21, డిసెంబర్ 2022, బుధవారం

చదువులు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

     *🌷నేటి చదువులు🌷* 

తెలుగు పేపర్లు దిద్దాల్సివచ్చింది ఐదో తరగతి పిల్లలవి! 


అసలే మన ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తెలుగు సవ్యంగా  రాకూడద ఉన్ని కదా రూలు! కాబట్టి వచ్చీరాని తెలుగులో ముద్దుముద్దుగా రాసారు  పరీక్ష ! 

కరెక్షన్ ఒక ఎత్తయితే ,ఆనక పేరెంట్స్ వచ్చి మార్కుల కోసం తగువులాడటం మరీ రసవత్తర ఘట్టం ! 


ఇదీ ప్రశ్న : లంకాధిపతి రావణుని చంపినది ఎవరు? (3మార్కులు)


నా బోటి కుర్రాడు "భీముడు " అని వ్రాశాడు సమాధానం .

నే కొట్టేశా. మార్కులివ్వలేదు.


తరవాత ఆ బాబు వాళ్ల తల్లిదండ్రులు వచ్చి కనీసం రెండు మార్కులైన ఇవ్వాలి..attempt చేసాడు కదా అని వాదిస్తారు.


అసలెలా ఇస్తామండి? ఒక పదం సమాధానం ..అది తప్పు పూర్తిగా అని నేనంటే...


ఆవిడ జవాబు : 

రాముడు అనే మూడక్షరాల పదానికి 3 మార్కులైతే ,మా వాడు రాసింది భీముడు అంటే ఒకే అక్షరం తప్పు.


ము,డు రెండూ కరెక్టైనపుడు రెండక్షరాలకు రెండు మార్కులెందుకివ్వరు? చేసిన తప్పే కనిపిస్తోంది కానీ-రాసిన ఒప్పును ఒప్పుకోలేని మీరూ ఓ టీచరేనా ???😳😳😳 నేటి కాలం తల్లిదండ్రులు ఇలా కూడా ఉంటారు అనేందుకు ఓ చిన్న కథ.


😃🤣😊

కుమరేశన్ మామ మనల్ని కాలచక్రంలో

 జనవరి 8 1994, మధ్యాహ్నం 2:58


కుమరేశన్ మామ మనల్ని కాలచక్రంలో ఆరోజుకు తీసుకునివెళ్తున్నాడు.


“జనవరి 7 ఏకాదశి కావడంతో పరమాచార్య స్వామివారు పూర్ణ ఉపవాసం ఉన్నారు. కాని, మేము బలవంతం చేసి కొద్దిగా గంజి ఇచ్చాము. అప్పటికే కొద్ది కాలంగా మహాస్వామివారి ఆరోగ్యం క్షీణించడంతో అ రాత్రంతా స్వామివారికి డ్రిప్స్ ఇచ్చారు. స్వామి వారు డ్రిప్స్ పై ఉండడంతో రాత్రంతా వారి చెయ్యి పట్టుకునే ఉన్నాను. డాక్టర్ శ్రీధర్ మరియు భాస్కర్ కూడా అక్కడే ఉన్నారు.


మరుసటిరోజు ద్వాదశి, అనుషం(స్వామివారి జన్మ నక్షత్రం). ఉదయం మూడు గంటలకు లేచారు స్వామివారు. ఎన్నడూ లేని విధంగా బలంగా, పెద్ద స్వరంతో ఉన్నారు. అందరినీ పేరుపేరునా గుర్తిస్తున్నారు. ఆకలిగా ఉందని చెప్పడంతో కొద్దిగా గంజి ఇచ్చాము. మహాస్వామివారికి నమస్కరించడానికి జయేంద్ర స్వామి, బెంగళూరు హరి వచ్చారు. పూజ పూర్తయ్యిందా అని జయేంద్ర స్వామిని అడిగారు స్వామివారు. 


చెయ్యడానికి వెళ్తున్నానని బదులిచ్చారు జయేంద్ర స్వామివారు. పూజ చేస్తూ ఉండమని, ఆపవద్దని ఆదేశించారు. బెంగళూరు హరి వెండి పాదుకలను, పరమాచార్య స్వామివారి పూర్వాశ్రమ తల్లితండ్రుల చిత్రపటాన్ని తెచ్చాడు. శ్రీ చంద్ర పాదుకలను స్వామివారి పాదాలకు ఉంచి, పటాన్ని స్వామివారికి ఇచ్చాడు. కాని స్వామివారు దాన్ని గుర్తించలేదు. అప్పుడు నేను చదువ కళ్ళజోడుని తీసి మామూలు కళ్ళజోడు పెట్టుకోవడానికి సహాయం చేశాను. స్వామివారు చిత్రపటాన్ని చూసు దగ్గరగా పెట్టుకున్నారు.


తరువాత పాదుకల గురించి అడుగగా, స్వామివారి పాదాలకే ఉన్నాయని చెప్పాను. అప్పటిదాకా వదులుగా ఉన్న స్వామివారు పాదాలు, పాదుకలు కాళ్ళకు ఉన్నాయని తెలియగానే పాదాలను బిగించారు. ఎంత గట్టిగా బిగించారు అంటే, స్వామివారే వదిలేదాకా మేమెవ్వరమూ తీయడానికి కాలేదు.


బెంగళూరు హరి వెళ్ళవలసి ఉండడంతో పాదుకలను వదిలారు. పాదుకలను, చిత్రపటాన్ని హరికి ఇచ్చారు. తరువాత వీటిని ఎచ్చంగుడిలో(పరమాచార్య స్వామివారి తల్లిగారైన మహాలక్ష్మమ్మ గారి గ్రామం) ఉంచారు.


జయేంద్ర స్వామి పూజ పూర్తిచేసి పరమాచార్య స్వామి వద్దకు వచ్చారు. శంకర విజయేంద్ర స్వామితో కలిసి చెన్నైలో హిందూ మిషన్ సమావేశానికి వెళ్ళాల్సి ఉంది. స్వామివారు ఆరోగ్యంగా ఉండడంతో, సెలవు తీసుకుని ఇద్దరో వెళ్ళిపోయారు.


తరువాత మేము స్వామివారికి స్నానం చేయించి, భక్తుల దర్శనానికి వీలుగా ఈజీ చయిర్ లో కూర్చోబెట్టాము. ఆరోజు అనుషం కావడంతో, ప్రదోషం మామ, వారి భార్య, మెచేరి పట్టు శాస్త్రి వచ్చారు అనుషం ప్రసాదంతో. మహాస్వామి వారే తీర్థాన్ని తలపై చల్లుకుని, రక్షను నుదుటిపై ఉంచుకున్నారు. పట్టు శాస్త్రిని శంకర జయంతి ఏర్పాట్లు, మరికొన్ని విషయాలను అడిగి, వాళ్ళను ఆశీర్వదించి పంపారు. వారు సంతోషంతో మఠం నుండి వెళ్ళిపోయారు.


ఆరోజు ద్వాదశి కావడంతో స్వామివారు మంచిగా ఆహారం స్వీకరించారు. నేను, శ్రీ కంఠన్ తయారుచేసిన వంటకాల్ని(పాయసం, బాదాం హల్వా, పచ్చి అరటి ఇడ్లి) ఒక్కొక్కటి అడిగి మరీ స్వీకరించారు. భిక్ష ముగించగానే, లఘుశంకకు వెళ్ళాలని చెప్పారు. మేము స్వామివారిని మోసుకునివెళ్ళడానికి సిద్ధమయ్యాము. వైతా మామ, అరక్కోణం బాలు స్వామివారి కాళ్ళు పట్టుకోగా, బాలు జబ్బ పట్టుకున్నారు. స్వామివారిని కూర్చోపెట్టబోతుండగా స్వామివారు కాలు విదిలించడంతో, ముగ్గురూ కింద పడిపోయారు.


అప్పుడే స్వామివారి ఆత్మ దేహం నుండి విడివడింది. డాక్టర్ భాస్కర్ స్వామివారిని పడుకోబెట్టమన్నారు. ఇతర వైద్యులు వచ్చి, స్వామివారిని పరీక్షించి, పరమాచార్య స్వామివారు సిద్ధి పొందినట్టు ధ్రువీకరించారు.

మేము తట్టుకోలేకపోయాము. కాని మమ్మల్ని ఏడవద్దని అందరూ వారించారు ఎందుకంటే స్వామివారు పరమేశ్వరులు కాబట్టి.


వార్త తెలిసిన వెంటనే జయేంద్ర స్వామి, విజయేంద్ర స్వామి వచ్చారు. జయేంద్ర స్వామి అస్సలు తట్టుకోలేకపోయారు. మహాస్వామి వారి పాదాలపై పడి ఏడ్చారు. వారిని సముదాయించడం ఎవరివల్లా కాలేదు. అందుకే దాదాపు అరగంట పాటు వారిని అలాగే స్వామి వారి వద్దనే వదిలేసాము. తరువాత విజయేంద్ర స్వామి వచ్చి వారిని స్థిమితపరచి వారి గదిలోనికి తీసుకునివెళ్ళారు.


పట్టు శాస్త్రి చెన్నై చేరుకోగానే, ఈ విషయాన్ని ఒక ఆటో డ్రైవరు తెలిపాడు. అప్పుడే స్వామివారిని దర్శించి ఉండడంతో వెంటనే ఆగ్రహోదగ్ధుడై అతణ్ణి కొట్టారు. కాని ఇంటికి వెళ్ళగానే, నిజం తెలిసింది. వెంటనే కుటుంబంతో సహా కాంచీపురానికి ప్రయాణమయ్యారు.


పరమాచార్య స్వామివారి చివరి దర్శనం కోసం ప్రజలు ఉప్పెనలా కాంచీపురానికి వచ్చారు. జాతి, కుల, మతాలకు అతీతంగా విచ్చేశారు.

శ్రీవారు పరమేశ్వరుడే అనడానికి నిదర్శనాలు అవసరం లేదు. ప్రదోషం, ద్వాదశి, అనుషం, కృష్ణపక్షం, ఉత్తరాయణ పుణ్యకాలంలో చివరి సంస్కారాలు జరిగాయి”


--- కుమరేశన్ మామ తమిళ ఇంటర్వ్యూ నుండి


https://youtu.be/Fn8sEIlsVo0


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శ్రీకృష్ణపరమాత్మబోధించినభగవద్గీత

 హరిః ఓమ్, హరిః ఓమ్.

🕉️  *మన తలరాత మార్చే గీత*శ్రీకృష్ణపరమాత్మబోధించినభగవద్గీత*దాని విశేషాలు*🕉️

                 ➖➖➖

♦️ *మన లోపల ఒకడు నిగూఢముగా ఉన్నాడు.... అసలైన వాడు.*♦️

▪️ *కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే  6 గురు  దొంగలు అడ్డుగా ఉన్నారు..*

 అవే *కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యo అనే 6 గురు  దొంగలు..!*

▪️ *ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా చాలా కష్టం..*

▪️ *ఆ ఇద్దరూ పెద్ద రౌడీలు. వాళ్ళే కామం, క్రోధం....ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటా రు అంటే - రజో గుణం అనే ఇంట్లో..*

▪️ *" కామ ఏష క్రోధ ఏష రజో*

  *గుణ సముద్భవహ "* 

▪️ *ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి ఉద్భవిస్తు న్నాయి అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు..*

▪️ *కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు*.

▪️ *ఈ దొంగలను పట్టుకోవాలి అంటే - రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు.. అయితే, ఈ రజో గుణం అనేది First floor....ఇంకా మనం First floor కు రాలేదు.....మనం Ground floor లో ఉన్నాం.*

▪️ *మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.*

▪️ *అంటే మనం తమో గుణంలో ఉన్నాం.*

▪️ *బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణలక్షణాలు ..... ఇలాంటి తమో గుణంలోనే మనలో చాలా మందిమి వుంటున్నాం..... అంటే,  ఇంకా Ground floor లోనే ఉన్నాం.*

▪️ *ఈ Ground floor నుండి పైకి వెళ్ళా లంటే చాలా కష్టం. అలాoటి ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు  దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది.*

♦️ *ఆ floor పేరు  ‘సత్వ గుణం..’*

 *ఈ floor చాలా పెద్దగా ఉంటుంది....హాయిగా ఉంటుంది......*

▪️ *ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది..*

▪️ *అయితే చిన్న సమస్య....... ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు. భయపడకండి*...... 

▪️ *వాడు...*

*మంచి దొంగ.....వాడు మీకు మంచి మాటలే చెబుతూ  ఉంటాడు . మీకు Third floor కు దారి చూపిస్తాడు...     ఆ floor పేరు శుద్ధ సాత్వికం.... ఇదే చివరిది..... ఇక్కడే మీకు  అఖండమైన వెలుగులో కలిసిపోయింది.... ఆ అఖండమైన వెలుగే 🕉️పరమాత్మ..🕉️*

▪️ *అది వెలుగులకు వెలుగు, మహావెలుగు.*

▪️ *చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక  Lift*   ఉంది.

♦️ *ఆ Lift పేరే "భగవద్గీత".*

▪️ *గీతను చదువుతూ ఉంటే:  తమో గుణం నుండి రజో గుణానికి-  రజో గుణం నుండి సత్వ గుణానికి- సత్వ గుణం నుండి విశుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి గుణ త్రయాతీత స్థితికి - ఆపైన శాశ్వతమైన స్థానానికీ చేరుకోవచ్చు.*

▪️  *అక్కడ చాలా ప్రకాశం గా వుంటుంది. అక్కడ సూర్యుడు, చంద్రుడు, అగ్నిని కూడామించిన వెలుగులు, చల్లదనం, వేడిమి వెద జల్లుతూ వుంటాయి*


♦️ *అక్కడకు చేరుకుంటే - ఆకలిబాధ , దప్పిక బాధలు, జన్మ భయం, వార్ధక్య భయం, రోగ భయం, మృత్యు భయం వుండవు*  *అంతా అభయమే*


🕉️ *అక్కడ కు చేరుకుంటే - మళ్ళీ గర్భస్త నరకం-  పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు.*.


🕉️ *అదే మన తలరాత మార్చేభగవద్గీత* 

                 ➖➖➖

▪️ఆ గీత పుట్టిన దేశం ఈ భారత్ దేశం.


♦️నా దేశం భగవద్గీత!,

నాదేశం అగ్ని పునీత సీత!,

 నా దేశం కరుణాంత రంగ!,

నా దేశం సంస్కార గంగ!.


హరిః ఓమ్.

అత్యద్భుతమైన శక్తి

 మానవజన్మ తరించడానికి - మహా మంత్రం.!!


తన్మేమనశ్శివసంకల్పమస్తు.!!


ఓం నమః శివాయ...


సాంబా... అని పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ...


నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే...

య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్ 


అనే మంత్రాన్ని ఉపదేశించారు. ఇది శివపురాణంలో కూడా  వస్తుంది. ఇది చాలా గొప్ప మంత్రం. నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే. నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది.


1) నమశ్శివాయ...


(శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం. శివభక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి.


 అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయువాలతో కూడిన  ఓంకారం సూక్ష్మప్రణవం.. న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాల శివమంత్రం స్ధూలప్రణవం.  పంచాక్షరీని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం.


2) సాంబాయ...


అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే  కావలసినవి అన్ని సమృద్ధిగా పొందవచ్చును.


3) శాంతాయ...


ఆయనని తలంచుకొంటే వచ్చేది శాంతం. జీవితానికి కావలసింది కూడా శాంతమే. "ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే" అని ఉపనిషత్తు చెప్పింది. అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.


4) పరమాత్మనే నమః...


చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే... అన్నిటిని కలిపి నాలుగు నామాలతో పొదిగిన మంత్రరాజం  ఈ శ్లోకం.


ఈ శ్లోకాన్ని అర్థానుసంధానంగా మననం చేసినవారు శివసాయుజ్యాన్ని పొందుతారు అని ఉపమన్యు  మహర్షి స్వయంగా చెప్పారు.!! స్వస్తి.!!