18, సెప్టెంబర్ 2024, బుధవారం

*శ్రీ శంకరాచార్య చరిత్రము 16


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 15 వ భాగము.*_ 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


*విజయ యాత్ర:&


వాదోపవాదములు చేసి శత్రువులను జయించమని ఈశ్వరుని ఆజ్ఞ. విష్ణుసన్నిభుడైన వ్యాసభగవానుని బోధ. ఇక జ్ఞాన యుద్ధమే తరువాయి.


ధర్మయుద్ధమైన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణపరమాత్మ అండ పాండవులకు లభించినట్లుగానే శివకేశవుల కరుణ శ్రీశంకరాచార్యులకు లభ్యమైంది. అర్జునుని అక్షయ తూణీరాల వంటివి శంకరుని సూత్ర భాష్యాలు. పార్థునకు దివ్యరథాలు ప్రాప్తించి నట్లు శంకరునికి ఉపనిషత్తులు చాలు. పదునెనిమిది అక్షౌహిణుల సేనల పోరాటమది. పదునెనిమిది రోజులుగా సాగినది. పదునెనిమిది అధ్యాయాల భగవద్గీత శంకరుని హృదయంలో చేరింది. ద్రుపద పుత్రుడు ధృష్టద్యుమ్నుడు పాండవ సేనకు అధ్యక్షుడైనాడు.


ఇక్కడ 'స్వయం మంత్రీ స్వయం రాజా' అన్నట్లుగా శ్రీశంకరుడే అన్నీ నిర్వహిస్తాడు. అర్జునునకు తోడుగా నలుగురు సోదరులు ఉండగా ఇక్కడ దిగ్గజాల లాంటి పద్మ పాదాది శిష్యప్రకాండు లున్నారు. పాండవుల పక్షాన ధర్మము ఉన్నట్లే శంకరుని పక్షాన ధర్మముతో కూడిన ఆత్మవిశ్వాస శక్తి ప్రబలంగా ఉన్నాయి.


పాంచజన్యాన్ని మధు సూదనుడు, దేవ దత్తాన్ని విజయుడు పూరించి నట్లు ఒక సుముహూర్తాన శ్రీశంకరాచార్యుడు తత్త్వ శంఖారవం చేశారు. ఆ శంఖా రావము కాశీలోనే కాదు యావద్భారత దేశములోని ధర్మ శత్రువుల గుండెలు దద్దరిల్లేలా వినిపిం చింది. విన్న యతులు, యోగులు, ముముక్షువులు, సాధుజనులు కర్ణానందంగా విన్నారు. ఆ అవతార మూర్తి రాకకై చంద్రునికి సముద్రునిలా ఎదురు చూస్తు న్నారు. గంగాస్తవాలు చేసికొంటూ, గంగాస్మర ణలతో తనకు దగ్గరలోనే మెలగు చున్న శంకరసేనను చూచి గంగ ఉత్తుంగ తరంగాలతో ఉప్పొంగి పోతోంది. హరిహరులకు భేదము లేదని ఆచార్యులవారు బోధించేవారు. శంకరాచార్యుని వైష్ణవులు సాక్షాద్విష్ణువుగాను, శైవులు సాక్షాత్తు శివునిగాను భావించి నమస్కరించేవారు. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అంబిక అనే పంచాయతనాన్ని పూజించమని ఆదేశించేవారు. అందు ఎవరికి ఏది అభిమతమో దానిని ప్రధానంగా ఎంచి అర్చించు కొమ్మన్నారు. ఆనాడు శంకరుని వాక్కు వేదవాక్కు, శంకరాచార్యుల బోధాసుధారసం హృదయాంత రాళాలలో స్థిరీకరించని వారు లేరు. ఎండ మిక్కుటంగా ఉన్నపుడు చెట్లనీడల నాశ్రయించి విశ్రమించేవారు. సూర్యుడస్త మించు వరకు ప్రయాణము సాగిస్తూ సంధ్యను ఉపాసిస్తూ, రాత్రి వేళల గంగాతీరమందే ఉండి నిద్రించువరకు ధర్మ ప్రవచనాలతో కాలక్షేపం చేసేవారు.సర్వభూతాలు ఆ వైదిక వాక్కులకు పరవశ మయ్యేవి. దారిలో ఆచార్యుల బోధలు విన్నవారు ఈ శిష్యపరి వారంలో చేరి వీరివెంట వచ్చేవారు. శంకరపరివారం అలా దినదినాభివృద్ధి చెందింది. వారు వెళ్ళే దారిలో చరణాద్రి, తరువాత వింధ్యాద్రి కనిపించాయి. ఆచార్యుల వారు శిష్యులకు చెప్పారు వింధ్యాద్రి కథ. అగస్త్యుడు ఎలా ఆ నగాన్ని అణచి వుంచాడో.


*ప్రయాగ మహిమ:*


ప్రజాపతి బ్రహ్మ యాగాలనేకం చేసిన చోటు అవడం చేత దానికి ప్రయాగ అనే సార్థకనామం ఏర్పడింది. 'ప్రజాపతి అగ్ని వేది' అని కూడా దానికి నామాంతరం ఉన్నది. ఏ అంత రాయం లేకుండా అక్కడ నిరంతరం అగ్నికుండాలు వెలుగు తుండేవి. నూరు యాగాల ఫలితాన్ని మించిన ఫలం ప్రయాగలో నివసించినవారికి లభిస్తుంది. ఈ రహస్యం తెలిసిన మునులు మున్నగు వారెందరో అక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటారు. చతుర్వేదాధ్యయనం, రాజసూయ యాగం, నిత్యసత్య వ్రతం ఆచరించిన ఫలం ప్రయాగ తీర్థాన్ని దర్శించి సేవిస్తే వస్తుంది. భరతునికి భరద్వాజ మహర్షి విందు చేసినది ఈచోటనే. శ్రీరామ చంద్రుడు తన పాదధూళితో పావనం చేసిన భరద్వాజ ఆశ్రమం ఉన్నచోటు ఇదే. బహ్మ చతుర్వేదాలనూ వెలువరించినది ఇచ్చోటనే. అట్టి పరమ పవిత్ర మైన ప్రయాగను శంకరా చార్యుడు శిష్యగణం తో దర్శించుకొన్నాడు.


*అక్షయ వట వృక్షము* :


కల్పాంతంలో సకలమూ నశించగా శ్రీమహావిష్ణుని దయచేత

మార్కండేయమహర్షి మాత్రం సజీవుడై ఉంటాడు. అలా ఉండడానికి ఆశ్రయం ఇచ్చి నశ్వరం కానిది ఆ మహావట వృక్షం. ఆ వటవిటపి కథ అపూర్వం.


మొగలాయిల ప్రభుత్వకాలంలో హైందవ మతాన్ని కూల ద్రోసి వారి మతాన్ని మాత్రమే భారతదేశంలో నిల బెట్టడానికి వారు చేసిన యత్నాలు ఇంతా అంతా కాదు. అగ్బరు పాలనలో జరిగిందిది. ఈ వటవృక్ష మహిమ విని తమ మత వ్యాప్తికి పెద్ద అంత రాయంగా ఇది ఉందనుకొన్నారు. "అగ్బరు ది గ్రేట్!" అనే బిరుదు అంటించారు అగ్బరు కు పాశ్చాత్య చారిత్రకులు. సర్వమత సహనం కల వాడన్న పొల్లు గుణం కూడా ఆ మహావ్యక్తికి ఆపాదించారు. ఆయన చేసిన మతసహన మహాకార్యం ఏమిటి? ఆ వృక్షం ఆర్ష మతానికి ఆలంబనం గా ఉందన్న భావనతో దాని కొమ్మలు నరికించి మ్రోడుగా చేశాడు! మర్రి చావలేదు సరిగదా సహస్రముఖాలుగా చిగిర్చి ఇతోధిక ప్రాబల్యం సంతరించు కొంది. 


అగ్బరు గతించినా ఆతురుష్కుల ‘మత అసహనగుణం’ మాత్రం అంతరించ లేదు! తండ్రికి పట్టిన పిచ్చి వదలని జహంగీరు చెట్టు మొదల్నే నరికించాడు ఔరా! మన మహా విటపి మాత్రం మరింత చైతన్య శోభతో విస్తరిల్లింది. పట్టు వదలని ఆ రాజు మరగకాచిన నూనెనుపోయించాడా తరువు మొదట్లో! అయినా చెక్కు చెదరక నేటికీ కోటలా ఉన్న ఆ చెట్టు అక్షయవృక్ష మనే సార్థకనామంతో విరాజిల్లు తోంది.


గంగా యమునా సరస్వతులు ప్రయాగ లో కలిసి త్రివేణీ సంగమమయ్యింది. ఈ తీర్థంలో స్నాన మాడిన వారికి పరమ కైవల్యపదం లభిస్తుంది. కోరికలతో స్నానమాడితే సఫలీ కృతులవు తారు. లక్షలాది జనాలు నిరంతరమూ వచ్చి ఆ ప్రయాగ గంగలో మునిగి అనంతమైన పుణ్యాలు మూట కట్టుకొని పోతుంటారు. 'కుంభమేలా’ జరిగేది ఇక్కడే. యాత్రికులు హిరణ్యాలు పెట్టి పితృతర్పణాలను అర్పిస్తారు. అమావాస్య నాటికి ప్రయాగ చేరుకొన్న శంకరబృందం త్రివేణీ సంగమ స్నానము ఆచరించారు.


,*కుష్ఠురోగి బాగుపడుట:*


శిష్యు డొకడు అక్షయ వటవృక్షాన్ని చూద్దా మని వెళ్ళాడు. అక్కడ ఒక కుష్ఠురోగి ఆత్మహత్యాప్రయత్నంలో ఉన్నాడు. కాళ్ళు, చేతులు, శరీరమంతా పుండ్లు పడి రక్తహీన మైన శరీరం తెల్లబడి చెప్పరాని బాధ పడుచున్నాడు. ఎందులకీ పాడు జన్మ అని విరక్తుడై ప్రాణత్యాగానికి సిద్ధ పడిన వానిని చూచి బ్రతికించాలన్న బీజాంకురం శిష్యుని హృదయంలో మొలకెత్తింది.


ఎలాగో గురువుగారి కడకు చేర్చాడా దీనుణ్ణి. శంకరాచార్యుని సన్నిధానంలో ఉన్న వారంతా కుష్ఠురోగిని చూచి దూరంగా తొలగి వెళ్ళారు. శంకరుడు ద్వంద్వా తీతుడు. సుఖము గలిగించే సార్థక నాముడు. దగ్గరకు రమ్మని పిలచాడు. ఏవేవో చికిత్సలు చేశాడు. ఆ చికిత్సల వలననో, శంకరుని అమృతహస్తమో, యోగ మహిమయో గాని ఆ రోగి పుండ్లు ఊడి మచ్చలు మటుమాయమై శరీరం కరివేరు పువ్వు రంగుతో వెలుగుతూ ఆతడు అనారోగ్యం వీడి తేజోవంతుడయ్యాడు. చూచిన వారందరు విభ్రాంతులయ్యారు. ఉదంకుడు అనే పేరు పెట్టి అతణ్ణి సంఘం లోనికి పంపించారు శంకరులు.


*కుమారిలభట్టు:*


గౌతమబుద్ధుడు అవతరించి మత ప్రచార మొనరించిన కొంత కాలానికి ఆయన శిష్యులు భిన్నవిధాలుగా శుష్క తర్కాలతో పలు రకముల పోకడలు పోయారు. కడకు దేవుడు లేడనీ, వేదాలనూ ఉపనిష త్తులనూ నిరసించటం ఆరంభించారు. ఆ విధంగా బౌద్ధమత స్వరూపం మారింది. జైనులు బౌద్ధమతాన్ని ఆదరించడంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లైంది. నేర్పూ, చురుకు దనంతో వారి భావాలను బహుళం గా ప్రచారం చేసి ఆ మతవ్యాప్తికి చాలా శ్రమపడ్డారు. బౌద్ధ గురువులు పాండిత్య ము కలవారు కావడంతో వారు భావించినవే సత్యంగా గ్రంథస్థం చేశారు. అదీ ఆ నాటి పరిస్థితి.


సుమారు 2575 సంవత్సరాల క్రిందటి మాట. మహానదీ తీరంలో జయ మంగళము అనే గ్రామం ఉండేది. అందులో చంద్రగుణ యజ్ఞేశ్వరులనే పుణ్యదంపతులకు కుమారిలభట్టు ఉదయించాడు. వేదాలు, శాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసిం చాడు. జైమిని మహర్షి అడుగు జాడలలో మెలగుతూ వేదవిహిత కర్మకాండ లను తానాచరిస్తూ ఇతరుల చేత చేయించుచుండేవాడు. బౌద్ధ జైన మతాలకు రాజాశ్రయం లభించ డంతో ఆ మతస్థులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వైదిక మతం ప్రజలలో ఆదరణను కోల్పోతూ ఉంది. ఇది సహించ లేక పోయాడు కుమారిలభట్టు. రాజాశ్రయం పొంది ఉన్న ఆ మతాలను వెడలగొట్టాలి. అందుకు ముందుగా ఆమతంలో ఏముందో కూలంకుషంగా తెలిసి కొనాలి. అందుకని కుమారిలభట్టు బౌధ్ధభిక్షు వేషం దాల్చి తక్షశిలలోని విశ్వ విద్యాలయంలో విద్యార్థిగా చేరాడు. అందరితోబాటు విద్య నభ్యసిస్తూ ఆ మతం లోని గుట్టుమట్టులు కనిపెట్ట గలిగాడు. వాళ్ళు చేసే వేద నిందలు దుర్భరం గా ఉన్నా కార్యసాధక దీక్షతో వాటిని అన్నిటిని భరించాడు. విద్యాభ్యాసం చివరికి వచ్చేసరికి సహ శిష్యులు ఇష్టాగోష్టిలో శ్రుతి స్మృతులను కర్మకాండలను దుయ్యబట్టుతున్నారు. ఘోరాతిఘోరంగా సాగుచున్న వారి మాటలకు సహించి మౌనంగా ఉండలేక పోయాడు. సహేతుకంగా వారి వాదనలు త్రోసిపుచ్చి వారి నోళ్ళు మూత పడేలా తెలియ జేసాడు. సహశిష్యులందరు కలిసి కుమారిలుని ద్రోహిగా నిశ్చయించి గురువులకు నివేదించారు. అది విన్న గురువు అట్టివాడుండకూడ దనుకొని నిద్రించే సమయంలో అతనిని మేడపై నుండి క్రిందకు పడద్రోయ’ మని ఆదేశించాడు. చూచారా! 'అహింస’ కు పెద్ద పీటవేసిన మతస్థాపకుని శిష్యపరంపర! గురువు చెప్పినంత పనీ శిష్యులు చేశారు. అలా పడుతున్న కుమారిలభట్టుకు స్పృహ వచ్చి 'వేదములే మహత్తు కలవైనచో నాకెట్టి అపాయము రాకుండు గాక' అని తనకున్న నమ్మకాన్ని ఒడ్డుకొన్నాడు. దూదిలో పడ్డట్టు పడినా చావు తప్పి ఒక కన్ను పోయింది. దానితో అక్కడి నుండి తప్పించుకొనాలని నిశ్చయించాడు. నూలు పోగుతో బిగించు కొన్న తన కంకణాన్ని ఈ మారు ఉక్కుతీగతో బిగించాడు. అమరావతీ పట్టణం చేరుకొని భట్టపాదుడు అనే మారుపేరు పెట్టుకొన్నాడు.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*15 వ భాగముసమాప్తము.* 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


*శ్రీ శంకరాచార్య చరిత్రము 16 వ భాగము*_ 

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️


*అమరావతిలో కుమారిలభట్టు:*


అమరావతీ పట్టణాన్ని అప్పుడు సుధన్వుడు అనే మహారాజు పరి

పాలిస్తున్నాడు. అతడు ధర్మిష్ఠి, సజ్జనసమ్మ తుడు. భట్టపాదుడన్న పేరుతో రాజ దర్శనం కోసం వేచి ఉన్నాడు కుమారిలభట్టు. మాసిన బట్టలతోఉన్నా అతని ముఖం బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశి స్తోంది. రాజు వెంటనే స్వాగతం పలికాడు. భట్టపాదుడు రాజును వేదోక్తంగా ఆశీర్వదిం చాడు. ఆ రాజు కొలువులో చార్వాకులు చర్చలు చేస్తుంటారు. భట్ట పాదుడు వారితో వాదించి శాస్త్రాధారా లను ఎత్తి చూపుతూ వేద మత ప్రామాణ్యాన్ని నిరూపించాడు. బౌద్ధు లకూ వేదాలు సరి పడవు. కుమారిల భట్టు రాజాస్థాన చర్చలలో పాల్గొని సభకు ఒక విలువ తెచ్చాడు.అది గమనించినా రాజు ఏ పక్షమూ చేరకుండా మౌనం వహించేవాడు.


సుధన్వుని రాణి పూర్వాచార పరాయణురాలు. దైవభక్తితో ఉండే ఆమెకు మహారాజు నాస్తికు డగుతాడేమో నన్న భయం ఉంది. భర్తతో మాటాడగా మహారాజు 'నాస్తిక్యాని దే పైచేయిగా ఉంది కాబట్టి నే నేమీ చేయలేను' అని చెప్పాడు. ఈ రహస్యం తెలిసికొన్న భట్ట పాదుడు పట్టపుదేవిని ఆశ్రయించాడు. భట్ట పాదుని మహానుభావత్వం మీద సుముఖం గా ఉంది మహారాణి. రాజసభలో మతాలను గురించి కఠోర పరీక్ష పెట్టేటట్లుగా సుధన్వుని ఒప్పించమని వేడు కొన్నాడు భట్టపాదుడు. రాజు అంగీకరించి మరునాటి సభలో మతపరీక్ష జరగాలని ప్రకటించాడు. 


భట్టపాదుడు లేచి “మహారాజా! ఎవరైతే పర్వత శిఖరాగ్రం నుండి క్రిందబడి బ్రతుకుతారో వారి మతమే శ్రేష్ఠమని ప్రభువులు నిర్ణయిం చాలి" అని కోరాడు. ముందుగా భట్టపాదుణ్ణి దింపు దామన్న భావంతో చార్వాకులు ఒప్పుకొన్నారు ఆ పరీక్షకు. ఈ సంగతి తెలిసిన మహారాణి భట్టపాదుని పిలిపించి అతనితో ఇలా అంది. "మహాశయా! ఏమిటీ ఘోరపరీక్ష? శాస్త్రాలఆధారములు చాలవా? యుక్తియుక్తమైన వాదనలతో వేదముల ఆధిక్యాన్ని నిరూపించ వచ్చు గదా! తొందర పడకండి భట్టూ!” అనిప్రార్థించింది. దానికి సమాధానంగా “అమ్మా! సకల శాస్త్రాలు వేదము అభ్యసించిన పిమ్మట జైన మతం లోని రహస్యాలను క్షుణ్ణంగా తెలిసి కొన్నాను. వేదములు పురుషులు సృష్టించినవి కావు. పరాత్పరుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవి. వాటికీ భగవంతు నకూ అభేదము. ఈ విషయాలు నిరూపించా లంటే మాటలతో అయ్యేటట్లు లేదు. మాటకుమాట, యుక్తికి యుక్తి కలిగి తెలివి గల వాళ్ళు ఆ శుష్క పద్ధతులకే తల ఒగ్గు తారు. అందు చేత నాకు ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణము కన్న వేరుగతి కనిపించడం లేదు. తల్లీ! పరాత్పరుడు సత్య రూపుడు. ఆ సత్యాన్ని నమ్మిన నాకు భయ మేల?” అని బదులు పలికాడు.


మరునాడు పరీక్ష. పరీక్షకు మొదటి అవకాశం తాను తీసు కొంటానని అభిప్రాయం వెలిబుచ్చాడు భట్ట పాదుడు. చార్వాకులకు అది ఆనందదాయక మైంది. దీనితో తమ కొక పీడ విరగడ అవు తుందనుకొన్నారు జైనులు, బౌద్ధులు, చార్వాకులు! భట్టపాదుడు ఒక ఎత్తైన పెద్ద పర్వతం ఎక్కి అమాంతం క్రిందికి దూకివేసాడు. చెక్కు చెదరకుండా నిక్షేపంగా ఉన్న భట్టపాదుని చూచి ఆ క్షణంలోనే జయజయ ధ్వానాలతో ఆయనకు నీరాజనాలు సమర్పించారు. భట్ట పాదునికి మహారాజ సభలో అగ్రస్థానంలో వేదఘోషల మధ్య సత్కారం చేశారు. సుధన్వ మహారాజు వేదమతమే సర్వ శ్రేష్ఠమనీ,సర్వోన్నతమనీ ప్రకటించాడు. చార్వాకులు అంతటితో వదలి పెట్టలేదు. ఇంద్రజాలం, మంత్ర తంత్ర విద్యలతో భట్టపాదుడు మనల్ని మభ్యపెడుతున్నాడు అన్న వాదనలను లేవదీశారు. రాజు ఆ వాదనలను అంగీక రించ లేదు. అయినా మరొక పరీక్ష పెడదా మని నిర్ణయించాడు. మూతి గట్టిగా బిగించిన ఒక భాండాన్ని తెప్పించి 'ఈ భాండంలో ఏముందో” రహస్యంగా పత్రాలపై లిఖించండి. సరిగా చెప్పగల వారి మతమే గొప్పదని నిర్ణయిస్తాము తక్కిన వారికి మరణ శిక్ష.' అని ప్రకటించాడు. చార్వాకులకు అది ఒక గడ్డు సమస్యగా ఉండి వ్యవధి కోరారు. రాత్రంతా కలిసిఒకచోట మీన మేషాలు లెక్కలు కట్టారు. భట్టపాదుడు కుత్తుక బంటి నీటిలో నిలబడి రాత్రంతా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేశాడు. తెల్లవారింది. రాజ్యసభ కిటకిట లాడుతుండగా రాజు పత్రాలు తెమ్మన్నాడు. భాండం లోపల పాము ఉందని చార్వాకులు వ్రాసి ఇచ్చారు.


భట్టపాదుడు అందు శేషశాయి ఉన్నాడు అని వ్రాశాడు. ఇంతలో ‘భట్టపాదునిదేసరియైన ది' అన్న ఆకాశవాణి వినిపించింది. సందేహ నివృత్తి కొరకు భాండము తెరచి చూచారు. రాజు ఆశ్చర్యచకితుడై నాడు. శేషశాయియే కన్పడ్డాడు. నిజానికి రాజు లోన పెట్టినది పామునే. చార్వాకులు ఈ రహస్యాన్ని ఎవరి ద్వారానో సేకరించి ఉంటారు. ఈ పరీక్షలో కూడ భట్టపాదుడే నిర్ద్వందంగా నెగ్గినట్లు ప్రకటించి నాటి నుండి వేదాలే ఆదరణీయాలు అన్న రాజాజ్ఞ వెలువడింది.


అప్పుడు జైన బౌద్ధమతవాదులు రాజుతో ఇలా విన్నవిం చారు: “రాజా! ఇన్నాళ్ళూ ప్రత్యక్ష ప్రమాణం కల వేద మతాన్ని దూషించి మహాపాతకం చేశాము. అవతార పురుషుడైన ఈ మహాత్మునితో పోటీపడ్డాము. మేము శిక్షార్హులం. శిక్ష త్వరలో అమలు చెయ్యండి" అని వేడుకొన్నారు. వారు అంతా కూడి ఇరువది ఒక్కరు. వరుసగా నిలబడి ఉన్నారు. ఖడ్గం పుచ్చుకొని శిరచ్ఛేదం చేద్దామని వధకారుడు సిద్ధమవుతున్నాడు. ఇంతలో అటు నుండి నరకమని కేక విన బడింది.


సరేనని ఆ పని చేస్తుంటే చివర నున్నవాడు అమర సింహడు తాను భట్టపాదునితో మాట్లాడ గోరాడు. ఆ వార్త విన్న మహారాజు భట్టపాదుని తోడ్కొని వచ్చాడు. వారికి నమస్కరించి అమర సింహుడు తన కోరికను ఈ విధంగా విన్నవించాడు: "స్వామీ! లోకోపకార దృష్ట్యా ఒక ఉద్గ్రంధా న్ని రచిస్తున్నాను. అది పూర్తి కావచ్చింది. అది సంస్కృత భాష అధ్యయనానికి మకుటాయ మాన మైనది. నా గ్రంథం పూర్తి అయ్యే వరకు నేను బ్రదికి ఉండడం అవసరం అనిపించి ఈ నా ప్రార్థన మన్నిస్తారని వేడుకొంటున్నాను. ఇది జీవితాశతో కోరు కొంటున్నది కాదు”. తరువాత తన గ్రంథము లోని కొన్ని శ్లోకాలనువినిపించాడు.

వెంటనే భట్టపాదుడు అది అత్యంత విశిష్టమైన గ్రంథము. అట్టి గ్రంథ రచయితను లేకుండా చేసి లోకానికి లోటు కలిగించ కూడదని చెబుతాడు. వధ మానిపించాడు. ఆ గ్రంథమే ‘అమర కోశము' అనే పేరుతో ప్రఖ్యాతి గాంచినది.


*తుషానల ప్రవేశము*:


'కర్మాచరణము కన్న మానవునకు కావలసినది వేరొండు లేదనే దృఢసంకల్పంతో చేసిన కృషిలో సఫలీకృతుడనయ్యాను. ఈ యత్నంలో కపటవేషం ధరించి గురుద్రోహం చేశాను. ఈ పాపానికి నిష్కతిగా నాకు నేనే శిక్ష విధించు కోవాలి' అని నిశ్చయించుకొన్నాడు కుమారిలభట్టు! ఊకను రాశిగా పోయించి అందులో తాను పరుండి నిప్పును తానే ముట్టించు కొన్నాడు. ఇలా చేస్తున్నాడన్న వార్త తృటిలో దేశ మంతా వ్యాపించి శంకరాచార్యుడు కుమారిల భట్టును దర్శించడానికి బయలు దేరాడు.


"కుమారిలా! ఏమిటీ ఘోరము? నీవు అపరాధాలు చేసే వాడవా? ఎందుకీ క్రూర కార్యం చేపట్టావు?” అని శంకరుడు అడుగగా "శంకరానందస్వామీ! మీరు ఇచ్చటికి వచ్చి నాకు తమ దర్శన భాగ్యం కల్పించారు. ధన్యుణ్ణి. నేను రెండు అపరాధములు చేసిన వాడను. ఒకటి శిష్యరికం కపటంగా చేసి ఆ గురువు మతాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొన్న గురుద్రోహిని. రెండవది ఆత్మ తత్త్వాన్ని మరుగుపరచి కర్మ వాదాన్ని ఒక్కటీ అమలు పరచిన వాడను. అందు వలన ఆత్మద్రోహం చేశాను. దీనికి శాస్త్రరీత్యా తుషానల ప్రవేశం చేసి సజీవ దహనమే ప్రాయశ్చిత్తము” అని వినయంగా సమాధాన మిచ్చాడు కుమారిలభట్టు. 


అందుకు శంకరుడు "భట్టాచార్యా! నీవు కర్మమతాన్ని ఉద్ధరించు టకే కదా అవతార మెత్తితివి! నీవు చేయదలచినదంతా చేశావు. పవిత్రుడవు నీకు ప్రాయశ్చిత్త మెందుకు? లెమ్ము. ఈ శిక్ష మానుకొమ్ము!” అని ఆదరంగా పలికాడు శంకరుడు.


"అవతారమూర్తీ! నీకు తెలియనిదేమున్నది? సృష్టి స్థితి సంహారాలు నీ అధీనములు. శాస్త్రాన్ని కాదన జాలను. కాదంటే ప్రపంచమే నన్ను నిందిస్తుంది. ఇది మీకు తెలియనిది కాదు. నన్ను బ్రదికించడం తమ కొక లెక్కా? మీరు కేవలం శివావతారులు. మీకు జయం తప్పదు. మాహిష్మతీపురంలో మండనమిశ్రుడను పేరు కలవాడు ఉన్నాడు. అతడు నా శిష్యుడు. నా యంతటి వాడు. అతని భార్య అపర సరస్వతి. సూత్రభాష్యా నికి వార్తికాలు వ్రాయగల సమర్థుడు అతడే. ఆతనిని జయిస్తే మీ అవతార ఆశయం నెరవేరు తుంది. పరాత్పరా! అవసానకాలమందు అవతారమూర్తుల సన్నిధానం లభించడం నా పూర్వపుణ్యఫలం. నాకు ఆత్మ తత్త్వాన్ని ఉపదేశించి సర్వబంధ విముక్తుణ్ణి చేయండి" అని ప్రార్థించిన కుమారిలుని కోరిక మన్నించి తత్త్వోపదేశం చేయగా మరుక్షణం కుమారిలుడు బంధనా లను త్రెంచుకొని ముక్తుడై మౌనం దాల్చి కన్ను మూశాడు.తుషానలం ఒక్కసారి గుప్పుమన్నది. కుమారిలుడు కైవల్యం చేరుకొన్నాడు.


*ప్రభాకరాచార్యుడు:*

ప్రయాగ కెదురుగా గంగానదికవ్వల ఒడ్డున ఉన్నది ప్రతిష్ఠాన పురం. ఒకప్పుడు చంద్రవంశపు రాజులు దాన్ని రాజధానిగా చేసికొని పరిపాలించే వారు. ఒకప్పుడు అది దగ్ధం కాబడి నేటికీ శిథిలావస్థలో కాన వస్తుంది. కుమారిల భట్టు శిష్యులలో ఒకడు ప్రభాకరా చార్యుడు అనే వాడు ఆ పట్టణంలో నివసిస్తున్నాడు. అతడు మహాపండితుడు. కర్మ కాండ యందే నిష్ఠతో యజ్ఞ యాగాది క్రతువు లెన్నో చేసి దేవతలను తృప్తి పరచేవాడు. కర్మకాండలో నూతన పద్ధతులను ప్రవేశ పెట్టినవాడు. తనంతటి వాడు లేడన్న ధైర్యంతో ఎవ్వరినీ లెక్క చేసేవాడు కాడు. అందు చేతనే కాబోలు శంకరాచార్యుల ప్రశస్తి విన్నా శంకరుని దర్శనానికి వచ్చే యత్నం చేయలేదు. ప్రయాగలో ఉండగా శంకరునికి ఆయన సంగతి తెలిసి ప్రభాకరాచార్యుని చూడడానికి శంకరా చార్యులే బయలు దేరాడు. తన్నుచూడడా నికి వస్తున్నాడంటే తానే అధికుడననే భావన చోటు చేసు కుంది ప్రభాకరా చార్యుని మనస్సులో!


శంకరాచార్యులను కలిసిన తర్వాత ఆ మనోదౌర్బల్యం చెల్లా చెదరయ్యింది. శంకరుని తన మతంలో కలుపుకొనడానికి ఇది మంచి అదనని కలగన్న ప్రభాకరుడు శంకరుల వాక్పటిమకు తట్టుకోలేక దాసోహమన్నాడు. ఆ శ్రీ శంకరాచార్య వాఙ్మయ మహా సముద్రంలో ఎన్ని ఏఱులు అప్పటికే చేరాయో కదా! ఇదొక లెక్కా! 


ప్రభాకరాచార్యులకు ఒక మూగగా పుట్టిన కొడుకు ఉన్నాడు. అప్పటికి పదమూడేండ్ల వయస్సు. పేరు పృథివీ ధరుడు. అయిదేళ్ళ ప్రాయంనుండి మాటా మంతీ లేకుండా మౌనంగా ఉండి పోయాడు. అతనికి పైపెచ్చు ప్రాపంచిక దృష్టి లేదు. అమ్మా అని పిలిచి ఎరుగడు. వైద్యాలకు ఏ విధం గాను పిల్లవాడి పరిస్థితి మెఱుగుపడటం లేదు. శ్రీశంకరుల దగ్గరకు తీసికొని వచ్చి "స్వామీ! ఈ నా పుత్రుని మామూలు మనిషిగా మార్చగల సర్వశక్తి సంపన్నులు మీరు.


నా పైన దయతో మమ్ములను కాపాడ వలసినదనిప్రార్థించాడు ప్రభాకరాచార్యుడు.


శంకరాచార్యుడు ఆ బాలుని బాగుగా పరిశీలించారు. అంతర్గర్భితమైన గొప్ప భావాలు ఆ బాలునిలో ఉన్నట్లు తెలిసి కొన్నారు. తండ్రిది కర్మజీవనం. ఆ వయస్సులోనే బాలునికి జ్ఞానదృష్టి పెంపొంది తనతో మాటలాడి తన భావాలు వినేవారు ఎవ్వరూ లేరన్న నిర్ధారణతో చిన్నప్పటి నుండే మౌనం వహించినటుల తెలిసిపోయింది శంకరునికి. ప్రేమ, ఆదరము చూపి బాలుని యథా జీవన స్రవంతి లోనికి తేవచ్చు నని గ్రహించారు. బాలకుని తలపై చేయి వేసి “బాలకా! నీవు ఎవ్వడవు? నీకు ఎవరితో సంబంధ మున్నది? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు? నీ పేరేమిటి? నాప్రశ్నలకు సమాధాన మిచ్చి నన్ను సంతోష పెట్టుము” అని అడిగారు శంకరస్వామి.


*హస్తామలకుడు:*


శంకరాచార్యుల వారి ప్రశ్నలకు ఆ బాలకుడు ప్రబుద్ధుడై, వెనువెంటనే అపూర్వమైన వాగ్ధాటి తో ఈ క్రింది శ్లోకాలుగా సమాధానాలు చెప్పాడు:


*“నాహం మనుష్యో న చ రేవ యక్షా,*

*న బ్రాహ్మణో నైవచవైశ్య శూద్రాః*

*న బ్రహ్మచారీ న గృహీ వనస్థో,*

*భిక్షుర్న చాహం నిజబోధ రూపః|*

*మనశ్చక్షురాదేర్వియుక్తః స్వయంయో,* 

*మనశ్చక్షురాదే ర్మనశ్చక్షురాదిః*

*మనశ్చక్షురాదే రగమ్యస్వరూపః*

*సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా!॥*


అట్లు పృథివీధరుడు తన అనుభూతిని శంకరాచార్య స్వామికివిన్నవించు కొన్నాడు. విన్న అందరూ ఆ దృశ్యాన్ని చూచి విభ్రాంతులయ్యారు. శంకరుని మహిమకు జోహారులర్పించారు. ఆమలకం హస్తంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఆత్మ తత్త్వం పృథివీధరు నిలో వ్యక్తం కావడంతో అతనికి ‘హస్తామలకుడు' అని నామకరణంచేశారు శంకరాచార్యులు.


అప్పుడు శంకరుల వారు ప్రభాకరా చార్యునితో "ప్రభాకరా చార్యా! చూచావు కదా! ఈ నీ పుత్రుడు ఎట్టివాడో! ఈతడు సర్వజ్ఞుడు. ఇటు వంటి వాళ్ళు చూచే వాళ్ళకు పిచ్చివాళ్ళలా కనబడ తారు. ఇతడు నీ దగ్గఱ ఉండడం కల్ల. వీని చిత్తమేనాడో పరమేశ్వ రాయత్త మయింది. బాహ్య ప్రపంచంతో నిమిత్తం లేనివాడు. మాతో ఉండదగ్గవాడు. కావున నాతో పంపి వేయి” అని చెప్పగా అంగీకరించి సంతోషం తో కుమారుని శంకరులకప్పగించాడు. ఈ విధంగా పృధివీ ధరుడు హస్తామలకుడుగా శ్రీశంకరాచార్యుల శిష్యుడు అయ్యాడు.


*కాలడి శంకర కైలాస శంకర*

*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*16 వ భాగము సమాప్తము* 

🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦


_*శ్రీ శంకరాచార్య చరిత్రము 17 వ భాగము.*_

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


*మాహిష్మతీ పురము:*


మాహిష్మతీపురంలోని మండనమిశ్రుని కలవాలని ఆయత్త పడుచున్నారు శంకరా చార్యులు. అది చాలా దూరంలో ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకే తప్ప వేరు సాధనాలు లేనిపరిస్థితి. ఈనాడు యంత్రాలతో జరుగుతున్నవి ఆనాడు యోగశక్తులతో జరిగేవి. వ్యవధి చాలా తక్కువ గా ఉండడంతో యోగ బలంతో శంకరుడు శిష్యపరి వారంతో సహా గగనమార్గాన మాహిష్మ తీపురం సమీపించారు. దగ్గరలో నున్న ఒక చక్కని ఉద్యానవనంలో ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసికొన్నారు.


మాహిష్మతీపురం ఆ నాటి మహానగరాలలో ఒకటిగా పేరెన్నిక గన్నది. తారలకెగబ్రాకు సౌధరాజములు, బహు సుందరమైన దివ్య భవనాలు వారికి దర్శన మిచ్చాయి. బిందెలు చంకన పెట్టుకొని వచ్చే పరిచారికలు కనబడగా మండనమిశ్రుని నివాస గృహం జాడఅడిగారు శిష్యులు. ద్వారం దగ్గర 

పంజరాలు, అందులో రామచిలుకలు, గోరు వంకలు ఉంటాయి. అవి ఈవిధంగా చర్చిస్తుంటాయి:


“స్వతః ప్రమాణం, 

పరతః ప్రమాణం

ఫలప్రదం కర్మ

ఫల ప్రదోషః

జగధ్రువం స్యా 

జ్జగ దధ్రువం స్యాత్”


అని గీర్వాణభాషలో బదులు పలికారా భామలు! చిలుకలు, గోరువంకలు, పరిచారిక లు సంస్కృతంలోనే మాటలాడడం చూచిన వారంతా ఆశ్చర్య పడ్డారు ఆ మండన మిశ్రుడు ఇంక ఎంత మహా పండితుడో కదా అని. శిష్యులకు ఆ చిలుక పలుకులకు అర్థం తెలియక తికమకపడి గురువు గారిని అడిగారు. అపుడు శంకరులు “చిలుకలు మన మాడిన మాటలే విన్నంత మాత్రాన తిరిగి చెప్పుతాయి. వాటికి ఆ నేరుపు ఉండడం సృష్టివిచిత్రం. దేశంలోని పండితులకు అన్నీ సందేహాలే. మండనమిశ్రుని వద్దకు వచ్చి అడుగు తుంటారు. శాస్త్ర ఆధారాలతో వారి సందేహనివృత్తి చేస్తాడు మండనమిశ్ర పండితుడు. ఆ ప్రశ్నలూ జవాబులూ వినిన చిలుకలు వాటినే మననం చేసుకొంటూ ఉంటాయి. మనకు చెప్పిన మాటలకు అర్థం ఇది.


మీమాంసకులు స్వత: ప్రమాణము అందురు. జ్ఞానులు అపౌరుషే యాలు అంటారు. మిగిలిన వాళ్ళు పరత ప్రమాణములంటారు. అంటేపౌరుషేయాలని. తరువాతి దానికిది మూలం: ఎవడు చేసికొన్న కర్మననుస రించి దాని ఫలాన్ని వాడే పొందుతాడు. సత్కర్మ అయితే సత్ఫలితాన్నీ, దుష్కర్మ అయితే చెడ్డ ఫలితాన్ని పొందుచున్నాడు. దుఃఖ ప్రారబ్ధమయినా, సుఖ ప్రారబ్ధమయినా అనుభవించి తీరాలని శాస్త్రాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఇందులో పరాత్పరునికి సంబంధంలేదు. అతడు కర్మనూ ఇవ్వడు ఫలితాన్నీ ఇవ్వడు. కేవలం సాక్షీభూతుడు.


ఇంక మూడవ భాగం : జగత్తు నిత్యం కాదని వేదాంతులంటారు. త్రాడును చూచి పాము అనుకొంటారు. అది పాము కాదని తేలే వరకు అది పాము లాగే కనిపిస్తుంది. త్రాడు పాము కాదని తెలిసిన తర్వాత త్రాడు త్రాడుగనే ఉంటుంది. అలాగే జగత్తును తెలిసికొన్న తర్వాత జగత్తు అనిత్యమే అవుతుంది. ఇది ఇట్లుండగా విజ్ఞులు జగత్తును 'మిథ్య' అన్నారు. చూపులకు నిజంలా గోచరిస్తుంది. అట్టిది నిజం కానిది ఎట్లు? ఈ జగత్తు ఒకప్పుడు నాశం కావలసిందే. అందుకే దీనిని 'మిథ్య అన్నారు.” అని వివరంగా బోధించారు. 


పరిచారికలు చెప్పిన గుఱుతులు ఆధారంగా తెలిసికొన్నారు వారు మండనమిశ్రుని ఇల్లు. అది మహారాజ గృహంలాఉంది. శంకర బృందాన్ని చూచిన చిలుకలు కిలకిలా రావాలు చేశాయి.


మండనమిశ్రుని ఇంట ప్రవేశము:


సింహద్వారం గట్టిగా బిగించబడి ఉంది. అన్ని ద్వారాలు మూసివేయబడి ఉన్నాయి. ఇక మార్గాంతరం లేక శిష్యుల్ని అరుగు మీద కూర్చోబెట్టి శంకరుడు ఒక్కసారిగా గగనాని కెగిరి మండువా లోనుండి ఇంట్లోనికి ప్రవేశించాడు. శంకరుని సమదృష్టి పుట్టుకతో వచ్చినదే. ఇది నా ఇల్లు అది వారిది అన్న భేదం ఆయనకు ఎప్పుడూ లేదు. ఆ రోజు మండనమిశ్రుని తండ్రి తద్దినం. ఏ లోపమూ రాకూడదని గృహద్వారాలు అన్నీ మూసివైచాడు. భోక్తలు మరెవరో కాదు. విష్ణు సన్నిభుడైన వ్యాస మహర్షి. ఆయన శిష్యుడు జైమిని మహర్షి! 


మంత్రపూతంగా వారిద్దరినీ ఉచితాసనాలపై కూర్చుండ బెట్టి కాళ్ళు కడుగుతున్నాడు మండనమిశ్రుడు. 


ఆ సమయంలో శంకరా చార్యస్వామి ఆ ముగ్గురి ఎదుట ప్రత్యక్ష మయ్యాడు. కర్మ భ్రష్టులన్నా యతులన్నా మండనుడు మండి పడతాడు. వాళ్ళను చూస్తేనే సచేల స్నానం చేయాలన్న మతమా యనది. తలుపులన్నీ బిగించి ఉన్నా ఎలా చొరబడ్డాడీతడు? అని కోపంతో పరవళ్ళు త్రొక్కుచున్నాడు. ఆ నాడు బౌద్ధ భిక్షువుల ప్రాబల్యం మూలాన వేదమతస్థులలో సన్న్యసించే వారు తక్కువ. అందుచేత సన్న్యాసులకు ఆదరణ లేదు. తద్దినం పెట్టే టప్పుడు మౌనంగా ఉండాలన్న నియమాన్ని కూడా త్రోసిపుచ్చి మండనమిశ్రుడు అతి క్రుద్ధుడై చింత నిప్పుల లాంటి కళ్ళతో శంకరుని ఇలా అడిగాడు:


మండనుడు: కుతో ముండీ! (ఓ బోడీ! ఎక్కడ నుండి నీ రాక? ఎక్కడి వరకు ముండ నం చేసి కొన్నావు?)


శంకరుడు: ఆగళాన్ముండీ! ( కంఠం వఱకే ముండనం చేయించు కొన్నాను. కంఠం వరకే క్షౌరం చేయించుకొనే వాడను)


మండనుడు : పన్థస్తే పృచ్ఛతే మయా. (నీ మార్గము నాచే

అడుగబడుచున్నది)


శంకరుడు: కిమాహి పంథా: (నిన్ను గూర్చి మార్గ మేమనెను?)


మండనుడు : త్వ న్మాతా ముండే త్యాహ! (ముండ అని చెప్పింది మీ యమ్మ!)


శంకరుడు : తథైవహి! (బాగు! బాగు! నీవు మార్గం అడిగి నందుకు మీ అమ్మ ముండ అని నీకు తగినదేచెప్పింది!)


మండనుడు : సురా పీతా కిమ్? ( కల్లు త్రాగావా ఏమిటి? కల్లు పచ్చగా ఉంటుందా?)


శంకరుడు : నైవ శ్వేతాయత స్మర! (కల్లు పచ్చగా ఉండదు. తెల్లగ ఉంటుంది. మరచితివా! జ్ఞాపకం తెచ్చుకో!)


మండనుడు : త్వం తద్వర్ణం జానాసి కిం? (నీకు అలవాటు కనుక దాని వర్ణం బాగా తెలుసు కాబోలు!)


శంకరుడు : అహం వర్ణం, భవా న్రసం! (నాకు రంగు తెలిస్తే నీవు రుచి తెలిసిన వాడవు!)


మండనుడు : మత్తో జాత: కలం జాశీ విపరీతాని భాషతే! (కలంజ భక్షణంతో విపరీతంగా మాటాడు చుంటివే! నా వలన కుమారుడు కలంజాన్ని తిన్న వాడై విపరీతంగా మాట్లాడుచున్నావు)


శంకరుడు : సత్యం బ్రవీతి! పితృవ త్వత్తో జాత: కలంజ భుక్! (నా వలన కలంజం తినువాడు పుట్టెనని నిజమే పల్కావు!)


మండనుడు : కంథాం సహసి దుర్బుద్ధే! గర్దభే నాపి దుర్వహమ్! శిఖాయజ్ఞోపవీతాభ్యాం కస్తే భారో భవిష్యతి? (దుర్బుద్దీ! గాడిద మోయలేని బరువును ఎలా మోస్తున్నావు? జుట్టూ జందాలు బరువయ్యాయా?)


శంకరుడు : దుర్బుద్ధే! తవ పిత్రాపి దుర్భరామ్ కన్థం వహామి శిఖా యజ్ఞోపవీతాభ్యాం శ్రుతిర్భారో భవిష్యతి! (మీ తండ్రి మోయలేని బరువును మోస్తున్నాను. శిఖాయజ్ఞోప వీతాలు శ్రుతికి బరువు కాని నాకు కాదు. శ్రుతులు చదువ లేదా? విరాగులైన యతులకు అది ధర్మమే. నా ధర్మం గ్రహించే శక్తి నీకు లేకపోయింది!)


మండనుడు: వేదవిహితంగా పెళ్ళాడి పెళ్ళాన్ని పోషించలేక ఆమెను విడచి, శిష్యులంటూ ప్రోగు పెట్టుకొని వాళ్ళచేత మూటా ముల్లె మోయిస్తూ త్రిప్పుకొనే నీ బండారం బయటపడిందిలే! ఇదంతా వేషంగాక మరేమిటి?


శంకరుడు: బ్రహ్మచారివై గృహాన్ని విడిచి గురువు నాశ్రయించి సకల విద్యలు నేర్చి అందులో ఉన్న రహస్యాన్ని గ్రహించలేక స్త్రీలోలుడైన వానికి బ్రహ్మసాక్షాత్కారం పొందాలంటే ఏం తెలుస్తుంది?


మండనుడు: నవమాసాలూ మోసి కని పెంచే తల్లులనే దూషిస్తున్నావు. ఇంత కన్న దారుణముందా?


శంకరుడు : ఎంత తెలివి లేనివాడవోయి! నేనేమీ తల్లిని దూషించడం లేదు. ఆడుదాని యోని నుండి బయట పడ్డావా! ఆమె స్తన్యం కుడిచితివా! అలాటి ఆడు దాని కుచాలను పట్టి కులుకుతావా! పుట్టిన స్థానాన్నే కామిస్తావా! నీకు పశువులకు తేడా ఏమిటి?


మండనుడు: త్రేతాగ్నులను వదలితే వీరహత్యను పొందు చున్నాడని వేదాలే వచిస్తున్నవి. ఇది నీకు ధర్మమే?


శంకరుడు: భవబంధనాలను తెంచే వేదాంత తత్త్వాన్ని తెలిసికోని వాడు ఆత్మహత్య చేసికొన్నట్లే అని వేదంలోనే ఉన్నది. అన్నిటి కన్న మిన్న కదా ఆత్మ హత్య!


మండనుడు: తలుపులు బిగిస్తే లోనికి రాకూడదన్న జ్ఞానం ఉండ నక్కఱలేదా? దొంగ వలె దూరావు!


శంకరుడు : డేగ ఆహారాన్ని తన్నుకొని దూరంగా పోయి మ్రింగుతుంది. ఆ డేగ వలె యతుల కివ్వ దగ్గ దాన్ని ఇవ్వకుండా చేస్తున్నావు. కర్మాను ష్ఠానం చేయడం లేదా? గృహస్థాశ్రమంలో ఉండి ఎవరికీ కనిపించకుండా అతిథుల్నీ అభ్యాగ తుల్నీ పూజించడం మానుకొన్నావా?


మండనుడు : కర్మకాలే న సంభాష్య అహమ్! (పవిత్ర మైన శ్రాద్ధకర్మ సమయంలో ఒక మూర్ఖునితోసంభాషించ వలసి వచ్చిందే!)


శంకరుడు: పండితుడవే! కవివే! విద్య లేని వాని వలె, సామాన్యుని వలె మాటాడుచున్నావు. నీవు అనవలసినది 'కర్మకాలే న సంభాషాహమ్!’ యతి భంగంగా మాటలాడే తెలివి కలవాడివి!


మండనుడు: యతిభంగానికై వర్తించే వానికి యతిభంగ దోషం రాదులే!


శంకరుడు : యతిని అవమానింప వచ్చన్న మాట? 


మండనుడు : ఈ కలి లోనా సన్న్యాసం? దురాచారాలు, దుష్ట బుద్ధులుచెలరేగుతుంటే బ్రహ్మజ్ఞానమా? పలురకాల రుచుల కోసం కాక యోగివేషా లెందుకు?


శంకరుడు: అవునులే! కలికాలంకాక ఇలాంటి దురాచారాలు అగ్ని హెూత్రాలు ఎందుకు? విషయ వాంఛలు చంపుకోలేక వేసే వేషాలు కాక?


మండనుడు : జడుని వలె అయిపోయావు. అందుకే వేదాలకు వ్యతిరేకంగా పలుకు తున్నావు!


శంకరుడు: పాంచభౌతిక శరీరమే జడం. చిదాత్మ కాదు.


మండనుడు: దరిద్రుడా! పరమ పవిత్రమైన పురుష జన్మ ఎత్తి జడత్వాన్ని పొంది ?


శంకరుడు : యతిని పూజింపని వాడే దరిద్ర చక్రవర్తి!


మండనుడు: మాటలు మంచిగా రావా?


శంకరుడు : పాపం చేస్తే మాటలు పరుషములవుతాయి.


మండనుడు : దొంగవై దొంగలచే ఆశ్రయింప బడ్డావు.


శంకరుడు: అరిషడ్వర్గాలచే పీడింపబడ్డవాడే దొంగలచే ఆశ్రయింప బడిన వాడని తెలిసికోలేవా?


మండనుడు : నా పిలుపు లేకుండా నా ఇంట్లో ఏల ప్రవేశించావు?


ఆ వాద ప్రతివాదనలు ఇప్పుడప్పుడే ముగిసే లా లేవని ఎంచిన వ్యాసమహర్షి కలుగ జేసికొని మండన మిశ్రునితో ఇలా చెప్పాడు:


"మండనమిశ్రా! తనంతట తానుగా వచ్చిన యతిని ఆదరింపక ఏవేవో అసందర్భపు మాటలు చెబుతావెందుకు? వచ్చిన యతి సామాన్యుడుకాదు. విజ్ఞానఖని. స్వయంగా వచ్చిన అభ్యాగతుడు విష్ణువుతో సమానుడై యుండగా పూజించడం మాని దూషిస్తున్నావు. నీ యింటికి నిజంగానే విష్ణువు వచ్చి యున్నాడు. ఆలస్యం చేయక యతిని ఆనందంతో యథావిధి గా సత్కరించు.” వ్యాస మహర్షి ఆజ్ఞతో మండనమిశ్రుడు కోపం చంపుకొని శాంతం వహించాడు.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*17 వ అధ్యాయము సమాప్తము*

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 15

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 15 వ భాగము.*_ 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


*విజయ యాత్ర:&


వాదోపవాదములు చేసి శత్రువులను జయించమని ఈశ్వరుని ఆజ్ఞ. విష్ణుసన్నిభుడైన వ్యాసభగవానుని బోధ. ఇక జ్ఞాన యుద్ధమే తరువాయి.


ధర్మయుద్ధమైన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణపరమాత్మ అండ పాండవులకు లభించినట్లుగానే శివకేశవుల కరుణ శ్రీశంకరాచార్యులకు లభ్యమైంది. అర్జునుని అక్షయ తూణీరాల వంటివి శంకరుని సూత్ర భాష్యాలు. పార్థునకు దివ్యరథాలు ప్రాప్తించి నట్లు శంకరునికి ఉపనిషత్తులు చాలు. పదునెనిమిది అక్షౌహిణుల సేనల పోరాటమది. పదునెనిమిది రోజులుగా సాగినది. పదునెనిమిది అధ్యాయాల భగవద్గీత శంకరుని హృదయంలో చేరింది. ద్రుపద పుత్రుడు ధృష్టద్యుమ్నుడు పాండవ సేనకు అధ్యక్షుడైనాడు.


ఇక్కడ 'స్వయం మంత్రీ స్వయం రాజా' అన్నట్లుగా శ్రీశంకరుడే అన్నీ నిర్వహిస్తాడు. అర్జునునకు తోడుగా నలుగురు సోదరులు ఉండగా ఇక్కడ దిగ్గజాల లాంటి పద్మ పాదాది శిష్యప్రకాండు లున్నారు. పాండవుల పక్షాన ధర్మము ఉన్నట్లే శంకరుని పక్షాన ధర్మముతో కూడిన ఆత్మవిశ్వాస శక్తి ప్రబలంగా ఉన్నాయి.


పాంచజన్యాన్ని మధు సూదనుడు, దేవ దత్తాన్ని విజయుడు పూరించి నట్లు ఒక సుముహూర్తాన శ్రీశంకరాచార్యుడు తత్త్వ శంఖారవం చేశారు. ఆ శంఖా రావము కాశీలోనే కాదు యావద్భారత దేశములోని ధర్మ శత్రువుల గుండెలు దద్దరిల్లేలా వినిపిం చింది. విన్న యతులు, యోగులు, ముముక్షువులు, సాధుజనులు కర్ణానందంగా విన్నారు. ఆ అవతార మూర్తి రాకకై చంద్రునికి సముద్రునిలా ఎదురు చూస్తు న్నారు. గంగాస్తవాలు చేసికొంటూ, గంగాస్మర ణలతో తనకు దగ్గరలోనే మెలగు చున్న శంకరసేనను చూచి గంగ ఉత్తుంగ తరంగాలతో ఉప్పొంగి పోతోంది. హరిహరులకు భేదము లేదని ఆచార్యులవారు బోధించేవారు. శంకరాచార్యుని వైష్ణవులు సాక్షాద్విష్ణువుగాను, శైవులు సాక్షాత్తు శివునిగాను భావించి నమస్కరించేవారు. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అంబిక అనే పంచాయతనాన్ని పూజించమని ఆదేశించేవారు. అందు ఎవరికి ఏది అభిమతమో దానిని ప్రధానంగా ఎంచి అర్చించు కొమ్మన్నారు. ఆనాడు శంకరుని వాక్కు వేదవాక్కు, శంకరాచార్యుల బోధాసుధారసం హృదయాంత రాళాలలో స్థిరీకరించని వారు లేరు. ఎండ మిక్కుటంగా ఉన్నపుడు చెట్లనీడల నాశ్రయించి విశ్రమించేవారు. సూర్యుడస్త మించు వరకు ప్రయాణము సాగిస్తూ సంధ్యను ఉపాసిస్తూ, రాత్రి వేళల గంగాతీరమందే ఉండి నిద్రించువరకు ధర్మ ప్రవచనాలతో కాలక్షేపం చేసేవారు.సర్వభూతాలు ఆ వైదిక వాక్కులకు పరవశ మయ్యేవి. దారిలో ఆచార్యుల బోధలు విన్నవారు ఈ శిష్యపరి వారంలో చేరి వీరివెంట వచ్చేవారు. శంకరపరివారం అలా దినదినాభివృద్ధి చెందింది. వారు వెళ్ళే దారిలో చరణాద్రి, తరువాత వింధ్యాద్రి కనిపించాయి. ఆచార్యుల వారు శిష్యులకు చెప్పారు వింధ్యాద్రి కథ. అగస్త్యుడు ఎలా ఆ నగాన్ని అణచి వుంచాడో.


*ప్రయాగ మహిమ:*


ప్రజాపతి బ్రహ్మ యాగాలనేకం చేసిన చోటు అవడం చేత దానికి ప్రయాగ అనే సార్థకనామం ఏర్పడింది. 'ప్రజాపతి అగ్ని వేది' అని కూడా దానికి నామాంతరం ఉన్నది. ఏ అంత రాయం లేకుండా అక్కడ నిరంతరం అగ్నికుండాలు వెలుగు తుండేవి. నూరు యాగాల ఫలితాన్ని మించిన ఫలం ప్రయాగలో నివసించినవారికి లభిస్తుంది. ఈ రహస్యం తెలిసిన మునులు మున్నగు వారెందరో అక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటారు. చతుర్వేదాధ్యయనం, రాజసూయ యాగం, నిత్యసత్య వ్రతం ఆచరించిన ఫలం ప్రయాగ తీర్థాన్ని దర్శించి సేవిస్తే వస్తుంది. భరతునికి భరద్వాజ మహర్షి విందు చేసినది ఈచోటనే. శ్రీరామ చంద్రుడు తన పాదధూళితో పావనం చేసిన భరద్వాజ ఆశ్రమం ఉన్నచోటు ఇదే. బహ్మ చతుర్వేదాలనూ వెలువరించినది ఇచ్చోటనే. అట్టి పరమ పవిత్ర మైన ప్రయాగను శంకరా చార్యుడు శిష్యగణం తో దర్శించుకొన్నాడు.


*అక్షయ వట వృక్షము* :


కల్పాంతంలో సకలమూ నశించగా శ్రీమహావిష్ణుని దయచేత

మార్కండేయమహర్షి మాత్రం సజీవుడై ఉంటాడు. అలా ఉండడానికి ఆశ్రయం ఇచ్చి నశ్వరం కానిది ఆ మహావట వృక్షం. ఆ వటవిటపి కథ అపూర్వం.


మొగలాయిల ప్రభుత్వకాలంలో హైందవ మతాన్ని కూల ద్రోసి వారి మతాన్ని మాత్రమే భారతదేశంలో నిల బెట్టడానికి వారు చేసిన యత్నాలు ఇంతా అంతా కాదు. అగ్బరు పాలనలో జరిగిందిది. ఈ వటవృక్ష మహిమ విని తమ మత వ్యాప్తికి పెద్ద అంత రాయంగా ఇది ఉందనుకొన్నారు. "అగ్బరు ది గ్రేట్!" అనే బిరుదు అంటించారు అగ్బరు కు పాశ్చాత్య చారిత్రకులు. సర్వమత సహనం కల వాడన్న పొల్లు గుణం కూడా ఆ మహావ్యక్తికి ఆపాదించారు. ఆయన చేసిన మతసహన మహాకార్యం ఏమిటి? ఆ వృక్షం ఆర్ష మతానికి ఆలంబనం గా ఉందన్న భావనతో దాని కొమ్మలు నరికించి మ్రోడుగా చేశాడు! మర్రి చావలేదు సరిగదా సహస్రముఖాలుగా చిగిర్చి ఇతోధిక ప్రాబల్యం సంతరించు కొంది. 


అగ్బరు గతించినా ఆతురుష్కుల ‘మత అసహనగుణం’ మాత్రం అంతరించ లేదు! తండ్రికి పట్టిన పిచ్చి వదలని జహంగీరు చెట్టు మొదల్నే నరికించాడు ఔరా! మన మహా విటపి మాత్రం మరింత చైతన్య శోభతో విస్తరిల్లింది. పట్టు వదలని ఆ రాజు మరగకాచిన నూనెనుపోయించాడా తరువు మొదట్లో! అయినా చెక్కు చెదరక నేటికీ కోటలా ఉన్న ఆ చెట్టు అక్షయవృక్ష మనే సార్థకనామంతో విరాజిల్లు తోంది.


గంగా యమునా సరస్వతులు ప్రయాగ లో కలిసి త్రివేణీ సంగమమయ్యింది. ఈ తీర్థంలో స్నాన మాడిన వారికి పరమ కైవల్యపదం లభిస్తుంది. కోరికలతో స్నానమాడితే సఫలీ కృతులవు తారు. లక్షలాది జనాలు నిరంతరమూ వచ్చి ఆ ప్రయాగ గంగలో మునిగి అనంతమైన పుణ్యాలు మూట కట్టుకొని పోతుంటారు. 'కుంభమేలా’ జరిగేది ఇక్కడే. యాత్రికులు హిరణ్యాలు పెట్టి పితృతర్పణాలను అర్పిస్తారు. అమావాస్య నాటికి ప్రయాగ చేరుకొన్న శంకరబృందం త్రివేణీ సంగమ స్నానము ఆచరించారు.


,*కుష్ఠురోగి బాగుపడుట:*


శిష్యు డొకడు అక్షయ వటవృక్షాన్ని చూద్దా మని వెళ్ళాడు. అక్కడ ఒక కుష్ఠురోగి ఆత్మహత్యాప్రయత్నంలో ఉన్నాడు. కాళ్ళు, చేతులు, శరీరమంతా పుండ్లు పడి రక్తహీన మైన శరీరం తెల్లబడి చెప్పరాని బాధ పడుచున్నాడు. ఎందులకీ పాడు జన్మ అని విరక్తుడై ప్రాణత్యాగానికి సిద్ధ పడిన వానిని చూచి బ్రతికించాలన్న బీజాంకురం శిష్యుని హృదయంలో మొలకెత్తింది.


ఎలాగో గురువుగారి కడకు చేర్చాడా దీనుణ్ణి. శంకరాచార్యుని సన్నిధానంలో ఉన్న వారంతా కుష్ఠురోగిని చూచి దూరంగా తొలగి వెళ్ళారు. శంకరుడు ద్వంద్వా తీతుడు. సుఖము గలిగించే సార్థక నాముడు. దగ్గరకు రమ్మని పిలచాడు. ఏవేవో చికిత్సలు చేశాడు. ఆ చికిత్సల వలననో, శంకరుని అమృతహస్తమో, యోగ మహిమయో గాని ఆ రోగి పుండ్లు ఊడి మచ్చలు మటుమాయమై శరీరం కరివేరు పువ్వు రంగుతో వెలుగుతూ ఆతడు అనారోగ్యం వీడి తేజోవంతుడయ్యాడు. చూచిన వారందరు విభ్రాంతులయ్యారు. ఉదంకుడు అనే పేరు పెట్టి అతణ్ణి సంఘం లోనికి పంపించారు శంకరులు.


*కుమారిలభట్టు:*


గౌతమబుద్ధుడు అవతరించి మత ప్రచార మొనరించిన కొంత కాలానికి ఆయన శిష్యులు భిన్నవిధాలుగా శుష్క తర్కాలతో పలు రకముల పోకడలు పోయారు. కడకు దేవుడు లేడనీ, వేదాలనూ ఉపనిష త్తులనూ నిరసించటం ఆరంభించారు. ఆ విధంగా బౌద్ధమత స్వరూపం మారింది. జైనులు బౌద్ధమతాన్ని ఆదరించడంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లైంది. నేర్పూ, చురుకు దనంతో వారి భావాలను బహుళం గా ప్రచారం చేసి ఆ మతవ్యాప్తికి చాలా శ్రమపడ్డారు. బౌద్ధ గురువులు పాండిత్య ము కలవారు కావడంతో వారు భావించినవే సత్యంగా గ్రంథస్థం చేశారు. అదీ ఆ నాటి పరిస్థితి.


సుమారు 2575 సంవత్సరాల క్రిందటి మాట. మహానదీ తీరంలో జయ మంగళము అనే గ్రామం ఉండేది. అందులో చంద్రగుణ యజ్ఞేశ్వరులనే పుణ్యదంపతులకు కుమారిలభట్టు ఉదయించాడు. వేదాలు, శాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసిం చాడు. జైమిని మహర్షి అడుగు జాడలలో మెలగుతూ వేదవిహిత కర్మకాండ లను తానాచరిస్తూ ఇతరుల చేత చేయించుచుండేవాడు. బౌద్ధ జైన మతాలకు రాజాశ్రయం లభించ డంతో ఆ మతస్థులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వైదిక మతం ప్రజలలో ఆదరణను కోల్పోతూ ఉంది. ఇది సహించ లేక పోయాడు కుమారిలభట్టు. రాజాశ్రయం పొంది ఉన్న ఆ మతాలను వెడలగొట్టాలి. అందుకు ముందుగా ఆమతంలో ఏముందో కూలంకుషంగా తెలిసి కొనాలి. అందుకని కుమారిలభట్టు బౌధ్ధభిక్షు వేషం దాల్చి తక్షశిలలోని విశ్వ విద్యాలయంలో విద్యార్థిగా చేరాడు. అందరితోబాటు విద్య నభ్యసిస్తూ ఆ మతం లోని గుట్టుమట్టులు కనిపెట్ట గలిగాడు. వాళ్ళు చేసే వేద నిందలు దుర్భరం గా ఉన్నా కార్యసాధక దీక్షతో వాటిని అన్నిటిని భరించాడు. విద్యాభ్యాసం చివరికి వచ్చేసరికి సహ శిష్యులు ఇష్టాగోష్టిలో శ్రుతి స్మృతులను కర్మకాండలను దుయ్యబట్టుతున్నారు. ఘోరాతిఘోరంగా సాగుచున్న వారి మాటలకు సహించి మౌనంగా ఉండలేక పోయాడు. సహేతుకంగా వారి వాదనలు త్రోసిపుచ్చి వారి నోళ్ళు మూత పడేలా తెలియ జేసాడు. సహశిష్యులందరు కలిసి కుమారిలుని ద్రోహిగా నిశ్చయించి గురువులకు నివేదించారు. అది విన్న గురువు అట్టివాడుండకూడ దనుకొని నిద్రించే సమయంలో అతనిని మేడపై నుండి క్రిందకు పడద్రోయ’ మని ఆదేశించాడు. చూచారా! 'అహింస’ కు పెద్ద పీటవేసిన మతస్థాపకుని శిష్యపరంపర! గురువు చెప్పినంత పనీ శిష్యులు చేశారు. అలా పడుతున్న కుమారిలభట్టుకు స్పృహ వచ్చి 'వేదములే మహత్తు కలవైనచో నాకెట్టి అపాయము రాకుండు గాక' అని తనకున్న నమ్మకాన్ని ఒడ్డుకొన్నాడు. దూదిలో పడ్డట్టు పడినా చావు తప్పి ఒక కన్ను పోయింది. దానితో అక్కడి నుండి తప్పించుకొనాలని నిశ్చయించాడు. నూలు పోగుతో బిగించు కొన్న తన కంకణాన్ని ఈ మారు ఉక్కుతీగతో బిగించాడు. అమరావతీ పట్టణం చేరుకొని భట్టపాదుడు అనే మారుపేరు పెట్టుకొన్నాడు.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*15 వ భాగముసమాప్తము.* 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

19. " మహాదర్శనము

 19. " మహాదర్శనము --పంతొమ్మిదవ భాగము --గోవుల వెంబడి


19. పంతొమ్మిదవ భాగము--   గోవుల వెంబడి


          

         సూర్యోదయమైన కొంచము సేపటిలోపలే అగ్నిహోత్రమును ముగించుకొని , ఆలంబిని పాల కోసమని గోశాలకు వెళ్ళినది . ఆ రోజు కొడుకు ఎప్పటివలె అగ్ని మందిరములో కూర్చోక , తల్లితో పాటు గోశాలకు వెళ్ళినాడు . పాలు పిండుట అంతా ముగిసినాక , గోపాలకుడు ఆ గోవులన్నిటినీ మందగా బయటికి పంపించినాడు. పశువులు వెళ్ళునపుడు యాజ్ఞవల్క్యుడు ప్రతియొక్క ఆవునూ ముట్టి ముట్టి చూచినాడు . ఏదీ కూడా ఆ స్పర్శను వద్దనలేదు . వాటికి ఏమి సుఖము అనిపించినదో , ఒక్క ఘడియ నిలచి , ఆ స్పర్శను స్వీకరించి , ముందుకు సాగినవి . 


కుమారుడు తల్లి వీపునెక్కి ఊగుతూ , ’ అమ్మా, నాకు ఒక కోరిక కలిగింది ’ అన్నాడు .


" ఏమిటయ్యా ? " అన్నది తల్లి ఆప్యాయంగా . 


" ఈ ఆవులతో పాటూ నేను కూడా పోయివస్తాను " 


" పోవచ్చు , అయితే అవి తిరిగి వచ్చేది సాయంత్రానికే . అంతవరకూ నువ్వు ఏమీ తినకుండా ఉండుట సాధ్యమా ? " 


" ఆ గోపాలకుడు రోజూ ఏమి చేస్తాడు , మరి ? "


" అతడు ఇప్పుడు చద్దన్నము తిని , మధ్యాహ్నానికై బుట్ట తీసుకొని వెళతాడు " 


" నేను అయోధ్య ధౌమ్యుల శిష్యుడు చేసినట్లే చేస్తాను " 


" అంటే ఏమి చేస్తావూ ? " 


" వాడు ఆవుల పొదుగు దగ్గర నోరు పెట్టి పాలు తాగేవాడట ! " 


" సరిపోయింది , పుణ్యాత్మా , నువ్వు అలాగ చేసేవాడవే ! ! అయితే హోమధేనువు దగ్గర మాత్రము అట్లా చేయవద్దు " 


" ఎందుకమ్మా ?"


          " చూడు , హోమధేనువంటే దాని పాలను దినమూ హోమానికి ఉపయోగించవలెను . దానికి ముందే దూడ తాగవలెను . మరి అలాంటపుడు , పొదుగులోని పాలన్నీ నువ్వే తాగేస్తే , పాపం , దాని దూడ గతి ఏమి ? హోమానికి ఏమి చేసేది ? " 


         " అయితే నువ్వు ఆ ఎర్రావునే కదా , ఈ సారి హోమధేనువు చేసినది ? అది నాకు వద్దులే , తెల్లావు గంగ కానీ , నల్లావు కాళి కానీ అయితే ఫరవాలేదు కదా ? , అమ్మా , ఈ రోజు ఒకటైంది . " 


" ఏమిటీ ? " 


" ఆవులు మాట్లాడుతున్నాయి . నేను వాటిని ముట్టి ముట్టిఅడిగినాను , నేను కూడా ఈ దినము మీతో పాటే  కాచేందుకు రానా ? అని . ఒక్కొక్క ఆవు , ’ ఊ ’ అన్నాయి "


" ఊ అన్నాయి ! నీ తలకాయ . ఆవులు మాట్లాడినాయి అని ఇంకెవరి దగ్గరైనా అంటే నవ్వుతారు " 


" నిజంగా , అమ్మా ! అవి మాట్లాడినాయి .... అంటే నేను అబద్ధం చెప్పుతానా ? " 


         పిల్లవాడి ముఖము ఎర్రనైంది . అబద్ధము చెప్పుట మహాపాపము అన్న నమ్మకము ఉన్నవాడివలె , స్పష్టముగా మాట్లాడిన కొడుకును చూసి , ఇక వికోపమునకు వదలరాదు అని , " అలాగేమి ? నువ్వు అబద్ధము చెప్పేవాడివి కాదు , అయినా వారికి ఒకమాట చెప్పి వెళ్ళుట మంచిది . ఈ దినము వారు అధ్యాపనములో నున్నారు . సమయము సరిపోదు , రేపు వెళ్ళవచ్చులే , నీతో ఆవులు మాట్లాడుతున్నాయన్నావు కదా ? నాకు కూడా వినపడేటట్లు మాట్లాడతాయా ? " అన్నది . 


కొడుకు అది బహు సామాన్యమైన సంగతి అన్నట్లు , " దానికేమి , రేపు నీ హోమధేనువునే మాట్లాడిస్తాను . చూడు , నువ్వీ దినము వారితో మాట్లాడి రేపు నన్ను పంపించమ్మా ! " అని చేతులు పట్టుకొని అడిగినాడు . 


        కొడుకు ఆశపడుటను చూసి తల్లి , ’ దానికి ఇంతగా అడగవలెనా ? అలాగే కానీ ! అదేం పెద్ద పని ? ఇక వెళ్ళి నేను పెరుగు చిలకవలెను . నువ్వు వెళ్ళి నడిమింట్లో కూర్చో . అధ్యయనము అవుతున్నది " అని వెళ్ళిపోయినది . 


         ఆ సాయంత్రము అగ్నికార్యమైన వెంటనే కొడుకు తల్లికి సైగ చేసినాడు . " తండ్రిని అడిగినావా ? అనుమతి ఇచ్చినారా ? " అన్నది ఆ సైగ భావము . తల్లి , కొడుకు సైగ చూచి , విస్మయపడుతూ భర్తకు చెప్పింది , " మీ కొడుకు రేపు ఆవులతో పాటూ వెళ్లవలె నంట " 


" అంటే ? "


" వాడినే అడగండి . వివరమంతా చెపుతాడు . అయోధ్య ధౌమ్యుని శిష్యుడు చేసినట్లే ఆవు పాలు తాగి సాయంత్రానికి ఇంటికి వస్తాడంట" 


" ఏమిటయ్యా సంగతి ? " 


        " ఏమీ లేదు , ఈదినము నేను గోశాలలో ఉన్నపుడు ,’ నువ్వు కూడా మా జట్టులో ఎందుకు రాకూడదు ? " అని ఒక గొంతు వినిపించింది . చూస్తే , ఆవు మాట్లాడించి నట్లయింది . ’ నిజమా , చూద్దాము ’ అని ఒక్కొక్క ఆవునూ ముట్టీ నేను మీతో పాటూ వచ్చేదా అని అడిగినాను , ’ రావయ్యా ’ అన్నాయి . అందుకని వెళ్ళి రావాలి అనుకున్నాను " 


          ఆచార్యుడు గంభీరుడైనాడు . ఆవులు , కావాలన్నపుడు మౌనము గానే మాట్లాడగలవు అని అతడు వినియున్నాడు . అదీకాక , అతనికి ఒక యోగి దర్శనమై యుండినది . ఆతడు , జగత్తంతా శాంతముగా నిద్రకు జారిన పిమ్మట , ఈతనితో నిద్రలోనే సంభాషణ చేసినాడు . ఆతడు మాట్లాడినది ఇతడికి బాగా వినిపిస్తుంది . ’ ఈతడు దానికి తన మనస్సులో ఇచ్చిన ఉత్తరము అతనికి వినిపించును . ఇప్పుడు మనము కర్మేంద్రియముతో ఈ వ్యాపారము జరుపుతున్నాము , అలాగే కర్మేంద్రియము తో కాక, జ్ఞానేంద్రియముతో కూడా ఈ వ్యాపారమును జరపవచ్చునా ? ఆ జ్ఞానేంద్రియముతో వ్యాపారము చేయుట సామాన్యులకు సాధ్యము కాదా ? కలలలో కర్మేంద్రియములు లేకనే కదా , వ్యాపారము సాధ్యమయ్యేది ? మరి అది మెలకువ లోనూ సాధ్యమా " అని అనేక ప్రశ్నలు పుంఖానుపుంఖములుగా వచ్చినవి . దానికి సరియైన సమాధానము దొరకలేదు . అయిననూ ఇప్పుడు ఆచార్యుడు కొడుకును అడిగినాడు , " అలాగయితే , పొద్దున్నే ఏమి తిని వెళతావు ? " కొడుకు ఏమీ చెప్పకుండా తల్లి ముఖము చూసినాడు . తల్లి , ’ నువ్వు కూడా ఆవులను తోలుకుని వెళ్ళేవారి వలెనే చద్ది తిని వెళ్ళవలెను ’ అంది .


          ఆచార్యుడు , ’ నీ కొడుకుకు ఎప్పుడూ చద్దన్నము పెట్టవద్దు . వండిన వంటలో ప్రాణము అది వేడిగా ఉన్నంతవరకే ఉండును . ఆరిపోయినాక, దానిని ప్రాణము వదలును . దేహములో జరుగు కార్యములన్నీ , ప్రత్యక్ష , అప్రత్యక్షముగా ప్రాణము వలననే జరుగును . ఇక్కడ అన్నమై అన్నమయ కోశములనూ , అక్కడ అన్నాదుడై ప్రాణ పంచకమునూ , మనోబుద్ధులనూ నడిపించు ప్రాణమునకు చద్దన్నము హితము కాదు . కాబట్టి వేరేగా హవిస్సు వలె అన్నము చేసి , దానికి ఉప్పు , నెయ్యి , పెరుగు వేసి వడ్డించు . వాడు వెళ్ళిరానీ. చూడు నాయనా , నిన్ను రమ్మన్న ఆవును , నీకు ఆకలైనపుడు మాట్లాడించు . ఏమి చేయవలె నన్నది అదే తెలియజేయును " అన్నాడు . 


           ఆరాత్రి ఆచార్యుడు , కొడుకు నిద్రపోయిన తర్వాత వాడిదగ్గర కూర్చొని రక్షోఘ్న మంత్రములను పారాయణము చేసి ’ రేపు వీడు పశువులను కాచుటకు వెళ్ళినపుడు వీడికి చెడ్డదేమీ జరగకుండనీ , అంతా మంచే జరగనీ ’ అని ప్రార్థించాడు . కొడుకును వెళ్ళిరమ్మని ఎందుకు చెప్పినాడు ? అని అతనికే చోద్యము . అది కూడా వాడి ప్రభావమేమో ? 


          ఈ మధ్య అతనికి ఒక విచిత్రానుభవము కలుగుచుండినది . కొడుకు వద్ద ఉంటే , కామ్యేష్టుల సంగతులు రావడమూ , వాటికి బదులుగా పశుయజ్ఞముల విచారము తలలో నిండిపోవడము జరుగుతున్నది " ఆ యజ్ఞముల అర్థము ఇంకేమో అయి ఉండ వచ్చునా ? కావచ్చు. ఒక్క పశు యజ్ఞమేనా ? యజ్ఞ యజ్ఞమునకూ ఇంకేదో అంతరార్థము ఉన్నదై ఉండవచ్చును . యూపాదులను స్థాపించి , యజ్ఞములను చేయు అధికారమున్న వారి విషయము సరే , ఆ అధికారము లేని వారుకూడా ఆ యజ్ఞ ఫలము పొందవలెనన్న ఏమి చేయవలెను ? ఏ రీతిలో చేస్తే ఆ యజ్ఞము బ్రహ్మ యజ్ఞమగును ? " అని కొన్ని విచిత్రమైన ప్రశ్నలు తరంగములుగా వస్తాయి . 


          అతడు కొన్ని సార్లు , దీనికి కారణమేమి యని వెదకి చూచినాడు . జ్ఞాతముగా ఏ కారణమూ తెలియలేదు . " సరే , ఇతడి ప్రభావమే అయిఉండాలి . లేకుంటే అలాగెందుకవుతుంది ? ’ అని ఆలోచించినాడు . కొడుకు సన్నిధానము లేనపుడు ఆ తరహా ప్రశ్నలు గుర్తు తెచ్చుకుందామన్నా రావు . ఇలాగ , అన్వయ వ్యతిరేకములతో , కొడుకు ప్రభావమే దీనికి కారణము అన్న సిద్ధాంతమునకు వచ్చినాడు . 

Janardhana Sharma

ఉద్దండ కవితా విన్యాసము -2



ఉద్దండ కవితా విన్యాసము -2


                    కొందరు పుట్టుకవులుంటారు. మరికొందరు పెట్టుకవులుంటారు. పుట్టుకవులలో  ప్రఖ్యాతిగన్న మహాకవి  వేముల వాడ భీమ కవి! దక్షారామ భీమేశ నందనుడైన  యీకవి  'ఉద్దండ కవితా వేశము కలవాడు. గద్దరించి బెదరించి శాపదిగ్ధమైన  కవితలతో  నాటిప్రభువుల భరతమును బట్టి  తనజీవనమును  మహోజ్వలముగా  గడపిన మహనీయుడు. 


                           భీమ కవి సంచార శీలుడు. అతడొక మారు కళింగ చొక్కరాజు  యాస్థానమునకేగినాడు. ఆప్రభువు  వేశ్యాలంపటుడు. భీమకవి యొచ్చువేళకతడు  రాజోద్యాన వనమున  వేశ్యా సమేతుడై  విహరింుసాగెను. ద్వారపాలకుడు  భీమకవి యరుదెంచిన విషయమును విన్నవింపగా  పొగరుబోతుతనమున  ఇక్కడికేరమ్మని కబురంపెను. భీమకవి యరుదెంచి వాని వాలకమునుగాంచి  తలవంచి నమస్కరించెను. 


                                        " భీమకవీ ! నీగురించి చాలవిన్నాము. నీ టక్కుటమారములు మా*కడ సాగవు. నీవెదియన్న నది జరుగునా?  ఓహో! అటులైన  యీపందిరి గుంజను  మహావృక్షముగావింపుమని "--పల్కెను. ఆసమయమున చొక్కరాజుకాలు మల్లెపందిరి గుంజకానుకుని

యుండెను. భీమకవి  గంభీరముగా  గళమెత్తి--


                      "శా:  "  ఆనీతాభ్యుపదాన శృంఖల  పదాభ్యాలంబిత  స్తంభమా!


                                  నేనే వేములవాడ  భీమకవినేనిం  జిత్రకూటంబులో


                                 భూనవ్యాపృత  పల్లవోప లతికా  పుష్పోప గుఛ్ఛంబులన్


                                 నానా పక్వ ఫల  ప్రదాయి వగుమా !  నాకల్ప వృక్షాకృతిన్."---- అనిపద్యం చెప్పాడు.  అంతే  ఆపందిరి గుంజ కాస్తా మహా వృక్షమైపోయింది.  రాజుగారికాలు  ఆచెట్టులో యిరుక్కుపోయింది. దెబ్బతో భీమకవి  మహిమెంతో ఆరాజుకు  తెలిసింది.

"మహాకవీ నాతప్పు మన్నించు. మళ్ళీ వృక్షాన్నిపందిరికి గుంజగాజేసి  నన్నుకాపాడమని " ప్రార్ధించాడు. కవి కరుణాళుడై. చొక్కరాజా!

కవుల నెన్నడు నవమానింపకుము. బుధ్ధిగలిగిప్రవర్తింపు మనుచు----


  

                ఉ: "  శంభువరప్రసాద  కవిసంఘ వరేణ్యుడ నైన  నావచో


                          గుంభన  మాలకించి  యనుకూలత నొంది  యనూన భావనన్


                          కుంభిని  జొక్కనామ  నృపకుంజరు  పందిటి  మల్లెసాలకున్


                           స్తంభమురీతి  నీతనువు  దాలిచి   యెప్పటియట్ల  నుండుమా! "--- అనేపద్యం  చెప్పాడు. వృక్షం పందిరి గుంజయిపోయింది.రాజుగారి  పాదానికి  విముక్తి లభించింది.


                                               భీమకవి  మహిమకు అక్కడివారందరూ  ఆశ్చర్యంలో  మునిగిపోయారు.


                                                                  ఇదండీ  భీమకవిగారి  ఉద్దండ కవిత్వం !🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

హైందవం వర్ధిల్లాలి 4*

 *హైందవం వర్ధిల్లాలి 4*




మన భారత దేశంలో గత పాతిక (25) సంవత్సరాల క్రితం వరకు కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. తండ్రుల నుండి వారి సంతానం,   బాల్యం నుండే అప్పటి, అక్కడి ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను, విద్యలను ఒక్క మాటలో చెప్పాలంటే ఆ *జీవన శైలిని  అలవర్చుకుంటూ, అభ్యసిస్తూ ప్రవీణులయ్యేవారు*. 

ఈలా వంశ పారంపర్యంగా సంప్రదాయాలకు కట్టుబడి, క్రమ శిక్షణతో నియమాలను పాటించే వారు, ఎట్టి ఉల్లంఘనలు ఉండేవి కావు. 


ఇంతకు ముందు తెలుసుకున్నాము సామాజిక బాధ్యతలను పంచుకోవడానికి ప్రజలు నాలుగు విభాగాలుగా ఏర్పడి, సమాజ సేవ మరియు సమాజ సంరక్షణ చేస్తూ ఉండేవారు. తదుపరి కాలంలో ఆ విభాగాలే కుల వృత్తులుగా రూపాంతరం చెందాయి. కాని, ఈ ఆధునిక కాలంలో ప్రజలు, ఆ కాలంలో ఏర్పడిన వృత్తులకు మాత్రమే పరిమితం కాలేదు. కాల మాన పరిస్థితులను బట్టి ప్రజల వృత్తులలో మార్పు వచ్చినది, కులం ప్రకారము జనుల వృత్తిని నిర్ణయించు అవకాశం ప్రస్తుతం లేదు.

 *అవకాశాలను బట్టి అందరు అన్ని వృత్తులు నిర్వహిస్తున్నారు*. 


*చాతుర్వర్ణాలలో అందరి క్షేమము, ప్రగతి, అభ్యుదయాన్ని చూడవలసిన ధర్మం  పాలకులదని రామాయణాది హైందవ గ్రంథాలు చాటాయి*. సరిగ్గా అదే బాధ్యతను పాలకులు కుల వివక్ష లేకుండా ఈ కాలంలో కూడా అమలు పర్చినట్లయితే మరి మరీ ప్రశస్తము.*ఇంత చక్కటి పరంపరను నెలకొల్పిన హిందూ మతం పలు రాజకీయ కారణాల వలన బలహీన పడుతున్నది. బలహీన పడుతున్నదని మిన్నకుంటే హిందువులందరు బలహీనులని ఒప్పుకున్నట్లె*. 

అవుతే, *ఆవేశకావేశాలతో తాత్కాలికంగా  "చట్టం సహాయంతో"  దుర్మార్గుల దౌర్జన్యాన్ని అరికట్టు ప్రయత్నాలు*, మరియు

హిందూ జీవన సరళిలో పూర్వ *సంప్రదాయాలు పునరుద్ధరించాలి*, స్వాభావికంగానే ప్రజలు జాగృతులు కావాలి, సమాజ పెద్దలు ప్రజలను  జాగృతం చేయాలి.


రోగ గ్రస్థమైన వ్యవస్థను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలంటే ముందు రోగ లక్షణాలను పరిశీలించాలి,

 ఆ పైన చికిత్సా విధానాన్ని అమలు పరచాలి. బహిరంగంగా దృశ్యమగుచున్న రుగ్మతలలో కొన్ని. 

 1) సముచిత హిందూ జన జీవన శైలిని పునరుద్ధరించుకోవాలి. 

2) ఆధునికత పేరుతో, నాగరికత పేరుతో ఆచార వ్యవహారాల భ్రష్టత్వం తొలగాలి.

 3) వర్ణాల కతీతంగా హిందువులలో ఐకమత్యం పెరగాలి  

4) ధర్మ ద్రోహులను (మత  మార్పిడి) నిరోధించాలి. 

5) నాస్తిక వాదుల  వ్యాఖ్యానాలను కట్టడి చేయాలి. 

6) ప్రవచన కారులు, ఆశ్రమ అధిపతులు, పీఠాధిపతులు, ధర్మ ప్రచారకులు,  హైందవ మత పెద్దలు, హిందూ నాయకులు   ధర్మ సంరక్షణ కొరకై ప్రజల మధ్యకు రావాలి. 

7) అవసరమైనప్పుడు హిందూ ధర్మ సంరక్షణకు చట్టాలను ఖచ్చితంగా వినియోగించుకోవాలి. 

8) అశ్లీలతకు తావివ్వని,

  వివక్ష లేనివిధంగా సమున్నత మాతృ స్థానం స్త్రీలకివ్వాలి.


ధన్యవాదములు

*(సశేషం)*.

వ్యక్తిత్వం

 🔔 *వ్యక్తిత్వం* 🔔


👉ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికీ అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం *వదిలెయ్*

👉పిల్లలు ఎదిగినప్పుడు, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాలా పడడం *వదిలెయ్*

 👉కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను

*వదిలెయ్*

👉ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోతే లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా 

*వదిలెయ్*

 👉మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం

*వదిలెయ్*

 👉మనలోని కోరికకు, మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటే, నీ గురించి నువ్వే ఎక్కువ ఆశించడం 

*వదిలెయ్*

👉ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. అంతెందుకు, ఓ మనిషి ఎత్తు, రంగు మొదలుకొని అన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి సరిపోల్చడం

*వదిలెయ్*

👉నేను మంచి స్నేహితుడిగా కనిపిస్తే సరేసరి, లేదంటే నన్ను కూడా

*వదిలెయ్*

👉వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి, రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించడం

*వదిలెయ్*

👉మీకు ఈ సందేశం నచ్చితే సరి. ఒకవేళ మీకు నచ్చకపోతే, సీరియస్ గా తీసుకోకుండా

*వదిలెయ్*... 🙂


https://youtu.be/VtjHEH7-Mio


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - వర్ష ఋతువు - భాద్రపద మాసం - శుక్ల పక్షం  - పూర్ణిమ & కృష్ణ ప్రతిపత్ - పూర్వాభాద్ర -‌‌ సౌమ్య వాసరే* (18.09.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

భరోసా విలువ*

 *సండే స్టోరీ*


*భరోసా విలువ*

👐


రచన : ప్రతాప వెంకట సుబ్బారాయుడు 


రాతి బస్టాండ్ కి వచ్చి భీమవరం వెళ్లే బస్ ఎక్కి కూర్చున్నాను. మనసు పరి పరి విధాలపోతూ వికలంగా వుంది.


అయిదు నిముషాల తర్వాత ఎవరో ముసలాయన వచ్చి నా పక్క సీట్లో కూర్చున్నాడు. కొద్దిగా ఆయాసపడుతు న్నాడు. ఈ వయసులో చివరి గమ్యం దాకా ప్రయాణించగలడో, లేక మధ్యలో గుటుక్కుమంటాడో. నా పక్క సీటే ఈయనకి రావాలా? ఈయన్ని చూస్తే మా నాన్న గుర్తొచ్చి ఓ మూల జాలేస్తోంది. కానీ అసలే చిరాగ్గా వున్న నా మనసుకు ఇది ప్లస్సయింది.


"బాబూ, నేను మంచినీళ్లు తెచ్చుకోవడం మరచిపోయాను, కాస్త ఇవ్వవూ ట్యాబ్లెట్ వేసుకోవాలి" అని అభ్యర్ధించాడు.


'మందులు వేసుకోవాలని తెలిసినవాళ్లు మంచినీళ్లు తెచ్చుకోవడం ఎలా మరచి పోతారో' అని మనసులో విసుక్కుంటూ బాటిల్ ఇచ్చాను. ఆయన ట్యాబ్లెట్ వేసుకున్నాడు.


డ్రైవర్ వచ్చి కూర్చుని బస్ స్టార్ట్ చేశాడు. రెండు నిముషాల్లో బస్ బయల్దేరింది. కిటికీ లోంచి చల్లటి గాలి వీస్తూ మనసుని ఆహ్లాదపరుస్తోంది.


నా పక్కాయన నిద్రలోకి జారుకున్నాడు. 'భగవంతుడా! అది శాశ్వత నిద్ర కాకుండా చూడు' అని మనసులో అనుకున్నాను.


బస్ వేగంతో పాటు నా ఆలోచనలు క్రమాకృతి దాల్చి మనసులో సినిమాలా కదుల్తున్నాయి.


పల్లెటూళ్లో మధురానుభూతుల మధ్య పెరిగినా, దూరపుకొండలు నునుపు కాబట్టీ పట్నవాసపు సొగసులు, అక్కడి విలాసవంతమైన జీవితాలూ నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తుండేవి. డబ్బు బాగా సంపాదించాలి. సిటీలో సెటిలవ్వాలి. ఇవే నా మ్ముఖ్య ధ్యేయంగా పెట్టుకుని కష్టపడి చదువుకున్నాను. మా నాన్న మొక్కకు కావల్సిన ఎరుపు, నీళ్లు సకాలంలో పోసి సంరక్షించినట్టుగా నా చదువు కోసం కావలసిన వనరులు అన్నీ చాలా శ్రద్ధగా సమకూర్చేవాడు. అందువల్ల నా చదువు నల్లేరు మీద బండి నడకలా ఎటువంటి ఒడిదుడుకులూ లేకుండా సాఫీగా సాగి నా చేతిలో సర్టిఫికెట్ పెట్టింది.


అప్పట్లో అన్ని రంగాల్లోకి తారాజువ్వలా దూసుకెళుతున్న సాఫ్ట్ వేర్ రంగంలో అదృష్టవశాత్తు కాలు పెట్టగలిగాను.

పని..డబ్బు..జల్సా వీటితోటే నా జీవితం ముడిపడిపోయింది.


రాత్రి పగలు ఒకటే పని. చిన్న వయసు లోనే బి పి వచ్చేసింది. పని ఒత్తిడితో, నిద్ర సరిగా లేక ట్యాబ్లెట్లు ఖచ్చితంగా వేసుకోవలసిన కొన్ని వ్యాధులు నా శరీరాన్ని ఆశ్రయించాయి. సంస్థ ఇచ్చిన ఫెసిలిటీస్.. అందుకునే శాలరీ ముందు నాకు అవేం పెద్ద ఇబ్బందులనిపించలేదు.

https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2

అప్పుడప్పుడూ మా ఊరెళ్లినప్పుడు నాన్న మాత్రం "నీ శరీరంలో అసహజ మార్పులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండు. ఆరోగ్యమే మహా భాగ్యము. జీవించినంత కాలం ఆహ్లాదంగా, ఆనందం గా జీవించాలి. మనకు దొరికిన ఈ మానవ జన్మ అద్భుతమైనది. దాన్ని అనుభూతించాలి. అంతేకాని మరబొమ్మ లా మారకూడదు" అని సున్నితంగా హెచ్చరించేవాడు.


మంచి మాటలు తలకెక్కించుకునే వయసా అది. నవ్వి ఊరుకునేవాడిని.


రెండేళ్ల తర్వాత నా టీమ్ మేట్ గా జూనియర్ పొజిషన్ లో చేరింది స్వప్న. చాలా చలాకీగా ఉండేది. సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ రాయడంలో తనదైన స్టైల్ కనబరిచేది. తను రాసిన ప్రోగ్రామ్స్ లో బగ్స్ ఉండేవి కావు. ఎక్జాక్ట్ అవుట్ పుట్ వచ్చేసేది. క్లయింట్స్ చాలా హ్యాప్పీగా ఉండేవారు.


అప్పటిదాకా పని తప్ప మరో ప్రపంచం తెలియని నన్ను, తన వైపు తన ఆకర్షణ శక్తితో బలంగా తిప్పేసుకుంది. ఇప్పుడు తనే ఒక ప్రపంచమైపోయింది నాకు.


తననే గమనించడం, పనిలో మెళకువలు నేర్పడం, లంచ్ ని షేర్ చేయడం, నా బైక్ మీద డ్రాప్ చేయడం లాంటివి అత్యంత ఇష్టంతో చేస్తున్నాను.


ఒకనాటి సాయంత్రం టాస్క్ సక్సెస్ అయిన నేపథ్యంలో మంచి ఖరీదైన హోటల్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఆఫర్ చేశాను.


ఆ రాత్రి రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నాక, మెల్లగా ఆఫీసు విషయాల్లోంచి టాపిక్ ని డైవర్ట్ చేసి ఆమెకు ప్రొపోజ్ చేశాను. ఆమె బెట్టు చేయడం కానీ, సున్నితంగా తిరస్కరించ డం కానీ చేయలేదు. సింపుల్ గా ఒప్పేసుకుంది.


మామూలు మనిషి ఏనుగు అంబారి ఎక్కేది బహుశా ఇలాంటి సందర్భంలోనే అనుకుంటా. మనసు దూది పింజ అయింది.


"మనిద్దరం యంగ్. బోలెడంత ప్యూచర్ వుంది. మీరూ హేండ్ సమ్ గా, చురుకుగా ఉంటారు. హెల్పింగ్ నేచర్ వుంది. మన మ్యారీడ్ లైఫ్ హాప్పీగా సాగిపోతుందని నాకు నమ్మకం ఉంది. మా నాన్న ఒంగోలులో ఓ చిన్న కౌలు రైతు. తనది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితైనా, చదువులో చురుకైన దాన్ని కావడం వల్ల నా చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకున్నారు.


నేనిక్కడే వర్కింగ్ విమెన్ హాస్టల్లో ఉంటున్నాను. మా వాళ్లు నా మాట కాదనరు, మా కుటుంబ పరిస్థితులు మీకు అభ్యంతరం కాకపోతే, మన విషయం మా వాళ్లతో చెప్పి, మా నాన్నగారిని..మీ వాళ్లని కలవమని చెబుతాను" అంది.


'నేను 'సమ్మతమే' అన్నట్టుగా ఆమె చేతిని అందుకుని సన్నగా నొక్కాను.


సెల్ ఫోన్ లో సంతోషంగా మా వాళ్లకు విషయం చెప్పాను. మొదట్నుంచి వాళ్లు నన్ను స్వేచ్ఛగా పెంచారు. మనసులో ఏదీ దాచుకోవడం మాకు ఇష్టముండదు. అందుచేత నా నిర్ణయానికి అమ్మానాన్న లు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు.


అనుకున్నట్టుగానే ఆమె తల్లిదండ్రులు మా వాళ్లని కలిసారు. తర్వాత వచ్చిన మంచి రోజులు మా ఇద్దర్నీ ఒక్కటి చేశాయి.

https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2

లక్షల్లో హోమ్ లోన్ తీసుకుని మాదాపూర్ లో ఫ్లాట్ తీసుకున్నాము. మాదైన చిన్న ప్రపంచం ఏర్పడిపోయింది. కొంతకాలానికి మరో ఇద్దరు బుజ్జి అతిధులు వచ్చారు. కాలం కమ్మగా పీచు మిఠాయిలా కరిగిపోతోంది. పెన్నులో ఇంక్ బదులు మధురం నింపి డైరీల్లోని పేజీలను నింపుకుంటున్నాం. డబ్బుని వెదజల్లి.. సుఖాలను సొంతం చేసుకుంటూ జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగిపోతున్న ప్పుడు ఒక చిన్న జర్క్.


రిసెషన్...(మాంద్యం)


శిశిరంలో వృక్షాలు ఆకులు రాల్చేసినట్టు టపటప మని అన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు ఉద్యోగులను తొలగించేశాయి.


స్వప్న ఉద్యోగం పోయింది.


ఇంకోటి దొరుకుతుందన్న ఆశ కూడా లేదు, ఎందుకంటే అవకాశలు లేవు, ఉన్నా ఎనార్మస్ స్కిల్స్ తో ఎక్విప్ అయి వున్న తన తోటివాళ్ల తోటే తనకు పోటీ. పోనీ  మేమేమన్నా చిన్న ఉద్యోగులమా? ఏదో ఒక పని చెయ్యడానికి. ఏ సీ లకీ, ఫెసిలిటీస్ కి, క్యాబ్ లకీ అలవాటు పడిన జీవితాలు మావి. ఎండలోకి వెళ్తే గట్టిగా నాలుగడుగులేయలేం. మానసిక క్షోభ. అనుక్షణం రంపపు కోత.


రెండు జీతాలకు అలవాటు పడిన మా ఇంటికి ఇది అశనిపాతం. ఇంటి లోన్ కు దాదాపు ఒక జీతం వెళ్లిపోతుంది. అలాంటిది ఒక్క జీతంతో అన్నీ ఎలా? ఎలా?? పోనీ దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవడం కోసం ఏవైనా పొదుపు చేసి కూడబెట్టామా? అంటే, అదీ లేదు. అసలు రేపటి గురించి ఆలోచన ఉంటేగా!


భవిష్యత్తు కూడా వర్తమానం లానే బంగారంలా ఉంటుందనుకున్న మా ఆశలు అలా ఆవిరయ్యాయి.


నిన్నటి దాకా మాల్స్, మల్టిప్లెక్స్ ల్లో గీక్కో మని క్రెడిట్ కార్డ్ లు నిర్లక్ష్యంగా విసిరేసిన మేము, సరుకుల కోసం మార్వాడీ వాళ్ళ షాపులకు వెళ్లగలమా? అసలు అంత ఛేంజ్ ని ఒక్కసారిగా మనసు డైజెస్ట్ చేసుకోగలుగుతుందా?


మా సంస్థలో కూడా మ్యాన్ పవర్ రిడక్షన్ మొదలైంది. 'భగవంతుడా నా పేరు ఆ లిస్ట్ లో ఉండకుండా చేయి' అని నా మనసులో వేలసార్లు మౌన ప్రార్ధనలు

చేశాను. నిజం చెప్పాలంటే బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నాం.


ఒక నెల భారంగా గడిచింది. చివరికి అనుకున్నంతా అయింది.

https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2

నేనెళ్లేసరికి హెచ్ ఆర్ నుంచీ వచ్చిన లెటర్ నా కోసం ఎదురు చూస్తోంది. నా మెదడు శూన్యమయిపోయింది.


రేపటి నుంచీ ఎలా? ఎలా?


శరీరం నుంచీ రక్తం పీల్చేసినట్టు నా అడుగులు తడబడుతూ ఇంటికి చేరాను.

తలుపు తీసిన స్వప్న నేను విషయం చెప్పకుండానే గ్రహించింది.


ఇద్దరి మనసులోనూ రేపెలా? అన్నదే దొలిచేస్తున్న ప్రశ్న. ఆ రాత్రి మేము నిద్ర పోకుండానే తెల్లారింది.


నిన్నటిదాకా తెల్లారుతోందంటే ఎంత ఉత్సాహంగా ఉండేది? కొత్త టాస్క్ లు అలాట్ చేయబడతాయని, వాటిలో మన పెర్ఫార్మెన్స్ కు తగిన షేర్ ఉంటుందనీ. 

కానీ ఇప్పుడు రోజులు అతి భయానకం గా, భారంగా గడుస్తున్నాయి. తెల్లారితే సమస్యలు పలకరిస్తాయి కాబట్టి, అసలు తెల్లవారకూడదనిపిస్తోంది.


మా సంగతి సరే, పిల్లలు ఎలా? వాళ్లని పోషించడమూ కష్టమే! మా పెద్దవాళ్ల దగ్గర వదులుదామంటే, ఇన్నాళ్లూ మా సంతోషం మాదే గానీ వాళ్లని అసలు పట్టించుకున్నది లేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్లగలం? ముఖ్యంగా మా అమ్మానాన్నలు. వాళ్లని చూసి చాలా కాలమయింది. మా అమ్మ ఫోన్ చేసి నన్ను చూడాలని విలవిల్లాడిపోయేది. తీరికుంటేగా! వీకెండ్స్ మా ఎంజాయ్మెంట్ కే సరిపోయేది కాదు.


మా నాన్నతో, అమ్మని తీసుకుని మా ఇంటికి రమ్మని ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్పాను. ఇక్కడి కంఫర్ట్ లైఫ్ గురించి ఏకరువు పెట్టేవాడిని. అయినా 'తనకు అక్కడే స్వేచ్ఛగా ఉంటుందనీ, రాలేనని' నిర్ద్వందంగా తిరస్కరించేవారు. రోజు రోజుకి పరిస్థితి అద్వాన్నమవుతోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు.


ఇప్పటికే ఇంట్లో వున్న బంగారం, ఖరీదైన వస్తువులు అమ్మి ఎనిమిది నెలలు గడిపేశాం. ఇక పైన కష్టం.


రోజులు ఇలాగే కొనసాగితే 'డిప్రెషన్ లోకెళ్లి ఆత్మహత్య చేసుకుంటామేమో' అన్న అనుమానం వస్తోంది.


ఏదో ఒకటి చేయాలి. లాభం లేదు.


"స్వప్నా" పిలిచాను.


నీరసంగా వచ్చింది.


"నేను ఇవాళ బయలుదేరి మా నాన్న దగ్గరకు వెళ్లి వస్తాను. నువ్వూ, పిల్లలూ జాగ్రత్త. మా నాన్న అనుభవం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని నా నమ్మకం. ఊళ్లో వాళ్లకు ఎన్నోసార్లు సరైన సలహాలు చెప్పడం విన్నాను. నాకు ఇన్నాళ్లు ఆయన గుర్తుకు రాకపోవడమే ఆశ్చర్యంగా వుంది" అన్నాను ఉద్వేగంగా

చమార్చిన కళ్ళతో...


నా సంతోషం, స్వరంలో వినిపించేసరికి తనకు కూడా కాస్త జీవం వచ్చినట్టుంది.


"అలాగేనండీ, మనకిప్పుడు కావలసింది పెద్దవాళ్ల సపోర్టే! మా వాళ్లు ఆర్థికంగా అంత ఉన్నవాళ్లు కాదు. మా నాన్నకు అంత లౌకిక జ్ఞానమూ లేదు. మన సమస్యకు పరిష్కారం మీ నాన్న ఇవ్వగలరంటే, ఇప్పుడే, ఇంకాలస్యం చేయకుండా వెళ్లిరండీ" అంది తొందరగా బ్యాగ్ సర్ది చేతికిస్తూ.



నేను కలల ప్రపంచంలోంచి హఠాత్తుగా ఈ లోకంలోకి వచ్చి చూసేసరికి బస్సు పచ్చటి పొలాల మధ్య పరిగెడుతూ మాకు స్వచ్ఛమైన ప్రాణ వాయువుని ఇస్తోంది. ఆ పచ్చటి పైరునీ.. పొలాలని చూసేసరికి ప్రాణం లేచొచ్చింది.


ఎప్పుడు లేచాడోగానీ నా పక్కన ఉన్న ముసలాయన పేపర్ చదువుతున్నాడు. నిన్న రాత్రి ఆయన పట్ల నాకు కలిగిన ఆలోచనకు నవ్వొచ్చింది.

https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2

మా ఊరి బస్టాండ్ లో దిగగానే వేప్పుల్ల తో పళ్లు తోముకునేవాళ్లు, మోకాళ్ల దాకా నిక్కర్లు వేసుకున్నవాళ్లని చూడంగానే మా ఊరు, మా వాళ్ల మధ్యకొచ్చేశానన్న ఏదో తెలియని అనుభూతి మదిని చుట్టేసింది. దూరంగా వున్న చంటి హోటల్ నుంచి వచ్చే ఇడ్లీ ఆవిరి వాసనా, దోశ కాలిన వాసనా కలగాపులగంగా అయినా కమ్మగా నాసికా పుటల్ని సోకాయి.


రెండు ఇడ్లీలు తిని కాస్త కాఫీ తాగుదామ నుకున్న నాకు స్వప్న, పిల్లలూ గుర్తొచ్చి కాళ్లను ఇంటి వైపు నడిపించాను. గోదావరి ఒక పాయ మా ఇంటి ముందు

నుంచీ ఒంపుసొంపులతో ప్రవహిస్తుంది. దాన్ని తాకుతూ సాగే మట్టి రోడ్డు మీద నడవడం నాకు ఎప్పుడూ ఇష్టమే! మధ్య మధ్యలో పెంకులు అందుకుని నీళ్లపై కప్పు గంతులేయిస్తూ తాత్కాలికంగా మురిసిపోయాను, అన్ని సమస్యలు మర్చిపోయి, మానసికంగా..!


ఇంటి ముందుకు చేరేసరికీ మా నాన్న వసారాలో కూర్చుని పేపర్ చదువుకుంటు న్నాడు.


నేను గేటు తీయంగానే ఆ చప్పుడుకు నా వైపు చూసి నాలోని నిస్తేజాన్ని తన అనుభవంతో పరిశీలించి, ఏదో సమస్య నన్ను వేధిస్తోందని గ్రహించి, నా దగ్గర కొచ్చి ఆప్యాయ్యంగా నా బుజం మీద చేయి వేసి "మనం తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందు ఫ్రెష్ అయి కాసేపు విశ్రాంతి తీసుకో. అప్పటికి నీ మనసులోని అలజడి కాస్త సద్దుమణు గుతుంది" అన్నాడు అనునయంగా.


నేను 'సరే' అన్నట్టుగా ముందుకు కదిలాను. అమ్మ ఎదురొచ్చి "ఏరా, ఇంతగా చిక్కిపోయావు. నువ్వు సంతోషంగా వున్నావనుకున్నాం గానీ ఇలా అయిపోయావేమిట్రా? అవునూ, అమ్మాయిని పిల్లల్ని తేలేదేమిటి?" అంది కళ్ల నీళ్లతో నన్ను నిలువెల్లా అపేక్షగా తడుముతూ.


"అన్నీ చెబుతాడు, ముందు వాడిని ప్రయాణ బడలిక పోగొట్టుకోనీ, రాజ్యం" అన్నాడు నాన్న అమ్మతో.


నేను లోపలికెళ్లి స్నానం ముగించి వచ్చే సరికి అమ్మ నా కోసం వేడి వేడిగా చింతపండు పులిహార సిద్ధం చేసింది. తిన్నాక నిద్ర ముంచుకువచ్చింది. ఆ నిద్ర.. నిద్ర మధ్యాహ్నం ఒంటిగంటకు లేచాను. చాలా కాలానికి మాంఛి నిద్ర పట్టింది. అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోయాను.


నేను లేచేసరికి నాన్న లేడు. పని మీద బయటకి వెళ్లాడని అమ్మ చెప్పింది.

కాసేపటి తర్వాత భోజనానికి వచ్చాడు.


మా అమ్మ చేసిన పదార్థాలు నా ఆకలిని ద్విగుణీకృతం చేసి చల్లబరచాయి. అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే!

https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2

తిన్నాక వాయువ్యం వైపున్న విశాలమైన గదిలో కూర్చున్నాం. నేను మధ్యాహ్నం వేసుకోవలసిన అయిదు రకాల ట్యాబ్లెట్లు వేసుకున్నాను.


మెల్లగా ఉద్యోగంలో ఆకాశ విహారం.. రిసెషన్.. కొంతకాలంగా మేము ఎదురు కుంటున్న గడ్డు పరిస్థితి పూసగుచ్చాను.


అన్నీ విన్న ఆయన "ఇందులో బాధ పడడానికి ఏముంది? సుఖ దుఃఖాలు, చీకటి వెలుగులూ సహజమే! వాటికి బెంబేలెత్తితే ఎలా? నీ ఆలోచనలు, నీ మొన్నటి స్థాయికి తగ్గట్టు ఉన్నాయి కాబట్టే సతమతమవుతున్నావు. 'ఎవరికీ ఏదీ శాశ్వతం కాదు' అన్న ఎరుక కలిగి వుంటే ఇబ్బంది ఉండదు. సృష్టిలో ఏ జీవీ ఆకలితో చచ్చిపోదు, అది ఎక్కడో అక్కడ తన కడుపుకు ఎంత కావాలో అంత సంపాదించుకుంటుంది. మనలాగా దాచుకోవడం కూడా తెలియదు. అయినా బతికినంతకాలం హాయిగా, సుఖంగా బతుకుతుంది. మనమే లేని పోని భేషజాలకు పోయి తినడానికన్నా విలాసాల కోసం, సౌకర్యాల కోసం నేల విడిచి సాము చేస్తాం. అప్పుడు భంగ పాటు తప్పదు.


'కడుపులో చల్ల కదలకుండా' అని మన వాళ్లు ఊరికే అనలేదు. ఎండమావుల కోసం పరిగెత్తి చివరకు అలసిపోయి కూలబడిపోవడం తప్ప, ఓ సుఖమా, సంతోషమా? నన్ను నువ్వు ఎన్నోసార్లు రమ్మన్నావు, వచ్చానా? లేదు. ఎందుకంటే వస్తే వాటికి దాసోహం అయ్యే అవకాశం ఉంది.


ఇక్కడ పల్లెటూరిలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? అంతెందుకు నువ్వు నీ శరీరాన్ని అంటిపెట్టుకున్న అనారోగ్యా నికి ఎన్ని మందులేసుకున్నావో ఇందాక చూశాను. నాకు ఇంతవరకు తలనొప్పి ఎలా ఉంటుందో తెలియదు, అదీ వ్యత్యాసం. ఏసీ గదులతోనూ, సకల సౌకర్యాలతోను శరీరాన్ని సుఖబెట్టి దాన్ని కష్టపడమంటే ఎందుకు కష్టపడుతుంది? కష్టబడితేనే కదా సుఖం. ఎప్పటికైనా సుఖం నుండి లభించే సుఖం కాదు కష్టం నుంచీ లభించే సుఖమే విలువైనది.”


ఇవన్నీ ముందే చెప్పొచ్చు కదా! ఇప్పుడు 'చేతులు కాలాక' ఎందుకు 'చెబుతున్నా డు' అని నువ్వనుకోవచ్చు. దేనికైనా సమయం రావాలి. భగవద్గీత ఆవిష్కరణ కురుక్షేత్ర యుద్ధంలోనే జరిగింది. మొదలే చెప్పుంటే నువ్వు నాతో పోట్లాడి మరీ, ఈ ఇంటి గుమ్మం దాటేవాడివి. దాని ఆకర్షణ అలాంటిది. అప్పుడు మళ్ళీ ఈ ఇంటి తలుపు తట్టడానికి సంకోచించేవాడివి. అందుకే అప్పుడు మౌనం వహించాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మిమ్మల్ని చూసుకోవడానికి పెద్ద దిక్కు మేమున్నాం. అమ్మాయినీ పిల్లల్నీ కూడా ఇక్కడకు వచ్చేయమను. పసిపిల్లల మీద విషపు ఛాయలు పడనీయకండి.


కొన్నాళ్లు కలుషితానికి దూరంగా ఇక్కడి ప్రకృతిలో మమేకమై కాలం గడపండి. మానసికంగా సేద దీరండి.. సాంత్వన పొందండి. మనసు ఎప్పుడైతే ప్రశాంతత పొందుతుందో, సరైన ఆలోచనలకు మార్గం సుగమం అవుతుంది. ఆడంబరా లన్నీ మన ఊరి పొలిమేరలో వదిలేసి రండి. జీవించడానికి కడుపునింపుకోవా లి. కడుపు నింపుకోవడం ఇక్కడ కష్టం కాదు. నెమ్మదిగా అన్నీ కుదుటపడ్డాక ఏంచేయాలన్నది ఆలోచిద్దాం" అన్నాడు.


ఊరిలో ప్రతి తండ్రీ తన అనుభవంతో బిడ్డలకు కౌన్సిలింగ్ ఇవ్వగలడు. సైకియాట్రిస్ట్ కాకుండానే మనసుకు మందేయగలడు. కానీ మనం.. పెద్ద చదువులు చదువుకున్న వాళ్లమని, దేశ విదేశాల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నామని విర్రవీగుతూ, 'పల్లెటూరి వాళ్లు.. వాళ్లకేం తెలియదని' తేలికగా తీసిపారేస్తాం. ఆత్మహత్య దాకా ఆలోచించిన మనసుకు, మా నాన్న తన మాటలతో ఊరటనిచ్చారు. 'బతకగలం' అనే భరోసానిచ్చారు. 


ఒక్కోసారి సమస్యలో కూరుకుపోయిన ప్పుడు మనకు మనంగా పైకి రాలేం. అందులోనే ఉండడం వల్ల దారులన్నీ మూసుకుపోయనట్టు అనిపించి జీవితం అంతం చేసుకోవాలనుకుంటాం. అలాంటి విపత్కర సమయంలో మనకు మరో దారి చూపించి మానసికంగా బలాన్నిచ్చేవాళ్లు కావాలి. అందుకే పెద్దవాళ్ళు దగ్గరగా ఉండాలి. ఇలాంటప్పుడే అమ్మ నాన్న ల విలువ తెలుస్తుంది.


సిటీలో ఐతే మానసిక వైద్య నిపుణులు ఆ పని చేస్తారు. కానీ ఎంతమంది వాళ్లని ఆశ్రయిస్తారు ? అయినా ఇప్పుడంటే అలాంటి అవకాశాలు ఉన్నాయి గాని, ఒకప్పుడు పెద్దవాళ్లే కదా ఆ బాధ్యత నెరవేర్చేది. అందుకే పెద్దవాళ్ల, అనుభవ జ్ఞుల సలహలూ తీసుకుంటూ ఉండాలి. 'గతం ఓ పీడకల. దాన్ని వీలైనంత త్వరగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి' అనుకున్నాక నా మళ్లీ మనసులో ఉత్సాహం ఉరకలేయడం మొదలెట్టింది.


సెల్ తీసుకుని స్వప్నకు ఫోన్ చేసి 'రాత్రికి బయల్దేరి ఊరొచ్చేయమ' న్నాక నా మనసు పూర్తిగా కుదుటపడింది.


నాన్న తనకు ఏదో పనుందని బయటకి వెళ్లిపోయారు. నేనూ అలా ఊళ్లోకి బయల్దేరాను. రేపట్నుంచి, పిల్లలకు చదువు చెప్పడమో, పొలం పనుల్లో నాన్నకు చేదోడువాదోడుగా ఉండడమో చెయ్యాలి కదా...! మళ్ళీ ఒక సరికొత్త జీవితం ప్రారంభించాలి కదా......

🪷

*సమాప్తం* 


꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*కథల ప్రపంచం* 




*1 YEAR SUBSCRIPTION 120/-*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂