19, మే 2024, ఆదివారం

విరాళాలు ఇవ్వగలరు

 విరాళాలు ఇవ్వగలరు 

రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.  మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 

 

ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని  మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 

9848647145

దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

          🕉️ *సోమవారం*🕉️

        🌷 *మే 20, 2024*🌷

        *దృగ్గణిత పంచాంగం*                  

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంతఋతౌః* 

*వైశాఖమాసం - శుక్లపక్షం*

*తిథి : ద్వాదశి* మ 03.58 వరకు ఉపరి *త్రయోదశి*

వారం :*సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : చిత్త* పూర్తిగా రాత్రితో సహా

*యోగం  : సిద్ధి* మ 12.11 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం : బాలువ* మ 03.58 *కౌలువ* రా 04.52 తె వరకు

*సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 09.00 - 11.00 సా 05.00 - 06.30* 

అమృత కాలం :*రా 10.42 - 12.28*

అభిజిత్ కాలం :*ప 11.38 - 12.30*

*వర్జ్యం : మ 12.06 - 01.52*

*దుర్ముహుర్తం : మ 12.30 - 01.22 & 03.05 - 03.57*

*రాహు కాలం : ఉ 07.13 - 08.50*

గుళిక కాలం :*మ 01.41 - 03.18*

యమ గండం :*ఉ 10.27 - 12.04*

సూర్యరాశి : వృషభం 

చంద్రరాశి : కన్య/తుల

సూర్యాస్తమయం :*ఉ 05.35*

సూర్యాస్తమయం :*సా 06.33*

*ప్రయాణశూల  :‌ తూర్పు* దిక్కుకు ప్రయాణం పనికిరాదు


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.35 - 08.11*

సంగవ కాలం :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం :*10.46 - 01.22*

అపరాహ్న కాలం :*మ 01.22 - 03.57*

*ఆబ్ధికం తిధి  : వైశాఖ శుద్ధ ద్వాదశి*

సాయంకాలం :*సా 03.57 - 06.33*

ప్రదోష కాలం :*సా 06.33 - 08.45*

నిశీధి కాలం :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*

_________________________

          🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

 🕉️ *ఓం నమః శివాయ*🕉️

🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🕉️🕉️🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🕉️🕉️🍃🌷

🌹🌷🕉️🍁🍁🕉️🌷🌹

Panchang


 

వైశాఖ పురాణం*_🚩 _*11

 🕉️ *సోమవారం - మే 20, 2024*🕉️

  _*🚩వైశాఖ పురాణం*_🚩 

     _*11 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

         *రతి దుఃఖము* 

    *దేవతల ఊరడింపు*

☘☘☘☘☘☘☘☘☘

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది ? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.


కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.


శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిదప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.


ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతిభక్తిమతీ ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను , శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్రహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు ఆచటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి ఇట్లనిరి.


కల్యాణీ ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.


రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును ? కావున ఇహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా !


*వైశాఖ పురాణం పదకొండవ* 

      *అధ్యాయం సంపూర్ణం*

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

The 12-step Script

 The 12-step Script that an Indian Software Engineer, who arrives in the USA mostly follows


𝗦𝘁𝗲𝗽 𝟭 

As a student,work hard to fulfill 3 goals

 (A) Pay off the Student Loan 

(B) Get a  job anywhere in USA

(C) Get *H1-B* approved 

(most important Goal) 


Simultaneously make elaborate plans to return back to India within 5 years

 ✈️


𝗦𝘁𝗲𝗽 𝟮 - 

H1-B approved🥳 

Enjoy the influx of Green Currency. Buy a Toyota Camry or Honda Civic or Nissan Altima

 Also, buy a property somewhere in India


𝗦𝘁𝗲𝗽 𝟯 

Invite Parents from India on Visitor Visas. 


Take them on the

*Char Dhaam Yatra*-

*Niagara Falls* 

*Statue of Liberty* 

*Charging Bull in the Wall Street*

*White House*

 🙄

𝗦𝘁𝗲𝗽 𝟰 

 Go to India,proposals and get married in 3 weeks - Of course it's the arranged marriage way !!

Come Back to the USA with your newly-married Spouse


𝗦𝘁𝗲𝗽 𝟱 

During weekends and lunchtime with other Indian friends, endlessly discuss 3 topics 


(A) When are you going to get your Green Card, and what is your priority date currently? 


(B) How Modi is transforming India 


(C) Cricket 🏏 Buy another property in India


𝗦𝘁𝗲𝗽 𝟲 - 

Buy a Home in the U.S Have 2 kids. Spend the next 15 years dropping them off to various Classes, attending Birthday parties, and visiting Home Depot for various Home projects


 *Step 7 -*  

Green card waiting is over.


𝗦𝘁𝗲𝗽 *8* 

By the time, you are in 40s, you have saved enough Funds. The plan for returning back to India, has not worked out. Now find new ways to spend money. 


Buy a Tesla or BMW or Mercedes Also your India Properties aren't lucrative anymore as INR has further depreciated against USD


So enroll into a difficult struggle of selling off the properties in India,paying a hefty *Capital Gains Tax* in India & remitting the funds back to US


𝗦𝘁𝗲𝗽 *9* 

Now comes the time for a Midlife crisis. Another shiny new Car, bigger Home, Green Card, and a High-paying job doesn't add anymore substance to your life. 


So do something exotic to add flavor to ur existence. Marathon Race, intermittent fasting or a new start-up


𝗦𝘁𝗲𝗽 *10* 

In your 50s and 60s, after your kids have graduated from Stanford or MIT or Princeton, discuss how your life would have been Very different, had you returned to India 5 years after coming to the USA

 🤔

 *Step 11* 

With Children going away & enough time in hand, cram each year with trips to Europe, visiting Pyramids in Egypt, enjoying Turkish Delights, & visit Italy.


Start rediscovering India and share with friends back in the USA how India has improved a lot in the recent Decades


 *Step 12* 

When Functional Mobility decreases - ponder over the big Question - whether to

Go back to India (or) 

stay in an Old Age Home or Assisted-living in USA


*Indian H1B Visa-holder's life in the USA in 12 Steps*

 


 😊

హిందూ దేశానికి

 *😡హిందూ దేశానికి వీళ్ళంతా ఎవరు?*


అయినా నాకెందుకు గాని

AP రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల కు ఇవ్వనున్న గౌరవ వేతనం 5, 000 రూపాయలుకు గాను ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లు ఆన్ లైన్ చేసుకున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

1)అనంతపురం.......... 643

2)చిత్తూరు................. 693

3)ఈ. గోదావరి.......... 5662

4)గుంటూరు............. 4292

5)కడప...................... 527

6)కృష్ణ.......................4376

7)కర్నూల్...................1019

8)ప్రకాశం................... 2495

9)నెల్లూరు.................. 1580

10)శ్రీకాకుళం................. 839

11)వైజాగ్.....................2114

12)విజయనగరం......... 1320

13)వెస్ట్ గోదావరి........... 4328

              మొత్తం --------------------

                                   29, 880

                                 ---------------

ఈ 13 జిల్లాల అఫ్రూవల్ కలెక్టర్ గారిచే అయిపోఇంది. వచ్చే 7 రోజులలో అకౌంట్ పడే అవకాశం

నెలకు 29,880×5000=14,94,00,000. (14 కోట్ల 94 లక్షలు)×48months=7171200000( ఏడు వందల 17 కోట్ల 12 లక్షల రూపాయలు) ఇది ప్రభుత్వం కేవలం క్రైస్తవపాస్టర్ లు గా అప్లై చేసుకున్న వారికి ఇస్తున్న మొత్తం. ఇక ముల్లాలు, మౌల్వీలు, కాజాలు ఎంత మంది ఉన్నారో వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది.ఇది మన ప్రభుత్వం ఘనత, అసలు వీళ్ళు రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తున్నారని గవర్నమెంట్ వీరికీ ఇంత డబ్బు పంపిణీ చేస్తుందో ఎవరికీ అంతుబట్టని విషయం.

అదే మనం గుడికి వెళ్తే..

పార్కింగ్ కి టికెట్ 

దర్శనానికి టికెట్ 

ప్రదక్షిణలకు టికెట్

ప్రసాదానికి టికెట్ 

తలనీలాలకి టికెట్

అర్చనకి టికెట్ 

హరతికి టికెట్ 

బొట్టుకి టికెట్ 

బోణంకి టికెట్  

కొబ్బరికాయ కొడతానికి టికెట్ 

కోరికలు కోరుతానికి టికెట్ 

ఇవన్నీ ఒకెత్తు ఐతే మనం హుండిలో వేసే సొమ్ముతో బతికే జీతగాల్లు భక్తులతో దురుసు ప్రవర్తనలు,

 తో😢సేయ్యడాలు,చిరాకులు,చీదరింపులు..

ఈ ప్రభుత్వాలు హిందువుల దగ్గర దొబ్బి జెరుసలేం,మక్కాలకి సబ్సీడీలు.

pickles and powders

 VAIBHAVA FOODS


If you take 250 Grams, then we will charge Rs. 175/- for each item.

If you take 500 Grams, then we will charge Rs. 325/- for each item.


Prices per Kg :

Thokkudu pachadi.. Rs.700/-

Dabbakaya... Rs. 600/-

Avakaya ........Rs.700/-

 Magaya.........Rs.700/-

Kaya Avakaya.Rs.700/- 

Pulihora

Avakaya..........Rs.600/-

mukkala pacchadi........Rs.600/-

Lemon...........Rs.700/-

Pesara

Avakaya…......Rs.600/-

Jaggery

Avakaya.......... 800/-

Menthikaya....Rs.800/-(Sold out)

Gongura.........Rs.600/-

Pallagongura..Rs.600/-

Pandumirchi.. .Rs.600/

Tomato.......... Rs.600/-

Tomato

Pandumirchi...Rs.600/-

Allam

Chutney. Rs.600/-

Mamidi Allam

Chutney. ... .Rs.600/-

Usiri Avakaya.Rs.600/-

Chinthakaaya.Rs.600/-

Dosa Avakaya Rs.600/-

Pacha

Avakaya 800/-

Usiri thokku

 pachadi. Rs.600/-

Allamvellulli

Avakaya. Rs. 700/

Munaga

Avakaya. Rs.600/_

Pesara

Avakaya, Rs.600/-

కరివేపాకు పచ్చడి Rs.600/-

కొత్తిమీర పచ్చడి.... Rs.,600/-

Kandipodi. Rs.600/-

Idlypodi. ...Rs.600/-

Karivepaku

podi. Rs.600/-

Sambarpodi....Rs.600/-

Charu podi.…. . Rs.600/-

Karapupodi.. Rs.600/-

Vellullikaram..Rs.600/-

Pallipappula

Podi.,..............Rs.600/-

Putnalapappu

Podi. Rs.600/-

Munagaaku

 podi. Rs.600/-

Kura karam. Rs.600/_

Dabbakaya Rs.600/-

Kondapindi Aaku podi..

Punarwa Aaku Podi..

Gummadi

Vadiyalu........Rs.1400/-

చిట్టి వడియాలు -Rs.800/-

Onion Vadiyalu....1000

to our members


Preparing with passion

No preservatives

No colours

Most trusted brand in the market in respect of taste, quality and delivery

No controversies

Affordable prices

Prompt delivery

Shipping charges are to be borne by the customer


We can deliver all the pickles within one day in Hyderabad


Apart from above, we can prepare different types of pickles and powders on order

Vaibhava Foods

102, Mithila APTS

VV NAGAR COLONY

KUKATPALLY

HYDERABAD


Contact if any needed to 7032752421

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 


ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు. మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి. దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 


ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   


ఇట్లు 


మీ బ్లాగరు

గురువు ఉపదేశం

 *గురువు ఉపదేశం వలననే ఆత్మదర్శనం పొందగలం* 


"మనిషికి నిజమైన యజమాని ఎవరు?"  అని అడిగితే భగవంతుడు గీతలో తన వాడు అని స్పష్టంగా చెప్పాడు.

 మామూలుగా అయితే మనకు ఎవరిద్వారా మేలు జరుగుతుందో వాళ్ళే మన యజమాని.  అలా చూసే వారికి "ఏం బావుంది నీకు?"  అని అడిగితే, "ఈ సంసార బంధం నుండి విముక్తి నాకు మంచిది" అని సమాధానం.  మన కోసం మనం మాత్రమే దీన్ని చేయగలం మరెవరూ చేయలేరు.

 సంసారసాగరంలో మునిగిపోయిన తనను తాను రక్షించుకోగలగడానికి రక రకాలుగా మార్గాలను చాలా మంది చెప్పారు.

 ఇది ఎప్పుడు ముగుస్తుంది?  అంటే, మనస్సును బాహ్య విషయాల నుండి ఆత్మ వైపు మళ్లించడం ద్వారా మాత్రమే.

 ఇది జరగాలంటే, ప్రాపంచిక వ్యవహారాలపై పూర్తిగా అవగాహన ఉండాలి.  ప్రాపంచిక విషయాలు అల్పమైనవని నిశ్చయించుకోవడం వల్ల ఈ వైరాగ్యం కలుగుతుంది.  అందుకు గురువుగారి అనుగ్రహం చాలా అవసరం.  ఈ విధముగా ఎవరైతే గురువు ఉపదేశము వలన ఎక్కువ వైరాగ్యమును పొందుతారో, అతడు ఆత్మ దర్శన యోగ్యతను పొందుతాడు.  ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారికి మాత్రమే జన్మ సార్థకం (సాఫల్యం) లభిస్తుంది.  ఎన్ని విద్యలు చేసినా ఆ విద్య అంతిమంగా ఆత్మ దర్శనానికి సాధనం కావాలి.

 *సా విద్యా యా విముక్తయే* అని ప్రాచీనులు చెప్పిన దానిని మరువరాదు.  ఆత్మ దర్శనానికి ఉపయోగ పడని సాధన సాధన కానే కాదు.


-- *జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహా స్వామి వారు*

Health ఆరోగ్య సంబంధ

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀





*ఆరోగ్య సంబంధ 48 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

యోగము - భోగము - రోగము www.freegurukul.org/g/Arogyam-2


నీవు - నీ పుట్టుక www.freegurukul.org/g/Arogyam-3


మూత్రపిండాల మర్మం www.freegurukul.org/g/Arogyam-9


జీర్ణం..జీర్ణం www.freegurukul.org/g/Arogyam-10


కీళ్ళు కండరాలు www.freegurukul.org/g/Arogyam-11


ఇదీ గుండె గుట్టు www.freegurukul.org/g/Arogyam-12


ఊపిరితిత్తుల ఊసు www.freegurukul.org/g/Arogyam-13


మధుమేహము-రక్తపోటు www.freegurukul.org/g/Arogyam-14


డయాబెటీస్ www.freegurukul.org/g/Arogyam-15


టీకాలు www.freegurukul.org/g/Arogyam-16


చలి జ్వరము www.freegurukul.org/g/Arogyam-17


స్థూల కాయం www.freegurukul.org/g/Arogyam-18


కన్ను - విధులు, వ్యాధులు, వైద్యము www.freegurukul.org/g/Arogyam-19


షుగర్ అంటే భయం ఎందుకు? www.freegurukul.org/g/Arogyam-20


ఆస్తమ ఉబ్బసము www.freegurukul.org/g/Arogyam-21


అంటువ్యాదులు www.freegurukul.org/g/Arogyam-22


శరీర శాస్త్రము-ఆరోగ్య భోధిని www.freegurukul.org/g/Arogyam-23


ఆరోగ్య దీపిక www.freegurukul.org/g/Arogyam-24


ఆరోగ్య సూత్రాలు www.freegurukul.org/g/Arogyam-25


ఆరోగ్యం - శుబ్రత www.freegurukul.org/g/Arogyam-26


ఆరోగ్యము - దీర్గాయువు www.freegurukul.org/g/Arogyam-27


ఆరోగ్యమే మహాభాగ్యం www.freegurukul.org/g/Arogyam-28


అందరికీ ఆరోగ్యం www.freegurukul.org/g/Arogyam-29


వైద్య ప్రపంచము www.freegurukul.org/g/Arogyam-30


మెడికల్ గైడ్ www.freegurukul.org/g/Arogyam-31


మెడికల్ బుక్ www.freegurukul.org/g/Arogyam-32


వైద్య రంగంలో సంఘ సంక్షేమ సేవలు www.freegurukul.org/g/Arogyam-33


ప్రధమ చికిత్స www.freegurukul.org/g/Arogyam-34


ప్రధమ చికిత్స www.freegurukul.org/g/Arogyam-35


మీకు అవసరమైన వైద్య వివేకం www.freegurukul.org/g/Arogyam-36


డాక్టర్ వచ్చేలోగా ఏం చేయాలి www.freegurukul.org/g/Arogyam-37


నర్సులకొరకైన పుస్తకం www.freegurukul.org/g/Arogyam-38


ప్రకృతి వైద్యం www.freegurukul.org/g/Arogyam-39


హెల్త్ అండ్ బ్యూటీ www.freegurukul.org/g/Arogyam-40


ప్రకృతి వైద్య తత్త్వము www.freegurukul.org/g/Arogyam-41


ప్రకృతి గృహ వైద్యం www.freegurukul.org/g/Arogyam-42


గృహౌషద వనము www.freegurukul.org/g/Arogyam-43


చిట్కా వైద్యం-2 www.freegurukul.org/g/Arogyam-44


వేదాలలో సూర్యకిరణ చికిత్స www.freegurukul.org/g/Arogyam-45


ఉపవాస చికిత్స www.freegurukul.org/g/Arogyam-46


పథ్యా పథ్యము www.freegurukul.org/g/Arogyam-47


సంవాహన చికిత్స - అవయవ మర్దన చికిత్స www.freegurukul.org/g/Arogyam-48


బాల రోగముల చికిత్స www.freegurukul.org/g/Arogyam-49


ఆరోగ్యామృతము www.freegurukul.org/g/Arogyam-50


చిరంజీవ చిరంజీవ-సుఖీభవ సుభీభవ www.freegurukul.org/g/Arogyam-51


అందానికి మార్గాలు www.freegurukul.org/g/Arogyam-52


గర్భధారణ సమస్యలు www.freegurukul.org/g/Arogyam-53


గర్భధారణ సుఖ ప్రసవం www.freegurukul.org/g/Arogyam-54


మహిళా శిశు వ్యాదులు-జాగ్రత్తలు www.freegurukul.org/g/Arogyam-55


ఆరోగ్యం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు www.freegurukul.org/join


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం  -‌ ఏకాదశి - హస్త -‌‌ భాను వాసరే* (19.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ప్రపంచాన్ని నిర్మిస్తారు

 🚩 *నవ్వుతూ ఉండేవారు తమలో ఒక ప్రపంచాన్ని నిర్మిస్తారు, నవ్వలేనివారు బయట ప్రపంచాన్ని నిందిస్తారు*. మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తును ప్రేమిస్తే బాగుపడతాడు.

🟨సంతోషం సీతాకోక చిలుక లాంటిది పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకదు ప్రశాంతంగా ఉంటే అదే వచ్చి వాలుతుంది.. నవ్వండి, నవ్వించండి, నవ్వుతూనే ఉండండి ఎందుకంటే మీ ఏడుపుకై ఎదురుచూసే వారికి మీరిచ్చే గొప్ప రిటర్న్ గిఫ్ట్ మీ నవ్వు మాత్రమే.

🟣 *సంతోషంగా ఉండాలంటే మతి మరుపు ఉండడం కూడా అవసరమే*. ప్రతి నవ్వు వెనక సంతోషం ఉండదు అది వాళ్ళకి వాళ్ళు ధైర్యం చెప్పుకునే ఒక ప్రయత్నం కావచ్చు.. కానీ నవ్వుతూనే ఉండండని అంటాడు  *రాగో*.

        🚩 *ధర్మో రక్షతి రక్షితః* 🚩

             *శుభోదయం*🙏🙏

       *🌜సత్యమేవ జయతే🌛*

Photo









 

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 


ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు. మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి. దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 


ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   


ఇట్లు 


మీ బ్లాగరు

వ్యాస వాఙ్మయము

 *వ్యాస వాఙ్మయము - విశ్వ చేతనము*


మహాభారతము- అనుశాసన పర్వము- దానధర్మ ఉపపర్వము...


మార్కండేయ - నారదర్షి సంవాదము;


*మా -* సజ్జనులతో సంభాషణము వలన ప్రయోజనము ఏమిటి?

*నా -* ధర్మాచారముల పట్ల శ్రద్ధ


*మా -* కలియుగానికి ఉన్న మఱియొక పేరేమిటి?

*నా -* నాలుగవ యుగము పేరు నందికము


*మా -* నియమ రహితంగా చేసే దానఫలము ఎవరికి అందుతుంది?

*నా -* అసుర, రాక్షస, ప్రేత, భూతములకు


*మా -* కన్యాపూజ ఎందుకు చేయాలి?

*నా -* కన్యలలో లక్ష్మీదేవి నిత్య నివాసినిగా ఉంటుంది కనుక...


*మా -* పతివ్రత గొప్పదనము ఏమిటి?

*నా -* గృహలక్ష్మి, గృహపుష్టి, గృహ ప్రతిష్ఠలకు ఆధారము పతివ్రతయే


*మా -* మనిషి శరీరంలో ఉన్న ఐదు తీర్థాలు ఏమిటి?

*నా -* దేవతీర్థము, ఋషితీర్థము, పితృతీర్థము, బ్రహ్మతీర్థము, విష్ణుతీర్థము


*మా -* ఆ తీర్థాల స్థానాలు ఎక్కడ?

*నా -* వ్రేళ్ళ చివరన దేవతీర్థము,

  చిటికెన వేలు ఉంగరపువ్రేలు మధ్యన ఋషితీర్థము,

  బొటనవ్రేలు ౘూపుడువ్రేలు నడుమ పితృతీర్థము,

  బొటనవ్రేలి చివరన బ్రహ్మతీర్థము, 

  అరచేతి మధ్యన విష్ణుతీర్థము.


న్యాయ్యేన మార్గేణ స్వస్తి ప్రజాభ్యః...

మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*


*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*44.14 (పదియవ శ్లోకము)*


*గోప్యస్తపః కిమచరన్ యదముష్య రూపం లావణ్యసారమసమోర్ధ్వమనన్యసిద్ధమ్|*


*దృగ్భిః పిబంత్యనుసవాభినవం దురాపమేకాంతధామ యశసః శ్రీయ ఐశ్వరస్య॥9961॥*


*మఱికొందరు స్త్రీలు ఇంకను ఇట్లు నుడివిరి* సఖులారా! గోపికలు నిరంతరము శ్రీకృష్ణునియొక్క రూపమాధుర్యమును తమ నేత్రములద్వారా ఆస్వాదించుచు, ఆనందించుచుందురు. వారు తమ పూర్వజన్మలలో ఎట్టి తపస్సులను ఆచరించిరో? (ఎట్టి నోములను నోచిరో) ఏమో! ఆయన రూపము దివ్యము, ఏకత్రరాశీభూతమైన సర్వలోకలావణ్యసారము. దానితో సమానమైనది లేనేలేదు. ఇక మించినది (అధికమైనది)  ఎట్లుండును? ఆయన రూపలావణ్య వైభవములు వస్త్రాభరణములతో వచ్చినవి కావు, సహజసిద్ధములు. ఆ దివ్యరూపమును ఎంతగా చూచినను తనివి తీరదు. అది నిత్యనూతనము. ఐశ్వర్యమునకు, సౌందర్యమునకు, యశస్సునకు అది నిధానమైనది. ఆ అద్భుతరూప దర్శనభాగ్యము గోపికలను తప్ప ఇతరులకు దుర్లభము. నిజముగా ఆ గోపాంగనల అదృష్టమే అదృష్టము".


*44.15 (పదిహేనవ శ్లోకము)*


*యా దోహనేఽవహననే మథనోపలేప్రేంఖేంఖనార్భరుదితోక్షణమార్జనాదౌ|*


*గాయంతి చైనమనురక్తధియోఽశ్రుకంఠ్యో  ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమచిత్తయానాః॥9962॥*


*మఱికొందరు స్త్రీలు ఇంకను ఇట్లు నుడివిరి* వ్రేపల్లెయందలి గోపికలు పాలు పితుకుచును, ధాన్యాదులను దంచునప్పుడును, పెఱుగులు చిలుకుచున్నప్పుడును, ఇండ్లను అలుకుచును, చిన్నారులను నిద్రపుచ్చుచు, ఉయ్యాలలను ఊపుచున్నప్పుడును, పిల్లలను జోకొట్టుచును (సముదాయించుచును), ఇండ్లముందు ఊడ్చుచున్నప్పుడును, కలాపి చల్లుచున్నప్పుడును, శ్రీకృష్ణప్రభువునందే తమ చిత్తములను లగ్నమొనర్చి, ఆర్ధ్రహృదయముతో ఆనందపరవశులై ఆ స్వామిని కీర్తించుచుందురు. కనుక, వారు ఎంతయో ధన్యురాండ్రు".


*44.16 (పదహారవ శ్లోకము)*


*ప్రాతర్వ్రజాద్వ్రజత ఆవిశతశ్చ సాయం గోభిః సమం క్వణయతోఽస్య నిశమ్య వేణుమ్|*


*నిర్గమ్య తూర్ణమబలాః పథి భూరిపుణ్యాః పశ్యంతి సస్మితముఖం సదయావలోకమ్॥9963॥*


*మఱికొందరు స్త్రీలు ఇంకను ఇట్లు నుడివిరి* "శ్రీకృష్ణుడు ప్రాతఃకాలమునందు గోవులను మేపుటకై గోకులమునుండి వనమునకు వెళ్ళుచుండెడివాడు. సాయంసమయమున గోవులతోగూడి వ్రజభూమికి తిరిగి వచ్చుచుండెడివాడు. అప్పుడు ఆ స్వామి వీనులవిందుగా మురళిని ఊదుచుండెడివాడు. ఆ మధురవేణునాదమును విన్నంతనే గోపికలు తమ పనులను అన్నింటిని ప్రక్కనబెట్టి పరమసంతోషముతో పరుగుపరుగున తమ ఇండ్లనుండి బయటికి వచ్చెడివారు. ఆ సమయమున చిఱునవ్వుల కాంతులతోను, దయాపూర్ణములైన చూపులతో సోయగము లొలుకుచుండెడి ఆ స్వామియొక్క ముఖసౌందర్యమును కన్నులప్పగించి చూచుచు గోపికలు పరమానందభరితులగుచుండెడివారు. యథార్థముగా ఆ గోపాలాంగనలు ఎంతటి పుణ్యాత్ములోగదా".


*44.17 (పదిహేడవ శ్లోకము)*


*ఏవం ప్రభాషమాణాసు స్త్రీషు యోగేశ్వరో హరిః|*


*శత్రుం హంతుం మనశ్చక్రే భగవాన్ భరతర్షభ॥9964॥*


*శ్రీశుకుడు ఇట్లు పలుకుచుండెను* పరీక్షిన్మహారాజా! మథురాపురకాంతలు ఇట్లు మాట్లాడుకొనుచుండగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్మ ద్వంద్వయుద్ధమున తనకు ప్రత్యర్ధిగా నున్న చాణూరుని హతమార్చుటకు నిశ్చయించుకొనెను.


*44.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*సభయాః స్త్రీగిరః శ్రుత్వా పుత్రస్నేహశుచాఽఽతురౌ|*


*పితరావన్వతప్యేతాం పుత్రయోరబుధౌ బలమ్॥9965॥*


ఇట్లు మథురానగర స్త్రీలు భయాందోళనలతో పలుకుచున్న మాటలను విన్నంతనే దేవకీవసుదేవులు మిగుల భీతిల్లుచు విహ్వలులైరి. బాలురైన బలరామకృష్ణులయొక్క బలపరాక్రమములను ఎఱుగక పుత్రమమకార ప్రభావమున వారు మిక్కిలి ఆందోళనకు లోనైరి.


*44.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*తైస్తైర్నియుద్ధవిధిభిర్వివిధైరచ్యుతేతరౌ|*


*యుయుధాతే యథాన్యోన్యం తథైవ బలముష్టికౌ॥9966॥*


శ్రీకృష్ణ చాణూరులు వివిధములగు ఆయా ద్వంద్వయుద్ధ విధానములతో (పరిభ్రమణ విక్షేపాదులతో) పెనుగులాడుచు పోరాడుచుండిరి. అట్లే బలరామముష్టికులును పోరుసలుపుచుండిరి.


*44.20 (ఇరువదియవ శ్లోకము)*


*భగవద్గాత్రనిష్పాతైర్వజ్రనిష్పేషనిష్ఠురైః|*


*చాణూరో భజ్యమానాంగో ముహుర్గ్లానిమవాప హ॥9967॥*


కృష్ణభగవానుని యొక్క అంగములన్నియును వజ్రములవలె కఠినాతి కఠినములైనవి. ఆ స్వామి బలమైన తన మోచేతులతో, మోకాళ్ళతో పదేపదే తీవ్రముగా పొడుచుచుండుటవలన చాణూరుని దేహమంతయును పూర్తిగా హూనమైపోవుచుండెను. ఆ పోటులకు తాళజాలక ఆ మల్లయోధుడు (చాణూరుడు) ఎంతయు అలసిపోవుచుండెను.


*44.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*స శ్యేనవేగ ఉత్పత్య ముష్టీకృత్య కరావుభౌ|*


*భగవంతం వాసుదేవం క్రుద్ధో వక్షస్యబాధత॥9968॥*


అంతట ఆ చాణూరుడు క్రుద్ధుడై, డేగవేగముతో ఎగిరి, తన రెండు చేతుల పిడికిళ్ళను బిగించి, శ్రీకృష్ణభగవానుని వక్షస్థలముపై బలముగా దెబ్బతీసెను.


*44.22 (ఇరువది రెండవ  శ్లోకము)*


*నాచలత్తత్ప్రహారేణ మాలాహత ఇవ ద్విపః|*


*బాహ్వోర్నిగృహ్య చాణూరం బహుశో భ్రామయన్ హరిః॥9969॥*


*44.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*భూపృష్ఠే పోథయామాస తరసా క్షీణజీవితమ్|*


*విస్రస్తాకల్పకేశస్రగింద్రధ్వజ ఇవాపతత్॥9970॥*


కాని, శ్రీకృష్ణుడు పూలమాలలతో కొట్టబడిన ఏనుగువలె, ఆ శత్రువుయొక్క పిడికిలి పోటులకు ఏమాత్రమూ చలించలేదు. అంతేగాక! ఆ ప్రభువు తన రెండు చేతులతో ఆ చాణూరుని పట్టుకొని,  వేగముగా త్రిప్పి, నేలకేసికొట్టెను. అట్లు త్రిప్పుచున్నప్పుడే ఆ మల్లుని ప్రాణాలు పైకెగిరిపోయెను. ఆ మల్లుని కేశములు, మాలలు చెదరిపోయెను. వేషభూషలు అన్నియును అస్తవ్యస్తము లాయెను. అతడు ఇంద్రధ్వజము (ఇంద్రుని పూజించుటకై నిలిపిన ధ్వజము) వలె పడిపోయెను.


*44.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*తథైవ ముష్టికః పూర్వం స్వముష్ట్యాభిహతేన వై|*


*బలభద్రేణ బలినా తలేనాభిహతో భృశమ్॥9971॥*


*44.25 (ఇరువది యైదవ శ్లోకము)*


*ప్రవేపితః స రుధిరముద్వమన్ ముఖతోఽర్దితః|*


*వ్యసుః పపాతోర్వ్యుపస్థే వాతాహత ఇవాంఘ్రిపః॥9972॥*


అట్లే ముష్టికుడు తన పిడికిలి పోటులతో బలరాముని నొప్పింపజొచ్చెను. కాని పరాక్రమశాలియైన బలరాముడు వాటిని సరకు సేయక తన అఱచేతితో వానిని తీవ్రముగా కొట్టెను. ఆ దెబ్బకు ముష్టికుడు కంపించిపోవుచు నోటినుండి రక్తమును వెళ్ళగ్రక్కుచు, అసువులను కోల్పోయి, పెనుగాలి తాకిడికి మహావృక్షమువలె నేలకూలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*


*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*44.1 (ప్రథమ శ్లోకము)*


*ఏవం చర్చితసంకల్పో భగవాన్మధుసూదనః|*


*ఆససాదాథ చాణూరం ముష్టికం రోహిణీసుతః॥9948॥*


*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! ఈ విధముగా కృష్ణపరమాత్మ చాణూరాది మల్లయోధులను వధించుటకు సంకల్పించుకొనెను. అంతట ఆ ప్రభువు చాణూరినితోను, బలరాముడు ముష్టికునితోడను ద్వంద్వయుద్ధము చేయుటకు సర్వసన్నద్ధులై వారిని సమీపించిరి.


*44.2 (రెండవ శ్లోకము)*


*హస్తాభ్యాం హస్తయోర్బద్ధ్వా పద్భ్యామేవ చ పాదయోః|*


*విచకర్షతురన్యోన్యం ప్రసహ్య విజిగీషయా॥9949॥*


అనంతరము వారు చేతులతో చేతులను పట్టుకొని, పాదములకు పాదములను అడ్డముగా నిలిపి, పరస్పర జయేచ్ఛతో ఒకరినొకరు తమవైపునకు లాగికొనసాగిరి.


*44.3 (మూడవ శ్లోకము)*


*అరత్నీ ద్వే అరత్నిభ్యాం జానుభ్యాం చైవ జానునీ|*


*శిరః శీర్ష్ణోరసోరస్తావన్యోన్యమభిజఘ్నతుః॥9950॥*


ఇంకను వారు పరస్పరము పెనవైచుకొనుచు, మోచేతులపై మోచేతులతోను, మోకాళ్ళపై మోకాళ్ళతోను, శిరస్సులను శిరస్సులతోను, వక్షస్థలములను వక్షస్థలములతోను మోదుకొనుచు ఒకరిపైనొకరు దెబ్బతీయదొడంగిరి.


*44.4 (నాలుగవ శ్లోకము)*


*పరిభ్రామణవిక్షేపపరిరంభావపాతనైః|*


*ఉత్సర్పణాపసర్పణైశ్చాన్యోన్యం ప్రత్యరుంధతామ్॥9951॥*


పరిభ్రమణము (ప్రత్యర్థిని చేతులతో పట్టుకొని చుట్టును గిరగిర త్రిప్పుట), విక్షేపము (దూరమునకు నెట్టివేయుట), పరిరంభణము (బాహువులతో అదిమిపట్టి పీడించుట), అవపాతము (క్రిందబడవేయుట), ఉత్సర్పణము (విడిచిపెట్టి ముందునకు పరుగెత్తుట), అపసర్పణము (వెనుకకు నడచుట) మొదలగు ప్రక్రియలతో కృష్ణచాణురులు, ముష్టిక బలరాములు ద్వంద్వయుద్ధమును జరిపిరి.


*44.5 (ఐదవ శ్లోకము)*


*ఉత్థాపనైరున్నయనైశ్చాలనైః స్థాపనైరపి|*


*పరస్పరం జిగీషంతావపచక్రతురాత్మనః॥9952॥*


ఇంకను ఉత్థాపనము (పాదములను, మోకాళ్ళను పిండి పిండిగావించి పడద్రోసిలేపుట), ఉన్నయనము (ప్రత్యర్థిని చేతులతో పైకెత్తి తీసికొనిపోవుట), చాలనము (నడుము దగ్గఱ పట్టుకొని త్రోసివేయుట), స్థాపనము (చేతులను, పాదములను ఒకటిగాజేసి పీడించుట) మొదలగు రీతులలో పరస్పర జయేచ్ఛతో వారు పోరాడిరి.


*44.6 (ఆరవ శ్లోకము)*


*తద్బలాబలవద్యుద్ధం సమేతాః సర్వయోషితః|*


*ఊచుః పరస్పరం రాజన్ సానుకంపా వరూథశః॥9953॥*


పరీక్షిన్మహారాజా! రంగస్థలము జరుగుచున్న ఆ ద్వంద్వయుద్ధమును గాంచుటకై స్త్రీలు గుంపులు గుంపులుగా అచటికి చేరియుండిరి. బలవంతులైన మల్లయోధులకును, సుకుమారులైన బాలురకును మధ్య 'ఇట్లు బలహీనులకు బలవంతులతో యుద్ధము జరుగుట అన్యాయము' అని నొచ్చుకొనుచు వారు జాలితో తమలో తాము ఇట్లనుకొనిరి.


*44.7 (ఏడవ శ్లోకము)*


*మహానయం బతాధర్మ ఏషాం రాజసభాసదామ్|*


*యే బలాబలవద్యుద్ధం రాజ్ఞోఽన్విచ్ఛంతి పశ్యతః॥9954॥*


"రాజసభలోనున్న వీరు అందఱును బలవంతులకును దుర్బలులకును మధ్య నడచుచున్న ఈ ద్వంద్వయుద్ధమును కనులప్పగించి  చూచుచుండిరేగాని, ఇట్లు జరుగుట అధర్మము  అని పలుకుచు దీనిని నివారింపరైరి. దీనిని ప్రత్యక్షముగా చూచుచున్న రాజుతో పాటు వీరును దీనిని ఆమోదించుచుండిరి.


*44.8 (ఎనిమిదవ శ్లోకము)*


*క్వ వజ్రసారసర్వాంగౌ మల్లౌ శైలేంద్రసన్నిభౌ|*


*క్వ చాతిసుకుమారాంగౌ కిశోరౌ నాప్తయౌవనౌ॥9955॥*


*44.9 (తొమ్మిదవ శ్లోకము)*


*ధర్మవ్యతిక్రమో హ్యస్య సమాజస్య ధ్రువం భవేత్|*


*యత్రాధర్మః సముత్తిష్ఠేన్న స్థేయం తత్ర కర్హిచిత్॥9956॥*


వజ్రములవలె దృఢమైన అంగములు గలిగి, పర్వతములవలె   ఒప్పుచున్న ఈ మల్లుయోధులెక్కడ? ఇంకను యౌవనదశకు చేరక కిశోరావస్థలో సుకుమారులైయున్న ఈ బలరామకృష్ణులెక్కడ? ఈ సమాజము అంతయును (ఇచటివారు అందఱునూ) ఈ విషమయుద్ధమును చూచుచు మిన్నకుండుట ఎంతేని అధర్మము. ఇది ముమ్మాటికిని నిజము. ఇట్లు ఉపేక్ష వహించుట తగదు. దీని వలన పాపములు చుట్టుకొనును. అధర్మము జరుగుచున్న చోట ఒక్క క్షణము గూడ నిలువరాదు. కనుక మనము ఎంతమాత్రమూ ఉండుట తగదు".


*44.10 (పదియవ శ్లోకము)*


*న సభాం ప్రవిశేత్ప్రాజ్ఞః సభ్యదోషాననుస్మరన్|*


*అబ్రువన్ విబ్రువన్నజ్ఞో నరః కిల్బిషమశ్నుతే॥9957॥*


మఱికొందరు వనితలు ఇట్లు పలికిరి. 'సదస్యుల దోషములను ఎఱింగియున్నప్పుడు ప్రాజ్ఞుడైనవాడు అందు (ఆ సభలో) ప్రవేశింపరాదు. ఒకవేళ ప్రవేశించినచో అచట జరుగుచున్న దోషములను ఎత్తిచూపక మిన్నకుండుటగాని, విపరీతముగా పలుకుటగాని లేక 'ఇది నాకు తెలియదు' అని పలుకుటగాని మూర్ఖలక్షణము. అట్టి వానికి పాపములు అంటును.


*44.11 (పదకొండవ శ్లోకము)*


*వల్గతః శత్రుమభితః కృష్ణస్య వదనాంబుజమ్|*


*వీక్ష్యతాం శ్రమవార్యుప్తం పద్మకోశమివాంబుభిః॥9958॥*


*ఇంకను కొందఱు కాంతలు ఇట్లు వచించిరి* "శత్రువు చుట్టును పరుగిడుచున్న శ్రీకృష్ణుని ముఖారవిందము ద్వంద్వయుద్ధ శ్రమవలన స్వేదబిందువులతో నిండియున్నది. అది జలకణములతో పరివ్యాప్తమైన పద్మకోశము (మొగ్గ) వలె అలరారుచున్నది".


*44.12 (పండ్రెండవ శ్లోకము)*


*కిం న పశ్యత రామస్య ముఖమాతామ్రలోచనమ్|*


*ముష్టికం ప్రతి సామర్షం హాససంరంభశోభితమ్॥9959॥*


"అది సరే! బలరాముని ముఖమును చూచినారా? ముష్టికునిపైగల క్రోధముతో కన్నులు ఎర్రబాఱియున్నవి. ఐనను ఆ స్వామి ముఖము చిఱునవ్వుతో, ఆవేశస్ఫోరకమై విలసిల్లుచున్నది".


*44.13 (పదమూడవ శ్లోకము)*


*పుణ్యా బత వ్రజభువో యదయం నృలింగగూఢః పురాణపురుషో వనచిత్రమాల్యః|*


*గాః పాలయన్ సహబలః క్వణయంశ్చ వేణుం విక్రీడయాంచతి గిరిత్రరమార్చితాంఘ్రిః॥9960॥*


*మఱికొందరు స్త్రీలు ఇట్లు నుడివిరి* "శంకరుడు. బ్రహ్మాదిదేవతలు, జగజ్జననియైన లక్ష్మీదేవియు శ్రీమన్నారాయుణిని పాదపద్మములను నిత్యము భక్తితో అర్చించుచుందురు. అట్టి వైకుంఠపతియే తన దివ్యలక్షణములను మఱుగుపఱచి మానవరూపమున శ్రీకృష్ణుడై అవతరించెను. కృష్ణప్రభువు నిత్యము చిత్రవిచిత్రములైన వనపుష్పమాలలతో విరాజిల్లుచుండును. ఆ స్వామి తన అన్నయగు బలరామునితోగూడి గోవులను పాలించుచుండును. ఆయన వేణువునుండి వెలువడు మధురధ్వనులు వీనులవిందు గావించుచుండును. ఆ స్వామి ఆటలపాటలతో బృందావన భూములయందు విహరించుచుండును. ఆ పురుషోత్తముని పాదస్పర్శకు నోచుకొనుటవలన వ్రజభూమి అంతయును పవిత్రమైనది,  ఆహా! ఎంత ధన్యమైనది".


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*835వ నామ మంత్రము*


*ఓం వివిక్తస్థాయై నమః* 


జనులు లేని పవిత్రప్రదేశముల యందు లేదా ఆత్మానాత్మ వివేకము గల వారి యందు విలసిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వివిక్తస్థా* యను నాలుగక్షరముల చతురక్షరీ నామ మంత్రమును *ఓం వివిక్తస్థాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని  ఆరాధించు భక్తులను ఆ తల్లి వారి మనస్సులందు పవిత్ర భావములు, వారి మాటలయందు పవిత్ర భాషణము, వారి చేతలలో సత్కర్మాచరణమును సుస్థాపితము జేస్తూ, వారి యునికితోనే వారుండుప్రదేశము ఒకపుణ్యక్షేత్రముగా భావింపజేస్తూ వారిని తరింపజేయును.


పరమేశ్వరి పరమేశుని రాణి. ఆ పరమేశ్వరుడు స్మశానవాటికయందు ఉంటాడు. ఎందుకో తెలుసా? ఈ మాటే పరమేశ్వరి పరమేశ్వరుని అడిగింది.     అందుకు పరమేశ్వరుడు ఇలాచెప్పాడు. పార్వతీ! మానవుడు  వజ్రవైడూర్యాది రత్నములు పొదిగిన కాంచనాభరణములు, భవనములు, రాజ్యములు, ధనరాశులు కూడబెడతాడు. జీవుడు పోతాడు అంటే భవనంలోంచి బయటకు తీసేస్తారు. ప్రాణాలు పోతే అందరూ స్మశానం వరకూ వస్తారు. గంధపుచెక్కలలో శరీరాన్ని పెట్టి, పుత్రునిచే నిప్పు పెట్టిస్తారు. అంతే అంతవరకూ వచ్చిన బంధుజనం అంతా స్మశానం విడిచి వెళ్ళిపోతారు. చివరకు కపాలమోక్షం కాగానే కొరవి పెట్టిన కొడుకు కూడా స్మశానం వదలి వెళ్ళిపోతాడు. ఆ కట్టెలలో కాలుతున్న దేహం దిక్కులేక కాలుతూ తనకోసం ఎవరూ లేరా అని ఏడుస్తూ ఉంటే, కనీసం నేనైనా ఉండవద్దా పార్వతీ! అని పరమేశ్వరికి పరమార్థాన్ని తెలియజేశాడు. అప్పటినుండి పరమేశ్వరికూడా అక్కడే ఆయనతో  ఉంటుంది. ఆయన వెండి కొండపైకి వెళ్ళినప్పుడు వెళుతూ, మళ్ళీ ఆయనతో వల్లకాటిలోనికే వస్తూ ఉంటుంది. అందుకే బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులు ఆ అమ్మ దర్శనం కోసం వల్లకాటిలోనికే వస్తున్నారు. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడే పవిత్రత. ఆ వల్లకాడే విజనప్రదేశం. పరమేశ్వరుడున్న పవిత్రప్రదేశం. అటువంటి చోటనే అమ్మ ఉంటుంది.    వెండికొండ (కైలాసం కూడా) అంతే కదా. విజన ప్రదేశమేకదా. *మనుష్యులు లేని ప్రదేశమంతయు పవిత్రమయినది* అని హరీతస్మృతిలో చెప్పబడినది. అంటే? మనుష్యులు లేని ప్రదేశం పవిత్రమైనదని అర్థము. కారణం? నరుడు నడచిన మార్గంలో గడ్డికూడా ఎండి పోతుంది. ఒకసారి ఆది శంకరుడు భిక్షాటనముకు వెళ్ళాడు. బాగా పొద్దుపోయింది. ఒక ఇల్లాలు ఆయనకు భిక్షవేసినది. బాగా పొద్దుపోయింది. వెళ్ళవద్దు. ఊరి బయట మహాకాళి తిరుగుచున్నది. నరసంచారం అయితే ఆ తల్లికి కోపంవచ్చి చంపేస్తుంది అని చెప్పింది.  రాత్రి అయితే మరింత ప్రశాంతంగా ఉంటుందని పరమేశ్వరునితో  విహరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో నరుడు కంటబడితే ఆమెకు కోపంవచ్చి నరుడిని చంపేసి కపాలం మెడలో వేసుకుంటుంది. అందుకని ఆది శంకరుడిని వెళ్ళవద్దంది. ఆ తల్లిచేతిలో చావైనా మహావరమని ఆదిశంకరుడు విజనప్రదేశంలో మహాకాళి సంచరిస్తున్న ప్రదేశానికి వెళతాడు.  మహాకాళి రూపంలో ఉన్న పరమేశ్వరి ఆదిశంకరుడిని చూసి హుంకరిస్తుంది. కళ్ళనుండి నిప్పులు కురిపిస్తుంది. తన చేతిలోని మహాఖడ్గాన్ని ఆదిశంకరునిపైకి తీసుకువెళుతుంది. అప్పుడు ఆదిశంకరులు కదలకమెదలక చిరునవ్వు నవ్వుతూ ఆ తల్లిని . మూకాంబికా స్తోత్రంతో శాంతపరచుతాడు. ఆ మహాకాళి ఉగ్రరూపం నుండి శాంతస్వరూపానికి మార్చుతాడు.  *తల్లీ! నీవెక్కడ ఉంటే అక్కడే పవిత్రమైన ప్రదేశం. నిన్ను సేవించేవారెవరైననూ ఆత్మానాత్మ వివేకము గలవారగుదురు. నిన్ను దర్శించడానికి వచ్చేవారి చూపులకు నీవు ప్రసన్నవదనంతో ఉండాలి గాని ప్రళయభీకరమైన హుంకరింపులు వద్దమ్మా* యని విన్నవించుకుంటాడు. అమ్మవారు ఆదిశంకరులు చెప్పినట్లు మూకాంబికాదేవిగా శాంతస్వరూపిణిగా విలసిల్లినది.


మన పవిత్రతను బట్టి పరమేశ్వరి మనకు గోచరిస్తుంది. ఆ తల్లి ఉగ్రరూపిణి కాళీమాత కావచ్చు, శాంతరూపిణియైన పరమేశ్వరి కావచ్చు చూచువారికి చూడగలిగినంత, ప్రాప్తియున్న వారికి ప్రాప్తియున్నంత.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వివిక్తస్తాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*375వ నామ మంత్రము* 


*ఓం కామ పూజితాయై నమః*


మన్మథునిచే ఉపాసింపబడిన (పూజింపబడిన) జగన్మాతకు నమస్కారము.


కామేశ్వరునిచే (శివునిచే) ఆరాధింపబడిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కామపూజితా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం కామపూజితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతకు పూజలు చేయు భక్తజనులకు ఆ తల్లి సకలార్థసిద్ధిని పరిపూర్ణముగా కలుగజేయును.


*హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః* (84వ నామ మంత్రము) - శివుని నేత్రాగ్నిచే బూడిదైన మన్మథుడిని మరల సజీవుని చేయుటలో పరమేశ్వరి తానొక సంజీవనౌషధియై ఒప్పారినది. రతీదేవి (మన్మథుని భార్య) సౌభాగ్యము నిలుపుటకై, శివుని నేత్రాగ్నికి భస్మమైపోయిన మన్మథుని అమ్మవారు సజీవుని చేయుటతో, కృతజ్ఞతా పూర్వకంగా మన్మథుడు అమ్మవారిని పూజించాడు. గనుకనే శ్రీమాత *కామపూజితా* యని అనబడినది. అసలు మన్మథుడు తొలుత జ్ఞానహీనుడు. తిరిగి అమ్మవారి వలన సజీవుడైన తరువాత జ్ఞాని అయాడు. అందువలన ఆ తల్లిని పూజించడం ప్రారంభించాడు. అమ్మవారు అందుకు సంతసించి మన్మథునికి పంచదశీ విద్య (శ్రీవిద్య) ప్రసాదించింది. పంచదశీ మంత్రోపాసన/ (శ్రీవిద్యోపాసన చేయు పదునాలుగు మందిలో (కొందరు పండ్రెండు మంది అని అంటారు) మన్మథుడు ఒకడు. ప్రస్తుతం మనం చేయు శ్రీవిద్యోపాసన మన్మథుడు చేయు శ్రీవిద్యోపాసనయే. గనుకనే అమ్మవారు *కామపూజితా* యని అనబడినది. 


పరమేశ్వరుడు (కామేశ్వరుడు), ఆయన పంచకృత్యపరాయణుడు. ఆయనకు సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. తొలుతగా జగన్మాతను పూజించి సృష్టి ప్రారంభించాడు. అందుచే లలితాంబిక *కామపూజితా* యని అనబడినది. 


లలితాంబికకు నమస్కరించునపుడు *ఓం కామపూజితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

ఉగ్రదేవతలను ఉపాసించవచ్చా

 ప్ర : కాళీ, చండీ, చాముండా - వంటి ఉగ్రదేవతలను ఉపాసించవచ్చా ? చండీసప్తశతి పారాయణ, చండీ హోమం వంటివి ఉగ్రదేవతోపాసన అని కొందరి మాట. ఎంతవరకు సమంజసం ?

జ : చండీ, కాళీ - ఉగ్రదేవతలు.... అనడం సరికాదు. ప్రతి దేవతోపాసనలోనూ ఉగ్రమూర్తులుంటారు. విష్ణూపాసనలో ఉగ్రనరసింహం, శివోపాసనలో వీరభద్ర - భైరవమూర్తులు వలెనే శక్తి ఆరాధనలో కాళీ, దుర్గా వంటి రూపాలు.

అసలు విశ్వవ్యాపక ఈశ్వరశక్తిలోనే ఉగ్ర, సౌమ్య - అనే రెండు భావాలూ ఉంటాయి. వీటినే వైదికభాషలో ఘోర, అఘోర - అని అంటారు. ఈ రెండూ ప్రకృతిలోనే గోచరిస్తాయి. ప్రాణాన్నిచ్చే జలమే ఉప్పొంగే ఉప్పెన అవుతోంది. జీవనదాత సూర్యుడే ప్రచండంగా గ్రీష్మంలో ప్రకాశిస్తాడు. ఈ రెండు విధాల వ్యక్తీకరణలు లోకక్షేమానికే.

అనంత కాలశక్తి కాళి. అధర్మాన్ని, దుష్టత్వాన్ని శిక్షించి, లోకరక్షణ చేసే పరమేశ్వర శక్తి చండి.రక్షణ స్వరూపిణి కనుకనే 'దుర్గ' అన్నారు.

ఇక 'చండీసప్తశతి' గ్రంథం అసలు పేరు 'దేవీమహాత్మ్యం'.

ఇది 'మార్కండేయ పురాణం'లోనిది.

ఈ స్వరూపాలను 'ఉగ్ర' అనడానికి లేదు. ఈ గ్రంథంలో చెప్పబడిన 'దేవి' - వేదాలలో లక్ష్మి, సరస్వతి, గౌరి,కాళీ, శ్రద్ధా, మేధా, గాయత్రి, స్వాహా, స్వధా - మొదలైన రూపాలలో ఉన్న పరాశక్తి జగన్మాత.

లోకరక్షణ కోసం దుష్టులను సంహరించి, ధర్మరక్షణార్థం - పలుమార్లు ఆవిర్భవించిన శక్తి. అసుర సంహారానికి కోపశక్తిగా 'చండి', లోకరక్షణకు మంగళస్వరూపిణి - ఈ రెండూ కారుణ్యరూపాలే.

సౌమ్యాని యాని రూపాణి

త్రైలోక్యే విచరంతి తే l

యాని చాత్యంత ఘోరాణి

తైరక్షాస్మాం స్తథా భువమ్ ॥ - అనే శ్లోకం దేవీమహాత్మ్యం లోనిదే.

'అమ్మా ! ముల్లోకాలలో చరించే నీ సౌమ్యరూపాలు, ఘోరరూపాలు మమ్ములను, ప్రపంచాన్ని రక్షించుగాక! " అని చక్కని భావమిది.

'సౌమ్యా సౌమ్యతరాఽశేష సౌమ్యౌభ్యస్త్వతిసుందరీ'

అనే వాక్యం కూడా ఈ గ్రంథంలోనిదే.

సమగ్రంగా దేవీతత్త్వం ఉన్న గ్రంథమిది.

చండీ, చాముండా- అనే మాటలకు తత్త్వపరంగా

'బ్రహ్మ విద్యాస్వరూపిణి' అనే అర్థం.

రక్షణనిచ్చే జగన్మాతను ఆరాధించడం వల్ల - మనలోని దష్టప్రవృత్తులు తొలగి సత్ప్రవర్తనలనే దైవీశక్తులు రక్షింపబడతాయి. సకామంగా పారాయణ, హోమం చేస్తే అభీష్టసిద్ధి లభిస్తుంది (అయితే ఆ కోరిక ధర్మబద్ధమైనది కావాలి). క్రమంగా జ్ఞానం, కైవల్యం లభిస్తాయి.

నిష్కామంగా ఆచరిస్తే మోక్షానికి కావాల్సిన జ్ఞానాన్నీ ప్రసాదిస్తుంది. ఆశించకుండానే ఐహిక జీవితంలోనూ అవసరమైన రక్షణ, సంపదలను అనుగ్రహిస్తుంది.

మేధాసి దేవి విధితాఽఖిల శాస్త్రసారా

దుర్గాసి దుర్గ భవసాగరనౌరసంగా ।

శ్రీః కైటభారి హృదయైక కృతాధివాసా

గౌరీ ! త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ఠా ॥

- అని దేవీమహాత్మ్యం లోని శ్లోకం.

" సకల శాస్త్రసారమైన మేధస్సు నీవే. దాటలేని సంసారసముద్రాన్ని నావ వలె దాటించే దుర్గవు నీవు. శ్రీమహావిష్ణువు హృదయాన అధివసించు లక్ష్మీవి నీవు. చంద్రశేఖరుడైన శివునియందున్న గౌరివి నీవు" అని భావం.

ఏ విధంగా చూసినా - అనంతశక్తి, అపార కరుణ కలిగిన జగన్మాత ఆరాధనలే చండీ , కాళీ వంటి పూజలు.

దేవీమహాత్మ్యం - పారాయణ, హోమాలు ఆ తల్లి దయను ప్రసాదించే సాధనలు.

అల్సర్ - అలక్ష్యం*_

 *శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ - 

🙏🌻🌻🌻🌻🕉️🌻🌻🌻🌻🙏


🪷 _*అల్సర్ - అలక్ష్యం*_ 🌹 


ఒకసారి భక్తుల గుంపొకటి కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికని కంచి వచ్చారు. వారంతా కన్యాకుమారి, తిరుచెందూర్, మధురై, తిరుచ్చి, తంజాఊర్, కుంబకోణం, తిరువనంతపురం దర్శించుకుని కంచికి వచ్చారు. 


అది కామాక్షి అమ్మవారికి అభిషేక సమయం కావటంతో ఇంకా ఒక గంట పట్టేటట్టు ఉంది అని నిర్ధారించుకున్నారు. కాబట్టి ఆ సమయంలో పరమాచార్య స్వామివారిని దర్శించుకుందామని నిశ్చయించుకుని అందరూ బయలుదేరారు ఒక్కజంట తప్ప. 


అతను మరొక శంకరాచార్య స్వామి మఠం భక్తుడు కావడంతో పరమాచార్య స్వామివారికి నమస్కారం పెట్టడం ఇష్టం లేక అక్కడే అమ్మవారి గుడిలోనే ఉండిపోయాడు. 


చాలాసేపటి తరువాత కూడా వెళ్ళినవారెవరూ తిరిగి రాకపోవడంతో వారిని వెతుక్కుంటూ ఇతను కూడా శ్రీమఠం లోనికి వచ్చాడు. ఆ దంపతులిద్దరూ ప్రవేశిస్తున్నప్పుడు మహాస్వామివారు త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వరునికి హారతి ఇస్తున్నారు. మొత్తం పూజ పూర్తైన తరువాత స్వామివారు కిందకు వచ్చి అందరికి తీర్థప్రసాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వరుసలో అందరితోపాటు వస్తున్నాడు. 


ఇతని వంతు రాగానే మహాస్వామివారు ఇతని పేరు, అతని తండ్రి గురించి, వారి గోత్రం, కేరళలో వారు కట్టుకున్న ఇల్లు, తోట గురించి అన్నీ మాట్లాడారు. ఒక కమలాపండుని స్వామివారి కడుపుపై తిప్పుతూ ఈ విషయాలన్నీ అతనితో మాట్లాడుతూ స్వామివారు. దాదాపు ఒకగంట సేపు అతనితో మాట్లాడి ఆ పండుని అతనికి ప్రసాదంగా ఇచ్చారు. 


అతనికి కడుపులో పుండు (పెప్టిక్ అల్సర్) ఉండడం వల్ల డాక్టర్ల సలహామేరకు ప్రతి ఇరవై నిముషాలకు ఒకసారి ఏదైనా తినాలి, లేదా కనీసం మంచినీరైనా తాగాలి. కాని స్వామివారితో మాట్ళాడుతూ ఉండడం వల్ల అతను సమయం చూడక ఒక గంట పాటు ఏమి తినకుండా అలాగే ఉండిపోయాడు. బయటకు రాగానే విషయం గుర్తుకు వచ్చి గభాల్న ఆ కమలాపండుని తినేసాడు. 


అప్పటి నుండి అతని జీవితాంతం వరకు అతనికి ఎటువంటి అల్సర్ కాని నెప్పి కాని లేక హాయిగా జీవించాడు. పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తుడై రెండు శంకర మఠాలను సేవిస్తూ కాలం గడిపాడు. 


_/\_ శంకరం శంకరాచార్యం తత్ పీఠాధీశ్వరం _/\_


        ❀┉┅━❀🕉️❀┉┅━❀

*జయ జయ శఙ్కర హర హర శఙ్కర*

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*

🙏🌻🌻🌻🌻🕉️🌻

శివానందలహరి

 శ్రీ  ఆది శంకర విరచిత శివానందలహరి   🙏                    ................................. ప్రలోభాద్యైరర్థాహరణపరతంత్రో ధనిగృహే

ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే |

ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో

తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ 22 

  

దొంగలరాజగు ఓ ప్రభూ! శంకరా! నామనస్సనే దొంగ ప్రలోభముతో ధనమునపహరించుటకై ధనికుని ఇంటిలో ప్రవేశించుటకు ప్రయత్నించుచూ తిరుగుచున్నది. దీనిని నేనెట్లు సహించగలను? (నా మనస్సేమో దొంగ, నువ్వేమో దొంగలరాజువి, దొంగలంతా ఒక్క జట్టు కదా) నా మనస్సుని నీ అధీనంలో ఉంచుకొని నిరపరాధియైన నా పై కరుణచూపుము తండ్రీ🙏.

సౌందర్య లహరి*

 *సౌందర్య లహరి* 

 *అరవై రెండో శ్లోక భాష్యం (62).* 


 *(శ్రీ శంకర భగవత్పాద విరచితము)* 


 *(శ్రీ లలితాంబికాయైనమః)* 


 *ఈ శ్లోకంలో శ్రీదేవి క్రింది పెదవి (అధరోష్ఠం) వర్ణించబడింది.* 


 *"ప్రకృత్యా రక్తాయా _ స్తవ సుదతి దన్తచ్ఛదరుచేః* 

 *ప్రవక్ష్యే సాదృశ్యం _ జనయతు ఫలం విద్రుమలతా !* 

 *న బింబం తద్బింబ _ ప్రతిఫలన రాగాదరుణితం* 

 *తులా మధ్యారోఢుం _ కథమివ న లజ్జేత కలయా !!"* 


చక్కని పలువరస గల దేవీ ! స్వభావము చేతనే ఎర్రనైన నీ పెదవుల 

కాంతికి పోలికను చప్పాలంటే ఈ ప్రపంచము లో ఏమీ కనబడవు.

ఎందువల్ల అంటే, నీ క్రింది పెదవి , సహజముగానే ఎర్రని కాంతికలది.

ఒకవేళ పగడపు తీగకు పండు పండినట్లయితే ఆపండుకు , నీ పెదవితో 

సామ్యము లభించవచ్చు. దొండపండుతో నీ పెదవి కి పోలిక చెపుదామని 

యనుకున్నా, అది కుదరదు. ఎందుకంటేదొండ పండునకు ఉన్న ఎర్రని

కాంతి సహజమైనది కాదు. దొండపండునకు "బింబము" అనిపేరు. 

బింబము అంటే ప్రతిఫలించిన రూపము . దొండపండుకు ఎర్రదనం

దేవి పెదవులు దానిలో ప్రతిఫలించడం వల్ల వచ్చింది. అందుకే దానికి

బింబము అని పేరు వచ్చింది. కాబట్టి బింబము, నీ పదవితో పదహారవ

పాలుతోనైనా సామ్యమును పొందడానికి సిగ్గు పడకుండా ఎలా

ఉంటుంది. (అంటే సహజమైన ఎర్రదనం గల నీ పెదవితో సామ్యానికి

రావడానికి ప్రతిఫలనం వలన ఎర్రబడిన బింబము అంటే దొండపండు

తప్పకుండా సిగ్గు పడుతుందని భావము. నీ పెదవితో దొండపండు, 

కనీసము పదహారవ వంతు పాలు పోలికయినా రాలేదని భావము).


 *ఓం భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణ్యైనమః* 

 *ఓం కరాంగుళీనఖోత్పన్ననారాయణదశాకృత్యైనమః* 

 *ఓం మహాపాశుపతాస్త్రగ్నినిర్దగ్దాసురసైనికాయైనమః*


 *ఓం శ్రీ మాత్రే నమః*

పాదారవిందశతకం

 *శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి* 

 *శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన* 

 *పాదారవిందశతకం* 

🙏🌸🙏🙏🙏🌸🙏

 

 *శ్లోకము:-* 

 *మనోగేహే మోహోద్భవ తిమిరపూర్ణే మమ ముహుః* 

 *దరిద్రాణీ కుర్వందినకర సహస్రాణి కిరణైః |* 

 *విధత్తాం కామాక్షి ప్రసృమర తమోవంచన చణః* 

 *క్షణార్ధం సాన్నిధ్యం చరణ మణిదీపో జనని తే ||26||* 

 

 *భావము:* 

అమ్మా! మోహముచే పుట్టిన చీకట్లతో నిండిన నా మనో గృహమందు లోలోన అలముకున్న తమస్సును హరించుటకు నిపుణమైన నీ చరణ మణిదీప కిరణాలు వేల సూర్యులను కూడా నిస్తేజులను చేయుచు, అరక్షణమైన నాకు సాన్నిధ్యమును అనుగ్రహించుగాక.🌹

 

*********

 

🔱 ఆ తల్లి 

పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱                                                                                                                                                                                             🙏🌸🌸🌸🌸🌸🙏

సిరికొలువు

 _*సిరికొలువు*_


_*(తిరుచానూరు శ్రీ క్షేత్ర మహిమ)*_

 *19.భాగం*


_*వైకుంఠ దర్శనం-శాపగ్రస్తులు*_


పూర్వ సనత్కుమార సనత్సుజాతులు అను నలుగురు మహర్షులు వుండేవారు. వీరు నలుగురూ బ్రహ్మదేవుని మనస్సంకల్పం చేత జన్మించారు. అందుకే వారిని బ్రహ్మ మానస పుత్రులని అంటారు. 


వీరి శరీర ప్రమాణం మాత్రం బొటన వ్రేలడంత! అయితే ఏం? వారికున్న బ్రహ్మజ్ఞానం మాత్రం బోలెడంత! త్రికాల జ్ఞానసంపన్నులైన వీరు ఎప్పుడైనా, ఎక్కడికైనా క్షణాల్లో వెళ్లగల సమర్థులు.


ఆ నలుగురూ అలా సంచారం చేస్తూ ఒకప్పుడు ఉన్నపళంగా వైకుంఠానికి వెళ్లారు. భక్తుల పాలిటి పారిజాతం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రమానాథుని దర్శనం కోసం వైకుంఠంలో ప్రవేశించారు. వారికి అడ్డేమిటి? కాని అడ్డు తగిలింది.


వారు వెళ్లిన వేళావిశేషం ఏమిటోకాని వైకుంఠంలోని ద్వారపాలకులు. జయ విజయులు నిక్కచ్చిగా వారిని అడ్డుకున్నారు. లోనికి వెళ్లడానికి వీల్లేదన్నారు. లోపల శ్రీలక్ష్మీ శ్రీమన్నారాయణులు ఏకాంతంగా వున్నారనీ, ఈ సమయంలో ఎవరూ లోనికి వెళ్లకూడదని అడ్డుచెప్పారు.


పరమశాంత స్వరూపులైన బ్రహ్మమానస పుత్రులకు తీవ్రంగా మనస్తాపం కలిగింది. తమకు జరిగిన అవమానానికి కోపంతో ఊగిపోయారు. తమను అడ్డగించిన ద్వారపాలకులను భూలోకంలో రక్కసులుగా జన్మించ వలసిందిగా ఆ మహాయోగులు తీవ్రంగా శపించారు.


ఈ హఠాత్పరిణామానికి జయ విజయులిద్దరూ హతాశులయ్యారు. సనక సనందనాదులు రూపుదాల్చిన పరమశాంత స్వరూపులు. కాని క్షణికావేశానికి లోనయ్యారు. వారి కోపం కట్టలు తెంచుకొంది.


జగన్మాతా జగద్ధాతా! అయిన శ్రీ లక్ష్మీ నారాయణులు ఇరువురు ఏకాంతవాసంలో వుండనే వుండరా! వారికి ఏకాంతం అవసరం లేదా! వుండదా!అలాంటి సందర్భాల్లో కూడా ఎంత సన్నిహితులైన వారైనా వారి ఏకాంతానికి భంగం కలిగించవచ్చా! లోపలికి దూసుకెళ్లవచ్చా! 


ఇలాంటి విచక్షణా జ్ఞానం

కోల్పోవడమేగాక తీవ్రంగా శపించడమా! అలాంటి మహనీయులు అలా ప్రవర్తించవచ్చా? అదే విధి బలీయం అంటారు పెద్దలు!


నిరంతరమూ ప్రశాంతధామమైన శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుని అభ్యంతర మందిరానికి ప్రధాన ద్వారమైన బంగారు వాకిళ్ల దగ్గర జరిగిన అలజడికి, ఆందోళనకు ఏకాంత భంగం కాగా లోపలినుంచి శ్రీ మహావిష్ణువు పరుగు పరుగున వెలుపలికి వచ్చాడు. 


పరంధాముడు పరిస్థితిని గమనించాడు. ఏమీ జరగనట్లుగానే, ఏదీ గమనించలేదన్నట్లుగానే ఆ లీలా వినోది ఆ యోగీశ్వరులకు నిండుగా దర్శనమిచ్చి ఆనందపరచి వీడ్కోలు పలికినాడు.


అంతే! జయ విజయు లిద్దరూ కుప్పకూలి పోయారు. నారాయణుని కాళ్లా వేళ్ళా పడి శరణు వేడినారు. స్వామివారు తన భటులను అనునయిస్తూ “జయా! విజయా! ఆ మహనీయుల శాపాన్ని అనుభవించవలసిందే. తప్పదు. గాక తప్పదు. దాన్ని తిప్పటం ఎవరికిని సాధ్యం కానే కాదు. 


అందువల్ల కేవలం మూడు జన్మల్లో రాక్షసులుగా జన్మించి నిరంతరం, అంతరాంతరాల్లో నన్నే ద్వేషిస్తూ వైరభక్తితో అతి తొందర్లోనే నన్ను చేరుకొంటారు! అని వారిని ఊరడించాడు."


శ్రీ వైకుంఠంలో జరిగిన ఈ తీవ్ర పరిణామానికి దేవతలు సంతోషించారు.పరమయోగులు పరమానందపడినారు. దేవర్షి నారదుడు శ్రీస్వామివారి మరో అవతారానికి ఇది నాంది అవుతుందేమో!" అనుకుంటూ నారాయణ! నారాయణ! అంటూ త్రిలోక సంచారానికి బయలుదేరినాడు.మళ్లీ ఎప్పటిలాగానే శ్రీ వైకుంఠంలో గంభీరమైన ప్రశాంతత చోటు చేసుకుంది.


 *గోవిందా గోవింద గోవిందా!!!* 


 *5 వ అధ్యాయం సంపూర్ణం*

మూకపంచశతి

 *శ్రీ మూకశంకర విరచిత* 

 *మూకపంచశతి* 

 *శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన* 

 *పాదారవిందశతకం* 

🙏🌸🙏🙏🙏🌸🙏

 

 *శ్లోకము:-* 

 *సమంతాత్ కామాక్షి క్షతతిమిర సంతానసుభగాన్* 

 *అనంతాభిః భాభిః దిన మను దిగంతాన్విరచయన్ |* 

 *అహంతాయా హంతా మమ జడిమదంతావలహరిః* 

 *విభింతాం సంతాపం తవ చరణ చింతామణిరసౌ 58* 

▪▪▪▪▪▪▪▪▪▪▪

 

 *భావము:* 

కామాక్షీదేవి దివ్యచరణం - సాధకుని జడత్వాన్ని,అహంకారాన్ని,తమస్సును హరించి సర్వతాపాల్ని హరించుటలో చింతామణి. దివ్యమణి అగు చింతామణి వంటిదే శ్రీదేవి చరణము..

🔱 ఆ తల్లి 

పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱                                                                                                                                                                                             🙏🌸🌸🌸🌸🌸🙏

ప్రాణం వున్నది

 14 -7 -1949 భగవాన్ కి ఆపరేషన్ జరిగిన తరువాత  చేతికి వచ్చిన పుండు నుండి రక్తం కారుతుంది.  ఆ నొప్పికి జ్వరం వచ్చి   శరీరం వణుకుతూ తులసాగింది. ఎట్లాగో వచ్చి సోఫాలో కూలబడ్డారు. అందరూ భయకంపితులై విచారిస్తూ దూరంగా ఉన్నారు. శాంతమ్మగారు పెద్దది గదా!దుఃఖం ఆపుకోలేక కళ్ళనీళ్ళు కారుస్తూ భగవాన్ సోఫా చుట్టూ పెట్టిన కర్ర కటకటాల నానుకొని శ్రీవారి నుద్దేశించి " అయ్యో ! శరీరం " అని అన్నదో లేదో భగవాన్ అందుకొని " ఓహో ! శరీరమా ? ఏమి , ఏమయింది , వణుకుతున్నది . వణికితే యేమి ? ఈ శరీరంలో ప్రాణం గదా వుండాలి మీకు . ప్రాణం వున్నది , సరేనా ? " అంటూ ఈ వణుకంతా అణుచుకొని నవ్వుతూ పక్కనున్న సేవకులతో “ అది నటరాజ తాండవమయ్యా . భయమెందుకు ? నిత్యం అచల దర్శనమైతే ఇవాళ తాండవదర్శనం . దీనికంత గాభరాయెందుకు ? " అని సెలవిచ్చి గంభీరంగా కూర్చున్నారు భగవాన్ .    

          

         *"నా రమణాశ్రమ జీవితం గ్రంథంనుండి".*   

                 🌹అరుణాచల ఆత్మానంద 

             ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🙏

మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది మూడవ అధ్యాయము*


*బలరామకృష్ణులు "కువలయాపీడము" అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*43.17 (పదిహేడవ శ్లోకము)*


*మల్లానామశనిర్నృణాం నరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్|*


*గోపానాం స్వజనోఽసతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రోః శిశుః|*


*మృత్యుర్భోజపతేర్విరాడవిదుషాం తత్త్వం పరం యోగినామ్|*


*వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గతః సాగ్రజః॥9924॥*


మల్లరంగమునందు బలరామసహితుడైయున్న శ్రీకృష్ణుడు మల్లురకు మిగుల రౌద్రాకారముతో పిడుగువలె భీకరముగా తోచుచుండెను. సామాన్యజనులకు ఒక మహరాజువలె అద్భుతముగా కన్పట్టుచుండెను. స్త్రీలకు ఆకృతిదాల్చిన నవమన్మథునివలె శృంగార పురుషుడై భాసిల్లుచుండెను. గోపాలురకు ఆత్మీయుడుగా, వారిలో ప్రేమభావమును నింపుచుండెను. కుటిలులైన రాజులకు నియంతగా తోచుచుండెను. తల్లిదండ్రులలో శిశువువలె వాత్సల్య భావమును నింపుచుండెను. కంసునకు మృత్యుదేవతవలె భయానకముగా గోచరించుచుండెను. ఒక అద్భుత పురుషునివలె మూర్ఖులను కలవరపరచు చుండెను. యోగీశ్వరులకు శాంతస్వరూపమున పరతత్త్వముగా భాసిల్లుచుండెను. వృష్ణివంశజులకు పరదేవత వలె పూజ్యభావమును కలిగించుచుండెను. ఇట్లు ఆ పరమపురుషుడు వేర్వేరు వ్యక్తులకు వారి వారి మనోభావములకు అనుగుణముగా వివిధ రూపములలో తేజరిల్లుచుండెను.


పై సందర్భములో పోతనగారి పద్యరత్నము:


*సీస పద్యము*


మహితరౌద్రంబున మల్లుర కశనియై;

నరుల కద్భుతముగ నాథుఁ డగుచు

శృంగారమునఁ బురస్త్రీలకుఁ గాముఁడై;

నిజమృత్యువై కంసునికి భయముగ

మూఢులు భీభత్సమునుఁ బొంద వికటుఁడై;

తండ్రికి దయరాఁగఁ దనయు డగుచు

ఖలులకు విరసంబుగా దండియై గోప;

కులకు హాస్యంబుగాఁ గులజుఁ డగుచు


*ఆటవెలది*


బాంధవులకుఁ బ్రేమ భాసిల్ల వేలుపై

శాంత మొనర యోగి జనుల కెల్లఁ

బరమతత్వ మగుచు భాసిల్లె బలునితో

మాధవుండు రంగమధ్య మందు.


*భావము*


మల్లరంగం నడుమ బలరామ సహితుడైన కృష్ణుడు, రౌద్రరసంతో మల్లురకు పిడుగులా కనిపించాడు; అద్భుతరసంతో పురస్త్రీలకు పంచశరుడుగా భాసిల్లాడు; భయానకరసంతో కంసునికి వాడి పాలిటి మృత్యువుగా మూర్తీభవించాడు; బీభత్సరసంతో మూర్ఖులకు వికటుడుగా కనిపించాడు; కరుణరసంతో తండ్రికి కన్నబిడ్డడుగా కరుణ కలిగించాడు; వీరరసంతో దుర్మార్గులకు విద్వేషం కలిగించాడు; హాస్యరసంతో గోపకులను కులదీపకుడుగా గోచరించాడు; ప్రేమరసంతో చుట్టాలకు దేవుడుగానూ, శాంతరసంతో యోగిజనులకు పరబ్రహ్మ స్వరూపుడుగానూ ప్రకాశించాడు.


*43.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*హతం కువలయాపీడం దృష్ట్వా తావపి దుర్జయౌ|*


*కంసో మనస్వ్యపి తదా భృశముద్వివిజే నృప॥9925॥*


పరీక్షిన్మహారాజా! సహజముగా కంసుడు ధీరుడే యనప్పటికిని, కువలయాపీడము హతమగుట చూచి, బలరామకృష్ణులు దుర్జయులు (అజేయులు) అని గ్రహించి, మిగుల భయగ్రస్తుడయ్యెను.


*43.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*తౌ రేజతూ రంగగతౌ మహాభుజౌ విచిత్రవేషాభరణస్రగంబరౌ|*


*యథా నటావుత్తమవేషధారిణౌ మనః క్షిపంతౌ ప్రభయా నిరీక్షతామ్॥9926॥*


గొప్ప భుజశాలులైన బలరామకృష్ణులు విచిత్రములగు వేషములతో, వస్త్రాభరణములతో, పూలహారములతో రంగస్థలమున విరాజిల్లుచుండిరి. అప్పుడు వారు ఉత్తమ వేషధారులైన నటులవలె తమ దివ్యశోభలతో సందర్శకుల మనస్సులను ఆకట్టుకొనుచుండిరి.


*43.20 (ఇరువదియవ శ్లోకము)*


*నిరీక్ష్య తావుత్తమపూరుషౌ జనా మంచస్థితా నాగరరాష్ట్రకా నృప|*


*ప్రహర్షవేగోత్కలితేక్షణాననాః పపుర్న తృప్తా నయనైస్తదాననమ్॥9927॥*


మహారాజా! రంగస్థలమునందలి మంచెలపై ఆసీనులైయున్న మథురానగరవాసులు, జానపదులు ఆ ఇరువురు మహాపురుషులను జూచినంతనే సంతోషాతిరేకముతో వారి ముఖములు మిగుల వికసించెను. వారు తమ నయనములనెడి పాత్రలద్వారా ఆ సోదరులయొక్క ముఖవర్చస్సులనెడి అమృతమును ఎంతగా గ్రోలుచున్నను వారికి తనివిదీరకుండెను.


*43.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయా|*


*జిఘ్రంత ఇవ నాసాభ్యాం శ్లిష్యంత ఇవ బాహుభిః॥9928॥*


*43.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*ఊచుః పరస్పరం తే వై యథాదృష్టం యథాశ్రుతమ్|*


*తద్రూపగుణమాధుర్యప్రాగల్భ్యస్మారితా ఇవ॥9929॥*


అప్పుడు బలరామకృష్ణులను దర్శించుచున్నవారు ఆ మహాత్ములయొక్క సౌందర్యరసమును కన్నులద్వారా త్రాగివేయుచున్నట్లుగను, తమ నాలుకలద్వారా రుచిచూచుచున్నట్లు గుటకలు వేయుచును, లావణ్య పరిమళములను ఆఘ్రాణించి పరవశించిపోవుచున్నట్లుగను, ఆ పరమ సుందరులను బాహువులతో హాయిగా కౌగలించు కొనుచున్నట్లుగను ఒప్పిరి. ఇంకను ఆ ప్రజలు గజదంతములను చేబూనియున్న ఆ మహాపురుషుల రూపవైభవములను, శౌర్యపరాక్రమాది గుణములను, దరహాస - భాషణ మాధుర్యములను, నిర్భయత్వమును, గుర్తునకు తెచ్చుకొనుచున్నవారివలె స్వయముగా తాము చూచిన ధనుర్భంగాది దృశ్యములను గూర్చియు. కర్ణాకర్ణిగా తాము వినిన గోవర్ధనోద్ధరణాది లీలలను గుఱించియు పరస్పరము ముచ్చటించుకొనిరి.


*43.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*ఏతౌ భగవతః సాక్షాద్ధరేర్నారాయణస్య హి|*


*అవతీర్ణావిహాంశేన వసుదేవస్య వేశ్మని॥9930॥*


సాక్షాత్తుగా సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడే సంకల్పమాత్రమున శ్రీకృష్ణుడుగను, తదంశతో బలరాముడుగను భూతలమున వసుదేవుని ఇంట అవతరించిరి.


*43.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*ఏష వై కిల దేవక్యాం జాతో నీతశ్చ గోకులమ్|*


*కాలమేతం వసన్ గూఢో వవృధే నందవేశ్మని॥9931॥*


ఈ శ్రీకృష్ణపరమాత్మ మథురలో దేవకీదేవి గర్భమున అవతరించిన వెంటనే వసుదేవునిచే గోకులమునకు చేర్చబడినాడట. ఇప్పటి వఱకును అచటనే గూఢముగా నివసించుచు నందుని గృహమున వృద్ధిపొందెను.


*43.25 (ఇరువది యైదవ శ్లోకము)*


*పూతనానేన నీతాంతం చక్రవాతశ్చ దానవః|*


*అర్జునౌ గుహ్యకః కేశీ ధేనుకోఽన్యే చ తద్విధాః॥9932॥*


*43.26 (ఇరువది యారవ శ్లోకము)*


*గావః సపాలా ఏతేన దావాగ్నేః పరిమోచితాః|*


*కాలియో దమితః సర్ప ఇంద్రశ్చ విమదః కృతః॥9933॥*


*43.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*సప్తాహమేకహస్తేన ధృతోఽద్రిప్రవరోఽమునా|*


*వర్షవాతాశనిభ్యశ్చ పరిత్రాతం చ గోకులమ్॥9934॥*


దివ్యతేజోమూర్తియైన ఈ శ్రీకృష్ణుడు ఒనర్చిన కృత్యములు అద్భుతములు. అతడు రక్కసియైన పూతనను మృత్యుముఖమునకు చేర్చెను. దానవుడగు తృణావర్తుని పరిమార్చెను. మద్దిచెట్లను నేలగూల్చి, నలకూబర మణిగ్రీవులకు శాపవిముక్తిని ప్రసాదించిరి. కుబేరుని భటుడైన శంఖచూడుని హతమొనర్చెను. కేశి రాక్షసుని చెండాడెను. ధేనుకాది అసురులను సంహరించెను. ఈ మహానుభావుడు దావాగ్ని ప్రమాదమునుండి గోవులను, గోపాలురను కాపాడెను. కాళియసర్పమును మర్ధించెను. దేవేంద్రుని గర్వమును అణచెను. ఒక్కచేతితో గోవర్ధనగిరిని ఎత్తి, దానిని అట్లే నిలిపి, ఏడు దినములపాటు సుడిగాలులతో గూడి, ఏకధాటిగా కురిసిన కుంభవృష్టినుండియు, పిడుగుపాటులనుండియు గోకులమును (గోవులను, గోవత్సములను, గోపికలను, గోపాలురను, పిల్లలను, వృద్ధులను - ఆ బాలగోపాలమును) పరిరక్షించెను.


*43.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*గోప్యోఽస్య నిత్యముదితహసితప్రేక్షణం ముఖమ్|*


*పశ్యంత్యో వివిధాంస్తాపాంస్తరంతి స్మాశ్రమం ముదా॥9935॥*


నిత్యము ఈ మహాత్ముని యొక్క ముదితముఖవికాసములను, దరహాస శోభలను, మధురప్రేక్షణములను గాంచుచు గోపికలు మిగుల ఆనందించుచుండెడివారు. ఆ ఆనందములో వారు తమ వివిధతాపములనుండి బయటపడి హాయిగా ఉండెడివారు.


*43.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*వదంత్యనేన వంశోఽయం యదోః సుబహువిశ్రుతః|*


*శ్రియం యశో మహత్వం చ లప్స్యతే పరిరక్షితః॥9936॥*


"ఈ పరమపురుషుడు దానవాది దుష్టుల బాధలనుండి ఈ యదువంశమును పరిరక్షించెను. ఈయన వలన ఈ వంశము మిగుల ఖ్యాతి వహించెను. ఈ పురుషోత్తముని కారణముగా ఇది మున్ముందు ఇతోధికముగా సిరిసంపదలతోను, యశోవైభవములతోను, మహత్త్వములతోడను వర్ధిల్లును" అని ప్రజలు అనుకొనుచుండిరి.


*43.30 (ముప్పదియవ శ్లోకము)*


*అయం చాస్యాగ్రజః శ్రీమాన్ రామః కమలలోచనః|*


*ప్రలంబో నిహతో యేన వత్సకో యే బకాదయః॥9937॥*


"ఈ మహాత్మునకు అన్నయు, కమలలోచనుడు, శుభలక్షణ సంపన్నుడు ఐన బలరాముడు ప్రలంబాసురుని హతమార్చెను. వత్సాసురుడు, బకాసురుడు మొదలగు దుష్టరాక్షసులను ఈ ప్రభువు సంహరించెను".


*43.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*జనేష్వేవం బ్రువాణేషు తూర్యేషు నినదత్సు చ|*


*కృష్ణరామౌ సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్॥9938॥*


ప్రజలు ఇట్లనుకొనుచుండగా రంగశాలయందు తూర్యాది వాద్యముల ఘోష మిన్నంటుచుండెను. అంతట చాణూరుడను మల్లయోధుడు బలరామకృష్ణులను సంబోధించుచు ఇట్లు నుడివెను-


*43.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*హే నందసూనో హే రామ భవంతౌ వీరసమ్మతౌ|*


*నియుద్ధకుశలౌ శ్రుత్వా రాజ్ఞాఽఽహూతౌ దిదృక్షుణా॥9939॥*


"నందకుమారా! కృష్ణా! బలరామా! 'మీరు మహావీరులనియు, మల్లయుద్ధమున నిపుణులు' అనియు విని, కంసమహారాజు మీ వల్ల క్రీడాసామార్థ్యములను ప్రత్యక్షముగా చూడగోరి ఇచటికి పిలిపించెను".


*43.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*ప్రియం రాజ్ఞః ప్రకుర్వంత్యః శ్రేయో విందంతి వై ప్రజాః|*


*మనసా కర్మణా వాచా విపరీతమతోఽన్యథా॥9940॥*


మహారాజునకు త్రికరణశుద్ధిగా (మనసా, వాచా, కర్మణా) ప్రియమును గూర్చెడి ప్రజలు శుభములను పొందెదరు. అట్లుగాక అప్రియమును కలిగించెడివారు కష్టనష్టముల పాలగుదురు.


*43.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*నిత్యం ప్రముదితా గోపా వత్సపాలా యథా స్ఫుటమ్|*


*వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతి గాః॥9941॥*


*43.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*తస్మాద్రాజ్ఞః ప్రియం యూయం వయం చ కరవామ హే|*


*భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృపః॥9942॥*


*చాణూరుడను మల్లయోధుడు బలరామకృష్ణులను సంబోధించుచు ఇంకను ఇట్లు నుడువుచుండెను (ముప్పదియవ శ్లోకము నుండి కొనసాగించబడినది)*


"ప్రతిదినము ఆవులను, దూడలను మేపుచు వనములలో తిరుగుచుండునప్పుడు గోపాలురు (మీరు) మల్లయుద్ధములను నెఱపుచు ఆడుకొనుచుండిరి. ఈ విషయము అందఱును ఎఱిగినదే. కనుక యుద్ధక్రీడలలో (కుస్తీపోటీలలో) ఆఱితేఱిన మీరును మేమును ఇప్పుడు ఆ క్రీడలను ఆడి రాజుగారిని సంతోషింపజేయుదము. అట్లొనర్చుట వలన ప్రజలందఱును ప్రసన్నులగుదురు. రాజు సకల ప్రజలకు ప్రతినిధి గదా" అని పల్కెను.


*43.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*తన్నిశమ్యాబ్రవీత్కృష్ణో దేశకాలోచితం వచః|*


*నియుద్ధమాత్మనోఽభీష్టం మన్యమానోఽభినంద్య చ॥9943॥*


పరీక్షిన్మహారాజా! చాణూరుడు పలికిన మాటలను వినిన పిమ్మట, ద్వంద్వయుద్ధము చేయుట తమకుకూడ ఇష్టమైనదేనని శ్రీకృష్ణుడు భావించెను. పిమ్మట ఆ స్వామి వానికి తన అంగీకారమును తెలిపి దేశకాలములకు తగిన మాటలను ఇట్లు బదులుచెప్పెను-


*43.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*ప్రజా భోజపతేరస్య వయం చాపి వనేచరాః|*


*కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహః॥9944॥*


*43.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*బాలా వయం తుల్యబలైః క్రీడిష్యామో యథోచితమ్|*


*భవేన్నియుద్ధం మాధర్మః స్పృశేన్మల్లసభాసదః॥9945॥*


"చాణూరా! మీరేగాదు. వనములలో సంచరించుచు జీవించుచున్నట్టి మేమును కంసమహారాజు యొక్క పాలనలోని వారమే. అందువలన ఆయనకు నిరంతరము ప్రియమును గూర్చుచుండుట మాకును కర్తవ్యమే. అంతేగాక! అది మాకు మిగుల శ్రేయోదాయకము గూడా. కనుక మల్లయోధుడా! మేము పసిబాలురము. మాతో సమానమైన బలముగల బాలురతోడనే యుద్ధక్రీడ సలుపుట ధర్మము. ఒకరు బలవంతులు, మఱియొకరు బలహీనులు ఐన వారిమధ్య ద్వంద్వయుద్ధము జరుగుట అధర్మము. అధర్మ యుద్ధము వలన ప్రాప్తించెడి పాపము (పాపఫలము) ప్రేక్షకులను తాకరాదుగదా" అనెను.


*చాణూర ఉవాచ*


*43.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*న బాలో న కిశోరస్త్వం బలశ్చ బలినాం వరః|*


*లీలయేభో హతో యేన సహస్రద్విపసత్త్వభృత్॥9946॥*


*43.40 (నలుబదియవ శ్లోకము)*


*తస్మాద్భవద్భ్యాం బలిభిర్యోద్ధవ్యం నానయోఽత్ర వై|*


*మయి విక్రమ వార్ష్ణేయ బలేన సహ ముష్టికః॥9947॥*


*అంతట చాణూరుడు ఇట్లనెను* "కృష్ణా! నీవు గాని, బలరాముడుగాని, బాలురు గాని కిశోరులు ఎంతమాత్రమూగాదు. మీరు ఇరువురును బలపరాక్రమ సంపన్నులే. ఎందుకనగా, వేయి యేనుగుల బలముగల *కువలయాపీడము* అను మదపుటేనుగును (మేము అందఱమూ చూచుచుండగనే) మీరు అవలీలగా హతమార్చితిరి. అందువలన మిక్కిలి బలిష్ఠులైన మీరు బలసంపన్నులమైన మా వంటివారితో ద్వంద్వయుద్ధము చేయుట న్యాయమే. ఏవిధముగను అన్యాయము గాదు. కనుక, శ్రీకృష్ణా! నీ పరాక్రమము నాపై చూపుము. బలరాముడు తన బలమును ముష్టికునిపై ప్రదర్శింపగలడు".


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే కువలయాపీడవధో నామ త్రిచత్వారింశోఽధ్యాయః (43)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *బలరామకృష్ణులు 'కువలయాపీడము' అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట* యను నలుబది మూడవ అధ్యాయము (43)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

శ్రీలలితా సహస్రనామ భాష్యము*



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*834వ నామ మంత్రము* 


*ఓం విశృంఖలాయై నమః*


కర్మబంధములు, విధినిషేధములు లేక సర్వ స్వతంత్రురాలుగాను, దిగంబర స్వరూపురాలిగాను భాసిల్లు  పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విశృంఖలా* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం విశృంఖలాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు  జీవనగమ్యంలో కొనసాగించు సత్కర్మలకు ఏర్పడు ప్రతిబంధకములు నిరోధింపడి, తలచిన కార్యములు నిర్విఘ్నము నెరవేరినవాడగును


ఐహిక బంధములే సంసార శృంఖలములు. జగన్మాత ప్రసాదించు జ్ఞానజ్యోతులచే భక్తుల సంసార శృంఖలములు ఛేదింపబడును. యోగులకు వారి యోగసాధనలో బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి యను శృంఖలములు త్రెంచబడి సహస్రారమునకు చేరు మార్గము సుగమము అగును. పాపకర్మలు చేయుటచే నీచపుజన్మలు మరల మరల కలుగుచునేయుండును. అట్లే పుణ్యకర్మలు చేసినను మంచిజన్మలు కలుగుచునేయుండును గాని జన్మరాహిత్యమైన ముక్తి లభించదు.. పరమేశ్వరి యందు సంపూర్ణమైన ధ్యానదీక్ష కలిగి, కేవలము ముక్తియే తమ పరమార్థంగా సాధనచేయు సాధకులకు శ్రీమాత జన్మరాహిత్యమైన కైవల్యమును ప్రసాదించి *పునరపిజననం, పునరపిమరణం* అను  శృంఖలములను ఛేదింపజేయును గనుకనే ఆ తల్లి *విశృంఖలా* యని అనబడినది.


అలంపురి జోగులాంబ వంటి కొన్ని శక్తిపీఠములలో నగ్నమూర్తులు గలవు. విశృంఖలా యను పదమునకు దిగంబరి యను అర్థమున్నది. గనుకనే జగన్మాత *విశృంఖలా* యని అనబడినది. ఎముకలు, మాంసము, రక్తము నింపిన తోలుతిత్తివంటిది ఈ శరీరము. అటువంటి తోలుతిత్తికి అలంకరింపబడిన వస్త్రములు, సుగంధభరితములైన పుష్పమాలలు, కాంచనమణి భూషణములు వంటి అలంకారములు మనోవికారములను పెల్లుబికించే అజ్ఞాన శృంఖలములవంటివి. పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాత తానొక జ్ఞానజ్యోతిగా ఆ శృంఖలములను తెగటార్చి కైవల్యమార్గము దిశగా సాధకులను నడిపించును గనుక పరమేశ్వరి *విశృంఖలా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విశృంఖలాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము

 


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*374వ నామ మంత్రము* 


*ఓం కృతజ్ఞాయై నమః*


పుణ్య పాపములు రెండింటిని తెలిసియున్న పరమేశ్వరికి నమస్కారము.


కృతములను తెలిసికొను తొమ్మండుగురుకి సాక్షియై ఉన్నట్టి శ్రీమాతకు నమస్కారము.


కృతయుగమునందువలె ఎల్లప్ఫుడు పరిపూర్ణమైన జ్ఞానము గలిగిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కృతజ్ఞా* యను మూడక్షరముల *త్ర్యక్షరీ* నామ మంత్రమును     *ఓం కృతజ్ఞాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే కృత్యాకృత్యముల తారతమ్యము తెలిసి, వేదవిహిత కృత్యములే ఒనరించువారిగా మెలగుచూ తరించుదురు.


*కృత* అనగా చేయునది. *జ్ఞా* అనగా తెలిసికొనుట. అనగా జీవులు చేయు మంచి చెడులను తెలిసికోగల జ్ఞానస్వరూపురాలు గనుక *కృతజ్ఞా* యని అనబడినది. 


1. సూర్యుడు, 2. చంద్రుడు, 3. యముడు, 4. కాలము, 5. పంచమహాభూతములు (5) (భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము) అను ఈ తొమ్మిదింటికి పరమేశ్వరి సాక్షి స్వరూపురాలు. గనుకనే *కృతజ్ఞా* యని అనబడినది.  జగన్మాత తనకు ఇతరులు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము చేయునది. అమ్మను స్మరించుటయే, లేదా ఉపాసించుట, అమ్మ నామ మంత్రము జపించుట, అమ్మను సాటి ప్రాణులలో గమనిస్తూ, ఆ ప్రాణులకు ఉపకారము చేయుట - ఇలాంటివి అన్నియు ఆ తల్లి తనకు ఉపకారము అని భావించి తిరిగి అట్టి ఉపకారులకు ప్రత్యుపకారము చేయునది గనుక శ్రీమాత *కృతజ్ఞా* యని అనబడినది.


*కృత* అనగా కృతయుగము. కృతయుగమునందు ధర్మము నాలుగు పాదములపై నడచియున్నది.  పాపపుణ్యముల విచక్షణ తెలిసియున్నవారే. పాపకృత్యములు చేయుటకు భయపడెడివారు. కృత యుగములో అందరూ జ్ఞానస్వరూపులే.  పరమేశ్వరి ఆ యుగధర్మమును తెలిసియున్నది గనుక  పరమేశ్వరి *కృతజ్ఞా* యని అనబడినది. ఇంకను చెప్పవలెనంటే కృతయుగధర్మమువలె తానన్ని యుగములందును, సర్వకాలములందును ఉంటుంది గనుక శ్రీమాత *కృతజ్ఞా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం కృతజ్ఞాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది మూడవ అధ్యాయము*


*బలరామకృష్ణులు "కువలయాపీడము" అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*43.1 (ప్రథమ శ్లోకము)*


*అథ కృష్ణశ్చ రామశ్చ కృతశౌచౌ పరంతప|*


*మల్లదుందుభినిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతుః॥9908॥*


*శ్రీశుకుడు పలికెను* అంతశ్శత్రువులను జయించిన పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు, బలరాముడు ప్రాతఃకాలస్నానాది విధులను నిర్వర్తించుకొనిరి. పిమ్మట వారు మల్లయోధుల భుజాస్ఫాలనాది ధ్వనులను, దుందుభి మొదలగు వాద్యముల ఘోషలను విని, రంగస్థల విశేషములను స్వయముగా తిలకించుటకై బయలుదేఱిరి.


*43.2 (రెండవ శ్లోకము)*


*రంగద్వారం సమాసాద్య తస్మిన్ నాగమవస్థితమ్|*


*అపశ్యత్కువలయాపీడం కృష్ణోఽమ్బష్ఠప్రచోదితమ్॥9909॥*


రంగస్థల ద్వారము కడకు రాగానే శ్రీకృష్ణుడు అచటనున్న *కువలయాపీడనము* అను ఏనుగును చూచెను. దానిని ఒక మావటివాడు అదుపు చేయుచుండెను.


*43.3 (రెండవ శ్లోకము)*


*బద్ధ్వా పరికరం శౌరిః సముహ్య కుటిలాలకాన్|*


*ఉవాచ హస్తిపం వాచా మేఘనాదగభీరయా॥9910*


అప్పుడు కృష్ణప్రభువు ఉత్తరీయమును నడుమునకు బిగించి, ముంగురులను సవరించుకొని, మేఘధ్వనులవలె గంభీరములైన వాక్కులతో మావటివానిని ఱెచ్చగొట్టుచు ఇట్లనెను-


*43.4 (నాలుగవ శ్లోకము)*


*అంబష్ఠాంబష్ఠ మార్గం నౌ దేహ్యపక్రమ మా చిరమ్|*


*నో చేత్సకుంజరం త్వాద్య నయామి యమసాదనమ్॰9911॥*


"ఓరీ మావటీ! వెంటనే తప్పుకొనుము. మా ఇరువురికి మార్గమునిమ్ము. లేనిచో నిన్ను, ఏనుగును ఇప్పుడే మృత్యుముఖమునకు చేర్చెదను".


*43.5 (ఐదవ శ్లోకము)*


*ఏవం నిర్భర్త్సితోఽమ్బష్ఠః కుపితః కోపితం గజమ్|*


*చోదయామాస కృష్ణాయ కాలాంతకయమోపమమ్॥9912॥*


శ్రీకృష్ణుడు హెచ్చరించినంతనే మావటివాడు మిగుల క్రుద్ధుడయ్యెను. పిదప అతడు మృత్యుదేవతవలె భయంకరమైన ఆ మదపుటేనుగును కృష్ణుని మీదికి ఉసిగొల్పెను.


*43.6 (ఆరవ శ్లోకము)*


*కరీంద్రస్తమభిద్రుత్య కరేణ తరసాగ్రహీత్|*


*కరాద్విగలితః సోఽముం నిహత్యాంఘ్రిష్వలీయత॥9913॥*


వెన్వెంటనే ఆ కువలయాపీడము ఱెచ్చిపోయి, శ్రీకృష్ణుని తన తొండముతో చుట్టివేసెను. అంతట ఆ స్వామి నేర్పుగా ఆ తొండమునుండి జాఱుకొని (తప్పించుకొని) దానిపై పిడికిలితో ఒక్కపోటు పొడిచి, తాను దాని కాళ్ళసందున దాగికొనెను.


*43.7 (ఏడవ శ్లోకము)*


*సంక్రుద్ధస్తమచక్షాణో ఘ్రాణదృష్టిః స కేశవమ్|*


*పరామృశత్పుష్కరేణ స ప్రసహ్య వినిర్గతః॥9914॥*


*43.8 (ఎనిమిదవ శ్లోకము)*


*పుచ్ఛే ప్రగృహ్యాతిబలం ధనుషః పంచవింశతిమ్*


*విచకర్ష యథా నాగం సుపర్ణ ఇవ లీలయా॥9915॥*


శ్రీకృష్ణుడు తన యెదుట ఎక్కడను కనబడకపోవుటతో ఆ మదపుటేనుగు ఒడలు తెలియని కోపముతో తొండముతో వాసన చూచుచు వెదకి వెదకి ఆ పురుషోత్తముని పట్టుకొనెను. అప్పుడు ఆ ప్రభువు శక్తియుక్తులను చూపుచు దాని పట్టునుండి బయటపడెను. పిదప ఆ స్వామి దాని తోకను పట్టుకొని, గరుత్మంతుడు సర్ఫమునువలె అవలీలగా దానిని ఇరువదియైదు బారల దూరము లాగివేసెను.


*43.9 (తొమ్మిదవ శ్లోకము)*


*స పర్యావర్తమానేన సవ్యదక్షిణతోఽచ్యుతః|*


*బభ్రామ భ్రామ్యమాణేన గోవత్సేనేవ బాలకః॥9916॥*

*43.10 (పదియవ శ్లోకము)*


*తతోఽభిముఖమభ్యేత్య పాణినాఽఽహత్య వారణమ్|*


*ప్రాద్రవన్ పాతయామాస స్పృశ్యమానః పదే పదే॥9917॥*


అనంతరము ఆ కువలయాపీడము పుంజుకొని, శ్రీకృష్ణుని పట్టుకొనుటకు ప్రయత్నించెను. ఆ ఏనుగు కుడివైపునకు తిరుగునప్పుడు అతడు ఎడమవైపునకును, అది ఎడమవైపునకు తిరుగునప్పుడు అతడు కుడివైపునకును తిరుగుచు, బాలకుడు ఆవుదూడనువలె ఆటపట్టించుచు ముప్పుతిప్పలు పెట్టెను. పిమ్మట ఆ ఏనుగునకు ఎదుట నిలిచి చేతతో దానిని ఒక దెబ్బకొట్టి పరుగిడసాగెను. ఆ విధముగా ఆ స్వామి దానికి అందినట్లే అందుచు, అందకుండాపోవుచు పదేపదే దానిని వంచింపదొడగెను.


*43.11 (పదకొండవ శ్లోకము)*


*స ధావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహసోత్థితః|*


*తం మత్వా పతితం క్రుద్ధో దంతాభ్యాం సోఽహనత్క్షితిమ్॥9918॥*


పిమ్మట కృష్ణభగవానుడు పరుగెత్తుచు ఒకసారి లీలగా భూమిపై పడినట్లు నటించెను. వెంటనే లేచి నిలబడెను. ఆ సమయమున మిగుల ఱెచ్చిపోయియున్న ఆ మదపుటేనుగు నిజముగనే అతడు పడిపోయినాడని భావించి, ఆవేశమున తన దంతములతో నేలను క్రుమ్మసాగెను.


*43.12 (పండ్రెండవ శ్లోకము)*


*స్వవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రోఽత్యమర్షితః|*


*చోద్యమానో మహామాత్రైః కృష్ణమభ్యద్రవద్రుషా॥9919॥*


*43.13 (పదమూడవ శ్లోకము)*


*తమాపతంతమాసాద్య భగవాన్మధుసూదనః|*


*నిగృహ్య పాణినా హస్తం పాతయామాస భూతలే॥9920॥*


క్రమముగా మదపుటేనుగు యొక్క శక్తి క్షీణించుచుండెను. తన ప్రయత్నము ఎంతకును ఫలింపకుండుటచే అది రెట్టించిన కోపముతో బుసలు కొట్టుచుండెను. పరిస్థితిని గమనించిన మావటివాండ్రు దానిని గట్టిగా ఉసిగొల్పుటతో అది ఇంకను కినుకబూని కృష్ణునిమీదికి విజృంభించెను. అంతట కృష్ణపరమాత్మ తనపై దాడి చేయుటకై వచ్చుచున్న ఆ మదపుటేనుగును సమీపించి తన చేతితో దాని తొండమును గట్టిగా పట్టుకొని, నేలపై పడవేసెను.


*43.14 (పదునాలుగవ శ్లోకము)*


*పతితస్య పదాఽఽక్రమ్య మృగేంద్ర ఇవ లీలయా|*


*దంతముత్పాట్య తేనేభం హస్తిపాంశ్చాహనద్ధరిః॥9921॥*


అది క్రిందబడినంతనే ఆ ప్రభువు సింహమువలె విజృంభించి, అవలీలగా దానిని తన పాదములతో త్రొక్కిపట్టెను. వెంటనే ఆ స్వామి దాని ఒక దంతమును ఊడబెఱికి, దాని దంతముతోనే ఆ కువలయాపీడమును, మావటివాండ్రను చావగొట్టెను.


*43.15 (పదునైదవ శ్లోకము)*


*మృతకం ద్విపముత్సృజ్య దంతపాణిః సమావిశత్|*


*అంసన్యస్తవిషాణోఽసృఙ్మదబిందుభిరంకితః|*


*విరూఢస్వేదకణికావదనాంబురుహో బభౌ॥9922॥*


ఆ మదపుటేనుగు మృతకళేబరమును అచటనే విడిచిపెట్టి ఆ మహాత్ముడు దాని దంతమును చేబూని రంగస్థలమున ప్రవేశించెను. అప్పుడు శ్రీకృష్ణుని రూపవైభవము చూడముచ్చట గొలుపుచుండెను. ఏనుగు దంతమును భుజముపై వహించియున్న ఆ ప్రభువు శరీరముపై రక్తబిందువులు, ఏనుగుయొక్క మదజల బిందువులు ప్రస్ఫుటముగా కనబడుచుండెను. మదపుటేనుగుతో పోరాడిన సందర్భమున చెమర్చిన ఆయన ముఖారవిందమునగల చెమటబిందువులు వింతశోభల నీనుచుండెను.


*43.16 (పదహారవ శ్లోకము)*


*వృతౌ గోపైః కతిపయైర్బలదేవజనార్దనౌ|*


*రంగం వివిశతూ రాజన్ గజదంతవరాయుధౌ॥9923॥*


పరీక్షిన్మహారాజా! బలరామకృష్ణుల చేతులలో ఆభ ఏనుగు దంతములు ఆయుధములవలె శోభిల్లుచుండెను. కొంతమంది గోపాలురు వారి చుట్టును చేరియుండగా ఆ సోదరులు మల్లరంగమున ప్రవేశించిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కోపగించినంత మాత్రాన

  🙏🏻

🌹ఆణిముత్యాలు 🌹


 *కాగితాలను కలిపివుంచడానికి పిన్ను వాటిని కలిపి గుచ్చి వలసివస్తుంది.. అంతమాత్రాన పిన్ను ఉద్దేశం కాగితాలను గుచ్చి బాధ పెట్టాలని కాదు వాటిని కలిపి ఉంచడానికే.. అదేవిధంగా కుటుంబాన్ని కలిపి ఉంచాలుకునే వారు కోపగించినంత మాత్రాన ద్వేషం ఉన్నట్టు కాదు.*

ప్రదోష వ్రతం

 *ప్రదోష వ్రతం*

                  

```

ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం. 


ప్రతి రోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. 


ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని ‘మహా ప్రదోషం’ అంటారు. 


మహా ప్రదోషం రోజున శివ భక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 


రెండు త్రయోదశి తిథులలో (శుక్ల పక్షము మరియు కృష్ణ పక్షము) ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 


కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణ పక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు. 


ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళి లో చెప్పబడింది.


ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు. 


ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు. ప్రదోష సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. 


ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు. నందీశ్వరుడు నాలుగు వేదాలు, 

64 కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ, వినయంతో వుండి, శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు. 


అందువల్ల నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి.``` 


*త్రయోదశి ఏ రోజున వస్తే* 


*ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషమని,


*సోమవారం రోజు వస్తే దానిని 

సోమ ప్రదోషమనీ, 


*మంగళవారం రోజు వస్తే దానిని 

భౌమ ప్రదోషమని, 


*బుధవారం రోజు వస్తే దానిని 

బుధ ప్రదోషమని, 


*గురువారం రోజు వస్తే దానిని 

గురు ప్రదోషమని, 


*శుక్రవారం రోజు వస్తే దానిని 

శుక్ర ప్రదోషమని, 


*శనివారం రోజు వస్తే దానిని 

శని త్రయోదశి అనీ, 

శని ప్రదోషమని పిలుస్తారు. 


వీటిలో శుక్ల పక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు.``` 


  *ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి?*


ప్రదోషం రోజు ఉదయమే స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించాలి. శరీరంపై విభూతిని, రుద్రాక్షమాలను కూడా ధరించటం మంచిది. ఆ రోజులో వీలైనప్పుడల్లా పంచాక్షరి మంత్రాన్ని (ఓం నమః శివాయ) జపం చేయాలి. ప్రదోషం రోజున నిశ్శబ్దంగా ఆరాధించటాన్ని శివుడు ఇష్టపడతాడని చెబుతారు. కఠిన ఉపవాసం చేయలేనివారు పండ్లు, పాలు లాంటివి తీసుకోవచ్చు. ఉడికించిన పదార్థాలను తీసుకోకూడదు. 


సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడశోపచార పూజ జరపాలి. 


ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన, ఆవుపాలతో అభిషేకం అభిషేకం చేయటం, బిల్వ పత్రాలు మరియు శంఖుపూలతో అర్చించటం శ్రేయస్కరం.

మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రదోష కథను వినటంగానీ చదవటం గానీ చేయాలి. ఇంటిలో పూజ ముగించిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి. వీలైనవారు ప్రదోష స్తోత్రం, శివ స్తోత్రములను కూడా పఠించాలి.


స్కంద పురాణంలో ప్రదోష మహత్య కథ కూడా వివరింపబడింది.```


*మహా మృత్యుంజయ మంత్రము:*


ఓం త్రయంబకం యజామహే 

సుగంధిం పుష్టి వర్ధనం 

ఊర్వారుకమివ బంధనాత్ 

మృత్యోర్ముక్షీయ మామృతాత్


*శని ప్రదోషం:*```


దేవ దానవులు క్షీర సాగరాన్ని మధించినప్పుడు వెలువడిన హాలాహలం నుండి శివుడు ప్రపంచాన్ని రక్షించిన రోజుగా శనిప్రదోషం రోజును చెబుతారు.


శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమంగా పరిగణిస్తారు.


శని ప్రదోష వ్రతం ఆచరించటం వలన కర్మ దోషాలు, జాతక దోషాల నుండి విముక్తి పొందవచ్చునని చెబుతారు. వివాహ దోషాలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజున ప్రదోష కాలంలో శివారాధన చేయాలి.


గత జన్మల పాపాలు కూడా తొలగి సకలసంపదలు చేకూరుతాయి. శని ప్రదోషానికి సంబంధించి ఉజ్జయిని మహాకాళేశ్వరునికి సంబంధించిన కథ ఒకటి చెప్పబడినది.``` 


*సోమ ప్రదోషం*```


సోమవారము శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఆ రోజున వచ్చే సోమ ప్రదోషమును ప్రశస్తమైనదిగా భావిస్తారు. ఈ రోజున ప్రదోష వ్రతము ఆచరించటం వలన మనసులోని మలినాలన్నీ తొలగిపోతాయి.``` 



*గురు ప్రదోషం*


త్రయోదశీ ప్రదోషము గురువారము వస్తే ఆ రోజును గురు త్రయోదశిగా భావిస్తారు.  

గురు ప్రదోష పూజ వలన విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయని చెబుతారు. జాతకములో ఉండే గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా భావిస్తారు.


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

వైశాఖ పురాణం🚩*_ _*10

 🌞 *ఆదివారం - మే 19, 2024*🌞

  _*🚩వైశాఖ పురాణం🚩*_

     _*10 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

         *దక్షయజ్ఞనాశము*  

          *కామదహనము*

☘☘☘☘☘☘☘☘☘

రుద్రుడా వార్తను విని కాలాంతకునివలె భయంకరాకారుడై వేయి బాహువులుకల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి యడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలనిరీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతిచ్చెను. భూతసంఘములను వీరభద్రుని వెంటపొండని పంపెను.


ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు , వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి యచటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అందరనుకొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు నెవరు యే అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేక పోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయముగ దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగ వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరచి తమ వారితో గలసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలినవారు బ్రహ్మవద్దకు వెళ్ళి శరణు వేడిరి.


బ్రహ్మయు వారితో గలసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధరీతులలో నూరడించెను స్తుతించెను. శివుని సమాధానపరచి శివునితో గలసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారినందరిని శివుని ప్రార్థించి యతనిచేతనే బ్రతికింపజేసెను, శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక ముఖము నమర్చి బ్రతికించెను, మరియు మేక గడ్డమును తెచ్చి భృగుమహర్షికి అమర్చెను. సూర్యునికి దంతముల నీయలేదు. కాని వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమిచ్చెను. అవయవములను పోగొట్టుకొన్నవారికి ఆ అవయవముల నిచ్చెను. కొందరికీయలేదు.


యజ్ఞశాల యీ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరల చేసి పూర్తి చేసిరి.


యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్యా వియోగమున దుఃఖితుడై గంగాతీరమున పున్నాగ వృక్షము క్రింద తపమాచరించు కొనుచుండెను.


దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనాహిమాచలముల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను.


ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరివలన మరణము లేకుండునట్లు వరములను పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు పుత్రుడెట్లు కలుగును ? కావున నేను అవధ్యుడను నన్ను చంపువారెవరును లేరని తారకుడు తలచెను. వరగర్వితుడై సర్వలోకములను , సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను , తన గృహములునూడ్చుటకును, దేవతాస్త్రీలను దాసీలుగను నియమించెను. దేవతలను బహువిధములుగ బాధించుచుండెను.


దేవతలు వాని వలని బాధలను భరింపజాలక బ్రహ్మవద్దకు బోయి తమను రక్షింపుమని బహువిధములుగ ప్రార్థించిరి. బ్రహ్మయును వారి మాటలను విని యిట్లు పలికెను. దేవతలారా ! నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి యెవరు నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షునియజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీయను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసికొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానము నాలోచింపుడని వారికి దగిన ఉపాయమును సూచించెను. వారిని యూరడించి పంపెను.


దేవతలందరును ఇంద్రుని ఇంట సమావేశమైరి బృహస్పతితో నాలోచించిన ఇంద్రుడును, నారదుని మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును, మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి.


ఇంద్రుడు - నారదుని జూచి నారదమహర్షీ ! నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీరత్యాగమొనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడగు శివుడును నీ హిమాలయశృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయై ప్రస్తుతము నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు. శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయగు శివునికి భార్య చేయమని భోదింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను. నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగ హిమవంతుని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించునట్లుగ హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను.


నారదుని పంపిన తరువాత నింద్రుడు మన్మధుని జూచి తారకాసుర పీడితులగు దేవతల హితము కొరకు భార్యా వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పు కార్యమును చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంతర్తుశోభలను ప్రవర్తింపజేయుము. పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణములను ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికిని సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురవధ జరుగును. దేవతలకు పరపీడనముపోవును. ఈ ప్రకారము చేయుమని వానిని పంపెను.


మన్మధుడును ఇంద్రుని యాజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితోను , భార్యయగు రతీదేవితోను , మలయానిలాది పరివారముతోను శివుడున్న తపోభూమికి పోయెను.


అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్పసమృద్దము , మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మున్నగువానిని సమర్పింప వచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతుల సమాగమమునకిదియే తగిన సమయమని తలచెను. శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండి యొక బాణమును ప్రయోగించెను. మరలనింకొక బాణమును ప్రయోగింప సిద్దముగనుండెను. శివుడు తన మనస్సు చలించుటను గుర్తించెను. కారణమేమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటయేమి నాకిట్టి చాంచల్యమును కలిగించిన వారెవ్వరిని విచారించి నలువైపుల పరిశీలించెను.

బాణప్రయోగమొనర్పబోవు మన్మధుని జూచెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని, వాని ధనుర్బాణములతో దహించెను.


తమ కార్యమేమగునోయని చూచుచున్నదేవతలు భయపడి కకావికలై పారిపోయిరి. వసంతుడు , మన్మధుని భార్య రతి - శివుడు తమను కూడ శిక్షించునేమో ? ఆ శిక్షయెట్లుండునోయని భయపడి కనులను మూసికొని దూరముగ పోయెను. స్త్రీ సన్నిధానము యుక్తముగాదని పరమశివుడంత్ర్దాన మయ్యెను.


మన్మధుడు చేసినపని దేవతలకు , శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పనిని చేసినచో నింక నెంతటి ఆపద మన్మధునకు కలుగునో యెవరు చెప్పగలరు ?


కావున శ్రుతకీర్తి మహారాజు ! ఇక్ష్వాకు వంశమువాడైన హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టుడేయగును. సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితమును వైకల్యము కలవారిని , అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసినదానికి శునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్యకర్తవ్యము. అనాధలయెడ దయజాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలయునని శ్రుతదేవుడు వివరించెను. పరమశివునికనిష్టమును చేయుటచే మన్మధుడు తరువాతి జన్మయందును బాధలుపడెను.


పరమపుణ్యప్రదమైన ఈ కధను , రాత్రిగాని , పగలుగాని యెవరు విన్నను , జన్మ , మృత్యువు , ముసలితనము మున్నగు భయములనుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదులవలన భయము నుండదు. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను.


   *వైశాఖ పురాణం పదవ*    

    *అధ్యాయం సంపూర్ణం*


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏