13, ఫిబ్రవరి 2023, సోమవారం

నమస్కారం విలువ.*

 ☘️☘️☘️


 *నమస్కారం విలువ.*

🌹🌹🌹🌹🌹🌹


```మహాభారత యుద్ధ సమయంలో "మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు" అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడి భీష్మ పితామహడు "నేను రేపు పాండవులను చంపుతాను" అని ప్రకటించాడు.


అంతే... పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు.


తను బైటే నిలబడి ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన "అఖండ సౌభాగ్యవతీ భవ" అని ఆశీర్వదిస్తాడు. తర్వాత జరిగేది గమనించు అన్నాడు.


ద్రౌపది అలానే చేసింది, భీష్ముడు దీవించి, "ఏంటమ్మా! ఇంత రాత్రి ఒంటరిగా వచ్చారు. నిన్ను కృష్ణుడు తీసుకు వచ్చాడు కదా" అన్నాడు.


దానికి ద్రౌపది "అవును తాతయ్యా.. అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు" అనింది. భీష్ముడు బయటకు వెళ్ళగా.. ఇద్దరూ ఒకరికి ఒకరు నమస్కరించు కున్నారు.


వెంటనే భీష్ముడు.. నాకు తెలుసు కృష్ణా, మీరు ఇలా చేస్తారని. ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ. నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి అని ఒక మార్గం ఉపదేశించాడు.


శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు".


"ఇలాగే.. నీవు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలకు నమస్కరిస్తూ ఉండు. అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడి భార్యలు కూడా ఆ పెద్దలతో పాటు పాండవులకు కూడా నమస్కరిస్తూ ఉంటే బహుశా ఈ యుద్ధం ఆగిపోవచ్చు. ఒక్క నమస్కారానికి అంతటి భాగ్యం కలుగుతుంది" అన్నాడు.

🌹🌹🌹🌹🌹🌹


ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోక పోవడం. అహంకారం వదిలి, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్ధాలు జరుగు తున్నాయి.


ఇంటిలోని పిల్లలు మరియు కోడళ్లు ప్రతిరోజూ ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దల ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి.

🌹🌹🌹🌹🌹🌹

ఎందుకంటే...

నమస్కారం ప్రేమ.

నమస్కారం క్రమశిక్షణ.

నమస్కారం చల్లదనం.

నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.

నమస్కారం మంచి ఆలోచనలను ఇస్తుంది.

నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది.

నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.

నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.

🌹🌹🌹🌹🌹🌹

ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ ప్రతిభ ఇనుమడిస్తుంది. మంచి సంస్కారాలు అలవర్చుకొంటే తరతరాలుగా వంశాభివృద్ధి  జరుగుతుంది.```

  🌹 ఓం శాంతి 🌹🙏🏽ధర్మో రక్షతి రక్షితః 🙏🏽

పిప్పి పన్ను

 పిప్పి పన్ను బాధ హరించుటకు సిద్దయోగాలు  - 


 *  కర్పూర తైలం ( టర్పంటైన్ ) లో దూది తడిపి ఆ దూదిని పిప్పిపన్ను పైన పెట్టి నొక్కి పట్టి ఉంచిన పిప్పిపన్ను బాధ తగ్గును . 


 *  జిందా తిలిస్మాత్ రెండు చుక్కలు దూది పైన వేసి పిప్పిపన్ను రంధ్రములో పెట్టిన పిప్పిపన్ను బాధ తగ్గును. 


 *  కుప్పింటాకు చెట్టు ఆకు పసరు పిప్పిపన్ను రంధ్రములో వేసిన పిప్పిపంటి లోని పురుగు చచ్చి ఉపశమనం కలుగును. 


 *  జిల్లేడు పాలు రెండు చుక్కలు దూదికి అంటించి పిప్పి పన్ను రంధ్రము నందు ఉంచిన పిప్పిపన్నులోని పురుగు చచ్చిపడిపోవును. 


   గమనిక  - 


        దంతములు వదులుగా అవ్వడం , దంతముల తీపి , తీవ్రమైన నొప్పి , చిగుళ్లు బలహీనత , చీము , రక్తం కారడం వంటి సమస్యలు ఉన్నవారికి ఒక దంత చూర్ణం తయారుచేసి ఇస్తాను. 40 రోజుల్లోపే సమస్య చాలావరకు నయం అగును. ఇది పూర్తిగా మూలికలు , భస్మాలు ఉపయోగించి చేయడం వలన ఎటువంటి చెడుఫలితాలు కలగవు. దంతసమస్యలు అన్ని సంపూర్ణంగా నయం అగును. 

చిగుళ్లు మరియు దంతాలు బలంగా తయారయ్యి గట్టిగా ఉండును.


 

  

ఎత్తైన స్వామి నటరాజ విగ్రహం

 *ప్రపంచంలోనే ఎత్తైన స్వామి నటరాజ విగ్రహం* 

పంచలోహాలతో 

*(5 లోహాలు)*

ఒకే తారాగణంతో తయారు చేయబడింది.  *23 అడుగుల పొడవు*

*17 అడుగుల వెడల్పు*

*15 టన్నుల బరువు*

*40 మిలియన్ రూపాయలు* 

(4 కోట్లు) 

*నిర్మించడానికి 10 సంవత్సరాలు పట్టింది.*


ఈ విగ్రహం నాలుగు చేతులు కలిగి ఉంది మరియు ఇది 102 తామర పువ్వులు,

52 సింహాలు మరియు 

34 సర్పాలను కలిగి ఉండేలా రూపొందించబడింది.

భారతదేశంలోని *తమిళనాడులోని వెల్లూరులోని* 

*శ్రీ లక్ష్మీ నారాయణి స్వర్ణ దేవాలయంలో స్థాపించబడింది.* 


*తమిళనాడు కుంభకోణానికి దగ్గరలో సుబ్రహ్మణ్యస్వామి నాలుగో క్షేత్రమైన  స్వామిమలైలో తయారు చేయబడింది.*


*నటరాజ విగ్రహాన్ని వీక్షించి స్వామి అనుగ్రహానికి పాత్రులుకండి.*

ప్రయాణించే వారి కోసం

 రైలులో మరియు బస్సులో ప్రయాణించే వారి కోసం బ్రాహ్మణ భోజనము మరియు టిఫిన్ కొరకు ఈ క్రింది నెంబర్లకు కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము.


గమనిక:'అన్యథా' భావించక

దయచేసి ఆరోజుకారోజు ఆర్డర్ చెయ్యొద్దు ఇవ్వలేము. ఇవ్వలేకపోయామనే బాధ మాకు కలగనివ్వొద్దు. మీరు టికెట్స్ బుక్ చేసుకున్న వెంటనే తెలిపినచో  ఇవ్వగలము.


1)ANANTHPUR SARALA 8374392377

2)వారణాసి లక్ష్మి 8985667737.

3)బాపట్ల  హరిప్రియ 9000120344.

4)షిర్డీ అనిల్. 9511111585

5)తిరుపతి విజయలక్ష్మి  9959859227

6)వైజాగ్ భువనేశ్వరి  8008390978.

7)రాజమండ్రి ప్రసన్న 6304049434.

8)హైదరాబాద్ ప్రసన్న 9346747694.

9)వరంగల్ హేమ 9703100005.

10)విజయవాడ లాస్య క్యాటరింగ్స్ 

9248487878

తుని గాయత్రి

7674023603

8686126646

అరుణాచలం ఆంధ్ర మెస్ లక్ష్మీకాంత్ శర్మ

8870218670

శ్రీ బ్రాహ్మణ కరిస్ పాయింట్ తిరుపతి 9959859227

వాస్తవా అద్భుతం

 ఎవరు రాశారో తెలియదు,

కానీ  వాస్తవాలను అద్భుతంగా ఆవిష్కరించారు.


మనిషి ఇరుక్కున్నాడు... మెగా గ్లోబలైజేషన్ లో...

👉 డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!

👉 పీలికబట్టల్ని వస్త్ర ధారణ అంటున్నారు.!

👉 భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!

👉 సహజీవనాన్ని సంసారమంటున్నారు.!

👉 గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.!

👉 డూప్ ల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు.!

👉 పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యమంటున్నారు..

👉 అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!

👉 ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!

👉 దారితప్పిన సరదాలను సంస్కృతి అంటున్నారు.!

👉 భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.!

👉 కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.!

👉 ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!

👉 మందు పోయిస్తేనే...మిత్రుడు అంటున్నారు.!

👉 కట్నం తెస్తేనే...భార్య అంటున్నారు.!

👉 సొమ్ములు తెస్తేనే... సంసారం అంటున్నారు.!

👉 కాసులు తెస్తేనే... కాపురం అంటున్నారు.!

👉 నిజాయితీగా ఉంటే... అసమర్ధుడంటున్నారు.!

👉 సక్రమంగా ఉంటే... అమాయకుడంటున్నారు.!

👉 అసత్యాలు మాట్లాడితే... బ్రతక నేర్చిన వాడంటున్నారు.!

👉 నిజం పలికితే... నీ కెందుకు పోవోయ్ అంటున్నారు..!

👉 న్యాయబద్ధంగా ఉంటే... ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!

👉 అన్యాయంగా బ్రతికినా... సక్సెస్...ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!

👉 అన్యాయాన్ని ఎదిరిస్తే... అతనికెందుకు అంటున్నారు.!

👉 నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!

👉 మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!

👉 మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!

👉 పరిస్థితులకు అనుగుణంగా పాత అర్ధం చెరిగిపోయి, ప్రయోజనాలకు అండగా... సరికొత్త పరమార్ధం ఆవిర్భవిస్తోంది.!

🤔 స్వార్ధ కాంక్షాణుగుణంగా... విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది.!

ఇదే గ్లోబలైజేషన్ మహిమ అంటే

🔥 టెక్నాలజీ పెరిగింది...

🔥 సౌకర్యం పెరిగింది...

🔥 విలాసం పెరిగింది...

🔥 విజ్ఞానం పెరిగింది...

🔥 కాలుష్యం పెరుగింది...

🔥 ఖర్చు పెరిగింది...

🔥 కల్తీ పెరిగింది...

🔥 రసాయన బంధం పెరిగింది...

🔥 అన్నీ పెరిగాయి...

కానీ! పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు

మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది..

రోగం తెలియని చికిత్సలు..శవాలకు రక్తపరీక్షలు...

విద్య పెద్ద వ్యాపారం...వ్యాధి ఇంకా పెద్ద వ్యాపారం

దహించనున్న గ్లోబల్ వార్నింగ్.... భావితరాలకు వార్నింగ్..

అయినా బాధ్యత లేనట్లు.. ఏమి తెలియనట్లు

నటించే మనిషికి శుభాకాంక్షలు .

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు


🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*శ్రీ సాయికి శ్రీ స్వామి వారికి భేదం లేదనే అనుభవం*


M.భాస్కరరావు (చెన్నై) వారికి వివాహమై 12 సంవత్సరములు అయినా సంతానం కలగలేదు. డాక్టర్ల చుట్టూ తిరిగారు. ఎన్నో పరీక్షలు చేశారు. ఎవరిలోనూ ఏ లోపంలేదు అయినా పిల్లలు ఎందుకు కలగటం లేదో అర్ధం కాలేదు. చాలా బాధపడుతున్నారు. ఒకరోజు ఒక స్నేహితుడు కలసి వీరి బాధ విని *సాయిబాబాకు మొక్కుకో పిల్లలు పుడతారు* అని చెప్పాడు. వీరికి సాయిబాబా అంటే మొదటినుంచి తెలవదు. వీరు వెంకటేశ్వరస్వామి భక్తులు. స్నేహితుడు చెప్పాక సాయిబాబా గుడికి వెళ్ళి మాకు సంతానము ప్రసాదించు స్వామీ నీ మందిరానికి 9 వారాలు వస్తాము అని మొక్కుకున్నారు. 


ఒక వారం వెళ్ళారు. రెండవ వారానికే వీరి భార్యకు గర్భమని చెప్పారు. వీరికి ఒక పాప పుట్టింది. పాపకు సాయి అని పేరు పెట్టారు. తరువాత మరలా ఇంకొక పాప పుట్టింది. అప్పటినుంచి వీరు భరద్వాజ మాష్టారుగారి పుస్తకాలు చదువుతూ పారాయణ చేస్తున్నారు. కొంతకాలానికి వీరి భార్యకు గర్భసంచిలో ఏదో అయింది, ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ చేస్తే చిన్న పిల్లలతో ఇబ్బంది అవుతుందని చాలా బాధపడుతున్నారు వీరి భార్య. తెల్లవారితే ఆపరేషన్, ఆ రాత్రి *ఆమె స్వప్నంలో వెంకయ్యస్వామి వారి పూజ గదిలో కూర్చున్నారు*.


 ఆమెకు వెంకయ్య స్వామి ఎవరో అర్ధంకాక ఎవరు నువ్వు ఎందుకొచ్చావని గట్టిగా అరుస్తూ స్వామిని అడిగారు. అప్పుడు *స్వామి, ఊరికినే వచ్చానమ్మా! ఏమీలేదమ్మా, నన్ను తిట్టమాకు!* అని వెళ్ళి పోయారట. తెల్లవారి ఈ విషయం ఈమె భర్తకు చెప్పింది. వచ్చింది. వెంకయ్యస్వామి అని ఆయనన్నారు. ఆ రోజు ఆపరేషన్కు హాస్పిటల్కు వెళ్ళారు. ఆపరేషన్ ముందు ఒక స్కానింగు చేయాలని అన్నారు.. స్కానింగ్ చేస్తే అంతకుముందు కనిపించిన ప్రాబ్లమ్ ఇప్పుడు లేదేంటి అని ఆశ్చర్యపోయారు డాక్టరుగారు. ఆపరేషన్ అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. ఇదంతా స్వామి దయ అని వారు పరమానంద పడిపోయారు.


 మరలా కొంతకాలానికి మళ్ళీ ఈమెకు కిడ్నీలో ప్రాబ్లమ్ వచ్చింది. ఏ సంగతి సరిగా చెప్పలేదు డాక్టర్లు. వారం వారం బాడీలోని బ్లడ్ అంతా బయటకు తీసి శుద్ధి చేసి మళ్ళీ ఎక్కించాలి. దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఇలా చేస్తుంటే కొన్నాళ్ళు బతకవచ్చు అన్నారు. బ్లడ్ తీసేటప్పుడు, ఎక్కించేటప్పుడు నరకం అనుభవించాలి. ఆమెకు పరీక్షలు చేస్తున్నారు. *ఈయన బాధతో హాస్పిటల్లోనే బాబా, వెంకయ్యస్వామి ఫోటోలుపెట్టి అగరవత్తులు వెలిగించి అక్కడే పారాయణ ప్రారంభించారు.* అది చూచి డాక్టర్లు ఏమిటయ్యా హాస్పిటల్ను గుడి చేసావేమిటి అని అడిగారు. అప్పుడు ఈయన మీ పని మీరు కానివ్వండి. నా పని నేను చూసుకుంటాను అని అన్నారు. పదిహేను రోజులు ఉంచాక పరీక్షలు అన్నీ అయ్యాక ఈమెకు ఏమీలేదు, బాగానే ఉంది. అని అన్నారట. స్వామి ఎంత దయామయుడో చూడండి. ఇంతటి దయామయునకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

                                                     పూజ్యశ్రీ మాస్టరుగారు మాచేత అనేక కార్యక్రమాలు చేయించారు. మేము కూడా మా శక్తి మేరకు, 'ఏమేమి కార్యక్రమాలు చేద్దామా?' అని ఆలోచిస్తూండేవారము. పూజ్యశ్రీ మాస్టరుగారి మూడవ సమ్మేళనం ఇక్కడ చేద్దామని యువకులమందరము సంకల్పించాము. దానికి కమిటీవారు కూడా సహకరించడంతో మొట్టమొదటిసారి 2002లో శ్రీ సాయిమాస్టర్ సమ్మేళనం ఒంగోలులో   చాలా చక్కగా జరిగింది. 


'ప్రతి ఇంట్లో రామాయణ, భారత గ్రంథాలు ఎలా వుంటాయో, అలాగే శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర గ్రంథాలు వుండాలి!', 'ఆధ్యాత్మిక గ్రంథాలు కొనుక్కోవడానికి ఆర్థికంగా ఎవ్వరూ వెనుకాడకూడదు" అని పూజ్యశ్రీ మాస్టరుగారు చెప్పిన రెండు వాక్యాలు నా మనసులో బాగా నాటుకుపోయాయి. కనుక మేమందరం కృషిచేసి పూజ్యశ్రీ మాస్టరుగారి అనుగ్రహంతో  శ్రీసాయిమాస్టర్ భక్తబృందానికి పారాయణ గ్రంథాలు అందుబాటులో   తీసుకురాగలిగాము.

                                                     

నా వివాహం విషయంలో కూడా పూజ్యశ్రీ మాస్టరుగారి ఆశీస్సులు లభించాయి.  పెళ్లి చూపులకు గూడూరు వెళ్ళినప్పుడు మేము బస చేసిన లాడ్జిలో పూజ్యశ్రీ మాస్టరుగారి ఫోటో కనిపించింది! నాకు చాలా ఆనందం కలిగింది. అదే సంబంధం నిశ్చయమైంది. లాయరుపేట పరిసరప్రాంతాలలోనే చిన్నదైనా, ఒక సొంత ఇల్లు వుండాలని  నా కోరిక. ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే అసాధ్యమైన ఆ కోరిక నెరవేరింది.


నా భార్యకు ఎట్టి పరిస్థితిలోనూ రావడానికి అవకాశం లేని   PhD సీట్ రావడమే కాదు, అదీ ఒంగోలులోనే చేసే అవకాశం వచ్చింది. మాకు మొదట బాబు పుట్టాడు. రెండవసారి  చాలామంది జాతకం ప్రకారం మళ్ళీ మగపిల్లవాడేనని చెప్పారు. మాకు అమ్మాయి పుట్టాలని కోరిక. పూజ్యశ్రీ మాస్టరుగారి దయ వల్ల పాప పుట్టింది. 


మా జీవితంలో ప్రతీ సన్నివేశంలో పూజ్యశ్రీ మాస్టరుగారి అనుగ్రహం వర్షిస్తూనే వుంది.  మేము బాబా గుడికి సేవ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ లలితా మేడంగారు మాతో, "మీరు భక్తిశ్రద్ధలతో బాబా, మాస్టరుగారి సేవ చేసుకుంటే జీవితంలో మీకు కావలసినవన్నీ వాళ్ళే సమకూరుస్తారు" అని చెప్పేవారు. బాబా, "మీరు ఒక అడుగు వేస్తే నేను పది అడుగులు వేస్తాను" అని చెప్పినట్లు, ఉడతాభక్తిగా మేము చేసుకుంటున్న సేవకి పదిరెట్లు మాకు అన్నీ ప్రసాదిస్తున్నారు! 


మాకు సేవచేయాలన్న భావాన్ని, అందులో మేము పొందుతున్న తృప్తి ఆనందాలను ప్రసాదిస్తున్న గురుదేవులకు కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ, 'అన్యధా శరణం నాస్తి, త్వమేవ  శరణం మమ!!' అని పూజ్యశ్రీ మాస్టరుగారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను.    


ఓం సర్వాభీష్టప్రదాయ శ్రీ భరద్వాజ సద్గురవే నమః!                                                                                                                       

జై సాయి మాస్టర్!!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

లాస్ట్ పంచ్👊

 లాస్ట్ పంచ్👊 మనదైతే ఆకిక్కే వేరప్పా👌👍


స్వామి వివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు..

ఒక తెల్ల ప్రొఫెస్సర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు...!!

.

ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెస్సర్ లంచ్ చేస్తుండగా..


వివేకానందుడు వచ్చి ప్రొఫెస్సర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా...

.

ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!!

" పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి"

.

దానికి వివేకానందుడు..!!

ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) :

" మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా" అని వేరే టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు.

(1St Punch👊)

.

ప్రోఫెసర్ మొహం ఎర్రటి కందగడ్డలా కందిపోయింది...!!

ఎలాగైనా వివేకా నంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు..!!

.

ఆ తరువాత ఒకరోజు క్లాస్ రూమ్ లో...

వివేకానందని ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు...!!

"వివేకానందా..!!

నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు..

నీకు రెండు బాగ్ లు రొరికాయి అనుకుందాం...!!

ఒక దానిలో జ్ణానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?"

.

వివేకానందుడు (సందేహించకుండా)...

"అనుమానమెందుకు సర్,డబ్బులున్న బ్యాగ్ నే తీసుకుంటాను" ఆన్నారు..!!

.

ప్రోఫెసర్ వంకరగా నవ్వుతూ..వ్యంగ్యంగా..

"అనుకున్నా...నీ సమాదానం అదేనని...!!

నేనే నీ ప్లేస్ లో వుంటే, జ్ణానమున్న బ్యాగ్ నే తీసుకుంటా" అన్నాడు..!!

.

దానికి వివేకానందుడు..!! 

" నిజమే. ... సహజంగా.... ఎవరికి ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్..!!"

(2nd Punch👊)

.

ప్రొఫెసర్ కి తిక్కరేగిపోయింది..!!

అవకాశం, టైమ్ కలిసి వచ్చినప్పుడు...

వివేకానందని వదలకూడదు అని మనసులో ప్రతిజ్ణ పూనాడు..!!

.

టైము, అవకాశం రెండు కిలిసి రానే వచ్చాయి ప్రొఫెసర్ కి...!!

ఆ రోజు, దిద్దిన ఆన్సర్ పేపర్ లు, క్లాస్ లో ఇవ్వలి..!!

.

కోపంతో రగిలిపోయు వున్న ప్రొఫెసర్..

వివేకానంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి వివేకానందకి ఇచ్చాడు..!!

.

ఆన్సర్ షీట్ అందుకున్న వివేకానంద...

తన సీట్లో కూర్చొని ప్రొఫెసర్ రాసిన " ఈడియట్" అనే Word చూసి...తనని తాను శాంత పరచుకోవడానికి చాలాసేపు పట్టింది

కోపం తగ్గిన తరువాత హుందాగా.. 

ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకెళ్ళి...

గౌరవప్రదంగా...

వినమ్రమయిన శాంత స్వరంతో...

"సర్...!! తమరు నా అన్సర్ షీట్ లోసంతకం చేసి మార్కులు వేయడం మరిచారు... (లాస్ట్ పంచ్👊)


😆😆😆😆😆that is.  Vivekananda

సహవాస దోషం

  *సహవాస దోషం* 🌺


గురువు తన శిష్యుడితో కలిసి తీరప్రాంతాన నడుస్తున్నాడు. వారికి సుదూరంగా ఒక ఓడ కనిపించింది. ఇద్దరు చల్లగాలిని ఆస్వాదిస్తున్నారు. కొన్ని నిమిషాలు గడిచాయో లేదో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చింది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచాయి. గురుశిష్యులు ఆశ్చర్యంగా చూస్తుండగానే ఓడ మునిగిపోయింది. అందులో ఎందరు ప్రయాణిస్తున్నారో, ఎందరి ప్రాణాలు పోయాయో తెలీదు. అంతలోనే వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది


శిష్యుడికి దుఃఖం ఆగలేదు. “గురువర్యా ! ఏమిటీ విపత్తు ? పాపం కదా ! ఒక్కసారిగా ఇంతమంది చనిపోయారేంటి ?” అన్నాడు.


ఏం చెప్పను ?! చేసిన పాపాల ఫలితం” సాలోచనగా అన్నాడాయన.


అందరూ పాపులేనా ? కొందరైనా పుణ్యాత్ములు ఉంటారుగా ! భగవంతుడు వారిని కూడా ఎందుకు చంపాడు ?” మళ్లీ అడిగాడు శిష్యుడు.


దానికి గురువు సమాధానం చెప్పలేదు


ఇద్దరూ ఆశ్రమానికి తిరిగెళ్లారు. శిష్యుడు తన సందేహం గురించి మర్చిపోయాడు. మరుసటిరోజు యథాప్రకారం గురుశిష్యులు సముద్ర తీరాన నడుస్తున్నారు. శిష్యుడికి అందమైన శంఖం కనిపించడంతో ఆనందంగా చేతిలోకి తీసుకున్నాడు. అందులోని జీవిని తినేందుకు చీమలు చేరాయి. వాటిల్లో ఓ చీమ శిష్యుడి చేతిమీద కుట్టింది. చురుక్కుమనడంతో శంఖాన్ని గబుక్కున సముద్రంలోకి విసిరేశాడు.


ఎన్ని చీమలు కుట్టాయ”ని అడిగారాయన.


ఒకటే”ననగా..” మరి ఒక్క చీమకు వేయాల్సిన శిక్షను అన్నిటికీ వేయడం సరైనదేనా ?’” అన్నాడు గురువు.


అర్థమైంది గురువర్యా ! మనం మంచిగా ఉన్నంతలో చాలదు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా మంచివారయ్యుండాలి” అంటూ నమస్కరించాడు శిష్యుడు. 🙏


అందుకనే భగవంతుని భక్తులైన వారితో స్నేహం చేయడం భక్తులుగా మారి మన జీవితం ఆనందమయం చేసుకోవడం, ఆ పరమాత్మను కడకు చేరడం ముఖ్యం, ఇదియే జీవిత పరమార్థం !


🙏🙏🙏🙏

 

హర హరమహాదేవ శంభోశంకర 

ఓంనమఃశివాయ

తక్కువ మాట్లాడటానికి

 శ్లోకం:☝️

*కర్ణౌ నేత్రే కరౌ పాదౌ*

 *కార్యార్థం ద్విగుణీకృతౌ |*

*ముఖమేకం పిధానాయ*

 *కదాచిద్భోజనాయ వా ||*


భావం: బహువిధ పాత్రల కోసం, పని రెండింతలు ఎక్కువ చేయుట కొరకు చెవులు, కళ్ళు, చేతులు మరియు పాదాలు వంటివి కొన్ని అవయవాలు సంఖ్యలో రెండుగా ఉంటాయి. కానీ నోరు మాత్రం ఒక్కటే. కొన్ని సమయాల్లో తినడానికి లేదా తక్కువ మాట్లాడటానికి కావచ్చు!😀

అదృష్టం

 శ్లోకం:☝️

*ఉద్యోగేన కృతే కార్యే*

 *సిద్ధిర్యస్య న విద్యతే ।*

*దైవంతస్య ప్రమాణం హి*

 *కర్తవ్యం పౌరుషం సదా ll*

~ గరుడపురాణం (ఆచారకాండ)


భావం: ఒక వ్యక్తి ప్రయత్నం చేసిన తర్వాత కూడా పనిలో విజయం సాధించలేకపోతే అందుకు అదృష్టమే కారణం. దానినే ప్రారబ్ధం, విధి, దైవము అని అంటారు. అయినప్పటికీ మనిషి ఎల్లప్పుడూ పురుష ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ జన్మలోని కృషి, ప్రయత్నమే రాబోయే జన్మలలో అదృష్టంగా మారుతుంది.

స్వర్గముతో సమానమయినవి

 *||శ్లోకము||*

||న విప్ర పాదోదక కర్దమాని 

న వేదశాస్త్ర ధ్వని గర్జితాని |

స్వాహా స్వధాకార వివర్జితాని 

శ్మశాన తుల్యాని గృహాణి తాని || 


*||తాత్పర్యము||*

బ్రాహ్మణుల పాదములు కడిగిన నీరు పారనట్టివి , 

వేదశాస్త్ర పాఠపఠనాధ్వనులచే ఘోషిల్లనట్టివీ , 

యజ్ఞమంత్రముల చివర పలికెడు స్వాహా అను శబ్దములు , పితరులకీబడిన భోజనమును పొగడునట్టి శబ్దములు (స్వధా) లేనట్టివియగు గృహములు శ్మశానభూములతో  సమానములు

 *— చాణక్య నీతి శాస్త్రము ---*


మరి స్వర్గతుల్యమైన గృహములేవి ???

ఈ శ్లోకానికి కొద్దిగా మార్పు చేస్తే  స్వర్గముతో సమానముగా గృహములు భాసించును 👇

*||శ్లోకము||*


॥స విప్ర పాదోదక కర్దమాని  

స వేదశాస్త్రధ్వని గర్జితాని|

స్వాహా స్వధాకార నిరంతారాణి స్వర్గాణి తుల్యాని గృహాణి తాని||


*||తాత్పర్యము||*

బ్రహ్మణుల పాదములు కడిగిన నీరు పారునవి ,  

వేదశాస్త్ర పాఠపఠనా ధ్వనులు ప్రతిధ్వనించునవి, 

దేవ పితృ కార్యక్రమంలో  హవిస్సును భుజింపుడు  చేయు స్వాహా స్వధా ధ్వనులు గల గృహములు స్వర్గముతో సమానమయినవిగా గ్రహింపవలెను .....!!

క్షీరసాగరమధనము

 🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

           _*ఆదివారం*_

    _*ఫిబ్రవరి 12, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*22 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*క్షీరసాగరమధనము*


🕉️🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️


గృత్నృమదమహాముని జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునివర్యా ! వినుము, అశ్వమేధయాగము చేసినవాడును , ఏకాదశివ్రత నియమమును పాటించినవాడును , మాఘమాసవ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలమునంది తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై యింద్ర పదవినందును. మాఘ ద్వాదశినాడు బ్రాహ్మణులతో గలసి పారాయణం చేయువాడు , అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను.


జహ్నుముని గృత్నృమదమహాముని ! తిధులనేకములుండగా ఏకాదశి అన్నిటికంటె శుభప్రదమైనది యెట్లయ్యెను ? అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతమొక్కటే యిచ్చుటయేమి ? ఎవరైనను యిట్లు చేసి యితటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగెను. గృత్నృమదమహాముని యిట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను , సంపదలను , పుత్రపౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగుగను , సర్పరాజువాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడువరుసలుగ జుట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్తిరి.


వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువామెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము , కామధేనువు , కల్పవృక్షము , అమృతకలశము మున్నగునవి సముద్రమునుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని యింద్రునకిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు , రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరువద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి.



*🌳దేవదానవులు చేసిన శివస్తుతి🌳*


*నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే*

*నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే ||*

*నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ*

*నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే ||*

*త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక*

*త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే ||*

*త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే*

*అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః ||*

*హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే*

*మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల ||*

*పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్*


అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మ్రింగి తన కంఠమును నలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి యేర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవ దానవులు సముద్రమును , ధనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి , ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఆ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.


మాయావియగు శ్రీమహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు , జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు , పొడవైన కేశములు , తీగవంటి శరీరము కలిగి సర్వాభరణభూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారాయని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి.


ఆమె దేవదానవులను జూచి దేవతలారా , దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినైయుండి యీ అమృతకలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను. దేవతల వర్గమొక వైపునను , రాక్షసుల వర్గము మరియొకవైపునను కూర్చుండిరి. ఈమె యెవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.


అందరిని మోహవ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృతపాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృతపాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్నవైపున కల్లును , దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచునెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకింపుగ ధ్వనించుచున్న పాదములయెందెల రవళితోను , హస్తకంకణముల సుమధుర నాదములతోను , ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగ మనోహర , మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును , సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరి.



*🌳రాహుకేతువుల వివరణ🌳*



రాక్షసులపంక్తిలో కూర్చున్న యిద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సువర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధనజనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతలవరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగ దానిని త్రాగుటతో నామెకనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుదు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలోనుండిరి. చంద్రుడు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలోనుండిరి. వారు యింతశ్రమయిట్లు అయ్యెని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో నిద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.


చక్రముచే నరుకబడి చావుబ్రతుకు లేని అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని యీస్థితి మాకు దుర్భరముగనున్నది. మాగతియేమి మాకాహారమేదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని , అమావాస్యతోగాని కల సంధికాలములయందు సూర్యుని , చద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి.


ఇంద్రుడు మొదలగు దేవతలు అమృతకలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్రతీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృతబిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరియొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంత కాలము గడిచెను. సత్యజిత్తను సూద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండిటిని సంరక్షించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూలతోటగామారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాతపుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్పసమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెను.


ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకీయవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవిమున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని(యక్షుని) పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్షయజమాని నడుగ కుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెను.


పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొనయత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమున కెగిరిపోయెను. సత్యజిత్తు యెంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యముకాకుండెను. దేవేద్రుడును 'నీవు యక్షుడవు , ఆకాశగమన శక్తికలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతిదినము పోవుచునే యున్నది. సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను.


యక్షుదు యధాపూర్వముగ పారిజాతపుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమనన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో బాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును యెంత ప్రయత్నించినను అచటినుండి పోలేకపోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని 'ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి , మా పుష్పములను ప్రతిదినము యెందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెను యక్షుడును 'నేను యక్షుడను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పముల నపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని యాజ్ఞచేత నిట్లు చేసితిని. కాని బుధ్ధిసాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు యేమియు మాటలాడక యింటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో నుండెను.


_*ఇరవైరెండవ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

నాడుల పేర్లు - వాటి స్థానములు .

: అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 3 . 


 నాడి చూడకూడని వారు  - 


      అప్పుడే స్నానం చేసినవారికి , భుజించిన వారికి , ఆకలిగొన్నవానికి , దప్పికతో ఉన్నవానికి , నిద్రనుండి లేచినవారికి నాడిని పరీక్షించిన ఫలితం స్పష్టముగా తెలియదు . కావున ఆ సమయములలో నాడిని పరీక్షించరాదు . 


  నాడుల పేర్లు - వాటి స్థానములు . 


    నాభికందము నందు ఉండు నాడి సుషుమ్న . ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి ఉండును . మానవుని స్థూల సూక్ష్మ నాడులు అన్ని కలసి మొత్తం 3 1/2 కోట్లు . ఇవి అన్నియు నాభికూర్మము నుంచి 10 నాడులు పైకి , 10 నాడులు కిందకి , 4 నాడులు అడ్డముగా బయలుదేరి శరీరము అంతయు మితిమీరిన సంఖ్యగలవై వ్యాపించుచున్నవి . 


           ఈ సుషమ్న నాడి యందే జీవుని నివాసము . ఈ సుషమ్న నాడి యందలి జీవునకు ఇ ళ , పింగళ నాడులచే తృప్తి కలుగుచుండును . వాటికి సరస్సులు అని పేరు . శరీరమునందు త్రిదోషములు ఎలా ప్రధానమో అదే విధముగా  ఈ నాడులు కూడా ప్రధానములు . మన ఉచ్చ్వాస నిశ్వాసమునకు హంస యని పేరు . 


       ఈ మూడు నాడులు వేణి బంధము వలే కలిసిమెలిసి త్రివేణి సంగమము పేరుతో లలాటం నందు కలిసి ఉండును . నాడి యందలి హంస యొక్క  గతిని బట్టి మనము త్రిదోషముల హెచ్చు తగ్గులుగా ఉండు సంచారములను తెలుసుకోగలము . 


              సుషమ్న నాడి వెన్నుపూసలో నుండి మెడమార్గములో బ్రహ్మ రంధ్రము చేరును . వెన్నుపూసకు బ్రహ్మదండము అని పేరు కలదు . అందులో ఉండు సుషమ్న నాటికి బ్రహ్మ నాడి  అని పేరు కలదు . బ్రహ్మనాడి యందు ఉన్న జీవుడు షట్చక్రముల యందు తిరుగుతూ ఇళ , పింగళ నాడులతో తృప్తిపొందుచుండును . 


     ఇళ నాడి నాభికూర్మము నుండి హృదయము వద్దకు వచ్చి మెడమార్గముగా ఎడమ ముక్కు రంధ్రము వద్దకు వచ్చును . అదేవిధముగా పింగళ నాడి కుడి ముక్కు రంధ్రమును ఆశ్రయించి ఉండును . పంచభూతాలు , లోకములు , నదులు , కులములు , గుణములు మొదలగునవన్ని సుషమ్న నాడి యందు ప్రతిష్ఠములు అయి ఉన్నవి . 


                        తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  : రక్తహీనత గురించి సంపూర్ణ వివరణ  -


     మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తి బలహీనం అవుతారు . ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువుగా ఉండును.  ఇప్పుడు దీని గురించి మీకు సంపూర్ణంగా వివరిస్తాను.


 *  ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది.


 *  ఆయాసం , ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం , మతిమరుపు ఎక్కువుగా ఉండును. నాలుక మంటగా ఉండును.


 *  ఐరన్ లోపించటం వలన వచ్చే రక్తహీనత ఎక్కువుగా ఉండును.


 *  సరైన ఆహారం తీసుకోకపోవటం , సరైన వ్యాయామం చేయకపోవటం వలన కూడా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవును .


 *  వ్యాధినిరోధక శక్తి తగ్గటం వలన అంటువ్యాధులు వీరికి త్వరగా వచ్చే అవకాశం కలదు. అందువలన ఆహారం నందు ఐరన్ ఎక్కువుగా ఉన్నవి తీసికొనవలెను.


 *  శరీరానికి కావలసిన ఐరన్ లభించుటకు పండ్లు , పుట్టగొడుగులు , ఆకుకూరలు , తీగకు కాసే కాయగూరలు , ఖర్జురము , తేనె , సోయాబీన్స్ , బీన్స్ సమృద్దిగా తీసుకోవాలి .


 *  వైట్ బ్రెడ్ , స్వీట్స్ , పంచదార , వేపుళ్లు , నిల్వపచ్చళ్ళు , మైదాపిండి మొదలగునవి వాడరాదు.


 *  కూరలలో నిమ్మకాయ పిండుకోవాలి. ఐరన్ శరీరం గ్రహించాలి అంటే C విటమిన్ అవసరం ఉంటుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడటం కంటే ఆహారం ద్వారా సహజంగా ఐరన్ శరీరానికి అందించడం ఉత్తమం .


 *  తేనె వాడితే కొద్దిరోజుల్లొనే మార్పు వస్తుంది. ఖర్జురములో ఐరన్ బాగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకి 10 నుంచి 12 వరకు తినాలి.


 *  రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి వస్తుంది.


 *  మద్యపానం , ధూమపానం ఈ సమస్యను మరింతగా ఎక్కువుగా చేస్తాయి .


 రక్తహీనత కొరకు నేను ప్రయోగించిన అనుభవయోగం  -


        ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ నందు ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి ఉదయం మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు ఇవ్వడం జరిగింది . ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఒక ఆపిల్ పండు తినిపించడం చేశాను . కేవలం నలభై రోజులలోనే శరీరం నందు సంపూర్ణంగా రక్తం వృద్ది అయ్యినది.  దానిమ్మ జ్యూస్ కొరకు ఉపయోగించే కాయలు తియ్యగా పెద్ద సైజు తో ఉండేవి తీసుకోండి . దానిమ్మ జ్యూస్ తాగలేనివారు ఆపిల్ జ్యూస్ నందు కూడా గోధుమగడ్డి చూర్ణం కలుపుకుని తాగవచ్చు .


   శారీరక బలాన్ని పెంచే సులభ ఆయుర్వేద యోగం - 


    ఇప్పుడు నేను చెప్పబోవు ఈ ఆయుర్వేద యోగం శరీరానికి అమితమైన బలాన్ని చేకూర్చును . బూస్ట్ , హార్లిక్స్ వంటి వాటిని పిల్లలకు పాలల్లో కలిపి ఇచ్చినను ఎటువంటి ఉపయోగము లేదు . 


      నేను వివరించబోయే ఈ ఆయుర్వేద చిట్కా మీకు , మీ పిల్లలకు ,వృద్దులకు అత్యంత ఉపయోగకారిగా ఉండును . 


  బాదం 250 గ్రాములు .

 

  సోంపు 250 గ్రాములు .


 పటికబెల్లం 250 గ్రాములు చిప్స్ 


  బాదం రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి ఎండించాలి . బాగా ఎండిన తరువాత మెత్తటి పౌడర్ కొట్టవలెను.


  సోంపు కొంచం వేయించి మెత్తగా పౌడర్ కొట్టవలెను.


 పటికబెల్లం మెత్తటి పౌడర్ కొట్టవలెను.


   మూడింటిని కలిపి ఉదయం , సాయంత్రం ఒక గ్లాసు పాలలో కలుపుకుని తాగవలెను. 


  చిన్నపిల్లలకి 1 స్పూన్ , పెద్దవారికి 2 స్పూన్స్ చొప్పున వాడవలెను. 


  షుగర్ లేనివారు పటికబెల్లం 50 గ్రాములు పెంచుకొన్నా పర్వాలేదు .


      శరీరంలో  నీరసం, నిస్సత్తువ పోయి శరీరానికి చాలా బలం కలుగును . 6 నెలలు విడవకుండా వాడిన అద్భుత ఫలితాలు వస్తాయి. ఇది నా అనుభవ యోగం 


   ఇటువంటి మరిన్ని అద్భుత యోగాలు నా గ్రంథాలలో కలవు . 


  .