17, నవంబర్ 2023, శుక్రవారం


 

Anjaneya swami


 

భగవంతుడు

 3.భగవంతుడు మనకు ఎందుకు కనబడడు?


భగవంతుడు కనిపించడని ఎవరు అన్నారు? భగవంతుడు తనని చూడదలచుకున్నవారికి తప్పక కనిపిస్తాడు. దానికి మార్గాలు కూడా మన ఋషులు, అనుభవజ్ఞులు చెప్తున్నారు.దేశాన్ని ఏలే రాజుని చూడాలంటే దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఏదైతో ఉంటుందో దానిని అనుసరించి వెళితేనే ఆయన వద్దకు వెళ్లి ఆయనను చూడగలవు. మరి సకలభవనచక్రవర్తి ఆయనను దర్శించుకోవాలంటే ఎంత ప్రోటోకాల్ అనుసరించాలి. 

   కానీ ఈ రాజు తన ఎడ్రస్ ఎక్కడో ఉందని చెప్పినా మనలో కూడా  ఉన్నాడు."అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణఃస్థితః"

మనలో ఆయన ఉన్న స్థలం:- " అణోరణీయాన్ మహతోమహీయాన్" అణువులలో అణువుగానూ, గొప్పవాటిలో గొప్పవానిగానూ కూడా ఉన్నాడని వేదం చెప్తోంది.


 "ఈశ్వరఃసర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్ఠతి."-- భగవద్గీత. 


"సర్వస్య చాऽహం హృదిసన్నివిష్టో.." -- భగవద్గీత.


"పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయంచాప్యథోముఖం.....నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా 

తస్యాఃశిఖాయామధ్యే  పరమాత్మా వ్యవస్థితః"  -- బ్రాహ్మణం.


అహమాత్మా గుడాకేశ! సర్వభూతాశయస్థితః.- భగవద్గీత.


అథోముఖంగా ఉన్న ఒక పద్మం ఉందనీ అక్కడ నీవారధాన్యముయొక్క పైన పొల్లు ఎలా ఉంటుందో అంత సన్నటి ప్రకాశం ఉండి దాని కిరణానికి మధ్యలో పరమాత్మ ఉన్నాడు అని చెప్తున్నారు.


పుణ్డరీకేణ సదృశం హృదయం స్యాదధోముఖమ్ । జాగ్రతస్తద్వికశతి స్వపతశ్చ నిమీలతి ॥  “ ఇతి చ( సుశ్రుతే శారీరస్థానే చతుర్థేఽధ్యాయే ॥ )


పుడరీకంలాగ హృదయం అథోముఖం గా ఉండి మనం మెలకువగా ఉన్నప్పుడు అది వికసిస్తుంది ట. నిద్రలో ఉన్నప్పుడు ముడుచుకుంటుందట.

 ఈ విధంగా మనలోపల ఉన్నవాడిని గూర్చి చెప్తున్నారు. వానిని చూసే మార్గాలు కూడా చెప్తున్నారు.


ఇక బయట ఉన్న మన రాజుగారి ఎడ్రస్:-


" న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః.

యద్గత్వా నా నివర్తన్తే తద్ధామ పరమం మమ."-- భగవద్గీత.


ఎక్కడైతే సూర్యచంద్ర అగ్నుల కాంతి ఉండదో ఎక్కడికైతే వెళ్లి మళ్లీ రారో అది ఆయన స్థానంట. ఇది సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్మ చెప్పినదే.ఇలా ఆయన్ని చూడాలంటే చూసిన తరువాత మన అనుభవం చెప్పాలన్నా మనం జీవించి ఉండము కదా!

లోకంబులు లోకేశులు

లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్.


అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దాపల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలోత్పలపర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు 

విహ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై.-- పోతనభాగవతం.


  ఈ పద్యమైతే సాక్షాత్తూ శ్రీరామచంద్రులవారే వారు ఉండే స్థానాన్ని వ్రాశారని అంటారు.

  ఇలా మన మహర్షులు, భక్తులు మన రాజుగారి అడ్రస్ చెప్పారు. 

లోపల ఉన్నవాడు నిర్గుణుడు. అంటే రూపనామగుణములు లేనివాడు. అటువంటి వానిని రూపనామగుణాలున్న మనం ఎలా చూడగలం? కళ్లతో చూడాలంటే కంటికి కనబడే విధంగా వాడు ఉండాలి. పోనీ ఆయనగారి స్వరమాధుర్యం ఎలా ఉంటుందో వినాలన్నా దానికి తగ్గస్వరంలోనే ఆయన మాట్లాడాలి. ఇలా సగుణాలైన మన ఇంద్రియాలను బట్టి, మనం కోరిన విధంగా మన దగ్గరకు ఆయనే రావాలి. లోపలున్నా బయట ఉన్నా సరే. ఆ రాజుగారికి మనం కనబడుతూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే మన లోపలైనా బయటైనా ఆయన లేనిదే మనం లేము. కానీ మనకి ఆయన కనిపించాలంటే ఎన్నో నియమాలు నిబంధనలు. నియమనిబంధనలు పాటించకపోయినా నువ్వు ఎందుకు కనిపించవయ్యా? అని హఠం వేసుకుని కూర్చుంటే ఆయన కనిపించడా? కనిపిస్తాడు. ఆయన భౌతికమైన రాజుగారు లా కఠినాత్ముడు కాడు. పట్టుదలతో నువ్వు నాకు కనిపించాలంటే నియమనిబంధనలేవీ పాటించకపోయినా మన వద్దకు మనం అనుకున్న రూపంలోనే మనలోనుండే వాడే బయటికి వచ్చి తనని చూపించుకుంటాడు. అదే కదా! అవతరించటమంటే. భక్తకన్నప్ప కి కనిపించలేదా! ఏనుగు, పాము మొదలైన జీవజాలానికి కనిపించలేదా! మొన్న మొన్నటి రామకృష్ణ పరమహంస కి కనబడలేదా! ఇంకెందరో లెక్కించలేనట్టి మహాత్ములకు కనిపించలేదా! మరి మన కళ్లకి ఎందుకు కనిపించటంలేదు? మనకి ఆ పట్టుదల లేదు కాబట్టి. ఏదో ఆ సమయానికి కాస్త 'కృష్ణారామ‌' అనుకుంటే చాలని, అది కూడా అనుకోకపోయినా జీవితం ఎలాగైనా గడిచిపోతోందిగా అనే నిర్లిప్తత కారణంగా మనకి కనిపించటం లేదు.

  ---బాలా...✍️🌺

మూడున్నరాంధ్రులు

 మూడున్నరాంధ్రులు-  


అప్పట్లో  అనగా 1950  లలో  మన నెహ్రూ గారికి  చైనా అంటే పిచ్చి ప్రేమ ఉండేది .. ఆలా మనకు వారికీ సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని తెలపడానికి హిందీ చీనీ భాయి భాయి అంటూ నినాదాన్ని కూడా లేవనెత్తారు . చివరకు అది మన దేశం యొక్క పుట్టి ముంచి  దాదాపు 90 , 000  ఎకరాల  భౌమిని చైనా పాలయ్యేలా చేసింది అది వేరే కథ అనుకోండి . 


నెహ్రూ గారికి సోషలిజం మీద ఉన్న అవ్యాజానురాగ ప్రేమతో మన భారత దేశం నుండి సాంస్కృతిక రాయ భార సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసి  చైనా కి పంపారు. అందులో పద్నాలుగు మంది సభ్యులు . వీరంతా చైనాకి వెళ్లి అక్కడ వేరు వేరు ప్రాంతాలలో అక్కడి అధికారులు, మంత్రులను కలవడం మనకూ చైనా కు అనాదిగా వస్తున్న సంబంధాన్ని గూర్చి వివరించడం వీరు చేసే పని.


ఆ రాయబార సంఘములో  మన తెలుగు వెలుగు దుర్గాబాయమ్మ  , సూరి భగవంతం,  చలపతిరావు  మరియు మన దేశ స్వతంత్ర  సమరయోధురాలు  సరోజినీ నాయుడు కుమార్తె లీలా నాయుడు కూడా అందులో సభ్యులు.


లీలా నాయుడు పద్మజా నాయుడు చెల్లెలు అని గుర్తు తెచ్చుకోండి.. ఆమె బెంగాల్ తరపున వెళ్లారు. సరోజినీ నాయుడు భర్త గోవిందరాజుల నాయుడు తెలుగువారు కాబట్టి అలా లీలా నాయుడు మన తెలుగింటి అమ్మాయే .. కానీ ఆమె బెంగాల్ కి ప్రాతినిధ్యం వహించడం  వలన   ఆమె సగం ఆంధ్రురాలు.  అలా మన దేశం నుండి  వెళ్లిన భారతీయ సాంస్కృతిక రాయబార సంఘములో సభ్యులు అత్యధికులు అంటే పదనాలుగురులో మూడున్నర ఆంధ్రులు  మన తెలుగు వారు కావడం యాదృచ్చికమో ఏమో గానీ అది మన అందరికీ గర్వకారణం. 


నేడు మన తెలుగులు   కులరాజకీయుల  గోలలో పడి భాషను సంస్కృతిని ఏనాడో విస్మరించారు  - ఇంక ముందు ముందు మంచి రోజులు వస్తాయన్న ఆశా లేదు.  నేడు పాలకుల మూర్ఖత్వం వలన తెలుగు సంసృతియే కాదు భాషకు కూడా దుర్దినాలు ఆరంభం అయ్యాయి.  తెలుగు తల్లీ ఏవీ నిరుడు కురిసిన హిమసమూహమ్ములు - నేడు  ఐక్యతా శూన్యతతో ఒక సరి అయిన మార్గదర్శనం లేక కొట్టు మిట్టాడుతున్నారు అవశేషాంధ్ర   తెలుగులు .

Stitching ideas

 https://youtube.com/shorts/aW5YPYJjeyc?si=bqYQwnp9Btk2kVyP


20 rupees meals at vijayawada


 

Bullet train


 

*కార్తిక పురాణము- 4*

 *కార్తిక పురాణము- 4*



అథ చతుర్థధ్యాయ ప్రారంభః

జనకుడిట్లడిగెను. వశిష్టమునీంద్రా! నీఉఒక్క వాక్సుధా రసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆకార్తీకమందు ఏదానమును జేయవలెో ల్దేనిని గోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను. పాపములను నశింప జేయునదియు, పుణ్యమును వృద్ధిబొందించునదియు అయిన కార్తీకవ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీకమాసమునందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీకమాసమందు శివాలయంలో గోపుర ద్వారమందును, శిఖరమందును ఈశ్వర లింగ సన్నిధియందును దీపారధన చేసిన యెడల సమస్తపాపములు నశించును. ఎవ్వడు కార్తీకమాసమునందు శివాలయంలో ఆవునేతితో గాని నేతితోగాని నువ్వునూనెతో గాని విప్పనూనెతో గాని నారింజనూనెతో గాని భక్తితో దీపసమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు. ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములయిన నూనెలు సంభవించినచో ఆముదముతోనయినా దీపమును సమర్పించిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు శివాలయంలో మోహముచేతగాని, బడాయికి గాని భక్తితో గానీ దీపమిచ్చువాడు శివప్రియుడగును. సందేహములేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన యొక రాజుగలడు. సంతానము లేక గోదావరీతీరమందు తపస్సు చేసెను. గోదావరీ స్నానార్థమై పైప్పమహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావని యడిగెను. ఆమాట విని రాజు మునీశ్వరా నాకు సంతానము లేదు గాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పల్కెను. రాజా! భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము. అట్లయిన యెడల నీకు పుత్రసంతానము కలుగును. ఇట్లు పైప్పలముని చెప్పగ ఆ రాజు విని ఆనందసాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను జేసెను. పిమ్మట ఆ పుణ్యముచేతనే రాజుభార్య గర్భవతియై పదియవమాసమున రెండవ సూర్యుడువలె ప్రకాశించెడి ఒక పుత్రునిగనెను. ఆరాజు విని అధికానందమును బొంది కార్తీకమహాత్మ్యము సత్యమైనది ఈకార్తీకవ్రతము ధర్మార్ధ కామమోక్షములనిచ్చును. సమస్త భూతములకు కార్తీకమాసము శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు "శత్రుజిత్" అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూధానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమముగా వృద్ధినొంది యౌవనవంతుడై శూరుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతట తృప్తిలేక పరస్త్రీలయందు ఆసక్తి గలిగి ధనాదికమునిచ్చి వారిని లోబరచుకొని సంభోగించెడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చినవారిని హింసించుచు అన్యాయమార్గవర్తనుడైయుండెను.

ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది సింహముయొక్క నడుమువంటి నడుుగది. పెద్దకన్నులు గలది. పెద్దవైన పిరుదులును, కుచములును గలదియు, అరటి స్థంభములవంటి తొడలు గలదియు, చిలుకకువలె సుస్వరమైన వాక్కు గలదియు, మన్మధోద్రేకముగలదై యుండెను. ఆరాజకుమారుడు అట్టి విప్రభార్యను జూచి దాని సౌందర్యమునకు సంతోషించి దానియందాసక్తిగలవాడాయెను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందాసక్తి గలదాయెను. తరువాత ఆ భ్రాహ్మణుని భార్య అర్ధరాత్రమందు భర్తను విడిచి రాజకుమారునియొద్దకుబోయి అతనితో రాత్రిశేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈప్రకారముగా అనేకదినములు జరిగినవి. ఆసంగతి బ్రాహ్మణుడు తెలుసుొి నిందితమైన నడతగల భార్యను, దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలుదొరుకునాయని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలము గడచిన తరువాత యొకప్పుడు శివాలయాన కార్తీకపూర్ణిమా సోమవారమునాడు బ్రాహ్మణి క్తన చీరె అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆవత్తితో జాచిన్నది దీపము వెలిగించి అరుగుమీద పెట్టెను. అచ్చటే వారిద్దదు కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంత బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుణినరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతములచేత ఆజీర్ణదేవాలయమందు ముగ్గురు మృతినొందిరి. ఆదినము కార్తీకపూర్ణిమ సోమవారము. దైవవశము చేత అట్టి పర్వమందుముగ్గురికి శివుని సన్నిధియందు మరణము గల్గినది. అంతలో పాశ హస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులును వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని, బ్రాహ్మణ భార్యను విమానముమీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసికొనపోవ ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసగమనమును, తనకు యమలోకగమనము జూచి బ్రాహ్మణుడు శివదూతలారా! ఈనాభార్య జారిణి. ఈరాజకుమారుడును జారుడుగదా. నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను గదా, ఇట్లుండ నాకీగతియేమి, వారికాగతియేమి అని యడిగెను. శివదూతలిట్లనిరి. బ్రాహ్మణోత్తమా! నీవన్నమాట సత్యమేగాని అందొక విశేషమున్నది చెప్పదము వినుము. ఈనీభార్య పాపాత్మురాలును జారిణియు అయినప్పటికి కామమోహముచేత కార్తీకపూర్ణిమా సోమారము నాడు శివాలయమునందు దీపారాధనకు గాను తన చీరెను చించి వత్తిని చేసి ఇచ్చినది.గాన దీని పాపములన్నియు భస్మములయినవి. ఈరాజకుమారుడును దీపార్థమై ఆముదమును దెచ్చి పాత్రలోనుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయెను. కాబట్టి కామమోహము చేయనయినా శివాలయమందు దీపదానము చేసిన వాడు ధన్యుడు. సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీభార్యకు రాజకుమారునకు ైలాసమును, దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినదు. ఇదివరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడవుగా లేదు. ధర్మసూక్ష్మమిదియని చెప్పిరి.

శివదూతలు ఈప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈబ్రాహ్మణుని భార్యతో రమించి ఈబ్రాహ్మణునిచేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము. ఇతనికి నరకము గలుగుట చాలా దుఃఖకరముగానున్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈబ్రాహ్మణునకు ఇచ్చెదను. ఏకకాలమందు మృతినొందిన మాముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక దీపదానముచే ముగ్గురు కైలాసమునకుబోయిరి. కాబట్టి కార్తీకమాసమున ధర్మమును జేయవలెను. అట్లు చేయనివాడు రౌరవనరకమును బొందును. కార్తీకమాసమందు నిత్యము శివాలయమందుగాని, విష్ణ్వాలయమునందుగాని దీపమాలను సమర్పించిన యెడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును బొంది తద్ద్వారా పునరావృత్తిరితమగు మోక్షమునొందును. సందేహములేదు. కార్తీకమాసమందు హరిసన్నిధిలో స్త్రీలుగాని, పురుషుుగాని తన శక్తికొలది దీపార్పణము చేసినయెడల సర్వపాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీకమాసమున దీపముల పంక్తి సమర్పించుము.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే చతుర్థోధ్యాయ స్సమాప్తః

శ్రీ స్వామివారి ప్రవర్తన..మాటలు..ఉపదేశం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శ్రీ స్వామివారి ప్రవర్తన..మాటలు..ఉపదేశం.*


*(ముప్పై వ రోజు)*


శ్రీ స్వామివారు తెల్లవారుఝామునే గదిలోంచి బైటకువచ్చి..ఇంటి ఆవరణలో తిరుగుతూ వుండేవారు..ఒక్కొక్కసారి శ్లోకాలు..దైవ సంకీర్తనలు పాడుతూ వుండేవారు..శ్రావ్యమైన కంఠస్వరం తో అద్భుతంగా గానం చేసేవారు..ప్రభావతి గారికి శ్రీధరరావు గారికి కూడా ఉదయాన్నే లేచే అలవాటు..ప్రభావతి గారు పశువుల ఆలనా పాలనా చూసుకోవడం..గేదెల వద్ద పాలు పితకడం..వగైరాలన్నీ చేసుకుంటూ వుండేవారు..ఆ సమయంలో ఆవిడ సహజంగా ఏదో ఒక స్తోత్రాన్ని మననం చేసుకుంటూ వుండేవారు..కానీ శ్రీ స్వామివారు వారింట్లో అడుగుపెట్టిన తరువాత ..శ్రీ స్వామివారు దాదాపు ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటల ప్రాంతంలో తన గానమాధుర్యాన్ని చవిచూపడం అలవాటుగా మారింది..వినేవారికి అదో గొప్ప అనుభూతి..


ఐశ్వర్యం గురించి రాత్రి పొద్దుపోయేదాకా శ్రీధరరావు దంపతులకు వివరించి..రాత్రి తన గదికి వెళ్లిపోయిన శ్రీ స్వామివారు..మళ్లీ తెల్లవారుఝామున నాలుగు గంటలకే వచ్చేసారు..శ్రీ స్వామివారి ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకున్న శ్రీధరరావు దంపతులు కూడా ఆ సమయానికి లేచి..కాలకృత్యాలు తీర్చుకుని..ఇంటి ముందుకు వచ్చారు..ఎదురుగా చిరునవ్వుతో శ్రీ స్వామివారు నిల్చుని వున్నారు..


"శ్రీధరరావు గారూ..కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది..సమయం కూడా చక్కగా ఉంది..మీరిద్దరూ తప్పక వినవలసినవి.. మళ్లీ మళ్లీ నాకు కుదరక పోవొచ్చు..లేదా..మీకు ఆ సమయమూ లేక పోవొచ్చు..ఏం తల్లీ!..వింటారా?.." అన్నారు..ఇద్దరూ తలాడించారు..


"శిష్యుడి మానసిక స్థితి..ఆధ్యాత్మిక ఉన్నతి గమనించి..ఆ శిష్యునికి సరైన సమయంలో సరైన మంత్రోపదేశం చేసి..ఆ మంత్రాన్ని శిష్యుని ద్వారా కోటి జపం పూర్తి చేయించి..కోటి జపం చేసేలా దీవిస్తూ..మార్గం నిర్దేశించేవాడే సద్గురువు!..ఉపదేశించిన మంత్రానికి..ఉపదేశం తీసుకున్న వ్యక్తిీ..ఆ మంత్రం పరిపూర్తి చేసినప్పుడే..మంత్రోపదేశం చేసిన గురువుకు కూడా అపాత్రదానం చేసాననే భావన లేకుండా పరిపూర్ణ తృప్తితో సద్గతి పొందుతాడు!.."


"దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోవడం ఏ యుగంలోనూ లేదు!..దైవ నామొచ్చారణతో జన్మ జన్మల పాపాలూ ప్రక్షాళన అయి తీరుతాయి..కోరరాని కోర్కెలు తీర్చేవాడు దేవుడు కానేకాదు!..భక్తులకు ఏది శ్రేయస్కరమో..ఏ క్షణంలో తన రక్షణ అవసరమో..అది ప్రసాదించేవాడు ఒక్క భగవంతుడు మాత్రమే!..నీవు చేయవలసిందల్లా..విడవకుండా..అచంచల విశ్వాసంతో..ఆయన పాదాలను మనసా, వాచా, కర్మణా నమ్మి శరణాగతి పొందడమే!.."


"దైవ జపం విశ్వాసం తో చేస్తే..సంపదలు మాత్రమే కాదు..అష్టసిద్ధులూ వశం అవుతాయి..కానీ వాటిని ఇతరులకు హాని కొరకు ఉపయోగిస్తే..రాక్షసులుగా మారతారు..అవి అందించిన భగవంతుని చేతిలోనే చావుదెబ్బ తింటారు..అలాకాక.. ధర్మమార్గాన వాటిని సమాజహితం కొరకు వినియోగిస్తే..వారు మహాత్ములు అవుతారు..అదొక యోగం..వారినే యోగులు అంటాం.." 


ఇంతవరకూ చెప్పిన శ్రీ స్వామివారు..హఠాత్తుగా పక పక మని నవ్వసాగారు..వింటున్న దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు..ఆ తెల్లవారుఝామున శ్రీ స్వామివారి స్వచ్ఛమైన నవ్వు..అదీ తెరలు తెరలుగా నవ్వడం..వారికి అర్ధం కాలేదు..


ఇంతలో శ్రీ స్వామివారే తమ నవ్వును ఆపుకొని..ప్రభావతి గారి వైపు చూసి.."అమ్మా..నిన్న రాత్రి నీకు అష్టైశ్వర్యాల గురించి బోధ చేసాను కదా!..నీవు ధన వ్యామోహం లో పడకూడదని అంతదూరం చెప్పాల్సి వచ్చింది..ఆ ఒక్క సందేహాన్ని తీర్చడం కోసం నేను ఎంతో సమయాన్ని వెచ్చించి..మీ సందేహాలను నివృత్తి చేయాల్సి వచ్చింది..మీరు ఈ జ్ఞానం నా ద్వారా పొందాలని ఆ భగవంతుడి నిర్ణయం..గృహస్తుల సందేహాలకు ఎంత సమయం ఇలా కేటాయించాలనో..అని నాకు నవ్వు తెప్పించింది..శ్రీధరరావు గారూ మీకు కూడా బోధ పడిందా?.." అన్నారు శ్రీ స్వామివారు..


"నాలోనూ చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి స్వామీ.." అన్నారు శ్రీధరరావు గారు..శ్రీ స్వామివారి బోధలో..శ్రీధరరావు గారికి బాగా ఆకట్టుకున్న విషయం..సమాజహితం తో కూడుకున్న ధర్మాచరణ!..అది గృహస్తులకు అత్యవసరం..


"చివరగా ఒక్కమాట!..ఫలానా పూజ చేస్తే..దేవుడు నెత్తిన మొట్టాడు..అంటూవుంటారు కొందరు..అది తప్పు!..నిజమైన భక్తుడిని దైవం నెత్తిన మొట్టడు.. అనవసర కోరికలు..మోసం..పరనిందా.. పరులకు హాని..ఇత్యాదులను దేవుడు క్షమించడు!..అదీ అసలు రహస్యం..అది తెలుసుకొని మసలుకోండి!.." అని చెప్పి..


"అమ్మా..త్వరగా ఒక గ్లాసు పాలు ఇవ్వమ్మా!..బాగా ఆకలిగా ఉంది.." అని అడిగారు స్వామివారు..ఆసరికే కొద్దిగా వెలుతురు వస్తోంది..ప్రభావతి గారు గబ గబా గేదె దగ్గరకు వెళ్లి, పాలు పితికి.. వెచ్చచెసి ఇచ్చారు..శ్రీ స్వామివారు ఆ పాలు త్రాగి..మళ్లీ తన గదిలోకి వెళ్లి ధ్యానం లో కూర్చున్నారు..


అవధూత లక్షణం..శ్రీ దత్తాత్రేయ అవతారం..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

 🎻🌹🙏కార్తీకమాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం.  ....!!


🌿శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడూ కనిపించే క్షేత్రం.....


🌸సాధారణంగా శివుడు లింగ రూపంలో మనకు కనిపిస్తాడు.అయితే దేశంలో ఎక్కడా లేనట్లు ఇక్కడ పరమశివుడు కుర్చొని ఉన్న భంగిమలో మనకు దర్శనమిస్తాడు.సిద్ధాసనంలో (కుర్చొని) శివుడు కొలువై ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్దేశ్వరాలయం అని పేరు వచ్చింది.


🌿ఇక స్వామివారు జఠాజూటంలో చంద్రుడితో పాటు సూర్యుడు కూడా కనిపిస్తారు.కుడిచేతిలో బ్రహ్మకపాలాన్ని, మెడలో కపాలాలను కూడా స్వామి వారు ధరించి సగం మూసిన కనులతో స్వామివారు కనిపిస్తారు. 


🌸ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో అమరాపురం మండలం హేమావతిలో ఉన్నది 


🌿ఇటువంటి రూపం భారత దేశంలో ఇదొక్కటే అని స్థానికులు చెబుతున్నారు. 


🌸ఇదే ఆలయంలో పంచ లింగాలు కూడా మనం చూడవచ్చు.శివరాత్రి రోజు సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఈ దేవాలయంలోని మూల విగ్రహం నుదిటిమీద ఖచ్చితంగా పడుతాయి. 


🌿ఇలా ఎలా పడుతున్నయన్న దానికి ఇప్పటి వరకూ ఖచ్చితమైన సమాధానం లేదు.


🌸ఇక ఆలయంలో శివుడికి ఎదుగా ఉన్న నంది స్వామివారిని చూస్తున్నట్టుగా కాక కొంత పక్కకు తిరిగి ఉంటుంది. 


🌿పడమర ముఖంగా ప్రవేశ ద్వారం ఉన్న దేవాలయాల్లో హేమావతి సిద్దేశ్వరస్వామి దేవాలయం కూడా ఒకటి.


🌸హేమావతిని పూర్వ కాలంలో హెంజేరుగా పిలిచేవారు. కాలక్రమంలో అది హేమావతిగా మారింది. 


🌿పూర్వం ఈ ప్రాంతాన్ని నోలంబరాజులు పరిపాలించేవారు. అందువల్ల హేమావతిలోని సిద్దేశ్వరుడిని నోలంబేశ్వరుడు, ఎంజేరప్ప అని కూడా అంటారు.


🌸అనంతపురం, హిందూపురాలకు రైల్వే సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హేమావతిని చేరుకోవచ్చు....స్వస్తీ...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

నాగుల చవితి శుభాకాంక్షలు*

 *ॐ              నాగుల చవితి శుభాకాంక్షలు* 


*I. పుట్టలో పాలు*


   "తోక తొక్కితే తొలగిపో! 

    నడుం తొక్కితే నా వాడనుకో! 

    పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ!" అని పుట్టలో పాలుపోస్తూ నమస్కరిస్తాం. 


విశేషం 


పాము 

* తోక తొక్కితే పగపడుతుందంటారు. అంటే ద్వేషంతో రెచ్చిపోతుంది. 

* నడుం తొక్కితే, బాధతో తొక్కినవాడి అంతు చూస్తుంది. 

* పడగ తొక్కితే బుసకొడుతూ భయపెడుతుంది. 


*II. ఖలునకు నిలువెల్ల విషం* 


తలనుండు విషము ఫణికిని, 

    వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్ 

తలతోకయనక యుండు ఖలునకు 

    నిలువెల్ల విషము గదరా సుమతీ! 


*III. మనం సర్పంగా ఉంటామా? గోవు అవుతామా?* 


దోషో గుణాయ గుణినాం 

    మహదపి దోషాయ దోషిణాం సుకృతమ్ I 

తృణమివ దుగ్ధాయ గవాం 

    దుగ్ధమివ విషాయ సర్పాణామ్ ॥ 


* గుణవంతునికి ఎదుటివాని దోషాలు, దోషాలుగా కనబడక, సద్గుణాలతోనే చూడబడతాయి. 

  ఎవరకీ అక్కఱకురాని గడ్డితిని ఆవు, అందఱికీ పనికివచ్చే పాలనిస్తుంది కదా! 


* దోషికి ఎదుటివాని మంచిగుణాలు కూడా దోషాలుగానే కనబడతాయి. 

    అందరికీ ఉపయోగపడే పాలని తీసికొని, అందఱినీ చెరిపే విషాన్నిస్తుంది పాము. 


*IV. ఆదిశేషుడు - వాసుకి* 


          *పన్నగ శయనా నారాయణా!*

         *- పన్నగ భూషణ సదాశివా !*  


* ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపయ్యాడు. 

    స్వామికి సేవచేస్తూంటాడు. 

   *మనంకూడా ఆదిశేషుడై, జీవలోకమంతటా వ్యాపించియున్న విష్ణువుని  సేవించుకొంటాం.* 


* వాసుకి శివునికి ఆభరణమయ్యాడు. 

    స్వామితోపాటు గౌరవం పొందుతుంటాడు. 

    *వాసుకి శివునితో కూడియుండడం వలన గౌరవం కలిగినట్లే,* 

    *మనం వాసుకిగా, మనలోని చిదానందరూపుడైన శివునితో కూడి మంగళకరమైన జీవితాన్ని కలిగియుంటాం.* 


*V. సముద్రమథనం* 


    దేవతలూ రాక్షసులూ, 

    మంధర పర్వతాన్ని కవ్వంగాచేసి, 

    వాసుకిని కవ్వానికి తాడుగా చేసి చిలుకుతున్నప్పుడు, 

    ముందుగా వచ్చిన విషం శివుడు త్రాగగా, 

    అమృతం దేవతల పరమై శాశ్వతత్వాన్నిచ్చింది. 


*అన్వయం* 

 

    *మెదడనే మంధర పర్వతంతో,* 

    *నరాలనే వాసుకితో, చిలికి,*  


   *"చిదానందరూప శివోఽహం శివోఽహం" అన్నట్లు,* 

     *మనలోని శివుడుగా మనం,*  

    *"రాగద్వేషాదు"లనే విషాన్ని మ్రింగి (రాగద్వేషాలు లేకుండా చేసికొని),*

    *"ఆత్మతత్వం" తెలుసుకొని,*

     *ఆ అమృతంతో  శాశ్వతులమవుతాం.* 


    *నాగులచవితి మనకి అందేంచే సందేశం ఇదే!* 


*అనుబంధం - చిత్రాలు* 


*1. మనం పాలుపోసే పాముపుట్ట* 

*2. పన్నగ (ఆదిశేష) శయనా నారాయణా!* 

*3. పన్నగ (వాసుకి) భూషణ సదాశివా!* 

*4. సముద్ర మథనం: విషంతో ప్రారంభం - అమృతం లభ్యం* 


                              =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

కార్తీక మాస విశేషాలు 3

 కార్తీక మాస విశేషాలు 3


పుట్టలో పాలు పోయడానికి సంతానం కలగడానికి సంబంధమేమిటి ?


పాములందు అనేక జాతులున్నాయి. మనము నాగు పామును మాత్రమే పూజిస్తాము. వేరు పాములను పూజించము. పాములకు కాళ్ళు లేవన్న సంగతి అందరికి తెలిసిందే. పాములు తమ పొట్టతో చలించును. వాని జననేంద్రియములు పొట్ట అడుగు భాగమున ఉండును. సామాన్యముగా ఇవి తమ వర్షకాలము  చలి కాలములో మాత్రమే లైంగిక క్రియ జరుపును, ఆడపాము ఈ కాలమందు గర్భము ధరించి ఎండాకాలము నాటికి గ్రుడ్లు పెట్టును. ఆ ఎండ వేడికి అవే పిల్లలగును. లైంగిక క్రియకు పాల్గొను సమయానికి ముందు ఆడ పాములకు ఋతు స్రావము జరుగును. దీనిని re productive cycle అని చెప్పుదురు. ఈ కాలములో ఇవి ప్రాకునప్పుడు చలించునప్పుడు విసర్జించబడు రజస్సు భూమికి చేరును. అందును పుట్టపై ఇవి ప్రాకుతూ ప్రవేశము చేయునప్పుడు పుట్ట మన్ను ఈ రజస్సును పీల్చుకొనును. ఇదే విధముగా మగ సర్పపు వీర్యము కూడా అది చలించునప్పుడు పుట్టకు అంటుకొనును. ఈ విధంగా పుట్టను పెట్టే white ants (చెదలు) నోటి జలము  సర్పముల వీర్యము రజస్సుల చే తడపబడిన పుట్టమట్టి మన్నుకు  నీరు గాని  పాలు తేనే గాని తగిలిన ఒక సుమధురమైన వాయువు ఉత్పన్నమగును. ఈ వాయువు సేవనము చే మనుష్యుని మనస్సుపై శరీర ఆరోగ్యముపై మంచి ప్రభావము కలుగుటయే కాక జననేంద్రియములపైనను (re productive organs)పై మంచి ప్రభావం పడును. నాగుపాము సంపర్కము పొందిన పుట్ట మన్ను నందు ఉన్న దీని ప్రభావం వలన  మనుజులకు సంతానోత్పత్తి జరుగుతున్నట్లు తెలియ వచ్చుచున్నది. ఆయుర్వేద శాస్త్రములో కూడా నాగు పాము కుబుసముతో వైద్యము చేసి సంతానం కలగకుండా కారణమయ్యే దోషాలను ననివారించు ప్రక్రియ కలదు.


ఈ విధమైన శాస్ర్రీయ దృక్పధముతోనే సంతానము లేని వారికి పుట్టకు పూజచేయించే ఆచారాన్ని మన మహర్షులు మనకు అందించారని గ్రహించ వచ్చు (ఆధారం- ఆచారాలు శాస్త్రీయత)


శుభం భూయాత్ !

ఈరోజు (17-11-2023) రాశి ఫలితాలు

 *ఈరోజు (17-11-2023) రాశి ఫలితాలు*


మేషం🐐

ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. 

అదృష్ట సంఖ్య 1


వృషభం🐂

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. 

అదృష్ట సంఖ్య 9


మిథునం👫

దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి.

అదృష్ట సంఖ్య 7


కర్కాటకం🦀

రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. 

అదృష్ట సంఖ్య 2


సింహం🦁

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. 

అదృష్ట సంఖ్య 9


కన్య👩

వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.

అదృష్ట సంఖ్య 7


తుల⚖️

నూతన వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

అదృష్ట సంఖ్య 1


వృశ్చికము🦂

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి. 

అదృష్ట సంఖ్య 3


ధనస్సు🏹

కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు. 

అదృష్ట సంఖ్య 9


మకరం🐊

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరో బాధను కలిగిస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.

అదృష్ట సంఖ్య 8


కుంభం⚱️

వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.

అదృష్ట సంఖ్య 6


మీనం🐟

వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

అదృష్ట సంఖ్య 4

_శ్రీ చన్ద్రశేఖరాష్టకం -07_* _

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*_భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం_*

*_సర్వభూతపతిం పరాత్పర మప్రమేయమనుత్తమం_*

*_సోమవారిణ  భూహుతాశన సోమపానిఖిలాకృతిం_*

*_చన్ద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః_*


_ *_శ్రీ చన్ద్రశేఖరాష్టకం -07_* _


భక్తవత్సలుడిగా పూజించబడి, నాశనము లేని సంపద యైన వాడు, సర్వభూతములకు అధిపతియైన వాడు, పరాత్పరుడు, అప్రమేయుడు, అన్నిటికన్నా ఉత్తమమైన, వికారమయమైన కోరికలను బూడిదచేసి, అబూడిదను పులుముకొనే చన్ద్రుని శిరమున ధరించిన ఆ చన్ద్రశేఖరుడను పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం  - చతుర్థి  - పూర్వాషాఢ -‌  భృగు వాసరే* *(17-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/liEP-CHM6F0?si=iIFCZcuAbn9CFawP


🙏🙏

సుభాషితమ్

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*_భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం_*

*_సర్వభూతపతిం పరాత్పర మప్రమేయమనుత్తమం_*

*_సోమవారిణ  భూహుతాశన సోమపానిఖిలాకృతిం_*

*_చన్ద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః_*


_ *_శ్రీ చన్ద్రశేఖరాష్టకం -07_* _


భక్తవత్సలుడిగా పూజించబడి, నాశనము లేని సంపద యైన వాడు, సర్వభూతములకు అధిపతియైన వాడు, పరాత్పరుడు, అప్రమేయుడు, అన్నిటికన్నా ఉత్తమమైన, వికారమయమైన కోరికలను బూడిదచేసి, అబూడిదను పులుముకొనే చన్ద్రుని శిరమున ధరించిన ఆ చన్ద్రశేఖరుడను పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

నవగ్రహా పురాణం🪐* . *79వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *79వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*"నా పేరు అదే - ఈ రూపం రాకముందు పురుష రూపంలో సుద్యుమ్నుడు..."* *"సుద్యుమ్నుడా !! నారాయణ !"* నారదుడు ఆశ్చర్యంతో అన్నాడు.


*"ఔను ! స్త్రీ రూపం రాగానే నా పేరు 'ఇల' అని అనిపించింది ఎందుకో ?"* ఇల దీనంగా అంది.


*“నారాయణ ! సుద్యుమ్నుడు...ఇది... అప్పుడు పురుషుడు... ఇప్పుడు స్త్రీ...అప్పుడు యువకుడు... ఇప్పుడు యువతి ! బాగుంది... "* నారదుడు స్వగతంలా అనుకుంటున్నాడు. 


*"మహర్షీ ! నాకు ఈ గతి ఎందుకు పట్టింది ?"* ఇల దయనీయంగా అడిగింది.


*"ఎందుకు ?"* నారదుడు సాలోచనగా అన్నాడు. *"నారాయణ ! నువ్వు... పొరపాటున ఆ 'కుమార వనం'లో అడుగుపెట్టలేదు కద ?"* 


*"కుమారవనం అని తెలీదు కానీ , ఒక వనంలోకి వెళ్ళాం నేనూ , భటులూ..."* అంటూ ప్రారంభించి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది ఇలా..


*"నారాయణ ! ఇంక నీ గతి ఇంతే ! ఈ ఇల మీద నువ్వు 'ఇల'గా జీవించాల్సిందే !”* నారదుడు నిష్కర్షగా అన్నాడు. *"ఎందుకు ఇలా జరిగిందని కదా నీ అనుమానం. ఆ కుమారవనంలోకి ఎవరు అడుగుపెట్టినా అంతే ! ఏ పురుష ప్రాణి అయినా సరే - కుమార వనంలో పాదం మోపగానే స్త్రీ ప్రాణిగా మారిపోవాల్సిందే ! స్త్రీ ప్రాణిగా జీవించాల్సిందే ! స్త్రీ ప్రాణిగా మరణించాల్సిందే !*


*"అలా జరగాలని పార్వతీ పరమేశ్వరులు తమ శాపంతో శాసించారు. కుమారవనం ఆ ఆదిదంపతుల ప్రత్యేక ప్రణయోద్యానం ! పార్వతీ మాత శాపం పెట్టడానికి కారణం ఉంది. ఒకనాడు ప్రశాంత సమయాన పార్వతీ శంకరులు కుమారవనంలో , ఏకాంతంలో ఒకరికి ఒకరై ఆనందిస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి కొందరు మహామునులు వాళ్ళ దర్శనానికి వచ్చి , వనంలో ప్రవేశించారు. ఆది దంపతుల ప్రణయ కాలక్షేపం గురించి తెలియని ఆ మునులు వాళ్ళిద్దరూ ఆదమరిచి ఉన్న ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయారు.”*


*"పార్వతి సిగ్గుపడింది. ఆగ్రహించింది. తమ అభ్యంతర విహార స్థలమైన కుమారవనంలోకి ప్రవేశించిన ప్రతి పురుషప్రాణీ స్త్రీగా మారిపోయేలా శాపం పెట్టాలంది ! శివుడు సరే అన్నాడు ! ఇద్దరూ ఏక కంఠంతో ఆ విధంగా శాపం పెట్టేశారు !"* నారదుడు వివరించి , ఇల వైపు చూశాడు.


*"నారద మహర్షీ ! నా గతి ఏమిటి ? ఆదిశక్తి శాపానికి విరుగుడు లేదా ?"* ఇల ఆశగా అడిగింది.


*"చండిక శాసనం అది ! అంటే చండశాసనం అన్నమాటే. తల్లీ ! ఆదిశక్తి ఆగ్రహమైనా , అనుగ్రహమైనా అనుభవించక తప్పదు ! నిన్ను సుద్యుమ్నుడుగా ఎవరూ గుర్తించరు. నిన్ను స్త్రీగానే భావిస్తారు ! అంగీకరిస్తారు ! స్వీకరిస్తారు ! అందగత్తెవైన నీలాంటి యువతులకు పురుషులతో ప్రమాదం ఉండనే ఉంది ! అంచేత నువ్వు... రాజధానికి తిరిగి వెళ్ళడం శ్రేయస్కరం కాదు...”* నారదుడు చెప్పుకు పోతున్నాడు.


*"అయితే...నా భవిష్యత్తు ? మీరే నాకు మార్గ దర్శనం చేయాలి ?"* ఇల ప్రాధేయ పూర్వకంగా అంది.


*"ఈ అరణ్యంలో తూర్పుదిక్కుగా వెళ్తే నీకు మేలు జరిగే అవకాశం ఉంది. మహాసాత్వికులైన మంచి వ్యక్తులు నీకు పరిచయమవుతారు. నీ భవిష్యత్తుకు అంకురార్పణ జరుగుతుంది !"* నారదుడు భవితను సూచించే జ్యోష్కుడిలాగా అన్నాడు.


*“అయితే... నన్ను... ఇటు వైపు వెళ్ళమంటారా ?”* ఇలా అడిగింది. 


*"ప్రస్తుతం నీ మార్గాంతరం అదే ! బయలుదేరు ! శుభం భూయాత్ !"* నారదుడు దీవిస్తూ అన్నాడు.


ఇల నారదుడు సూచించిన దిశగా అడుగులు వేస్తోంది. రూపం మారేసరికి తనలో మానసికంగా కూడా ఏదో మార్పు వచ్చేసింది. చిన్న చప్పుడుకు కూడా తను జడుసుకుంటోంది. కుందేళ్ళనీ , లేళ్ళనీ , దుప్పులనీ చూస్తుంటే - పురుషావతారంలో అనిపించినట్టు వాటిని సంహరించాలనిపించడం లేదు. వాటిని చేరదీసి ముద్దు చేయాలని ముచ్చటవేస్తోంది. పురుష మనస్తత్వానికీ , స్త్రీ మనస్తత్వానికీ , ఆలోచనా సరళికి ఇంత అంతరం ఉంటుందా ?


మెత్తటి అడుగుల చప్పుడు ఇలను ఆలోచనల నుండి లాగింది. ఆమెలో ఆలోచనలు ఆగినట్టే , ఎదురుగా వినవచ్చిన అడుగుల సవ్వడి కూడా ఆగింది. ఇల బెరుకు బెరుకుగా చూసింది.


ఎదురుగా ఒక యువకుడు ! తనలాగే నిలబడి , తనలాగే ఆశ్చర్యపోతూ చూస్తున్న యువకుడు. ఇందాక లేడిని చూడగానే భయంతో స్పందించిన ఆమె గుండె ఇంకా ఎంతో వేగంగా స్పందిస్తోంది. అయితే భయంతో కాదు , ఏదో ఉద్వేగంతో !


పురుష సౌందర్యానికి నిర్వచనంలా ఉన్నాడా యువకుడు ! పోతపోసిన అందంలా ఉన్నాడు ! తళతళ లాడుతూ కనిపిస్తున్న శరీర సౌష్టవం ! గుండ్రటి ముఖం. చూపుల్ని బలంగా లాగి బంధించివేసే అందమైన పెద్ద పెద్ద కళ్ళు ! దరహాసానికి ప్రాణం పోస్తున్న పెదవులు... దగ్గరైన అదృష్టవంతురాలికి ప్రణయ పీఠంలా భాసించే విశాల వక్షం.... కళ్ళు చెదిరే శరీర వర్ణం... ఆ దేహకాంతిని హెచ్చవేత వేసి చూపించే వస్త్రధారణ... గాలికి ఎగురుతున్న పల్చటి అంగవస్త్రం. 


ఇల తటాలున రెప్పవాల్చి తనను చూసుకుంది. మరుక్షణం ఆమె సిగ్గుతో కుంచించుకు పోయింది. ఎడమ చెయ్యి తటాలున ఆమె పయ్యద ఉండాల్సిన స్థానాన్ని ఆక్రమించింది. కుడి చెయ్యి కిందకి జారిపోయి గాలికి మెలికలు తిరుగుతున్న పైటకొంగుని అందుకుంది. ఇదంతా లిప్త పాటు కాలంలో జరిగిపోయింది. 


సిగ్గుతో ఇంకా రెప్పలు దించుకునే ఉన్న ఇలలో ఆలోచన వెన్నెల్లో కలువ మొగ్గలా వికసిస్తోంది. అంటే... అంటే... గాలి తాకిడికి పైట తొలగిపోయిన విషయాన్నీ , తన వక్షభాగం అనాచ్ఛాదితంగా ఉన్న విషయాన్నీ గమనించే స్థితిని దాటిపోయి, ఆ యువకుడిని చూస్తూ ఉండిపోయింది తను. అంత అందగాడా అతడు ? ఇలా అంతరంగంలో పుట్టిన ఆ ప్రశ్నకు అంతరంగంలోనే సమాధానం దృశ్య రూపంలో లభించింది. ఇంకా కిందికి వాలి ఉన్న రెప్పల వెనక తను ఇందాకా చూసిన ఆ యువకుడి సమ్మోహనాకారం ప్రత్యక్షమైంది ! తన అంతరంగం మీదికి చేరిపోయి కనిపిస్తున్న ఆ యువకుణ్ణి అలాగే 'లో' చూపుతో చూస్తూ ఉండిపోయింది ఇల.


తాను నిలుచున్న రెండు పొదరిండ్ల మధ్య అందమైన యవ్వన వృక్షంలో ఉన్న యువకుడు ప్రకృతి నేపథ్యంలో తన ముందు నిలుచున్న ఆ యువతిని చూస్తూ. ఉండిపోయాడు. ఆమె నిసర్గ సౌందర్యం తనను మంత్రముగ్ధుణ్ణి చేసి వేసింది. బంగారు తీగను గుర్తుకు తెచ్చే శరీరం... పూర్తిగా వికసించిన పద్మంలాంటి ముఖం ! కలువరేకుల్లాంటి అందమైన విశాల నేత్రాలు... ఊహూ... అవి నేత్రాలు కావు , ఎదుటి వారి మీద కాంతి కిరణాల్ని రువ్వే జ్యోతులు ! పగడాల్లాంటి పెదవులు. అవి కదిలినప్పుడల్లా తొంగి చూస్తున్న ముత్యాల్లాంటి పళ్ళు ! ఆమె సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తున్న ఆ పైట... ఆమె అందాన్ని తన చర్మచక్షువులకు కనిపించకుండా దాచగలిగింది కానీ , తన అంతర్నేత్రాల నుంచి , ఇంకా ఆ అయస్కాంత సౌందర్యాన్ని దర్శిస్తున్న తన అంతర్నేత్రాల నుండి దాచలేకపోతోంది !


ఈ నడుస్తున్న సౌందర్యం ఎక్కడిది ? ఎక్కణ్ణుంచి వచ్చింది ? ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కోలేకా , ఆమెను అడగలేకా సతమతమనుతున్న యువకుడు తనకు తెలీకుండానే ముందుకు సాగాడు. అతని కదలిక కోసమే కాచుకున్నట్టు , ఆమె కూడా ముందుకు అడుగులు వేసింది. ఇద్దరూ ఒకర్ని దాటి ఒకరు ముందుకు వెళ్ళిపోయారు.


ఏదో అజ్ఞాత సంకేతాన్ని అందుకున్న వాళ్ళలాగా ఇద్దరూ ఒకేసారి వెనుదిరిగారు. ఒకరికొకరు అభిముఖంగా నిలుచున్నారు. ఇద్దరి ప్రయత్నమూ లేకుండానే , ఇద్దరి కళ్ళూ తమ భాషలో పలకరించుకుంటున్నాయి. ఆ 'నేత్రభాష' పెదవులను స్పందింప జేస్తోంది. రెచ్చగొట్టుతోంది.


*“నా పేరు... బుధుడు...”* యువకుడు ఆమె కళ్ళలోకే చూస్తూ అన్నాడు *“నువ్వు...”*


*"నా పేరు... ఇల...”.*


*"నేను చంద్రుడి పుత్రుణ్ణి. తారాదేవి నా తల్లి. నేను ఈ దగ్గర్లోని ఆశ్రమంలో నివసిస్తున్నాను. నువ్వు..."* బుధుడు రెండు అక్షరాలతో ప్రశ్నను పూర్తి చేశాడు.


*“నాకు... నాకు... ఎవ్వరూ లేరు...”* తన గతం గురించి , పురుష జన్మ గురించి , పార్వతి శాపం గురించి చెప్పాలనిపించడంలేదు ఇలకు. ఆ అందగాడికి భయాందోళనలూ , సందేహాలూ కలిగించే నిజాలేవీ చెప్పకూడదనిపిస్తోంది. చెప్తే , తనకు... దూరమైపోతాడేమో ! ఇల తన ఆలోచనలకు తానే నవ్వుకుంది. ఇప్పుడు దగ్గరయ్యాడా దూరం కావడానికి ?!


*"సూర్యాస్తమయం కావస్తోంది. అరణ్యం క్షేమకరం కాదు. నా ఆశ్రమంలో... విశ్రాంతి తీసుకోవచ్చు...”* బుధుడు ఆహ్వాన సూచకంగా అన్నాడు.


*“సరే..."* ఇలా అసంకల్పితంగా అంది. 


బుధుడు వెనుదిరి , తన ఆశ్రమం వైపు దారి తీశాడు. తనను వేటాడుతున్న ఇల కళ్ళను చూశాక అతను వేట గురించి , వేటగాళ్ళ గురించి మరచి పోయాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

పెరియ పురాణం⚜️

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 02*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *2. ఇయర్ పగై నాయనారు*


పూంబుహార్ నగరంలో ఇయర్ పగై నాయనారు అనే పేరుగల

వర్తకుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. శివభక్తులు

ఏది అడిగినా లేదనకుండా ఇచ్చే దాన స్వభావి. ఆ విధంగా భక్తులు

అడిగినది లేదనకుండా ఇవ్వడం లోక స్వభావానికి విరుద్ధం కాబట్టి అందరూ

అతనిని ఇయర్ పగై (లోక ప్రవృత్తికి విరుద్ధమైన) నాయనారు అని పిలుస్తుండేవారు. 


తన భక్తుని దాన గుణాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో శివుడు ఒక ధూర్త బ్రాహ్మణ వేషధారియై ఇయర్ వగై నాయనార్ ఇంటికి

వచ్చాడు. నాయనార్ ఆ బ్రాహ్మణ శివభక్తుని భక్తి పూర్వకంగా సముచిత

సత్కారాలతో గౌరవించాడు. 


తనముందు నిలబడిన ఇయర్ పగై నాయనారును చూసి వంచక బ్రాహ్మణుడు నీ భార్యను కావాలని కోరి నీ

ఇంటికి వచ్చాను అని చెప్పగా నాయనారు ఏ మాత్రమూ కోపం చెందక

తన భార్యను సంతోషంగా తాపసికి సమర్పించాడు. అప్పుడా బ్రాహ్మణుడు

"నీ భార్యను నేను ఒంటరిగా పిలుచుకొని వెళ్తున్నపుడు నీ బంధువులు

నాపై పగబట్టి నాకు అపకారం చేయవచ్చు. కాబట్టి నగరం పొలిమేరలు

దాటేంతవరకు నీవు నాకు తోడుగా రావాలి" అని ఆజ్ఞాపించాడు. 


వెంటనే ఇయర్ పగై నాయనారు వాళ్ల వెనుకగా ఒకచేతిలో కరవాలము, మరొక

చేతిలో డాలును ధరించి తనను ఎదిరించిన వాళ్లను కరవాలంతో

నేలకూలుస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు.

ఊహించిన విధంగానే నాయనారు బంధువులు ఆయుధాలతో ఆ

ధూర్త బ్రాహ్మణుని చంపడానికి ఉద్యుక్తులయ్యారు. నాయనారు వాళ్లందరినీ

తన కరవాలంతో నిర్దాక్షిణ్యంగా సంహరించాడు.


తన భార్యను వైదికోత్తమునికి సమర్పించి "స్వామీ! ఇక మీరు

భయపడకుండా వెళ్లండి" అంటూ వాళ్లు సురక్షిత ప్రదేశానికి చేరుకున్న

తరువాత తన అర్ధాంగిని శాశ్వతంగా వదిలిపెట్టి వెనుదిరిగి చూడక

సంతోషంతో తన ఇంటికి బయలుదేరాడు. అన్యులు చేయడానికి

అసాధ్యమైన కార్యాన్ని చేసినవాడునూ, శివభక్తుడునూ అయిన ఇయర్

పగై నాయనారును బ్రాహ్మణుడు ఎలుగెత్తి పిలిచాడు. 


ఆ శబ్దాన్ని విని “ఈ

దాసుడు ఇదిగో వస్తున్నాడు. మీకు అపకారం తలపెట్టిన వారిని ఈ  కరవాలంతో ఖండిస్తాను" అని చెబుతూ ఇయర్ పగై నాయనారు

బ్రాహ్మణుడున్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ విధంగా పరిగెత్తుకుంటూ

వచ్చిన ఇయర్ పగై నాయనారుకు బ్రాహ్మణుడు కనిపించలేదు. రత్నాభరణ

భూషితురాలైన భార్య మాత్రం కనిపించింది. 


ఇంతలో శివగామవల్లీ సమేతుడై వృషభ వాహనం మీద కొలువు తీరిన నటరాజస్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నీవు నీ భార్య ఇరువురూ కైలాసానికి విచ్చేయండి”

అని వారిని తన కరుణా కటాక్షాలచే అనుగ్రహించాడు. 


చనిపోయిన

నాయనారు బంధువులను, కులపెద్దలను పునర్జీవితులను చేసి వాళ్లు కూడ

శివలోక పదవిని అందుకొని సుఖ సంతోషాలను అనుభవించే వరాన్ని

అనుగ్రహించాడు.


    *రెండవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 89*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 89*


శ్రీరామకృష్ణులు అవతార పురుషుడనే  విషయాన్ని పరీక్షించాలనే ఆలోచన నరేంద్రునిలో తలెత్తింది.......   ఆ రోజు భరించరాని నొప్పితో శ్రీరామకృష్ణులు తల్లడిల్లిపోతున్నారు. ' 'శారీరక వ్యాధి వలన ఇంతగా తల్లడిల్లిపోతున్న ఈ స్థితిలో కూడా ఆయన తమను అవతారపురుషునిగా వచించే పక్షంలో, ముమ్మాటికీ ఆయన అవతారపురుషులేనని నమ్ముతాను' అని నరేంద్రుడు అనుకొన్నాడు. 


ఇలా అతడు అనుకోవడమే ఆలస్యం, పడక మీద పడుకొనివున్న శ్రీరామకృష్ణులు తమ శక్తినంతా కూడదీసుకొని లేచి కూర్చుని సుస్పష్టమైన స్వరంలో ఇలా అన్నారు: "నరేన్! మునుపు ఎవరు రాముడుగాను, కృష్ణుడుగాను. అవతరించారో, వారే ఇప్పుడు రామకృష్ణులుగా ఈ శరీరంలో ఉన్నారు. కాని నీ వేదాంత భావన ప్రకారం కాదు." ఎన్నో దివ్య దృశ్యాలూ, శక్తులూ ఆయనలో చూసిన తరువాత కూడా ఇంకా తనకు సంశయం నివృత్తి కాకపోయినందుకు నరేంద్రుడు సిగ్గుతో, అవమానంతో తలవంచాడు.


ఒక రోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి తప్ప తక్కిన తమ యువశిష్యులను పిలిపించారు. ఆయన మాట్లాడలేకపోతున్నారు. అయినప్పటికీ అతి మెల్లని స్వరంలో, "ఇదిగో చూడండి! మిమ్మల్ని నరేంద్రుని బాధ్యతలో వదలి పోతున్నాను. అతడు చెప్పినట్లు మెలగండి. అతడి ఆరోగ్యాన్నీ, శ్రేయస్సునూ గమనించి మసలుకోండి" అన్నారు. 


ఆ తరువాత నరేంద్రుణ్ణి పిలిచి, "ఇదిగో చూడు నాయనా, నరేన్! ఈ నా బిడ్డలనందరిని నీకు అప్పగించిపోతున్నాను. అందరిలోను బుద్ధిశాలివీ, ప్రతిభావంతుడివీ నువ్వు ప్రేమతో వారికి నేతృత్వం వహించు. నా కోసం పనిచేయి” అన్నారు.🌹


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 79*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

          *🌹సౌందర్యలహరి🌹*

                   *శ్లోకం - 79*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


 *నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో*

 *నమన్మూర్తే ర్నారీ తిలక శనకై స్త్రుట్యత ఇవ |*

 *చిరం తే మధ్యస్య     త్రుటిత తటినీతీరతరుణా*

 *సమావస్థా స్థేమ్నో భవతు కుశలం శైలతనయే ‖*


ఓ శైల తనయా ఓ నారీ తిలకమా సన్ననిదీ, పాలిండ్ల భారము చేత బడలి, క్రిందికి వంగి, ఉద్ధృతమైన వరద ప్రవాహము చేత కోసుకుపోతున్న నదీ తటమున వున్న చెట్టు వలె వున్నదీ అయిన నీ నడుము చిరకాలము సురక్షితముగా ఉండుగాక!


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

దీపారాధన మహిమ*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*కార్తీకపురాణం - 4వ అధ్యాయము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*దీపారాధన మహిమ*


ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసమున యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి. 

జనకా! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన యందు అతి ముఖ్యము.  దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని  వైకుంఠ ప్రాప్తి నొ౦దుదురు.  కార్తిక మాసమందు హరి హరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు  అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను.  దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను  నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.


*శతృజిత్ కథ* 


పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుండగా నచ్చటకు పికెదుడను ముని పుంగవుడు వచ్చి ' పాంచాల రాజా! నీవెందుల కింత తపమాచరించు చున్నావు?  నీ కోరిక యేమి?'  యని ప్రశ్నించగా, ' ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని   చెప్పెను. అంత మునిపున్గవుడు' ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల నీ కోరిక నేర వేరగలదు ' యని చెప్పి వెడలిపోయెను.


వెంటనే పాంచాల రాజు తన దేశమునకు, వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దాన ధర్మాలతో  నియమాను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముహూర్తమున నొక కుమారుని గనెను.  రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రో త్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మములు జేసి, ఆ బాలునకు ' శత్రుజిత్' యని నామకరణ ము చేయించి అమిత గరాబముతో పెంచుచుండిరి.  కార్తిక మాస  దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను.  కాని, యవ్వనము  రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండించుచు తన కమావాంఛ తీర్చుకొనుచుండెను.

తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల ప్రేమతో చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి.  శత్రుజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకుని, ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను.   ఆమె ఒక ఉత్తమ భార్య, మిగుల రూపవతి.  ఆమె అందచందములను వ ర్ణించుట మన్మధునికైననూ శక్యము గాదు.  అట్టి స్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై, కామవికారముతో నామెను సమీపించి తన కమవాంఛను తెలియచేసేను.  ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై, కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములను అనుభవించెను. 


ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత, వారు ప్రతి దినము నర్థరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు, తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి, ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.


ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు, అంతకుముందే కత్తితో  సహా బయలు దేరి గర్భ గుడిలో దాగి యుండెను.  ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చు కొను సమయమున 'చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా,' యని రాకుమారుడనగా, ఆమె తన  పైట చెంగును చించి, అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో  రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని

ఖండించి, తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు  బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి.  అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు 'ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు?  కామాంధకారముతో  కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల?  చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను.  అంత యమకింకరులు ' ఓ బాపడ! ఎవరెంతటి  నీచులైననూ, యీ పవిత్ర దినమున, అంగ, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశించిపోయినవి.  కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు' అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు'  అలా యెన్నటికిని జరగనివ్వను.  తప్పొప్పులు యెలాగునున్నప్పటికీ మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మా యందరికి  వర్తించ వలసినదే ' అని, తాము చేసిన దీపారాధన ఫలములో  కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను.  వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివ సాన్నిధ్యమునకు జేర్చిరి. 

వింటివా రాజా!  శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికుల పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను.  కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొందుదురు.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త  కార్తిక మహాత్యమందలి*

*నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం.*

*ఉ || ఎల్ల శరీర దారులకు నీళ్ళను చీకటి నులిలోపలన్*

*ద్రెళ్లక ' మీరుమే' మను మతిభ్రమణంబున భిన్నులై*

*ప్రవర్తిల్లక సర్వమున్నతని* *దివ్యకళమయమంచు విష్ణు నందుల్లము జేర్చి తారడ వినుండుట మేలు నిశాచరాగ్రణి ||*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 ఈ రోజు పంచాంగం 17.11.2023  Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస శుక్ల పక్ష: చతుర్ధి తిధి భృగు వాసర: పూర్వాషాఢ నక్షత్రం ధృతి తదుపరి శూల యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


చవితి పగలు 11:02 వరకు.

పూర్వాషాఢ రాత్రి 01:15 వరకు.

సూర్యోదయం : 06:26

సూర్యాస్తమయం : 05:36

వర్జ్యం : మధ్యాహ్నం 11:27 నుండి 12:59 వరకు .

దుర్ముహూర్తం : పగలు 08:40 నుండి 09:25 వరకు తిరిగి మధ్యాహ్నం 12:23 నుండి 01:08 వరకు. 


రాహుకాలం : పగలు 10:30  నుండి 12:00 వరకు.


యమగండం : మద్యాహ్నం   03:00 నుండి 04:30 వరకు.


శుభోదయ:, నమస్కార: