరమేశ్వరుని పద్మములవంటి ఆ పాదాన్ని భజించు . అంతకంటే ఏమి కావాలి ?*


*(పూర్వము శీవలింగము యొక్క అగ్రమును అడుగు భాగాన్ని  చూడాలని, బ్రహ్మ  హంసవాహనుడై ఆకాశానికి, విష్ణువు వరాహత్వాన్ని ధరించి పాతాళానికి వెళ్ళాడు. కానీ బ్రహ్మ, విష్ణువు శివలింగపు ఆది అంతాలను చూడలేక పోయారు.)*


*వివరణ:-*


*శంకరులు ఇలా చెప్పారు  "ఈశ్వరా!  నీవు పరమేశ్వరుడవు. నీ పాదపద్మాలు ఎక్కడ ఉన్నాయో తెలిసికోవాలని ఉవ్విళ్ళూరి శ్రీ మహావిష్ణువు వరాహరూపం ధరించాడట. కానీ ఆయనకవి కనబడలేదు. అట్టి నీ పాదపద్మముల మహిమను గూర్చి వర్ణించి చెప్పలేము.*


*కాబట్టి ఓ మనసా! ముక్తి అనబడే గొప్ప ఓషధులకు పంటపొలమయిన శ్రీ పరమేశ్వరుని పాదపద్మములను భజనం చెయ్యి. అంతటి శ్రీ మహావిష్ణువే ఈశ్వర పాదాలను దర్శించాలని కోరాడంటే ఆపాదములు తక్కినవారు కోరదగినవని వేరే చెప్పనక్కరలేదుకదా!*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ఆశీర్వచనం

 🕉️🍀🕉️🍀🕉️🌸🕉️🌸🕉️🌸🕉️🍀


🙏ఆశీర్వచనం ఎందుకు చేస్తారు? -🙏


 అక్షతల ప్రాధాన్యత!*_




❓ _*ఆశీర్వచనానికీ, అక్షతలకీ ఏమిటి సంబంధం.....?*_ 


❓ _*పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి.....?*_ 


🌹 _*భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు♪.*_


🌹 విద్యార్ధులను -  "విద్యా ప్రాప్తిరస్తు"  అని, పెళ్ళైన ఆడవారిని - "దీర్ఘ సుమంగళీభవ"  అని, పురుషులను - "దీర్ఘాయుష్మాన్ భవ"  వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.


🌹 యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు 

_*"గో బ్రాహ్మణేభ్యః శుభంభవతు, లోకాస్సమస్తా సుఖినోభవంతు"*_ అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృధ్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు♪.


🌹అయితే, ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా ? అవి ఫలిస్తాయా ? అంటే......


తప్పకుండా ఫలిస్తాయి...!


🌹 _*సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి♪. ‘ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలగుతాయి, అకాలమృత్యు దోషాలు తొలగుతాయి♪.’ అంతేకాదు, ‘పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు♪.’*


🌹 *గురువులు, సిధ్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా సరే.. వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు♪. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి♪...!*


✳️ _*అక్షతల సంకేతం.....*_


🌹 సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షతలు జల్లుతారు♪. 


✳️ _*ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం ? అక్షింతలే ఎందుకు చల్లాలి? వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా ? మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి ?*_


🌹 బియ్యం చంద్రుడికి కారకం♪. చంద్రుడు మనస్సుకి కారకుడు♪. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అన్నమాట♪. 


🌹 బియ్యంలో కలిపే పసుపు గురువుకు కారకం♪. గురువు శుభ గ్రహం♪. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు♪.


🌹 మంత్రం అంటే క్షయం లేనటువంటిది♪. 'అ'కారంనుంచి 'క్ష'కారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది♪. మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షతలకి కూడా ఆ శక్తి వస్తుంది♪. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందాలని ఆశీర్వదిస్తారు♪. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది♪.


🌹 మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షతలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.  అక్షతలుఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షతలు ఉంచి మధ్యమధ్యలో ”అక్షతాన్ సమర్పయామి” అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం♪. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు♪. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.


🌹 *మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది.*


🌹 *బియ్యంలో తగినంత పసుపు,   నాలుగు చుక్కలు నెయ్యివేసి అక్షతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి....


  ✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                *విరచిత*

         *”శివానందలహరి”*

            *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శివ భక్తులు ధన్యులని శంకరులు ఈ శ్లోకంలో తెలిపారు.*


*శ్లోకము : 72*


*ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం*

     

*భిత్వా మహా బలిభిరీశ్వర నామ మంత్రైః*

    

*దివ్యాశ్రితం భుజగ భూషణ ముద్వహంతి*

    

*యే పాదపద్మ మిహతే శివతే కృతార్థాః !!"*


*తాత్పర్యము :~*


*ఈశ్వరా ! నిధులు వెదికేవాడు, కన్నులకు అంజనము వేసికొని అది కనిపెట్టి ఆ చోట నిధి రక్షకులైన దేవతలను పూజించి, త్రవ్వి ఆనిధిని తీసుకొని సంతోషాన్ని పొందిన విధంగా భక్తుడు ధ్యానమనే అంజనంతో మీ పాదపద్మ నిధిని కనిపెట్టి మీ నామ మంత్రముతో మహా బలియొనర్చి, ఆవరణమైన అఙ్ఞానమును తొలగించి, దేవతాశ్రితమూ, భుజగభూషితమూ, అయిన మీ పాదపద్మములను గ్రహించి వాటిని శిరసా వహించి , జన్మసాఫల్యంగా పరమానందమును పొందుతాడు.*


*వివరణ :-*


*శంకర భగవత్పాదులు ఈ శ్లోకములో ఈశ్వరుని పాదపద్మాన్ని గొప్ప నిధిగా వర్ణించారు. భూమిలో అనేక నిధులుంటాయి. అందువలననే భూమిని "రత్న గర్భ" అంటారు. భూమిలోని నిధులను దక్కించుకోవడానికి, గట్టి ప్రయత్నం చేయాలి.*


*అలాగే శివపాదములనే నిధిని పొందాలన్నా కూడా ఎంతో కష్టపడాలి.*


*భూమిలో నిధి ఎక్కడుందో తెలియాలంటే కంటికి అంజనం రాసుకోవాలి. అంజనమంటే ఒక విధమైన ప్రత్యేక కాటుక. శివపాద నిధిని చూడాలంటే ముందుగా శివధ్యానం చేసి దర్శించాలి.  శివ ధ్యానం శివనిధిని పొందడానికి అంజనంలాంటిదన్నమాట.*


*నిధి కనబడగానే మనచేతికందదు.  ఎందుకంటే నిధి భూమి బయట వుండదు. అది రాళ్ళచేత రప్పలచేత కప్పబడి ఉంటుంది.  దాన్ని కొందరు దేవతలో దేవతా సర్పములో కాపలా కాస్తూంటాయి. కొన్ని ప్రత్యేకమైన మంత్రాల నుచ్చరించి , బలుల సమర్పించి నిదులను రక్షించే దేవతలను ప్రసన్నము గావించుకొని, భూమిని త్రవ్వి అడ్డుగావున్న రాళ్ళను తొలగించుకొని  ఆ నిధులను పొందాలి.*


*అలాగే శివపాద నిధిని ధ్యానంలో దర్శించినంత మాత్రాన అది మనకు లభింపదు. మన పాపాలు శివధ్యానానికి ప్రతి బంధకాలు అవుతాయి  ముందు వాటిని తొలగించాలి. తరువాత మంత్రోచ్చారణ శివనామ స్మరణలతో శివుని చుట్టూ కాపలాగా వున్న ప్రమథగణాది దేవతలను ప్రసన్నులను చేసుకోవాలి. ఆ తరువాత సన్నిధిలో బ్రహ్మాది దేవతలచే ఆశ్రయింప బడినదీ, వాసుకి మొదలైన సర్పాలంకృతులతో యుండేది అయిన శివపాద నిధిని దక్కించుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే తప్పక శివపాద నిధిని పొంది ధన్యులు కావచ్చునని శంకరులు చెప్పారు.*.


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

మహా శక్తి…

 *మనలోని మహా శక్తి………….*.

(హనుమత్ విజయోత్సవం సందర్బంగా)

************************

*హనుమా!! సీతాన్వేషణ నీకు తప్పా మరెవారికీ సాధ్యం కాదయ్యా!!**ఆ తల్లిని వెదకి కనుక్కొని వచ్చే ధీరుడివి నువ్వొక్కడివే. ఈ సప్త సముద్రాలు దాటి నేను పొగలను కానీ మళ్ళీ రావడం నాకు కష్టం. నేను వృద్ధుడిని కదా. నీకు ఏదైనా సుసాధ్యం. వాయు పుత్రుడివి. రుద్రాంశ సంభూతుడువి. ఆ సీతా రాములను సదా నీ హృదయాంతరగమున ప్రతిష్టించుకున్న శ్రీరామ భక్తుడువి. 


ఈ సప్త సముద్రాలే కాదు సకల భూనభోంతరాలను ఒక్క క్షణంలో చుట్టి వచ్చే వాడివి అని జాంబవంతుడు అనగానే అక్కడున్న అంగద వానర వీరులంతా ముక్త కంఠంతో *జై హనుమా జయ జయ హనుమా* అంటూ  ఒక్క పెట్టున నినాదాలు చేయగా………


అంతవరకూ ఈ సముద్రాలు ఎలా దాటాలి లంకకు ఎలా వెళ్ళాలి  రాముని ఆజ్ఞ ఎలా పాలించాలి  *ఆ సీతమ్మ తల్లీ జాడ భారం నాపై పెట్టిన ఆ రామచంద్రునికి ఏమని సమాధానం చెప్పాలి* లక్ష్మణ మూర్తి ముందే కోపగ్రస్తుడు అని  విచార వదనంతో విచారిస్తూ ఆ పర్వతంఫై ఓ మూలకు కూర్చున్న హనుమంతుడు 


తన తోటి సహచరుల నినాదాలు, జాంబవంతుని మాటలు విని  వారి ప్రోత్సాహం, వారి పొగడ్తలతో అత్యుత్సాహం పొంది ఒక్కసారే తన శరీరాన్ని పెంచి

విశ్వ రూపం తో భీకరమైన కంఠంతో  *హూం**అంటూ 

ఒక్క  భయంకరమైన కేక పెట్టాడు. 

                                        

ఆ అరపు విని పర్వతం అటూ ఇటూ ఉగసాగింది.పర్వతం ఫై ఉన్న వానరులంతా భయబ్రాంతులతో చెల్లా చెదురై కేకలు పెట్టసాగారు. 

ఆ కొండపై ఉన్న పశు పక్ష్యాదులు అన్నీ బిక్కు బిక్కు మంటూ రోధించ సాగాయి. సముద్రాలు పెద్ద హోరుతో అల్లకల్లోలం కాసాగాయి. సాగర కె రటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ అంబరాన్ని తాకసాగాయి

ఆ భీభత్స వాతావరణాన్ని, ఆ ప్రళయాన్ని చూచి జాంబవంతుడు  *హనుమా శాంతించు ఆంజనేయ శాంతించు**అని అనగానే హనుమంతుడు తన తప్పిదం తెలుసుకుని ఒక్క పెట్టున ఆ కొండను తన కాలితో తన్ని ఆకాశం పైకి లంఘించి వాయు వేగమున సీతమ్మ తల్లిని వెదకుటకు లంక దిశగా ఎగిరిపోసాగాడు ఆ ఆ వీర హనుమానుడు.


*కొందరికి తమలో దాగి ఉన్న శక్తిని మరొకరు గుర్తించి చెబితే గానీ తమకు తెలువదు.**ఆంజనేయ స్వామి విషయంలో అదే కదా జరిగింది.


జై వీర హనుమాన్ 🙏జయ జయ హనుమాన్ 🙏శ్రీ రామ జయ రామ 🙏జయ జయ రామా 🙏


*మిత్రాజీ**

(గుండవరం ప్రభాకర్ రావు, అత్వెల్లి మేడ్చల్ జిల్లా)

కుంతీదేవి శ్రీకృష్ణ ప్రార్ధన

 🙏కుంతీదేవి శ్రీకృష్ణ ప్రార్ధన 🙏

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! 

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా

నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! 

నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

              శ్రీకృష్ణా = కృష్ణా {కృష్ణ - నల్లనివాడు}; యదుభూషణా = కృష్ణా {యదు భూషణుడు - యదు వంశమునకు భూషణము వంటి వాడు, కృష్ణుడు}; నరసఖా = కృష్ణా {నరసఖుడు - అర్జునునకు సఖుడు, కృష్ణుడు}; శృంగారరత్నాకరా = కృష్ణా {శృంగార రత్నాకరుడు -శృగార రసమునకు సముద్రము వంటివాడు, కృష్ణుడు}; లోకద్రోహినరేంద్రవంశదహనా = కృష్ణా {లోకద్రోహినరేంద్రవంశదహన - దుష్టరాజవంశముల నాశనము చేయువాడు, కృష్ణుడు}; లోకేశ్వరా = కృష్ణా {లోకేశ్వరుడు - లోకములకు ఈశ్వరుడు, కృష్ణుడు}; దేవతానీకగోబ్రాహ్మణార్తి హరణా = కృష్ణా {దేవతానీకగోబ్రాహ్మణార్తి హరణుడు - దేవత = దేవతల, అనీక = సమూహమునకును, బ్రాహ్మణ = బ్రాహ్మణులకును, గోగణ = గోవులమందకును, ఆర్తి = బాధలను, హరణా = హరించువాడు, కృష్ణుడు}; నిర్వాణ సంధాయకా = కృష్ణా {నిర్వాణ సంధాయికుడు - మోక్షమును కలింగించువాడు, కృష్ణుడు}; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరిస్తున్నాను; త్రుంపవే = తెంపుము; భవ = సంసార; లతల్ = బంధనములు; నిత్యానుకంపానిధీ = కృష్ణా {నిత్యానుకంపానిధి -శాశ్వతమైన దయకు నిలయమైనవాడు, కృష్ణుడు}.

            శ్రీ కృష్ణా! యదుకులవిభూషణా! అర్జునమిత్రా! శృంగార రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశాలను దహించే వాడా! జగదీశ్వరా! ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవులమందల ఆర్తులను బాపువాడా! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకీ ఈ భవబంధాలను తెంపెయ్యి.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

‘అదేం పిచ్చి కోరిక

 ❤️ *ఒక్క సారి చదడానికి ప్రయత్నం చేయండి* ❤️ ఒకబ్బాయికి ఉరిశిక్ష అమలు చేస్తారు.

కారణం అతను చేసిన తప్పులు.


అధికారి: ‘ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు’



అబ్బాయి: నాకంటే ముందు నా తల్లిదండ్రులను ఉరితీయాలి

అధికారి: ‘అదేం పిచ్చి కోరిక. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఉరితీయమంటావా?. అందులో ఏమైనా అర్థం ఉందా?’


అబ్బాయి: అవును అర్థం ఉంది..

నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే

నన్ను చూసి మురిసిపోయారు.

నేను అల్లరి చేస్తుంటే గద్దించలేదు.

వయసొచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను మంద లించలేదు.


ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసనయ్యాను.

తప్పుడు మార్గంలో పయనించాను.

ఎన్నో ఘోరమైన పనులు చేశాను.

నేను ఒక్కడ్నే కొడుకునని.. నన్ను ఆనాడే గారాబం చేయకుండా..

దండించి ఉంటే.. నేను ఈ రోజు.. ఈ పరిస్థితుల్లో ఉండేవాడిని కాదు.


నేనే మారతానని అనుకున్నారే కానీ…

నేను ఎలా మారాలో చెప్పలేదు.

నేను చేసే పనులకు తల్లిదండ్రులే అడ్డుచెప్పకపోవడంతో..

నేను చేసే పనులన్నీ కరెక్టే అనుకున్నా.

ఇప్పుడు అలాంటి పనులకు సమాజం అడ్డు చెబుతుంటే తెలిసొచ్చింది..

నేను నడిచింది తప్పుడు మార్గమని.


నాడు వాళ్లు నన్ను అలా వదిలేశారు కాబట్టే..

నేనిలా ఉరికంభంపై ఉన్నా.

అందుకే నా కంటే ముందు నా తల్లిదండ్రులనే ముందు ఉరి తీయాలి అన్నాడు.


డబ్బు సంపాదనలో పడి మన పిల్లల ఆలోచన ఎలా వుంది, ఎలాంటి పనులు చేస్తున్నారు అని గమనించకపోతే మనమే బాధపడాల్సి వుంటుంది. దయచేసి పిల్లలు చేసే పనులను గమనించండి, వారిని మంచి మార్గంలో నడపండి. మంచి సమాజానికి నిర్మించేందుకు దోహద పడండి.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  - ప్రతిపత్ - చిత్ర -‌‌ భాను వాసరే* (13.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎                

𝕝𝕝 *శ్లో* 𝕝𝕝    *మహాజనస్యసంసర్గః* 

  *కస్య నోన్నతికారకః ।*

       *పద్మపత్రస్థితం తోయమ్*

             *దత్తే ముక్తాఫలశ్రీయమ్ 

𝕝𝕝 *తా* 𝕝𝕝 *గొప్ప వ్యక్తుల సహవాసం ఎవరికి ప్రయోజనకరం కాదు?  తామర రేకుపై ఉన్న నీటి బిందువు కూడా ముత్యంలా ప్రకాశిస్తుంది.....*

 ✍️💐🌹🪷🙏

పణ్డితులకు

 శోకస్థానసహస్రాణి వర్షస్థాన శతాని చ|

దివసే దివసే మూఢమావిశన్తి న పణ్డితమ్||


ప్రతిరోజూ వేలకొలది దుఃఖములు మరియు వందలకొద్దీ సంతోషములు మూర్ఖులకే వస్తాయి కానీ పణ్డితులకు కాదు

కాలపథం

 "దిగ్దేశకాలపథినాం చ జ్ఞానం సూర్యాద్వినిర్గతం|


దిక్కులు (దిక్పథం), దేశాలు, కాలపథం మొదలైన జ్ఞానాలన్నీ సూర్యుని నుంచే ఉద్భవించాయి.

ధనికులు విద్యావంతులు

 *2070*

*కం*

ధనికులు విద్యావంతులు

ఘనజీవన్మూర్తులైన కడతేరగనే

తనువును శవమని పిలుతురు

మననము ప్రేతని తలతురు మహిలో సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనికులు, విద్యావంతులు, గొప్ప జీవితం గడుపుతూ ఉన్న వారైననూ కడతేరగనే ఈ భూలోకంలో దేహాన్ని శవం అని పిలుస్తారు, వ్యక్తి ని ప్రేత అని తలుస్తారు.

*సందేశం*:-- ఎంత గొప్పపేరు ప్రతిష్ఠ లు కల వారి నైనా చనిపోయిన వెంటనే శవం, ప్రేత అనే పేరులతో మాత్రమే గుర్తిస్తారు. అక్కడ అందరూ సమానులే.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఆదివారం🌞* *🌹13, ఏప్రిల్, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌞ఆదివారం🌞*

*🌹13, ఏప్రిల్, 2025🌹*

   *దృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - కృష్ణపక్షం*


*తిథి      : పాడ్యమి* పూర్తిగా రోజంతా రాత్రితో సహా

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం   : చిత్త* రా 09.11 వరకు ఉపరి *స్వాతి*


*యోగం  : హర్షణ* రా 09.40 వరకు ఉపరి *వజ్ర*

*కరణం   : బాలువ* రా 07.08 *కౌలువ* పూర్తిగా రాత్రంతా


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00 - 12.00 మ 02.00 - 04.00*

అమృత కాలం  : *మ 01.58 - 03.46*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.33*


*వర్జ్యం          : రా 03.29 - 05.18 తె*

*దుర్ముహూర్తం  : సా 04.43 - 05.32*

*రాహు కాలం   : సా 04.49 - 06.22*

గుళికకాళం      : *మ 03.15 - 04.48*

యమగండం     : *మ 12.08 - 01.42*

సూర్యరాశి : *మీనం*

చంద్రరాశి : *కన్య/తుల*

సూర్యోదయం :*ఉ 05.54* 

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.54 - 08.23*

సంగవకాలం         :*08.23 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 03.53*


*ఆబ్ధికం తిధి         : చైత్ర పౌర్ణమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.22*

ప్రదోష కాలం         :  *సా 06.22 - 08.40*

రాత్రి కాలం         :  *రా 08.40 - 11.45*

నిశీధి కాలం          :*రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.07*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య చంద్ర కళా స్తోత్రం🌝*


*ద్వాదశాత్మా సుధాత్మానౌ* 

*దివాకరనిశాకరౌ |*

*సప్తమీ దశమీ జాతౌ*

*సూర్యచంద్రౌ గతిర్మమ ||*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹