23, మే 2023, మంగళవారం

భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                       ఉపక్రమణిక 


      కాశీ పట్టణంలో  ఒక వ్యాకరణ పండితుడు "డుకృఞ్ కరణే" అన్న వ్యాకరణ ధాతుపాఠాన్ని వదలకుండా వల్లె వేయడం ఆదిశంకరుల కంటబడింది. 

      ఆ వ్యాకరణ పండితునిలో 

  - స్వస్వరూప జ్ఞానం కొరవడి, 

  - కనిపిస్తున్న అసత్యాన్ని అనంత సత్యమని నమ్ముకొని 

  - భవబంధాలలో తగులుకొని 

  - దరిజేరటానికి దారీ తెన్నూ కానక కొట్టుమిట్టాడుతున్న జీవరాసులు కదలాడాయి. 


     అంతే! 

    

    శంకరాచార్యుల హృదయం ఉత్తుంగతరంగంలా ఉవ్వెత్తున పైకెగసింది. 

    ఆ మహనీయుడు త్రుటిలో ఆ వ్యాకరణ పండితుని ముంగిట నిలిచారు. 

    ఆయన శిష్యులూ పరుగు పరుగున చేరారక్కడ. 


   "భజగోవిందం భజగోవిందం 

     గోవిందం భజ మూఢమతే"  అంటూ, 

    

    విశ్వాన్ని మేలుకొలుపే గీతాలాపనకి ఉద్యమించిందాయన గళం. 

    అనంత విశ్వమూ ఆ పల్లవిని అందుకొంది. 

    పన్నెండు శ్లోకాలని శంకరులూ, వారి శిష్యులు ఒక్కొక్కరూ ఒక్కొక్క శ్లోకాన్నీ ఆశువుగా పలికారు. 

    కాశీ అన్నపూర్ణ మాత అనుగ్రహించి వెన్నంటగా, మనమూ ఆ సర్వజన శ్రేయో గీతంతో గొంతు కలుపుదాం. 

    నిశ్రేయస పథగాములమై ముందుకురుకుదాం. 

    రేపటి నుంచీ ఆ శ్లోకాలని ఒక్కొక్కటిగా తెలుసుకొందాం. 


Introduction by Sir Raajaaji at the Gramphone recording of Bhajagovidam verses sang by M S Subbulakshmi. 


M S సుబ్బులక్ష్మి గానం చేసిన భజగోవిందం గ్రాంఫోను రికార్డు ముందుమాటగా రాజాజీ అన్న మాటలు 👇 


    Adi Shankaracharya wrote a number of Vedantic works for imparting knowledge of the Self and the Universal Spirit. 

    He also composed a number of hymns to foster Bhakti in the hearts of men. 

    One of these hymns is the famous Bhaja Govindam.

    The way of devotion, is not different from the way of knowledge or Jnana. 

    When intelligence matures and lodges securely in the mind, it becomes wisdom. 

    When wisdom is integrated with life and issues out in action, it becomes Bhakti.

    Knowledge, when it becomes fully mature is Bhakti. If it does not get transformed into Bhakti, such knowledge is useless tinsel. 

    To believe that Jnana and Bhakti - knowledge and devotion are different from each other, is ignorance. 

    If Sri Adi Shankara himself who drank the ocean of Jnana as easily as one sip’s water from the palm of one’s hand,  

    sang in his later years, hymns to develop devotion. 

    It is enough to show that Jnana and Bhakti are one and the same. 

    Sri Shankara has packed into the Bhaja Govindam song: the substance of all vedanta and 

    set the oneness of Jnana and Bhakti to melodious music. 


* Tomorrow onwards, daily, let us know each Sloka with its meaning. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

జగద్గురు అర్హత

 జగద్గురు అర్హత


1931వ సంవత్సరం చివరి రోజుల్లో బ్రిటీషు ప్రభుత్వం వారు కాంగ్రెస్ కార్యకర్తలను బంధించి, హింసించడం చాలా ఎక్కువగా ఉండేది. వారికి సహాయం చేసిన ప్రజలకు, సంస్థలకు కూడా తీవ్రమైన పరిస్థితులు కల్పిస్తామన్న హెచ్చరికలు జారీచేశారు.


పరమాచార్య స్వామివారు ఉత్తర ఆర్కాటు జిల్లాలోని ఆరణిలో మకాం చేస్తున్నారు. కాంగ్రెస్ వ్యక్తులు కొందరు స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారు. ఈ సమయంలో స్వామివారు కాంగ్రెస్ వ్యక్తులను కలవడం వల్ల మఠానికి ఏదైనా సమస్య వస్తుందని శ్రీమఠం అధికారులు తెలిపారు.


పరమాచార్య స్వామివారు వారి భయాలన్నింటిని విని, “సభ్యులందరినీ లోపలకు రమ్మని చెప్పండి. అలాగే శ్రీమఠం తరుపున వారందరికీ భోజనాదులు ఏర్పాటు చెయ్యండి” అని ప్రశాంతంగా చెప్పారు.


నివ్వెరపోయిన మఠం అధికారులు భయంభయంగానే స్వామివారి ఆదేశాలను పాటించారు. కాని ప్రభుత్వం ఎటువంటి సమస్య ఎదురుకాలేదు.


బ్రిటీషు ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిచర్య లేదన్న సంతోషకర వార్తను మఠం మేనేజరు స్వామివారికి తెలుపగానే, “నన్ను చూడాలన్న వారిని కలవకుండా నేను తలుపులు మూసుకుంటే, జగద్గురు అన్న బిరుదునామం ఉంచుకోవడానికి, ఈ పీఠ సింహాసనం పైన కూర్చోవడానికి నాకు అర్హత ఉండదు” అని చెప్పారు.


--- రా. గణపతి, “మహా పెరియవాళ్ విరుంధు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

మహనీయుల మంచి మాటలు.

 *మన మహనీయుల మంచి మాటలు.*

>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<                                              


 *అడవుల్లో తిరిగినా రాముడు  చెడిపోలేదు, అంతఃపురంలోపెరి గినా రావణుడు బాగుపడలేదు*       


 *వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో,అం తస్తులోనో ఉండదు. ఆలోచనల్లో,ఆచరణలోమాత్రమే ఉంటుంది.*

       

*కదలకుండా స్థిరం గాకూర్చుంటే మన శరీరం మన మాట వినక న రాలు అల్లుకుపోయి కదలలేని స్థి తికి వస్తాము*


*మన మనసు స్థిరంగాఉండకపో తే దానికి కూడా కష్టపడాల్సిందే*


*ఏది స్థిరం గాఉంచుకోవాలోఅది స్థిరంగా ఉంచుకోవాలి దేన్నీనిరం తరం కదల్చాలో*

*దాన్ని కదిలిస్తేనే శరీరం మనసు ఆరోగ్యం గా ఉంటాయి* 


*"విజయం సాధించాలంటే కావా ల్సింది దానిపట్ల ఉత్సాహం కృషి చేసేందుకు సుముఖత."*


*"నీచేయిదాటిపోయిన విషయ ముల గురించి నిన్ను వదిలి వెళ్ళి న వారి గురించి మరీ ఎక్కువగా ఆలోచించకు.                                                  నీవెంత ఆలోచించినా వాటిని సరిచేయలేవని తెలుసుకో."*


*"సహనాన్ని మించిన ఆయుధం లేదు. విశ్వాసాన్ని మించిన భద్ర త లేదు. నవ్వును మించిన ఔష ధంలేదు. ఈ మూడు ఉచితంగా నే లభిస్తాయి."* 


*"చేసిన తప్పుకు క్షమాపణ అడి గినవాడు ధైర్యవంతుడు. ఎదుటి వారి తప్పును క్షమించగలిగినవా డు బలవంతుడు."*


*భగవంతునికి దగ్గరవ్వాలిఅంటే ముందుగానియంత్రించుకోవల్సిం ది మనమనస్సును అందులోము ఖ్యంగా మాటను ఏమాట బడితే ఆ మాట అనేసి నేను కరెక్ట్ గానే అన్నాను అనుకుంటే! ఎదుటివా రు మన్నించినా భగవంతుడు మ టుకు క్షమించడు*


       *సర్వేషాంశాన్తిర్భవతు.*

షష్టిపూర్తి

 *షష్టిపూర్తి ఎందుకు చేస్తారు?*        

*మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120                       సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది.             60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది                  షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట          ‘ఉగ్రరథుడు’ అను పేరుతో, 70 వ యేట ‘భీమరథుడు’        అను పేరుతో , 78 వ యేట ‘విజయరథుడు’      అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు. ఆరోగ్య.        సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ.*       *షష్టిపూర్తి."*


*బృహస్పతి, శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.*


*మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.*


*షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము… ‘ఆయుష్కామనయజ్ఞము’*


*పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.*


*తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీసి వాటిమీద అయిదు అడ్డగీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం. అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను , 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు.*


*పక్షములను, తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనిని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము, భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లను ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు , నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు.*


*అపమృత్యు నివారణార్థం హోమాల్ని , జపాలని కుడా చేస్తారు. తదుపరి బ్రహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు.* 


*పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.*


*పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి."*

ప్రవృత్తి నివృత్తి*

 *🌹🌹🌹అమృతస్య పుత్రాః🌹🌹🌹*


      *శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం*


                     *మొదటి భాగము*


                     *ప్రవృత్తి నివృత్తి*


                *వేదాలు ప్రవృత్తి, నివృత్తియని రెండు మార్గాలు చూపించాయి. ప్రపంచ వ్యవహారాలను ధార్మికంగా నిర్వహించడం ప్రవృత్తిమార్గం. ప్రాపంచిక వ్యవహారానికి దూరంగా ఉండి జనన మరణ ప్రవాహం నుండి విముక్తుడగుట, పరమాత్మతో ఐక్యమగుట నివృత్తిమార్గం.*


                *ప్రవృత్తిమార్గం, వేదచోదిత ధర్మంపై ఆధారపడి వర్ణాశ్రమాలతో ఉండి తన శ్రేయస్సునకు, సంఘ శ్రేయస్సునకు తోడ్పడే రీతితో ఉంటుంది. పుణ్య కర్మ ఫలం క్షీణించగా మరల జన్మనెత్తుట జరుగుతుంది.*


              *అంటే స్వర్గ సౌఖ్యము శాశ్వతము కాదని తేలినట్లే గదా! లోకంలో గాని, స్వర్గంలో కాని శాశ్వత సుఖం అంటూ లేదు. ఇక్కడా, అక్కడా భయం, దుఃఖం, క్రోధం మామూలే! కన్ను, చెవులు మొదలైన ఇంద్రియాల వల్ల కొంత సౌఖ్యం అనుభవించే మాట నిజమే. కాని లోనున్న ఆత్మకు ఇవి సంతోషాన్ని ప్రసాదిస్తాయా? ఆత్మతృప్తి కల్గుతుందా?*


                   *అఖండానందం అనుభవించాలంటే నివృత్తి మార్గాన్నే అనుసరించాలి. సంఘానికి దూరంగా ఉండి ఆత్మనే చింతిస్తూ అదే బ్రహ్మమని భావిస్తూ సమాధి స్థితిలో ఉండిపోవడమే. లౌకిక సుఖాలననుభవిస్తూ ఒక్కొక్కప్పుడు బ్రహ్మానందం అంటూ ఉంటారు.*


               *నిజమైన బ్రహ్మానందం నివృత్తి మార్గంలోనే. ఇలా అని నేను చెప్పడం కాదు. వేదమే 'అనావృత్తి శబ్దాత్, అనావృత్తి శబ్దాత్' అని చెప్పిందని బ్రహ్మసూత్రాలలో ఉంది. శబ్దమనగా ఇక్కడ వేదం. ఇదే ఛాందోగ్యోపనిషత్ మరల మరల చెప్పింది. నివృత్తి మార్గం వల్లనే పరమ సుఖమని, వీటి తాత్పర్యం.*


*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

శ్రీశైల శిఖర దర్శనం

 శ్రీశైల శిఖర దర్శనం వెనుక రహస్యం మీకు తెలుసా ?


🍁🍁🍁🍁🍁


శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైంది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలంలో శిఖరదర్శనం చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు, అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి. అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు, పునర్జన్మ నుండి విముక్తులవుతారు. 


కొన్ని శతాబ్దాల క్రితం శ్రీశైల గర్భాన్ని చేరటానికి కారడవిలో, కాలి నడకన ప్రయాణించవలసి వచ్చేది. కొంతదూరం నడిచాక అప్పటికే అలసి సోలసిన కొందరు భక్తులు ఇక ఒక్క అడుగైనా ముందుకు వేయలేని స్థితిలో ఏదోవిధంగా ఈ కొండ శిఖరం (శిఖరేశ్వరం) కనబడేవరకు ప్రయాణించి శ్రీశైల శిఖరాన్ని చూసి తిరుగు ప్రయాణమయ్యేవారు. ఎంత దూరం నుంచి అయినా యీ శిఖరాన్ని చూస్తే గత జన్మల సంచిత పాపం సర్వమూ నశించి జనన మరణరూప సంసారచక్రం నుండి ముక్తి లభిస్తుందని పురాణాలు ఏకకంఠంతో చెబుతున్నాయి. కాలక్రమంలో ఈ శిఖరేశ్వరం నుండి శ్రీశైల ప్రధాన ఆలయ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని, అలా ఆలయ శిఖరం కనబడితే 6 నెలలలో మరణిస్తారని ఒక నానుడి ప్రజలలో నాటుకుపోయింది. ఈ విషయంలో సాహిత్యపరమైన ఆధారాలు ఏవీ లేకున్నా, ఆలయ శిఖరం స్పష్టంగా కనబడింది అని చెప్పిన వ్యక్తులు 6 నెలలలోపే దివంగతులవటం ఈ భావనకు బలాన్ని చేకూరుస్తుంది. కాగా, 6 నెలలలోపు ప్రాణాలను కోల్పోయే వారి కంటిచూపు అంత దూరంలో గలదాన్ని స్పష్టంగా కనబరుస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. 


శ్రీశైల ప్రధానాలయమైన శ్రీ మల్లికార్జునస్వామి ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న యీ శిఖరేశ్వరం వాస్తవంగా ఒక కొండ శిఖరం. ఈ శిఖరేశ్వరంలో కొలువు తీరిన 'వీరశంకరుడు' కాలక్రమంలో శిఖరేశ్వరునిగా ప్రసిద్ధుడయ్యాడు. ఈ వీరశంకరుడు ఎప్పుడు ప్రతిష్ఠించబడ్డాడో, ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇతమిత్థంగా చెప్పే ఆధారాలు నేటి వరకూ లభ్యం కాలేదు. కాని ఆలయం ఎదురుగా ఉన్న సా.శ. 1398  (శా.శ 1320) పార్థివ నామ సంవత్సర చైత్ర బహుళ దశమి బుధవారం నాటి ఈ దిగువ శాసనాన్ని బట్టి అప్పటికే యీ శిఖర పైభాగానికి భక్తులు తండోపతండాలుగా వెళ్ళే ఆచారం ఉన్నట్లు దృఢంగా తెలుస్తోంది.

.

.

.