19, జనవరి 2021, మంగళవారం

నిమిషానికి 59సెకన్లే..

 *పెద్ద సమస్యే ఇది.. నిమిషానికి 59సెకన్లే.. శాస్త్రవేత్తల ఆలోచన!*

 తన చుట్టూ తాను తిరుగుతూ ఉండే భూమి వేగం పెంచుకుంది. దీంతో సాధారణ సమయం కంటే సమయం వేగంగా గడిచిపోతోంది. భూమికి ప్రళయ సంకేతాలు కనపడుతున్నాయంటూ చాలా ఏళ్లుగా వార్తలు వస్తుండగా.. ఇప్పడు శాస్త్రవేత్తలు సమయాన్ని కుదించే అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నిమిషాకి 59సెకండ్లనే లెక్కగట్టే యోచనలో ఉన్నారు శాస్త్రవేత్తలు.

మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి తన చుట్టూ తాను వేగంగా భ్రమించగా.. ఒకసారి సూర్యుడిని చుట్టి వచ్చే లోపు భూమి తన చుట్టూ ఏకంగా 419 నుంచి 420 సార్లు తిరిగేదట. అయితే అది కాల క్రమంలో ఆ సమయం తగ్గింది. ప్రస్తుతం 365 సార్లు మాత్రమే పరిభ్రమిస్తోంది. ప్రతి ఏడాది దాదాపు 6గంటల సమయం ఎక్కువగా ఉంటోంది. దీంతో నాలుగో ఏడాదిని లీపు ఇయర్‌గా పరిగణించి ఏడాదికి 366 రోజులను నిర్ణయించారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఆ లెక్క కూడా మారేలా కనిపిస్తోంది.

భూమి వేగవంతమైన వేగాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు నిమిషాన్ని 59 సెకన్లకు తగ్గించాలని ఆలోచిస్తున్నారు. భూమి యొక్క నిజమైన భ్రమణానికి సమయాన్ని సమకూర్చడానికి కనీసం ఒక “సెకండ్”ను ఒక నిమిషం నుండి తీసివేయవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి వేగం పెరుగుదలలో మార్పులకు అనేక కారణాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోని సముద్ర మట్టం స్థాయిలో మార్పులు దీనికి ఓ కారణం. చంద్రుడు భూమికి దూరంగా కదులుతుండడం కూడా ఒక కారణమే.

సగటు రోజు సాధారణ 86,400 సెకన్లు ఉంటుంది. అయితే 2021లో 0.05 మిల్లీసెకన్లు తక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ‘అయితే దీనిని అడ్జస్ట్ చేయాలంటే సాధారణ విషయం కాదు. ఇలా ఇంతకుముందు కూడా టైం అడ్జస్ట్ జరిగింది. కానీ అప్పుడు కేవలం 1 మిల్లీ సెకను అడ్జస్ట్ చేశారు. దానివల్లే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వచ్చింది. కంప్యూటర్లు, శాటిలైట్లు అన్నీ క్రాష్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒక సెకెండ్ అడ్జెస్ట్ చెయ్యడం అంటే చాలా కష్టమైన పని.

ఒక్క సెకనును ఒక నిమిషం నుండి తీసివేయడం వలన ఖచ్చితమైన సమయపాలనపై ఆధారపడే ప్రదేశాలలో వినాశనం వస్తుంది. తద్వారా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 2012లో సమయానికి జోడించిన ఒక లీపు సెకను కారణంగా సర్వర్లు క్రాష్ అయ్యి అనేక సైట్లు పడిపోయాయి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు జావాస్క్రిప్ట్ కూడా ఫలితంగా అంతరాయాలను చవిచూసింది. కంప్యూటర్లు సమయాన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో ట్రాక్ చేస్తాయి మరియు లీపు సెకను జోడించడం లేదా తీసివేయడం చాలా ప్రమాదం.

 అయినప్పటికీ, శాస్త్రవేత్తలు ఒకరకమైన దిద్దుబాటు అవసరం అని చెబుతున్నారు. 59 సెకన్ల నిమిషంను చెయ్యాలని భావిస్తున్నారు. ఏ దిశను తీసుకోవాలో లేదో నిర్ణయించడానికి చాలా సమయం పట్టవచ్చు. అన్ని సంభావ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని, 2023లో జరిగే ప్రపంచ రేడియోకమ్యూనికేషన్ సమావేశం లీపు సెకన్లతో ఎలా ముందుకు వెళ్ళాలో నిర్ణయిస్తుంది.

శృంగేరి కథ

 శృంగేరి కథ కంచి(కి)లో


ఒకసారి మహాస్వామి వారి దర్శనానికి ఒక బ్రహ్మచారి అయిన యువకుడు వచ్చాడు. పరమాచార్య స్వామి వారికి సాష్టాంగం చేసి నిలుచున్నాడు. మహాస్వామి వారు ఆత్రుతగా అతణ్ణి చూసి “నువ్వు కుళితలై శంకరన్ కదూ? ఎలా ఉన్నావు?” అని అడిగారు. ”అవును పెరియవా. బావున్నాను అంతా మీ ఆశీర్వాదం.” శంకరన్ బదులిచ్చాడు.


“సరే ఇప్పుడు నీ వయసెంత?”


“ముప్పై సంవత్సరాలు పెరియవా”


మహాస్వామి వారు నవ్వుతూ “పెళ్ళి చేసుకోకుండా ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోవాలనుకుంటున్నావా?” అని అడిగారు. 


”అవును పెరియవా” అన్నాడు శంకరన్. 


”సరే. ఏమైనా విశేషమా ఇలా రావటం?” అని నవ్వుతూ “కారణం లేకుండా నువ్వు రావు కదా?” అని అన్నారు. 


”అవును పెరియవా. ఒక సందేహ నివృత్తి కోసం ఇక్కడకు వచ్చాను.”


“అలాగా! సరే చెప్పు ఏమా పెద్ద సందేహం” అని అడిగారు. 


“అది మంత్రజపం గురించిన ఒక సందేహం” శంకరన్ బదులిచ్చాడు. పరమాచార్య స్వామి వారు వెంటనే “అది మంత్ర జపం గురించినదైతే.. నువ్వు ఏదైనా మంత్ర జపం చేస్తున్నావా?”


“అవును పెరియవా”


“ఓహో మంత్రోపదేశం తీసుకున్నావన్నమాట.”


“అవును పెరియవా”


“గురువు ఎవరైతే”


“మైసూరు యజ్ఞ నారాయణ గణపదిగళ్” శంకరన్ బదులిచ్చాడు. ”మంచిది. చలా మంచి విద్వాంసుడు; మత్రం ఏదైనా”


శంకరన్ నోరు తెరువక ముందే స్వామి వారు “ఆగాగు.. ఆ మంత్రాన్ని అలా చెప్పకూడదు. అది నీలోనే రహస్యంగా ఉంచుకోవాలి. కేవలం అది ఏ దైవ సబంధమో చెప్పు చాలు”


“హనుమత్ ఉపాసనా పరమాణ మూల మంత్రం పెరియవా”


“సరే నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటి ఈ మంత్ర జపంలో”


“అది పెరియవా నేను ఈ మంత్రాన్ని నాకు 23 సంవత్సరాల వయసున్నప్పటినుండి జపంచేస్తున్నాను మత్రోపదేశం పొందిన తరువాత. నేను గత ఏడు సంవత్సరాలుగా జపం చేస్తున్నాను. కాని నాకు ఏమి తెలియదు”


“నాకు ఏమి తెలియదు అనుటలో అర్థమేమి?” మహాస్వామి వారు ఆశ్చర్యంతో అడిగారు. ”నేను ఏమంటున్నానంటే, పెరియవా నాకు ఆ మంత్ర సిద్ధి కలిగిందో లేదో అర్థం కావటం లేదు” అని దిగాలుగా అన్నాడు.


పరమాచార్య స్వామి వారు వెంటనే “తెలుసుకుని ఏం చేస్తావు? ఏమైనప్పటికీ నీవు జపం చేస్తున్నది ఆత్మార్థం (ఆత్మజ్ఞానం) కోసమా? కామ్యార్థం (ఏదేని కొరిక తీరడం) కోసమా?”


“నేను చేస్తున్నది ఆత్మార్థం కోసమే పెరియవా. కాని నాకు ఆ మంత్ర సిద్ధి కలిగిందో లేదో, ఆ మంత్ర అధిష్టాన దేవత అనుగ్రహం ఉందో లేదో అర్థంకావటం లేదు. దయచేసి నా మంత్ర జపం పురోగతి ఎలా ఉందో తెలపండి.” ఈ మాటలు చెప్తూ తల వంచుకుని కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు. 


”ఎవరైతే మంత్ర జపం చేస్తున్నారో వారికి స్వీయ అనుభవం వల్ల మాత్రమే తెలుస్తుంది ఆ మత్రం ఫలించిందో లేదో అని. ఒకానొక సమయంలో అది నీకు కూడా సంభవిస్తుంది, శంకరా” అని వాత్సల్యంతో అన్నారు. 


శంకరన్ కు తృప్తి కలగలేదు, “లేదు పెరియవా. నాకు ఇంతవరకూ ఎటువంటి అనుభవం కలగ లేదు. నాకు దాని గురించి ఏమి అర్థం కావట్లేదు గత 7 సంవత్సరాలుగా మా గురువు గారు చెప్పినట్టు చేస్తున్నా కూడా. ఒక్కోసారి నాకు చాలా అసహనంగా ఉంటుంది ఈ విశయమై. మీరే ఏదో ఒక దారి చూపించాలి” అని శంకరన్ రెండు చేతులు కలిపి అంజలి ఘటించి మహాస్వామి వారికి సాష్టాంగం చేసాడు.


పరమాచార్య స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి, తన భక్తుని మనస్థితిని అర్థంచేసుకుని ఇలా చెప్పారు. ”చాలా సంవత్సరాల క్రితం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి పీఠానికి మహాత్ముడైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారు పీఠాధిపతిగా ఉండేవారు. ఒకరోజు ఆ ప్రాంతం వాడైన ఒక శిష్యుడు వారి దర్శనార్థం వచ్చాడు.”


“వారికి సాష్టాంగం చేసి, తను తెచ్చిన జామ పళ్ళను వారికిచ్చాడు.”


“రా ఎలా ఉన్నావు? చెప్పు నీకేం కావాలి?” అని ప్రేమతో పలకరించారు. 


”స్వామి, నాకు మా గురువు గారు ఉపదేశించిన మంత్రాన్ని నేను చాలా సంవత్సరాలుగా జపిస్తున్నాను. కాని నాకు మంత్ర సిద్ధి కలిగిందో లేదో తెలియడం లేదు. అది తెలుసుకోవడం ఎలా?” అని వినయంగా అడిగాడు. 


స్వామి వారు వెంటనే “ఆత్మార్థం కోసం నువ్వు చేస్తున్న జపం కొనసాగించు. ఆ మంత్ర అధిష్టాన దేవత నీకు ఫలితాన్ని కచ్చితంగా ఇస్తుంది”


ఆ శిష్యుడు స్వామి వారి మాటలకి తృప్తి పడలేదు. “లేదు స్వామి నేను నాకు కలిగిన ఫల సిద్ధి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరే ఒక దారి చూపించాలి మిమ్మల్ని వేడుకుంటున్నాను.” అని అన్నాడు. 


స్వామి వారు ఆ శిష్యుడి మనస్థితిని అర్థం చేసుకుని దగ్గరకు పిలిచి “దిగులు పడకు. దానికి ఒక మార్గం ఉన్నది” అన్నారు.”


ఉన్నదా? ఐతే నాకు ఆ విషయం దయచేసి తెలియపరచండి స్వామి” అని అడిగాడు. నృసింహ భారతీ స్వామి వారు నవ్వుతూ “ప్రతి రోజూ నువ్వు జపం చేసుకునే ముందు చక్క పీట పైన వడ్లు పరిచి దాని పైన ఒక వస్త్రం కప్పి, దాని పైన కూర్చొని జపం చెయ్యి. రోజూ ఇలాగే చెయ్యి. ఏరోజైతే ఆ పీట పైనున్న వడ్లు వేయించినట్లు పేలాలుగా మారతాయో ఆ రోజు నీకు మంత్ర సిద్ధి కలిగినట్టు. అర్థం అయ్యిందా?” అని చెప్పారు. 


శిష్యుడు అర్థం చెసుకున్నాడు కాని తనను సముదాయించడానికే ఇలా చెప్తున్నారేమో అని కాస్త గందరగోళ పడ్డాడు. 


”స్వామి వారు నన్ను క్షమించాలి. కేవలం తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జగద్గురు స్థానంలో ఉన్నవారిని పరీక్షిస్తున్నానని తప్పుగా భావింపవలదు. పీట పైన వడ్లు చల్లడం.. వాటిని వస్త్రంతో కప్పడం.. అవి వేయించటం.. ”


అతను పూర్తి చెయ్యకమునుపే స్వామి వారు నవ్వుతూ “నాకు అలాంటి అనుభవం కలిగిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నావు కదూ?“ అని ఒక చెక్క పీట తెప్పించి తూర్పు అభిముఖంగా వేయించారు. దాని పైన వడ్లు పోయమని చెప్పారు. తరువాత స్వామి వారు దాని పై వారి వస్త్రాన్ని కప్పి పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకున్నారు. ఈపాటికి అక్కడకు చాలా మంది వచ్చారు. 


”కేవలం కొన్ని క్షణాల తరువాత వడ్లు టప టప మని పగులుతూ పేలాలుగా మారటం వినిపించింది. కొద్దిగా పొగ కూడా కనిపించింది. స్వామి వారు పైకిలేచి ధాన్యం పై పరచిన వస్త్రం తీయగానే పీట పైన తెల్లని మల్లెపూలవలే ఉన్న పేలాలు కనపడ్డాయి. అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు.“ 


ఇది విన్న తరువాత శంకరన్ ఏదో మాట్లాడబోగా, పరమాచార్య స్వామి వారు అడ్డుపడుతూ “ఏమిటి శంకరా? చేసి చూపించమని నన్ను అడుగుతున్నావా?” అని గట్టిగా నవ్వారు. 


శంకరన్ మహాస్వామి వారి పాదాల పై పడి తన అష్ట అంగములు నేలకు తగులుచుండగా “చాలు పెరియవా నాకు జ్ఞానోదయమైంది. మంత్రజపం శక్తిని దాని గొప్పని అర్థం చేసారు. నన్ను దీవించి పంపించండి.”


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము 🌹



ఇరు ధర్మ సతులతో తిరుమల జేరియు 

               యానందు డయ్యెను యన్నమయ్య 

దివ్య పుష్కరణిలో తీర్థ స్నానము జేసి 

              శ్రీ వరాహు గుడిని చేరి మ్రొక్కె 

పసిడి వాకిలి దాటి పరమాత్ము దర్శించి 

              తీర్థ ప్రసాదముల్ తీసుకొనియె 

కడుసంతసంబున కాన్కల నర్పించి 

             సాష్టాంగ దండముల్ సల్పె హరికి 

మంటపంబులు మఱియును వంట శాల 

పరవశంబున  జూచియు బయటకొచ్చి 

స్వామి సత్రంబు నందున సతుల తోడ

స్థిరముగా నుండె దివ్యమౌ తిరుమలందు 


సతు లిద్దఱు పరిచర్యల

నతి నిష్ఠతొ  జేయు చుండ నానందముగన్ 

యతులిత మగు స్థిర భక్తి తొ 

సతతము హర్యర్చనంబు సల్పగ సాగెన్ 


అనయము హరి కీర్తనముల 

వినయంబున పాడు కొనుచు వీడని భక్తిన్ 

ఘనుడగు యా యన్నమయ్య 

వినుతించుచు నుండె హరిని విభవము తోడన్ 


తిరుమలందు కలలొ శ్రీ యన్నమయ్యకు 

వేంకటేశ్వరుండు యెదుట నిలిచి 

యతడు జెప్పినట్టి హరికీర్తనములను 

యమిత శ్రద్ధతోడ యాలకించె


తడుప రన్నమయ్య తత్ కల యోచించి 

పాట వినిన యట్టి ప్రభుని దలచి 

శ్రీనివాసు పైన చెప్పంగ మదిదల్చె 

దినము కొక్క పాట వినయముగను 


దినమున కొక సంకీర్తన 

వినయంబున జెప్పు టకును విడువక యెపుడున్ 

మనమున స్వామిని దలచుచు 

ఘనుడగు శ్రీ యన్నమయ్య కాంక్షించె మదిన్ 




గోపాలుని మధుసూదనరావు 🙏

మిరియాల అన్నం

 🌹🌹 ఆరోగ్యంకోసం 🌹🌹

           🌹సేకరణ🌹

🥀ప్రతి  నెలా  ఒక్కమారు  మిరియాల  అన్నం  తినటం  వలన కలుగు  ఆరోగ్య  ప్రయోజనాలు .🥀 


🥀నెలకోసారి ఇంటిల్లపాదీ మిరియాల అన్నం తినండి.. మీకు అనారోగ్య సమస్యలే రావు..! 


మిరియాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాల్లో ఉపయోగించే చాలా సాధారణమైన మసాలా దినుసులలో ఒకటి. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి. ఇది చాలా ఘాటుగా ఉండటమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిరియాలు జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది. ప్రతి రోజు నల్ల మిరియాలను తినే కోట్లాది మందికి, ఇది ఒక ఔషధ మసాలా అనే విషయం తెలియకపోవచ్చు. అంతేకాక మిరియాల్లో ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. నెలకోసారి కుటుంబం అంతా మిరియల అన్నం తింటే అద్బుత ప్రయోజనాలున్నాయి..🥀 


🥀మిరియాల అన్నం ఇలా చేయాలి..🥀

🥀కావల్సినవి: 

పొడిపొడిగా ఉడికించిన అన్నం – కప్పు, సెనగపప్పు – అరకప్పు, మిరియాలపొడి – రెండు చెంచాలు, పల్లీలు -అరకప్పు, పచ్చిమిర్చి – ఆరు, తాలింపు దినుసులు -ఒకటిన్నర చెంచా, కరవేపాకు రెబ్బలు – రెండు, కొబ్బరి తురుము – పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ, నూనె – అయిదు చెంచాలు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత. 🥀

🥀తయారీ: 

అన్నాన్ని వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. సెనగపప్పులో కొద్దిగా ఉప్పూ, పసుపూ వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి తాలింపుగింజలు వేయించుకోవాలి. తరవాత పచ్చిమిర్చీ, కరివేపాకూ, పల్లీలూ వేయించాలి. ఇందులో ఉడికించిన సెనగపప్పూ, మరికొంచెం ఉప్పూ, కొబ్బరి తురుమూ, మిరియాల పొడీ వేసుకునిబాగా వేయించి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిపితే సరిపోతుంది.🥀 


🥀మిరియాల అన్నంతో ప్రయోజనాలు…🥀 


🥀 జీర్ణశక్తిని పెంచుతాయి. కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచుతాయి. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే కాకుండా మలినాలు అన్నీ బయటికి పోతాయి.

* మిరియాలతో చేసిన వాటిలో ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

విశ్రాంతి చేకూరుస్తుంది.

* మిరియాల్లో విటమిన్ ‘C’ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకర రోగ నిరోధక వ్యవస్థ మరియు జీవక్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వను నివారించి, బరువు తగ్గుటను ప్రోత్సహిస్తాయి.

* రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది. జలుబు దగ్గు గొంతు గరగర ముక్కుదిబ్బడ జీర్ణశక్తిని పెంచటం గొంతును శుభ్రపరచటం కీళ్లనొప్పులు ఉబ్బసం కలరా మలేరియా ఇలా ఎన్నో వ్యాధులకు మిరియాలు ఔషధం లా ఉపయోగ పడతాయి.🥀

🥀మిరియాలను ఆహారంలో తీసుకుంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్రవించడం ద్వారా జీర్ణ ప్రక్రియను తేలిక చేస్తుంది. అలాగే ప్రేగు మరియు కడుపు సంబంధించిన వ్యాధుల నివారణలో సహాయపడుతుంది.

* బాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధుల చికిత్సలో నల్ల మిరియాలు సహాయపడతాయి. మలబద్ధకం, అతిసారం మరియు ఉదర సంబంధిత వ్యాధుల చికిత్సలో నల్ల మిరియాల యొక్క ప్రభావం ఉందని గుర్తించారు.

* మిరియాలు ఫ్రీ రాడికల్ ని శుద్ధి చేయడం ద్వారా క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతుంది. అంతేకాక క్యాన్సర్ యొక్క కొన్ని రకాల కార్యకలాపాల ఉదృతిని తగ్గిస్తుంది. చర్మ క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడుతుంది.

* మిరియాలు జీవక్రియను పెంచటానికి సహాయపడి, అవసరంలేని కేలరీలను కరిగించి బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మిరియాలు స్థూలకాయంనకు వ్యతిరేకంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకుంటే కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

* మిరియాలు ఒక యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మిరియాలలో ఉండే పెపైన్ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేసి నాడీ వ్యవస్థ ఉద్దీపనకు సహాయపడుతుంది. దాని పలితంగా అభిజ్ఞతా సామర్థ్యం పెరుగుతుంది.

* మిరియాలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన లైన్స్,ముడతలు,నల్లని మచ్చలు, అకాల వృద్ధాప్య చిహ్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మాన్ని రక్షిస్తుంది. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చటం ద్వారా చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూడవచ్చు.🥀

శ్రీ కామాక్షీ ధ్యానశ్లోకము-

 శ్రీ కామాక్షీ ధ్యానశ్లోకము-


చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ

కాంచినిలయా మే। చిరతర సుచరిత సులభా

చిత్తం శిశిరయతు చిత్సుధాధారా ।।



శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ మహాస్వామివారి

ధ్యానశ్లోకము-


అపారకరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణమ్ ।శ్రీచంద్రశేఖరగురుం

ప్రణమామి ముదాన్వహమ్।।


శ్రీ జయేంద్రసరస్వతీమహాస్వామివారి ధ్యాన

శ్లోకము-


అద్వైతానుభవాభీతి ప్రాపకాయ శివాత్మనే।

కల్యాణకల్పతరవే జయేంద్రగురవే నమ:।।



శ్రీ శంకర విజయేంద్రసరస్వతీమహాస్వామివారి

ధ్యానశ్లోకము-


వేదాంత పీయూషభరార్ద్ర రూపం

లోకైకదీపాయితవాక్ప్రసారమ్।

కారుణ్యసింధుం సతతం నమామి

శ్రీ  దేశికేంద్రం విజయేంద్రదేవమ్।।

ఒక్కడే అయిన పరమాత్మ

 శ్లో!! మృత్పిండమేకం బహుబాంఢరూపం 

సువర్ణమేకం బహు భూషణాని

గోక్షీరమేకం బహు ధేను జాతం

ఏకః పరమాత్మా బహుదేహ వర్తీ


మట్టి అనే ఒక్క పదార్ధం అనేక రూపాలుగా మారినట్లు, బంగారం అనే ఒక్క పదార్ధం అనేక ఆభరణాలుగా మారినట్లు, గోవులలో అనేక రంగులు ఉన్నా క్షీరం ఒకటే అయినట్లు, ఒక్కడే అయిన పరమాత్మ అనేక రూపాలలో ఉన్నాడు.

తండ్రి ఆన్సర్

 _*తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి*_ _*కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.?*_

_*తండ్రి ఆన్సర్ హైలైట్.!*_


_కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు._

_తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు_


_“నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు?”_


_“ఎందుకు చేయించుకోవాలి” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు._


_“ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు”._


_internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు._


_*తండ్రి :* “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?”_


_”ఆవును అవును”, అని కొడుకు జవాబిచ్చాడు._

_“ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు…_

_ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”, అంటూ వివరించే ప్రయత్నం చేశాడు._


_*అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!!*_


_“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను._

_ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను._


_నీకు తెలుసు నేను ఒంటరివాడిని._

_నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే._

_నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను._


_రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు._

_నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు._


_కొన్ని రోజుల క్రితం…అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది._

_మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు._


_నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా.?_

_పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా.??_

_కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా..???_


_ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే... నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!!_


_నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం._

_నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా?_

_కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి._


_*టెక్నాలజీ ఉండాలి కానీ.,*_

_*అది మాత్రమే జీవితం కాకూడదు !*_

_*దానికి మనం బానిసలం కాకూడదు!*_


_*మనుషులతో జీవించండి…..*_

_*పరికరాలను వాడుకోండి…..*_


_*” ప్రేమించవలసిన మనుషులను వాడుకొని,*_

_*వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి “*_


_*( తెగిపోతున్న మానవ సంబంధాల”*_

_*గురించి ఒక్కసారైనా అలోచించండి.)*_🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కైలాస_పర్వతం

 #కైలాస_పర్వతం పైన #ఎత్తైన_శిల్పాలా!!

ఇది నిజంగా #అద్భుతమే కదా!!

హిందువుల విశ్వాసం ప్రకారం, 

కైలాస మనస సరోవర్ పర్వతం శివుని నివాసంగా పరిగణించబడుతుంది.కానీ ఈ రోజు వరకు ఎవరూ కైలాష్ మానససరోవర్ పర్వతాన్ని అధిరోహించలేదు. 


మొట్టమొదటిసారిగా, ఒక విదేశీయుడు "#గూగుల్ ఎర్త్" చేత కైలాస మనససరోవర్ పర్వతం యొక్క వీడియోను సృష్టించాడు, ఇది చాలా #నమ్మశక్యం_కాని అభిప్రాయాలను కలిగి ఉంది మరియు దాని వివరాలను విన్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. *


#250అడుగుల ఎత్తు .... 

అవును, 250 అడుగుల ఎత్తు ఉన్న కైలాస మానసరోవర్ పర్వతంపై #రాతి_శిల్పాలు ఉన్నాయని ప్రపంచంలో ఎవరికీ తెలియదని ప్రతినిధి వీడియోలో చెప్పారు.ఇంత ఎత్తైన విగ్రహాలను ఎవరు తయారు చేసి ఉంటారనేది చాలా ఆశ్చర్యకరమైనది మరియు ఆశ్చర్యకరమైనది ???  కైలాస మనస సరోవర్ పర్వతం మిలియన్ల సంవత్సరాల వయస్సు కలిగినది.


 శివుడి నివాసం అయిన కైలాస మానస సరోవర్ పర్వతం యొక్క అద్భుతమైన వాస్తవాల గురించి ఎవరూ తెలుసుకోకపోవడం ఆశ్చర్యకరం.#భోలే_నాథ్ యొక్క లీల సాటిలేనిదని మనిషి మాత్రమే చెప్పగలడు.


 * వీడియో చూడటం ద్వారా ప్రజలకు హిందూ ధర్మం పై అచంచలమైన విశ్వాసం కలుగుతుంది.శివుని నివాసమైన కైలాస మానససరోవర్ పర్వతాన్ని సందర్శించి, మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా, ఆశీర్వదించారని భావించి నమస్కరించండి !!!

నాన్నకు కన్నీళ్లు వున్నాయి 👨‍👧‍👦*

 *🌹నాన్నకు కన్నీళ్లు వున్నాయి 👨‍👧‍👦*


        *నాన్నలందరికి అంకితం* 


*నాన్న మనకోసం ఏం చేశాడో*

*ఏం కోల్పోయాడో  మనకు తెలియదు..!*


*జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి. తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు తండ్రి. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.*

 

*ఎందుకంటే.. నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు. అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.*

 

*‘ఎప్పుడూ పనేనా? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.*

 

*మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. వృద్ధాప్యం ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*

 

*తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు. మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ.*

 

*ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా?.. నాన్న కూడా ఏడుస్తాడు. కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు.*

 

*పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. ‘నా కోసం నేను ఏదీ దాచుకోలేదే..’ అనుకుంటాడు.*

 

*నిజానికి ‘నేను’ అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.*

 

 *కొడుకు ఎంత మంచివాడు * ప్రయోజకుడైతే తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.... అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు.( పాజిటివ్ గా ఆలోచించండి) ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ నాన్న పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు.** 

 

*మీ కోసం రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు..’*


 *🙏ప్రతీ నాన్నకు సెల్యూట్ 🙏*

🌾👨‍👧‍👦🌾 👨‍👧‍👦🌾👨‍👧‍👦 🌾👨‍

శ్రీకృష్ణుడికి

 *📖 మన ఇతిహాసాలు 📓*



*శ్రీకృష్ణుడికి ఎంత మంది పిల్లలో తెలుసా?*



శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ. కానీ, గోవిందుడి కొడుకులు ఎవరు? ఎంతమంది ఉన్నారన్న అనుమానం కలుగుతుంది. మథురనిచేరి కంసుని చంపిన దేవదేవుడు తరువాత దేవకీ, వసుదేవుల చెంత వుంటూ వారిని అనుగ్రహించాడు. ఈ సందర్భంలో ఆయన అనేక వివాహాలు చేసుకున్నాడు. ప్రధానంగా ఎనిమిది మంది భార్యలు ఆయనకు అష్ట మహిషులుగాప్రసిద్ధి పొందారు! శ్రీకృష్ణ పత్నులైన ఆ ఎనిమిది మంది... లక్ష్మీదేవీ అవతారమైన రుక్మిణీ మాత, సత్రాజిత్తు తనయ అయిన సత్యభామ, శ్రీరాముని బంటైన జాంబవంతుని పుత్రిక జాంబవతి, అలాగే, వివిధ రాజ్యాల రాకుమార్తెలైన నాగ్నజితీ, భద్ర, మిత్రవింద, కాళింది, లక్షణ. ఈ ఎనిమిది మందితోనూ శ్రీకృష్ణ పరమాత్మకి పదేసి మంది కొడుకులున్నారని చెబుతోంది భాగవత పురాణం! అంటే, మొత్తం ఎనభై మంది తనయులున్నమాట!


గోపాలబాలుడి కులంలో పుట్టిన ఆయన వంశోద్ధారాకుల్లో అందరూ ప్రాముఖ్యత వహించలేదు. అయితే, రుక్మిణీ దేవీ కుమారుడైన ప్రద్యుమ్నుడు మహా సుందరుడు, వీరుడు. ఆయన సాక్షాత్తూ రతీదేవీ భర్త అయిన మన్మథుడు. శివుడికి తపోభంగం చేసిన కారణాన ఆయన రూపం నశించి పోగా.. రుక్మిణీ దేవీ గర్భంలో జన్మించి తిరిగి రూపం పొందాడు ప్రద్యుమ్నుడుగా! రుక్మిణీదేవీకి ప్రద్యుమ్నుడు కాక మరో తొమ్మిది మంది పుత్రులున్నారు. అలాగే, సత్యభామకి భాను, సుభాను, స్వర్భాను అంటూ పది ముంది భాను పేరుగల పుత్రులున్నారు. ఇక మరో ప్రధానమైన కృష్ణుడి పత్ని అయిన జాంబవతి కుమారుడు సాంబుడు. ఈయన కురుక్షేత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాటం చేసి చివరకు ప్రాణాలతో నిలిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో మరణించని అతి కొద్దిమందిలో జాంబవతి, శ్రీకృష్ణుల కుమారుడైన సాంబుడు కూడా ఒకరు! ఈయన కాక మరో తొమ్మిది మంది సంతానం జాంబవతికి వున్నారు.


రుక్మిణీ, సత్యభామ, జాంబవతి లాగే ఇతర శ్రీకృష్ణ పట్టపు రాణులకు కూడా అనేక మందిపుత్రులున్నారు. వీళ్లే కాక అనంతమైన శక్తి కలిగిన ఆ స్వామికి నరకాసురవధ అనంతరం 16,108మంది స్త్రీలని పెళ్లాడవలసివచ్చింది. వారంతా నరకాసురుని బంధీలుగా మగ్గిపోయిన వారు! వారి ద్వారాకూడా శ్రీకృష్ణునికి ఎందరో సంతానం కలిగారు. అయితే, వాళ్లలో అందరూ కలియుగ ప్రారంభసమయంలో మురళీ మోహనుని అవతార సమాప్తి తరువాత అంతమైపోయారు. శ్రీకృష్ణ, బలరాముల వంశంలో అంతః కలహాలు పెల్లుబికి ఒకరినొకరు కొట్టుకుని చంపుకున్నారు! అలా కృష్ణుని సంతానం ఏదీ మిగలలేదు. రుక్మిణీ, శ్రీకృష్ణ పరమాత్మల తనయుడైన ప్రద్యుమ్నుడికి మాత్రం అనిరుద్ధుడనే కొడుకు కలిగాడు. ఆయన మాత్రం కృష్ణ వంశాన్ని కొనసాగించాడు!


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

కథ

 *✍🏼 నేటి కథ ✍🏼*



*తలపాగా ఖరీదు*



ఒకరోజు నస్రుద్దీన్‌ ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు.

"రాజా ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను" అన్నాడు.

"అలాగా! దీని ఖరీదు ఎంత?" అన్నాడు రాజు.


"వెయ్యి వరహాలు రాజా" అన్నాడు నస్రు. ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి ఒకరు "రాజా! ఈ నస్రుద్దీన్‌ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. ఈ తలపాగా అంత ఖరీదు చెయ్యదు." అని చెవిలో చెప్పాడు.


మంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి. అయినా తలపాగా నచ్చడంతో, "నస్రుద్దీన్‌! ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుందే. ఎందుకంత ధర?" అని అడిగాడు.


"రాజా! దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్పవాళ్ల తలపైనే ఉండే తలపాగా అనిపించింది. అంత గొప్పవాళ్లు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది. అందుకే బేరం కూడా చేయకుండా వెయ్యి వరహాలు పెట్టి కొన్నాను రాజా!" అన్నాడు నస్రు.


నస్రు మాటలకి రాజు పొంగిపోయాడు. వెంటనే వెయ్యి వరహాలిప్పించి, ఆ తలపాగా తీసుకున్నాడు.

వరహాలు తీసుకుని వెళ్తున్న నస్రుకి బయట మంత్రి కనిపించాడు. అతని దగ్గరకి వెళ్లి, మంత్రిగారూ! మీకు తలపాగా గొప్పదనం తెలుసు, కాని నాకు రాజుగారి బలహీనత తెలుసు" అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

తెలుసు కుందాం

 *✅తెలుసు కుందాం✅*



*🟥చలికాలంలో మన చేతివేళ్లు ఇతర దేహ భాగాల కన్నా చల్లగా ఉంటాయి. ఎందుకు?*


🟢 ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక భిన్న ప్రయోగం చేద్దాం. బాగా వేడిగా ఉన్న నీటిని రెండు సమాన పరిమాణం గల గిన్నెలలో తీసుకోండి. వాటిలో ఒకదాని మూతి చిన్నదిగానూ, మరొక దాని మూతి వెడల్పుగానూ ఉండాలి. కొంతసేపటికి జాగ్రత్తగా గమనిస్తే, వెడల్పు మూతి ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్లబడుతుంది. ఈ పరిశీలన బట్టి తెలిసేదేమంటే, నీటి ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండే... అంటే మూతి వైశాల్యం ఎక్కువగా ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్ల బడుతుంది. అంటే వేడిని త్వరగా కోల్పోతుంది అని అర్థం.


ఇప్పుడు ప్రశ్న విషయానికి వస్తే, మన శరీరంలో ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణ పరిమాణం దేహంలోని ప్రతి ఘన సెంటిమీటరులో సమానంగా ఉంటుంది. కానీ ప్రతి ఘన సెంటిమీటరుకు చేతివేళ్లు, ముక్కు ఉపరితల వైశాల్యం మిగతా భాగాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చేతి వేళ్లు, ముక్కు వాటి ఉపరితలం నుంచి వేడిని త్వరగా కోల్పోయి చల్లబడతాయి. మిగతా దేహ భాగాలు నిదానంగా వేడిని కోల్పోవడంతో, అవి చేతివేళ్ల కన్నా కొంచెం వెచ్చగా ఉంటాయి.

వడ్డించే వాడు

 *🤠 నేటి సామెత 🌸*



*వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు*



భోజనాలకు బంతిలో కూర్చున్నప్పుడు మొదటగా వున్నావారికి అన్ని పదార్థాలు వడ్డిస్తారు. చివరకు వచ్చేసరికి కొన్ని పదార్థాలు అయిపోవచ్చు. ఆ కారణంగా చివర బంతిలో కూర్చున్న వారుకి అన్ని భోజన పదార్థాలు అందక పోవచ్చు. కాని వడ్డించే వాడు మన వాడైతే మనం చివరన లేదా వెనకగా కూర్చున్నా మన కోసమని మనవాడైన వడ్డించే వాడు మన వద్దకు వచ్చి కావలసిన పదార్థములను వడ్డిస్తాడస్ని అర్థము.

మూల శ్లోకాలు 1

 🍀🌺🍀🌺🍀 🌺🍀🌺🍀🌺🍀18.


సంస్కృత  వాక్యాలకు మూల శ్లోకాలు:


18.   వృద్ధ నారీ పతివ్రతా!

       ➖➖➖➖➖➖✍️️




*అసమర్ధస్య సాధూనాం*

*నిర్ధనస్య జితేంద్రియః*

*వార్ధక్యో దేవతా భక్తిః*

*వృద్ధ నారీ పతివ్రతా!*


అసమర్ధుని మంచితనం, 


ధనం లేని పేదవాని ఇంద్రియ నిగ్రహం,


ముసలి తనంలో దైవ భక్తి, 


వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే!✍️


                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*ఆ దైవం ఎవరు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


              *ఆ దైవం ఎవరు?*

                  ➖➖➖✍️


*దైవము కంటికి కనిపించడు..కదిలే కాలము కంటికి కనిపించదు. అయితే.. కనిపించని కాలాన్ని మనకు తెలియచెప్పేది.. ఆ కనిపించని దైవమే. అదే.. కాలా నికి, దైవానికి ఉన్న అవినాభావ సంబంధం.* 


*మరి.. ఆ దైవం ఎవరు ? ఇంకెవరు? సూర్య భగవానుడే. ఆయన కదలికే... కాలం కదలిక. అందుకే.. సూర్యుని ‘ప్రత్యక్షదైవమ్’ అన్నారు. ఇది నిరంతర ప్రయాణం. మరి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది కదా.* 


*ఉంది. ఏమిటా గమ్యం? ‘జననం నుంచి..జననం’ అనే గమ్యానికి చేరడమే ఈ నిరంతర ప్రయాణానికి ఉన్న లక్ష్యం. ఇదేమిటి? జననానికి మరణమేకదా... చివరి గమ్యం? అనే ప్రశ్న మీకు కలుగవచ్చు. మరణమే.. చివరి గమ్యమైతే...అక్కడితో కాలం యొక్క ప్రయాణం ఆగిపోయినట్టే. మరి కాలం ఆగదు కదా. జననానికి..మరణం ఓ మజిలీ మాత్రమే. ఇక్కడే.. మీరు నిశితంగా పరిశీలించాలి. జన్మించిన జీవి..మరణించి, మరో జీవిగా జన్మించి... ఈ నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే.. ఈ ప్రయాణం, మరణం అనే మజిలీ గుండా సాగుతుంది. అంతే! ఈ కాలరథానికి సారధి ‘సూర్యుడు’. ఎందుకంటే... జీవికి..ఉత్పత్తి, ఎదుగుదల, నాశనము అనే మూడు దశలు ఉన్నట్టే..సూర్యునకు ఉదయము, పూర్ణవికాసము, అస్తమయము అనే మూడు దశలు ఉన్నాయి. బాలభానుడుగా ఉదయించిన సూర్యుడు.. మధ్యాహ్నానికి పూర్ణవికాసుడై.. సాయంకాలానికి అస్తమిస్తాడు.* 


*నిజానికి సూర్యునకు అస్తమయం ఉందా.. లేదే. ఇక్కడ ఆయన అస్తమయం.. మరొకచోట ఉదయానికి నాంది. అంతే. అలాగే.. జీవికి మరణం.. మరోచోట జననానికి నాంది.* 


*అందుకే అస్తమయం లేని సూర్యుడు.. జననం నుంచి జననం అనే గమ్యానికి చేర్చే సారధి అయ్యాడు. జీవికి ఈ వైరాగ్యాన్ని తెలియచెప్పడమే..ఆయన ఉదయ, మాధ్యాహ్నిక, సాయం సంధ్యల లక్ష్యం.*


*ఈ లక్ష్యాన్ని గుర్తించడం కోసమే., ఈ త్రిసంధ్యలలో సూర్యుని ఉపాసించాలి అనే నియమాన్ని మనకు ఏర్పాటు చేసారు... మన ఋషులు.*


*సూర్యోపాసన వల్ల...తేజస్సు, బలము, ఆయువు, ఆరోగ్యము వృద్ధిపొందుతాయి. అంతేకాదు.. జన్మించిన జీవి.. మరోజన్మ అనే గమ్యం చేరాలంటే ‘మరణం’ అనే మార్గం గుండానే వెళ్లాలని చెప్పాను కదా. ఈ మరణమార్గం సూర్యలోకం గుండానే సాగుతుంది.*


* మరల జన్మే లేకపోతే..కాలం ప్రయాణం ఆగదుకానీ.. జీవికి, ప్రయాణం ఆగిపోతుంది. అదే ‘మోక్షం’. ఆ మోక్షమార్గమే..పరమాత్ముని సన్నిదికి చేర్చే ‘పరమపద సోపాన మార్గం’. జీవికి ఈ నిత్య సత్యాన్ని తెలియచెప్పడమే.. సూర్యగమనం యొక్క సారాంశం.*


*అందుకే..ఆ ప్రత్యక్షదైవాన్ని త్రిసంధ్యలలోనూ ఉపాసించాలి. అదే...మనం చేసే ఈ జనన, మరణ ప్రయాణానికి మనం చెల్లించే ప్రయాణ మూల్యం.*✍️


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మౌఢ్యమి

 https://t.me/joinchat/SIa6-4GeLjIInXl1

మౌఢ్యమి అంటే ఏమిటి.?

గురుగ్రహమే కానీ , శుక్ర గ్రహమేకానీ సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు.


మౌఢ్యకాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు,

అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి,

గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.


శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము.

మౌఢ్యమిని "మూఢమి"గా వాడుకభాషలో పిలుస్తారు. 

ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు,

మూఢమి అంటే చీకటి అని అర్ధం, మూఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్న గురు , శుక్ర మౌఢ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.

శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు , పోటులలో మార్పులు వస్తాయి.


శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు , ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి.

 శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు, జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు...

ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయడం మంచిది.


మౌఢ్యమిలో చేయకూడనివి:-

పెళ్ళిచూపులు , వివాహం , ఉపనయనం , గృహారంభం , గృహప్రవేశం , యజ్ఞాలు చేయుట , మంత్రానుష్టానం , విగ్రహా ప్రతిష్టలు , వ్రతాలు, నూతన వధువు ప్రవేశం , నూతన వాహనము కొనుట , బావులు , బోరింగులు , చెరువులు తవ్వటం , పుట్టువెంట్రుకలకు , వేదా"విధ్యా"ఆరంభం , చెవులు కుట్టించుట , నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయరాదు.


మౌఢ్యమిలో చేయదగినవి:-

జాతకర్మ , జాతకం రాయించుకోవడం , నవగ్రహ శాంతులు , జప , హోమాది శాంతులు , గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు , సీమంతం , నామకరణం , అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా , శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును. గర్భిణి స్త్రీలు , బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సివస్తే శుభ తిధులలో అశ్వని , రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.

స్వస్తి🙏🙏🙏🙏