22, జులై 2022, శుక్రవారం

అక్షరసత్యాలు

 *🙏మహనీయుల మాటలు అక్షరసత్యాలు🙏*


*🙏నీ గమ్యం ఎంత ఎత్హు లో ఉన్నప్పటికీ, దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళకిందనుండే మొదలవుతుంది.!*


*🙏వాడని ఇనుము తృప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.*


*🙏నా జీవితం మహా అద్భుతంగా ఉంది. ! ప్రపంచమంతా మహా అద్భుతంగా ఉంది. అని రోజుకు ఒక్క సారైనా అనుకోండి. ఆతర్వాత జరిగే అద్భుతాలను చూడండి.!*


*🙏లోపలి స్థితి ముఖ్యమా! బయట స్థితి ముఖ్యమా,! అంటే లోపలి స్థితికే ఓటు వేయాలి. ఎందుకంటే.లోపల స్థితి బాగుంటే, అన్నీ బాగున్నట్లే!* 


*🙏మనం సంతోషంగా ఉండటానికి ఎదో అవసరం అన్నది కేవలం భ్రమ మాత్రమే! సంతోషం అన్నది మనలోపలి ఒకానొక మానసిక స్థితి!*


*🙏శరీరంలో అలసట వస్తే పర్వాలేదు! అదే అలసట మనసులో వస్తే వెంటనే స్పందించు! మరచిపోకు!*


*🙏నీ జీవితం నీ చేతుల్లోకి రావాలంటే నీ దృష్టి ఇతరులను నియంత్రించడం లోకాదు .నీ దృష్టి నీపై మాత్రమే ఉండాలి.!,* 


*🙏నీవు నిజంగా సత్యం లో సత్య సాధనలో ఉంటే ఇతరుల మాటలతో నీకు పని లేదు! చివరికి నీకు తప్పక స్వేచ్ఛ లభిస్తుంది.!*

సేంద్రియ వ్యవసాయం

 ఆవుతో సేంద్రియ వ్యవసాయం - 


 పశువులలో గోవు , మనిషికి ముఖ్యంగా రైతుకి ఎన్నొ రకాలుగా ఉపయోగపడుతుంది. ఆవుపాలు , నెయ్యి, మజ్జిగ, పెరుగు, మూత్రము , పెడ, కొమ్ములు గిట్టలు అన్ని వ్యవసాయ రంగానికి ఉపకరించేవి.


 ఆవుపాల విశిష్టత - 


 ఆవుపాలకు వ్యాధికారక వైరస్ ని నిరోధించే శక్తి ఉంది. విత్తనాలను ఈ పాలతో శుద్ది చేయడం శ్రేయస్కరం.వీటితో భూసారాన్ని పెంచవచ్చు.


 పంచగవ్య విశిష్టత - 


 పుజాకాలలో పంచామృతాల పేరుతో ఆవుపాలు , పెరుగు, నెయ్యి, తేనే , కొబ్బరినీళ్ళు  వాడతారు. వీటిని పవిత్రముగా చెబుతారు. అలాగే వ్యవసాయానికి సంబందించి ఆవుపాలు , పెరుగు , నెయ్యి, మూత్రము , పెడ , కలిపి పంచగవ్య అంటారు. వీటన్నిటిని నిర్దిష్ట పరిమాణంలో  మిశ్రమం చేయాలి . ఈ మిశ్రమం పంటల పెరుగుదలకు, యాంటి వైరస్ గా , యాంటి బ్యాక్టీ రియల్ గా పనిచేస్తుంది. 


 గిట్టలు, కొమ్ములు , వెంట్రుకలు విశిష్టత - 


 గోవు సహజంగా మరణించిన తరువాత దాని శరీరం నుండి తీసిన గిట్టలు, కొమ్ములు , వెంట్రుకలు, వీటన్నిటిని కలిపి కాల్చిన పిడక పై వేస్తే పొగ వస్తుంది. దీనిని ప్యుమింగ్ అంటారు. కూరగాయల చెట్లకు ఈ పొగ పెడితే వాటికి కీడు చేసే సూక్ష్మ క్రీములు ఎగిరిపోతాయి, లేదా చనిపోతాయి. చచ్చుబడి మడతలతో వంకరగా తయారైన ఆకుకూరలు దీనివల్ల చక్కగా పొడుగ్గా ఎదుగుతాయి.


 కొమ్ముల విశిష్టత - 


 మరణించిన గొవుల నుండి కొన్ని కొమ్ములు సేకరించి వాటిని ఆవుపేడతో నింపి భుమిలొ పుడ్చిపెట్టాలి. ఆరునెలల తరువాత ఈ కొమ్ములు బయటకు తీసి వాటితో ఒక కొమ్ము పేడను ఒక ఎకరం భూమిని సమస్కరించడానికి , సారవంతం చేయడానికి వినియోగించవచ్చు 


 ఆవుముత్రం తో అధిక దిగుబడి. -


 ఆవుముత్రం 5 రకాలు అవి 


 1. వట్టిపోయిన ఆవు ముత్రము 2. పాలిచ్చే ఆవుముత్రం . 3. చూడి ఆవుముత్రం . 4. ఎద్దు ముత్రము . 5. ఆవుజాతి పశువుల ముత్రము 


 మొక్కల ఎదుగుదలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది . పురుగులను చెట్ల ధరిచేరనివ్వదు.

 వరి నాట్లు పూర్తి అయిన తరువాత 20 రోజులకు ఒక లీటరు దేశవాళి మాములు ఆవుముత్రానికి 10 లీటర్ల నీళ్లు కలిపి స్ప్రె చేస్తే అద్బుత ఫలితాలు కనిపిస్తాయి. తరువాత 20 రోజులకు చూడి ఆవు ముత్రాన్ని 1:10 నిష్పత్తిలో నీటితో కలిపి స్ప్రే చేయాలి . మరలా 20 రోజులకు చూడి ఆవు ముత్రాన్ని లీటరుకు 50 గ్రాములు వాయు విడంగాల పొడిని కలిపి 24 గంటలు నానబెట్టి చల్లాలి. నాలుగో సారి అంటే నాట్లు వేసిన  80 రోజుల తరువాత సాదారణంగా స్ప్రే అవసరం లేదు . అవసరం అనిపిస్తే పైన పేర్కొన్నట్టు స్ప్రే చేయాలి . మనం సహజ పద్ధతిలో చేసే వ్యవసాయం కంటే దీనివల్ల మూడు నుండి ఆరు క్వింటాళ్ళ ధాన్యం అదనంగా పండించవచ్చు.


 గోముత్రంలో వాయు విడంగాలను 15 రోజులు మురగబెట్టి, పైరు పూత పూసే సమయానికి ముందు ఆకులపై స్ప్రే చేస్తే మాములుగా పంట కన్నా రెండింతలు దిగుబడి అధికంగా వస్తుంది.


 ఇదే విధంగా ఉడుగ చెట్టు ఆకులు, కాయలు గొముత్రంలో పదిహేను రోజులు మురగబెట్టి చల్లినా కుడా రెండింతలు దిగుబడి అదనంగా పొందవచ్చు. అయితే కాయలు మాత్రమే మురగబెట్టినప్పుడు ఒక విధమైన ఫలితం. ఆకులు మాత్రమే మురగబెట్టినప్పుడు   ఒక విధమైన ఫలితం కలుగుతుంది.


 గొముత్రంతో ఎరువుని ఎలా తయారు చేసుకోవాలి 


 ఆవుపేడ నే కాదు ముత్రాన్ని కుడా ఎరువుగా వినియోగించుకోవచ్చు . ఆవు ముత్రం సాధారణగా వృధా పొతుంది.అక్కడ ఒక తొట్టె కట్టాలి. ఆ తొట్టెలో ప్రతిరోజు ఉదయం మట్టిని వేసి మరుసటి రోజు తీసివేస్తూ ఉండాలి. ఈ విధంగా తీసిన మట్టిని మొక్కకు ఒక తట్ట చొప్పున వేస్తే స్ప్రే చేయాల్సిన అవసరం లేదు . మంచి దిగుబడి వస్తుంది.


 జీవద్రవం తయారి విధానం - 


 ఆవు ఈనబోయే ముందు ఉచ్చ బు డ్డ కనపడుతుంది . ఒక సంచిలో నీళ్లు ఉన్న విదంగా అది గుండ్రంగా ఉంటుంది.దీనికి రంద్రం చేసి జీవ ద్రవాన్ని బకెట్ లొ పట్టుకొవాలి. దానిలొ ఒక నిమ్మకాయ రసాన్ని పిండితే ఇది 3 నెలలు నిలువ ఉంటుంది. 

           ఈ జీవద్రవాన్ని లీటర్ కి పది లీటర్ల నీళ్లు కలిపి మొగ్గదశకు ముందే ఏ పంటపైన అయినా చల్లితే పూత , పంట ఎక్కువగా వస్తాయి.నారుమల్లు వేసిన 10 రోజులకు దీనిని స్ప్రే చేస్తే ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని నారుమడి సాధించవచ్చు.

 

 విత్తనాలు, విత్తనశుద్ధి -


 విత్తనశుద్ది కొసం ఒక క్వింటా విత్తనాల పై ఒకటి నుండి ఒకటిన్నర లీటర్ల పైన తెలిపిన జీవద్రవాన్ని చల్లి బాగా కలిపి ఒకరోజు నీడలో ఆరబెట్టి ఆ తరువాత విత్తుకోవాలి. ఏ రకం విత్తనాలనైన విత్తడానికి సిద్దం చేసుకున్న తరువాత ఆవుపాలు ఒక భాగం నీళ్లు 9 భాగాలు కలిపి విత్తనాలపై చల్లి నీడలో ఆరనిచ్చి విత్తుకోవాలి.

             ఎద్దులు పొలంలో పనిచేసి ఇంటికి వచ్చిన తరువాత పోసే ముత్రాన్ని సేకరించి క్వింటా విత్తనాలకు ఒకటి లేదా రెండు లీటర్లు కలిపి నీడలో ఒకరొజు ఆరనిచ్చి నాటాలి.




         

రామాయణానుభవం_ 101

 🌹రామాయణానుభవం_ 101


సుగ్రీవుడు *దక్షిణదిశ* భౌగోళిక అంశాలు తెలియ జేస్తున్నాడు....


దక్షిణ దిశాన సముద్రం దాటాక

"పుష్పితక" పర్వతము సువర్ణ, రజిత శిఖరాలతో సూర్యేందుకు నెలవై ఉంటుంది. అయితే దానిని క్రూర, నాస్తిక కృతఘ్నులు చూడరు.


ఆ పర్వతము తర్వాత "వైద్యుతము" అనే పర్వతము మెరుపువంటి రంగుతో ప్రకాశిస్తూ మధువుకు, మధుర ఫలాలకు నిలయమై ఉంటుంది.


ఆ పర్వతము దాటిన తరువాత “కుంజర" పర్వతము "అగస్త్య" భవనముతో అలరారుతూ ఉంటుంది. దాని తరువాత "భోగవతీ నగరము” ఉంటుంది. అది "వాసుకి" సమేత అసంఖ్యాక సర్పరాజులకు నిలయము. మహావిషసర్ప సంరక్షితమై ఉంటుంది.


దాని తరువాత "వృషభాచలము" ఉంటుంది. దానిపై ఎఱ్ఱ చందనము విశేషంగా ఉం, భయంకర రోహితాకార గంధర్వ సురక్షితమై ఉంటుంది. 


పంచగంధర్వులు పాలకులుగా ఉంటారు. వారే శైలూష, గ్రామణి, శిశువు, శుభ్రుడు, బభ్రుడు అనేవారు. తమ పుణ్యకర్మలచే సూర్య, చంద్రాగ్ని శరీరకులైన దేవతలు అక్కడ స్వర్గవాసము చేస్తుంటారు.


వృషభగిరియే పృథివి యొక్క దక్షిణాంతిమ భాగము ఇంతవరకే మీరు వెళ్లగల్గుతారు. దాని తరువాత గాడాంధకార పరీవృతమైన పితృలోక, యమలోక ప్రాంతము ఉంటుంది.


ఈ దక్షిణ దిశను నెల రోజులలోపు పర్యటించి సీతను గాఢంగా అన్వేషించి రావాలి. సీత జాడ తెలిపిన వారు నాకు ప్రాణప్రియులై, నాతో సమానంగా భోగభాగ్యములు అనుభవిస్తారు. వారు ఎన్ని తప్పులు చేసినా నాకు ఆమోదయోగ్యులే.


మీరందరు ఉన్నత కుల సంజాతులు, బలపరాక్రమ సంపన్నులు” అని సుగ్రీవుడు వారికి దక్షిణ దిశా నిర్దేశం చేశాడు........


**

 *పశ్చిమదిశ*

 సుగ్రీవ మహారాజు తన మామగారైన “సుషేణుడు" అను వానర మహావీరుని నాయకునిగా జేసి, అతనికి తోడుగా మారీచుని, అతని సోదరులను, అర్చిష్మంతుని, అతని అనుయాయులను, రెండు లక్షల మంది వానర వీరులను పశ్చిమ దిశకు పంపాడు. 

ఆయన తన మామగారితో:

"మీ నాయకత్వంలో సౌరాష్ట్ర (గుజరాత్) బాహ్లిక, శూరదేశాలను (బహుశః పంజాబు, సింధు దేశాలను) జన, పదాలను, పట్టణాలను, మహారణ్యాలను పర్వతాలను వెతకాలి. అవి దాటిన తరువాత మెట్ట ప్రదేశాలతో కూడిన (రాజస్థాన్ లోని “థార్") ఎడారిప్రాంతము వస్తుంది. అక్కడ అంతా బాగా అన్వేషించి క్రింది (అరేబియా) సముద్రంలో ప్రవేశించాలి. దానిలో "తిమి", తిమింగిలాది పెద్ద పెద్ద చేపలు, మొసళ్లు అధికంగా ఉంటాయి.


(సింధూ) నదీ సాగర సంగమ ప్రదేశంలో "హేమగిరి" అనే మహా పర్వతము శత శిఖర పరివేష్టితమై ఉంటుంది. దానిలోయలలో "రెక్కలుగల ఎగిరే సింహాలు" ఉంటాయి. అవి మదగజాలను, మహామీనాలను పట్టుకొని తమ గుహలలోకి తీసికవెళ్లి తింటాయి. దాని శిఖరాలలో ఒకటి బంగారు రంగుతో ప్రకాశిస్తుంటుంది. మీరు కామరూపధారులై అక్కడ అంతా జాగ్రత్తగా అన్వేషించాలి.


ఆ (అరేబియా) మహా సముద్రములో శతయోజన విస్తీర్ణమైన "పారియాత్ర" మహా పర్వతము శిఖర సమేతమై ఉంటుంది. ఆ పర్వతంపై కామరూప శక్తి గలిగిన అగ్ని వర్ణులైన ఇరువై నాలుగు కోట్ల మహాబలసంపన్నులైన గంధర్వులు ఉంటారు. ఆ పర్వతము ఫల, మూలాలను వారు రక్షిస్తుంటారు. అయినప్పటికి వానర రూపులైన మీకు వారి వలన భయము ఉండదు.


ఆ పర్వతము తర్వాత వైడూర్య వర్ణమయమైన "వజ్ర పర్వతము" శత యోజన సమున్నతమై ఉంటుంది. ఆ పర్వత గుహలన్నిటిలో సీతను జాగ్రత్తగా అన్వేషించాలి.


దాని తరువాత "చక్రవంత" పర్వతము విశ్వకర్మ స్థాపిత సహస్రార చక్రముతో ప్రకాశిస్తుంది. పంచజనుడనేరాక్షసుని సంహరించి, శ్రీమహావిష్ణువు ఈ చక్రాన్ని కైవసం చేసికొన్నాడు. ఈ పర్వత ప్రాంతాలన్నిటిలో సీతాదేవిని అన్వేషించాలి....

కపట సన్యాసి

 కాళిదాసు - కపట సన్యాసి


ఒకసారి మేము చెన్నై(తిరుమంగళం) నుండి అంబత్తూరుకు వెళ్తున్నాము. అప్పటిలాగే పరమాచార్య స్వామివారు మూడు చక్రాల సైకిలుపై ఒక చెయ్యి ఉంచి నడుస్తున్నారు. స్వామివారితో పాటుగా మేము ఒక ఏడెనిమిది మంది కూడా నడుస్తూ వెళ్తున్నాము.


“నీలకంఠా, నువ్వు కపట సన్యాసిని చూశావా?”


“లేదు . . .”


“నాగరాజా, మరి నువ్వు?”


“లేదు . . .”


నావైపు చూసి స్వామివారు, “కపట సన్యాసి గురించి విన్నావా?” అని అడిగారు.


“విన్నాను పెరియవా! రావణ, అర్జున . . ” అని అన్నాను.


“వారు మాత్రమేనా?”


కాస్త సంశయిస్తూ “కాళిదాసు కూడా” అని చెప్పాను.


“కాళిదాసా? అతను ఎప్పుడు కపట సన్యాసి అయ్యాడు?”


“ఆ విషయం స్వామివారికి తెలుసు. ఆ కథను స్వామివారే చెబితే వింటూ నడుస్తాము”


“లేదు, నువ్వే చెప్పు”


“భోజరాజు ఆస్థానంలో విద్వాంసుడైన కాళిదాసు, ఒకసారి సభలో అమర్యాదకరమైన మాటలు వినడంతో సభను వదిలి కాళ్ళు తీసుకువెళ్ళిన చోటుకు వెళ్ళిపోయాడు.


కాళిదాసు లేకపోవడంతో భోజునికి సమయం గడవడంలేదు. ఎలా అతణ్ణి పట్టుకోవడం? ఒక శ్లోకంలోని రెండు పాదాలు వ్రాసి, మిగిలిన పాదాలను పూరించిన వారికి బహుమతి అని రాజ్యంలో చాటింపు వేయించాడు.

దాసీ ఇంట్లో ఉన్న కాళిదాసు, బహుమానం గురించి ఏమీ తెలియకపోయినా శ్లోకాన్ని పూరించాడు. దాసి భోజుని వద్దకు వెళ్లి ఆ శ్లోకాన్ని చూపించింది. ఆమె ద్వారా విషయం తెలుసుకుని మారువేషంలో కాళిదాసుని వెతకడానికి బయలుదేరాడు భోజుడు. దారిలో ఒకచెట్టు క్రింద కూర్చున్న ఒక సన్యాసిని చూసి కాళిదాసేమో అన్న అనుమానం కలిగింది.


ఇద్దరి సంభాషణ ఇలా కొనసాగింది.


ఆ సన్యాసి మారువేషంలో ఉన్న భోజుణ్ణి "నువ్వు ఎవరు?" అని అడిగాడు. 

"నేను భోజుని వద్ద తాంబూలం పెట్టె మోసేవాణ్ని. ఆయన మరణించిన తరువాత అక్కడ ఉండడానికి మనసొప్పక ఇలా వచ్చేసాను". 


"ఆహ్ ! నా భోజుడు చనిపోయాడా?", అని ఆ సన్యాసి బాధపడుతూ చరమ శ్లోకం పాడడంతో మారువేషంలో ఉన్న వ్యక్తి కిందపడి చనిపోయాడు. ఆ మారువేషంలో ఉన్నది భోజుడే అని ఏ మాత్రం అనుమానం లేని ఆ సన్యాసి అమ్మవారిని ప్రార్థించి శ్యామలా దండకాన్ని పఠించాడు. మరొక్క పాదాన్ని "ఇక్కడ, భోజుడు మేల్కొన్నాడు" అన్న అర్థం వచ్చేలా స్తుతించాడు.


భోజుడు నిజంగా బ్రతికాడు.”


ఈ కథను మొత్తం చెప్పి, "ఈ సందర్భంలోనే కాళిదాసు కపట సన్యాసి వేషం వేసాడు" అని అన్నాను.


"చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంత దూరం నడిచినా అలసట కలగలేదు" అన్నారు స్వామివారు.


అంబత్తూరు చేరుకున్నాము. 


--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, కంచి శ్రీమఠం విద్వాన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గురు భక్తుని

 *ఒక గురు భక్తుని ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు.*

*ఏవండీ మీరు చాలా రోజుల నుంచి ఒక గురువుగారి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, దానివల్ల మీకు ఏమీ ప్రయోజనం కలిగింది. ?* 

*ఏమి ఆస్తులు సంపాదించారు ?*


 *అని అడిగాడు. అదివిన్న అవతలి వ్యక్తి ఇలా చెప్పాడు.*


 *అయ్యా చాలా మంచి ప్రశ్న వేశారు. చెప్తాను వినండి. మీరు గురు తత్త్వం ఇప్పటి వరకూ తెలుసుకోలేక పోయారు. అందుకే మీ మనసులో ఇలాంటి ప్రశ్న పుట్టింది. ఏమి సంపాదించారు అన్నారు కదా చెప్తా వినండి. నా గురుదేవులే నా కోటానుకోట్ల ఆస్తి. వారి పాదాల దగ్గర స్థానమే మాకు గొప్ప పదవి. వారి సేవే మాకు గొప్ప వరం.*


*నేను వారి సన్నిధికి చేరక ముందు  వేరు, ఇప్పుడు నేను వేరు. ఒకప్పుడు నా మనసు అంతా గందరగోళం గా ఉండేది. ఎప్పుడూ ఎదో ఆలోచన. భవిష్యత్తు గురుంచి భయం. రేపు అనేది ఎలా ఉంటుందో అనే ఆలోచన. ఏదో ఒకటి చేసి తప్పుదారిలో వెళ్ళి సుఖపడాలి అనే ఆలోచన తో నా జీవితం కొనసాగేది. కానీ ఇప్పుడు నా ఆలోచేనే మారిపోయింది. ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంత కష్టం మీద పడుతున్నా నా మనస్సు ఎప్పుడూ ఆనందం తో నిండి ఉంటుంది. నా పెదాలపై ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. ధర్మంగా ఉండి ఉన్నదానిలో సంతృప్తిగా ఉంటున్నాను. దురాశ లేదు. ఉన్నదానిలో ఒకరికి అయినా సాయం చేయాలనే బుద్ధి పుట్టింది. మా గురుదేవుల ప్రవచనాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వ్యక్తి ఎలా జీవించాలో తెలుసుకున్నాను. ముఖ్యంగా నేను ఎక్కడ ఉన్నా మా గురుదేవులు రక్షగా నా పక్కనే ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అదికావాలి ఇది కావాలి అనే కోరికలు పూర్తిగా తగ్గాయి.ఇప్పుడు మా ఇంట్లో ఒక ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. మా పిల్లల చదువులు, వారి అలవాట్లు మంచిగా సాగుతున్నాయి. మా కుటుంబం మొత్తం ఒక మంచిదారిలో నడుస్తున్నాము.*


*మా గురువు గారి మార్గదర్శనం లో, మేము నలుగురికి ఆదర్శం గా నిలిచాము. ఒకరు పొగిడినా  లేదా ఒకరు విమర్శించి తిట్టుకున్నా రెండిటిని మేము ఒకే దృష్టితో చూడగలుగుతున్నాం. ఇప్పుడు మా మనసులో కూడా చెడు అనే ఆలోచన రావడం లేదు . చూసే దృష్టిలో కూడా మార్పు వచ్చింది. ఇంతకన్నా ఒక వ్యక్తికి, లేదా కుటుంబానికి కావలిసిందేముంది. ఈరోజు మేము జీవించి ఉన్నాము అంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. ఈ జీవితం ఆయనది. మా జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ ఆయనదే. కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని ప్రసాదించి రక్ష ఇచ్చేది కూడా ఆయనే. నా మనసులో వున్న ప్రతిదీ ఆయనకు అవగతమే. ఎందుకంటే మా మనసులో ఎప్పుడూ ఆయన కొలువుదీరి ఉన్నారు. ఆయన సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపం.  గురువు గొప్పదనం కేవలం గురువును అనుసరించడం వల్ల మాత్రమే తెలుస్తుంది.*


*ఆయన దృష్టితోనే అన్ని సంపదలు ప్రసాదించగలరు. కానీ కర్మలు తొలగించి ఎవ్వరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో వారికి తెలుసు.*


*వారు పూజలు చేసి మాతో చేయిస్తారు. దివ్యనామం పలుకుతూ, మాతో పలికిస్తారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి , మాతో కూడా అన్నదానం చేయిస్తారు. జీవులను కాపాడమని జీవ హింస చేయద్దని పదేపదే చెపుతూ, వుంటారు. ధర్మ సూక్ష్మాలు చెప్తూ,  ధర్మ మార్గంలో నడిపిస్తారు. అన్ని విద్యలూ ఆయనలోనే ఉండి అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని వానిలా, చిన్న వారిని కూడా అడిగి తెలుసుకుంటారు. ఆయన జ్ఞాన శిఖరం. ఆయనను ఆశ్రయించిన వారికి జ్ఞానభిక్షను అనుగ్రహిస్తారు.* 


*అందుకే మా గురుదేవులే మాకు గొప్ప సంపద. ఇంతకన్నా ఒక వ్యక్తికి ఏం కావాలి.*

*Appana Veerababu.*

*Rajahmundry.*

అంతర్మథనం

 'నేను' చిరంజీవి (అంతర్మథనం)

........................................

అహమాత్మా గుడా కేశా..అంటారు శ్రీ కృష్ణ పరమాత్మ అర్జనునితో. నేనే ఆత్మ రూపంలో చరాచర సృష్టిలో ఉన్నానని అర్థం. అంటే..జీవకోటి సర్వస్వం ఆత్మ స్వరూపులే. నీవు ఎవరిని మోసం చేసినా ఆత్మ ఘాతకుడు కిందే లెక్క. ఆత్మ..ఆత్మతో తాదాత్మ్యం అయితే భౌతికం. ఆత్మ పరమాత్మతో లయమైతే అది ఆధ్యాత్మికం. అదే జీవుడి నిజ స్థితి. అదే ముక్తి మార్గం. మాధవుడే ముక్తి దాయకుడు. ముందు..మ..అనే పదం లేకుండే అది..ధవా..అవుతుంది. ధవం అంటే.. మల్లె. ఇది కొద్దిసేవు సువాసనలు ఇచ్చి వాడిపోతుంది. దానికి..మ..అనే పదం ముందు చేరిస్తే మాధవ అవుతుంది

మ..అంటే ముక్తి నిచ్చేవాడు. మరి..మాధవుడు కావాలా? ధవం కావాలా? తేల్చుకోవాలి.


శరీరానికి ఒక నామధేయం ఉంటుంది. ఇక్కడే మాయ కమ్మేస్తుంది. నేను అనే శరీరం కేవలం అస్థిత్వం మాత్రమే. ఒక ఉపాధి మాత్రమే. అసలైన..నేను..నడిపించేది. అదే అసలైన నేను. ఆ నేను..చితాద్మ. ఎప్పటికీ నశించదు. దేహం కుప్పకూలినా మరో దేహాన్ని ఆత్మ స్వీకరిస్తుంది. అంటే చనిపోయేది శరీరమే కానీ, ఆత్మ కాదు. కాబట్టి నేను.. చిరంజీవినే. నేనే కాదు..నేనెవరో తెలుసుకున్న వారంతా చిరంజీవులే.


మాయామయం..

...................

నేను శరీరం అనుకోవడం వల్లే ఆశ, పాశం, మదం, మొహం, అహంకారం వంటి ఊడలు విస్తరిస్తాయి. సరే..శరీరం నువ్వే అయితే..ఒక్కో పార్టు తీసి ఇచ్చేస్తావా? ఇవ్వవు. ఎందుకు? అది నీది కాదు కాబట్టి. నీదే అయితే ఇట్టే తీసి..అట్టే ఇచ్చేయ గలగాలి కదా. ఇవ్వలేవు. ఎందుకంటే అది అసలైన నేను కాదు కాబట్టి. అవునా?


సాధకులారా.. నేను సత్యం. నేనే సత్యం. ఇందుకు..ముందు నువ్వు సాధకుడు కావాలి. తపస్సు లేనిదే ఏ సాధనా మొదలు కాదు. విషయ భోగాల కోసం వెంపర్లాడే బాహ్య ఇంద్రియాలను చాకచక్యంగా అంతర్ముఖం చేసి చూడు. ఆలోచనలు లుప్తమై.. చిదానందం కలుగుతుంది. జాగ్రత్తగా గమనిస్తూ పోతుండు. నీ నిజ స్థితి అనుభవైకవేద్యం అవుతుంది. అదే ఆత్మానుభూతి. అదే నీ నిజ స్థితి. అదే నేను. నిజమైన నేనును తెలుసుకున్న నువ్వు, నేనూ కూడా చిరంజీవులమే. దీంతో.. అప్పటి వరకూ మనం ఘనంగా చెప్పుకునే 'మాయా నేను' మటు మాయం. సాధకుడా..మేలుకో.. త్వరపడు..సమయం అట్టే లేదు. స్వస్తి.// ఆదూరి వేంకటేశ్వర రావు.🙏

.....................

జిజ్ఞాసువులకు మాత్రమే పరిమితమైన ఈ అంతర్మథనం తెలుగుకే పరిమితం. ఆంగ్లంలో ఎవరైనా అనువదిస్తే..నాకు ఎలాంటి బాధ్యత లేదు. హరి ఓం.🙏

ఊపిరి ఉన్నంతవరకు

 శ్లోకం:☝️భజ గోవిందం

*యావత్పవనో నివసతి దేహే*

  *తావత్పృచ్ఛతి కుశలం గేహే |*

*గతవతి వాయౌ దేహాపాయే*

  *భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||*

   - మోహ ముద్గరం 6


భావం: శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు మృతదేహము చూసి సమీపించుటకు నీ జీవిత భాగస్వామి కూడా భయపడును.

*ఫల ప్రదో భవేత్ కాలే....*

 ఇది కథా…నిజమా…?


          *ఫల ప్రదో భవేత్ కాలే....*


*"విశాఖపట్టణం నుండి పలాసపోవు ప్యాసింజర్ మరి కొద్ది సేపట్లో 5వ నెంబర్ ప్లాట్‌ఫాం నుండి బయలు దేరుటకు సిద్ధంగా ఉంది" అని మైకులో వినబడుతుంటే రామనాథం మాస్టారు గబగబా పరుగెత్తి వెళ్ళి రైల్లో కూర్చున్నారు.


*రామనాధంగారు రిటైర్ అయిన సంస్కృత ఉపాధ్యాయుడు. విజయనగరం మహారాజా వారి సంస్కృత కళాశాలలో పనిచేసారు; ఎందరో విద్యార్థులకు విద్య గరపారు. మంచికి మారుపేరుగా అందరూ చెప్పుకుంటారు ఆయన్ని గురించి. ఎందరో పేద విద్యార్థులకు చేయూత నందించిన వ్యక్తిత్వం ఆయనది.


*రైలు వేగం మెల్లమెల్లగా పెరుగుతుంటే ఆయన మనసు గతం లోకి పరుగులు పెడుతోంది. చాలా రోజుల తరువాత తన పుట్టినూరికి వెళ్తున్నాడు. తమ ఊరి పొలాలు, చెరువు గట్టు, శివుడి కోవెల, తను చదివిన బడి.. అన్నీ గుర్తొస్తున్నాయి. తన చిన్ననాటి తెలుగు మాస్టారు చెప్పిన "చేసిన మేలు ఊరకన్ పోదు" అనే మాట ఇప్పటికీ చెవుల్లో వినబడుతోంది. ఆ మాటే తనని ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టింది.


*రైలు విజయనగరం చేరుతోంది. ఎవరో భిక్షగాడు "జీవము నీవే కదా..దేవా" అని పాడుకుంటూ వస్తున్నాడు. రాంనాథం గారు ఒక ఐదు రూపాయల బిళ్ళ అతని చేతిలో పెట్టారు.


*రైలు విజయనగరంలో ఆగింది. రామనాథం గారు ఓమాటు రైలు దిగారు. ఆ రోజు దినపత్రిక కొని, మళ్లీ రైలెక్కారు. పేపరు చదువుతుండగా వినబడింది.. "టికెట్ టికెట్" అని! తల త్రిప్పి చూశారు. ఎదురుగా రెండు మూడు వరసల ముందునించి టికెట్‌లు తనిఖీ చేస్తూ వస్తున్న అధికారి కనబడ్డాడు. రాంనాథం గారు లేచి నిల్చున్నారు. టికెట్ తీసుకుందామని తన లాల్చీ జేబులో చెయ్యిపెట్టారు. జేబు ఖాళీగా చేతికి తగిలింది!


*మాస్టారుగారికి దిక్కు తోచలేదు. "పర్సు ఏమైంది?! తన పర్సులోనే పెట్టుకున్నాడే, డబ్బులు టికెట్ కూడానూ?! పర్సు జేబులో లేదు!" రెండు జేబులూ తడుముకొని చూసుకున్నాడు. రెండూ ఖాళీనే! దేవుడా, ఏం చేసేది?.. టికెట్ లేదు; డబ్బులు లేవు. వెళ్లేది అమ్మాయి పెండ్లికి!.


*రామనాధం గారికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. టికెట్.. టికెట్..' శబ్దం ముందు ముందుకు వస్తోంది.


*'నాకు ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితిరాలేదు: ఈ వయస్సులో ఇంతమంది ముందు దోషిగా నిలబడతానే, ఏం చేసేది?" రామనాథం గారి మనసు పరిపరివిధాల పోతోంది.. "విజయనగరంలో దిగి పేపరు కొన్నాను. గాబరాగా పర్సు జేబులో పెట్టుకొని రైలెక్కేసాను.. బహుశా అప్పుడే అది బయట పడిపోయి ఉంటుంది. ఇప్పుడెలాగ?" రామనాధంగారి కళ్ళు మూసుకుపోయాయి.


*"టికెట్..టికెట్..." శబ్దం మరింత దగ్గరకు వచ్చింది.. తన ఎదురుగా ఉన్నవాళ్లని ప్రశ్నిస్తోంది. రామనాథం గారికి చెమటపడుతోంది.


*"ఇప్పుడు ఏం చేయాలి? చేతిలో నయాపైసా అయినా లేదు.. తెలిసిన వాళ్ళుకూడా ఎవరూ లేరు ఈ రైల్లో.." రాంనాథం గారు తలవంచుకుని కూర్చున్నారు. "టికెట్.. టికెట్.." శబ్దం తన పక్క వారిని ప్రశ్నిస్తోంది.......'పరీక్షలో‌ జవాబులు తెలియని ప్రశ్నలకు సమాధానాలు రాసే విద్యార్థిలాగా ఉంది రాంనాధం గారి పరిస్థితి. "జీవితంలో ప్రతివాడూ ఎల్లప్పుడూ విద్యార్థే......" తాను పిల్లలకు చెప్పిన మాటలు తనకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. "తనూ ఇప్పుడో 'అర్థే'.." రామనాధం గారు ముడుచుకు పోతున్నారు.


*"ఏమండీ.. మీ టికెట్ చూపిస్తారా?" ఆ గొంతు తననే ప్రశ్నిస్తోంది.. రాంనాథం గారు తటాలున లేచి నిల్చున్నారు. అతని వేపు చూసారు.. ఒక్క క్షణం నిశ్శబ్దం…


*ఏం చెప్పాలో పాలుపోలేదు..

"ఏమని చెప్పను?.. టికెట్ లేదనేదా?.. నన్ను జైల్లో పెట్టమనేదా?.."


*రైల్వే అధికారి ఏదో అంటున్నారు. రాంనాధం గారికి అది సగం సగమే వినబడుతున్నది.. "నమస్కారం మాస్టారూ, నేను మీ దగ్గర చదువుకున్న గోపాల్‌ని. గుర్తున్నానో లేదో.. నాకు మీరు చాలా సార్లు సాయం చేసారు. విజయనగరంలో రైలు ఎక్కబోతుంటే నాకు ఒక పర్సు దొరికింది. 'ఎవరిదా' అని చూస్తే దానిలో మీ ఫోటో ఉంది.. అక్కడినుండీ నేను మీ కోసమే వెతుక్కుంటూ వస్తున్నాను.


*ప్రస్తుతం రైల్వేలో టి.టి.యీ. గా పనిచేస్తున్నాను మాస్టారూ. ఇంతకాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది....ఇదిగోండి, మీ పర్సు తీసుకోండి.. ఇందులో టికెట్ కూడా ఉంది" అని పర్సు అందించి, రాంనాథం గారికి గౌరవంగా నమస్కరించాడు గోపాల్.


*రాంనాథం గారి సంతోషానికి అవధులు లేవు. తన పర్సు దొరకడం ఒక వంతు అయితే, తన విద్యార్థి ప్రయోజకుడై తన ముందు నిలబడి ఉండటం మరొకటి. రాంనాధం గారు ఆలోచనల్లో ఉండగానే గోపాల్ చెబుతున్నాడు.. "మీరు మాకు ఎన్నో నీతి శ్లోకాలు చెప్పారు, అందులో ఒకటి ఇప్పటికీ గుర్తుంది:


*యథా బీజాంకుర: సూక్ష్మ: ప్రయత్నేన అభిరక్షిత:।

ఫలప్రదో భవేత్ కాలే-తద్యల్లోకో సురక్షిత:॥


*విత్తనం‌ నుండి వచ్చిన మొలక చాలా చిన్నది. అయినా దానిని మనం నీరుపోసి జాగ్రత్తగా రక్షిస్తే, అది పెరిగి పెద్దదై, సరైన సమయంలో మనకు ఫలాలను అందిస్తుంది. ఈ లోకం కూడా అలాంటిదే. మనం తోటి వారికి చేసిన సాయం వృధా పోదు. ఏదో ఒకనాడు అది మనకు సహాయమై తిరిగి వస్తుంది.' అని మీరు ఎన్నోసార్లు చెప్పారు. మేము మీ దగ్గర పెరిగిన పూల మొక్కల లాంటి వాళ్లమే. నమస్కారం. నేను వెళ్ళొస్తాను, అని వెళ్లి పోయాడు.


*"పుస్తక జ్ఞానాన్ని, జీవిత పాఠాలు చెప్పిన గురువులు అందరికీ శుభ నమస్సులు"

                                               

            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

సేకరణ.

సత్యం వద ధర్మం చర*

 శ్లోకం:☝️

*సత్యం వద ధర్మం చర*

*స్వాధ్యాయా న్మా ప్రమదః*

*ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య*

*ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సీః*

*సత్యా న్న ప్రమదితవ్యం*

*ధర్మా న్న ప్రమదితవ్యం*

*కుశలా న్న ప్రమదితవ్యం*

*భూత్యై న ప్రమదితవ్యం*

*స్వాధ్యాయప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం*

*దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం*

    - తైత్తిరీయారణ్యకము


భావం: సత్యము పలుకుము, ధర్మము ననుష్ఠించుము. స్వాధ్యాయ విషయుములో ప్రమాదమును (ఏమరుపాటును) పొందకుము; అంటే అశ్రద్ధ వహించకుము. గురువునకు ప్రియమగునట్లు ధనమార్జించి యిచ్చిన పిమ్మట వంశము నిలుపుటకై సత్సంతానమును బడయుము.

సత్యము నేమరకుము.

ధర్మమార్గమునుండి వైదొలగకుము.

కుశలము నుండి, కల్యాణకర్మలనుండి, సమృద్ధినుండి, స్వాధ్యాయప్రవచనములనుండి ప్రమాదము నొందకుము.

దేవ పితృకర్మలను విడువకుము.