18, నవంబర్ 2020, బుధవారం

రోగములు - కారక గ్రహములు .

 #భువనేశ్వరిపీఠం

వివిధ రోగములు - కారక గ్రహములు . 


మనిషి చేసే పాపకర్మలు వ్యాధుల రూపంలో పట్టి పీడిస్తాయి అని అనేక గ్రంధములలో చెప్పబడింది. అదేవిధంగా ఆయా వ్యాదులు రావడానికి ఆయా గ్రహాలూ కారణం . ఒక్కోసారి మనం ఎన్ని ఔషధాలు తీసుకున్నా కూడా వ్యాధి నుంచి పూర్తి ఉపశమనం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా వ్యాధికారక గ్రహానికి పూజ జరిపించడం ద్వారా మరియు సరైన ఔషధ సేవన ద్వారా బయటపడవచ్చు. ముందు గ్రహాలకు దానం ఇవ్వాలి . అప్పటికి ఫలితం లేకుంటే తీవ్రతని బట్టి అభిషేకం నిర్వహించాలి. ఇంకా ఫలితం రాకుంటే జపం చేయించాలి. ఇంకా ఫలితం ఇవ్వకుంటే హోమం నిర్వహించాలి. ఇందులో ఏది అన్నది ఆ గ్రహ దోషం , వ్యాధి తీవ్రతని బట్టి ఉంటుంది. 


ఇప్పుడు మీకు ఆయా వ్యాధులకు కారణం అయ్యే గ్రహాల సమాచారం ఆచార్య సిద్ద నాగార్జునుడు రచించిన సిద్ద నాగార్జున తంత్రం నుంచి గ్రహించడం అయినది. 


సన్నిపాత జ్వరం ( Typhoid ) - గురు,బుధులు .


కామెర్లు ( Jaundice ) - గురు, శుక్రులు . 


రాచకురుపు ( Carbuncle ) - రవి.


మలేరియా ( మలేరియా ) - శని . 


 పురాణ జ్వరం ( Long standing Fever) శని .


 అతిసారం ( diamhoed and chronic ) కుజుడు .


 గ్రహణి ( Diarrhoea ) - బుధ , శని , కేతువు . 


మూలశంక ( Piles ) - కుజుడు , రాహువు. 


రక్త ఆర్శస్సు ( Bleeding piles ) - కుజుడు , రాహువు .


అగ్నిమాన్ధ్యం ( Dyspepsis ) - శని.


అజీర్ణం ( Indaigestion ) - శని.


కలరా ( cholera ) - కుజుడు . 


రాజయక్ష్మ ( Consumption ) - కుజ, రాహువు 


అసాధ్య రాజయక్ష్మ ( Tuberculosis ) క్షయ - శుక్రుడు .


తమక శ్వాసము ( Asthama ) - శని, బుద,కేతువు .


మహాశ్వాసం ( Dysproea ) - శుక్రుడు . 


ఉన్మాదం ( Insanity ) - శుక్ర,రాహు,చంద్ర,శని 


ధనుర్వాతం ( Titanus ) - రవి,శని కలయిక కాక రవి,కుజ,శని కలయిక .


పక్షవాతం ( Paralysis ) - శని. 


అవతంత్రకం ( Hysteria ) - కుజ,శని.


మూగతనం ( Apasia ) - బుద,కేతువు . 


వాత రక్తం ( Gout ) - శని,శుక్రులు . 


ఆమవాతం ( Rhumatism ) - శని . 


నొప్పి - ( Colic ) - శని, కుజ,రాహువు.


పరిణామ శూల ( Gastral Gokennosis ) - శని, కుజ, రాహువులు .


హుద్రోగములు - ( Diseases of the Heart ) శుక్రుడు . 


మూత్రక్రుచ్చం ( Dysuria ) - కుజ, బుధులు . 


జలోదరం ( Ascties ) - కేతువు ,బుదుడు .


మూత్రజ వృద్ది ( Hydrocele ) - బుదుడు.


మశూచి ( Small pox ) - బుద,కేతు,కుజులు .


చెవుడు ( Deafness ) - శని. 


తలనొప్పి ( Headache ) - కుజ,రాహువులు 


 గర్భస్రావం ( Abortion ) - రవి,గురులు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

ఒబేసిటీని తగ్గించుటకు

 ఒబేసిటీని తగ్గించుటకు ఆయుర్వేద ఔషధాలు -


     అంతకు ముందు పోస్టులో ఒబేసిటీ గురించి మీకు వివరించాను. ఇప్పుడు అది తగ్గించుకొనుటకు కొన్ని సులభ యోగాలు మీకు వివరిస్తాను.


 సులభ యోగాలు  -


 *  దేహశ్రమ అధికంగా చేయుట , మైధున ప్రక్రియ ఎక్కువ చేయుట .


 *  అధిక దూరం నడవడం , జాగరణ చేయుట అనగా తక్కువ సమయం నిద్రించుట .


 *  యావలు , చామలు వంటి సిరిధాన్యాలు వాడవలెను. నీరు ఎక్కువుగా ఉన్న అన్నము భుజించటం.


 *  ఉదయాన్నే తేనెతో గోరువెచ్చని నీటిని తాగవలెను.


 *  ఉదయాన్నే వేడి అన్నంగాని గంజి గాని తాగవలెను.


 *  చవ్యము , జీలకర్ర, శొంటి, మిరియాలు , పిప్పిళ్లు , ఇంగువ, సౌవర్చ లవణం , చిత్రమూలం వీటిని సత్తుపిండి, నీరు, మజ్జిగ యందు కలిపి తీసికొనవలెను.


 *  వాయువిడంగములు, శొంటి, యవాక్షారం , ఎర్రచిత్రమూలం, యావలు , ఉసిరిక రసం వీటి చూర్ణాలను మజ్జిగతో కలిపి సేవించినను శరీరం నందు కొవ్వు కరుగును.


 *  త్రికటు చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన బాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణమును ఆహారం తీసుకున్న తరువాత ఒక పావు స్పూన్ మజ్జిగ లో కలిపి ఉదయం , రాత్రి సమయాలలో తీసికొనవలెను.


 *  మారేడు లేత ఆకులను తీసుకుని నూరి ఉదయం , సాయంకాల సమయాలలో శరీరానికి బాగా పట్టించి ముఖ్యంగా చంకలు , గజ్జలు వంటి బాగాలలో పట్టించి గంట సమయం తరువాత స్నానం చేయుచున్న శరీరంలోని కొవ్వు పేరుకొని పోవడం వలన శరీరం నుంచి వచ్చు దుర్గంధం హరించును .


 *  గోమూత్రం ప్రతినిత్యం 10ml నుంచి 15ml వరకు ఒక కప్పు నీటిలో ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న శరీరం సన్నబడును.


       ఒబేసిటీ తగ్గించుకొనుటకు ఔషధ సేవన ఒక్కటే సరిపోదు . మనం తినే ఆహారంలో కూడా మార్పులు చేసుకోనవలెను . 


       

  పాటించవలసినవి  -


      పాతబియ్యం , వెదురు బియ్యం, చామలు , కొర్రలు , ఆళ్ళు , జొన్నలు , యావలు , ఉలవలు, పెసలు , కందులు, మాసూరపప్పు, తేనె , పేలాలు, ఎక్కువ కారం, చేదు గల పదార్దాలు, వగరు కలిగిన పదార్దాలు, మజ్జిగ,  వేయించిన వంకాయ (నూనె తక్కువ) , ఆవనూనె ఆహరంలో ఉపయోగించటం , పాయసం, ఆకుకూరలు , వేడినీరు తాగుట, ఎండ యందు తిరుగుట, ఏనుగు , గుర్రపు స్వారీ చేయుట , అధిక శ్రమ చేయుట , స్త్రీ సంగమం , నలుగు పెట్టుకొనుట , శనగలు, చిరు శనగలు , త్రికటుకములు, వాము తినటం, 


 పాటించకూడనివి  - 


     చన్నీటి స్నానం, శాలి బియ్యం, గొధుమలు, అతిగా సుఖపడటం , పాలు , మీగడ , పెరుగు , పన్నీరు , మినుములు , కడుపు నిండా భోజనం , చెమట పట్టని ప్రదేశాలలో పని, చేపలు , మాంస పదార్దాలు , ఎక్కువసేపు నిద్రించడం , సుగంధ పదార్దాలు అతిగా వాడటం , తియ్యటి పదార్దాలు అతిగా తినటం , చద్ది అన్నం , చెరుకు రసంతో చేయబడిన అన్నం . 


       పైన చెప్పబడిన నియమాలు తప్పక పాటించినచో శరీరం నందు కొవ్వు తగ్గి శరీరం నాజూకుగా అవ్వును.


    

     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మ‌హాబ‌లేశ్వ‌రం ఆల‌యాలు.!!

 అడుగ‌డుగున అద్బుతాలు…మ‌హాబ‌లేశ్వ‌రం ఆల‌యాలు.!!


మహాబలిపురం.. తమిళనాడులోని చెన్నైకి దక్షిణాన సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా పురాతనమైన పట్టణం. క్రీస్తు శకం 7 నుంచి 9వ శతాబ్దాల నడుమ దీన్ని పల్లవులు నిర్మించారు. అప్పట్లో ఈ పట్టణం చక్కని పర్యాటక ప్రదేశంగా ఉండేది. ఇక్కడి రాతి ఆలయాలు, వాటిపై ఉండే శిల్పకళ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.


చరిత్ర

7 వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహాబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్టబడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.


మరొక కథనం ప్రకారం అప్పట్లో ఈ పట్టణాన్ని మహాబలి అనబడే ఓ రాక్షస రాజు పరిపాలించేవాడట. పేరుకు రాక్షస రాజే అయినా అతనిది చాలా జాలి గుండెనట. ఈ క్రమంలోనే అతని పేరిట ఈ పట్టణానికి మహాబలిపురం అని పేరు వచ్చిందని చెబుతారు. దానికి అంతకుముందు మామళ్లపురం, కడల్‌మలై అనే పేర్లు కూడా ఉండేవట. కడల్‌మలై అంటే పర్వతాలు, సముద్రంతో కూడిన ప్రదేశం అని అర్థం.ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.


1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు దర్శనమిస్తాయి. అందులోని శిల్పాలను చూస్తే పురాతనకాలంలోనే రాకెట్ ప్రయోగాలకు నాంది పలికారని అనిపిస్తుంది. 


మహాబలిపురం మొత్తం 7 ఆలయాలు కలిపి ఒకే ఆలయంగా ఉండేవి. కానీ అందులో 2 ఆలయాలు సముద్రంలో మునిగిపోగా, ప్రస్తుతం 5 ఆలయాలు మాత్రమే బయటకు ఉన్నాయి. అవే మనకు కనిపిస్తాయి. అయితే సముద్రంలో మునిగిన ఆ ఆలయాల శిఖరాలను బోటులో వెళ్లి చూడవచ్చు. అందుకు గాను బీచ్‌ నుంచి బోటు సౌకర్యం అందుబాటులో ఉంది.


ప్రస్తుతం మనకు కనిపించే ఆ 5 ఆలయాలను దూరం నుంచి చూస్తే రథాలలా ఉంటాయి. అవి పాండవులకు చెందిన 5 రథాలే అని చెబుతారు.

ఈ ఆలయాలను నిర్మించేందుకు సుమారుగా 200 ఏళ్లు పట్టిందట. మొత్తం 3 తరాలకు చెందిన పల్లవ రాజులు ఈ ఆలయ నిర్మాణాలను పూర్తి చేశారట.

ఆ 5 ఆలయాల్లో సముద్రానికి దగ్గర్లో ఉన్న ఆలయం ముఖ్యమైందిగా చెబుతారు. దీన్ని చాలా పకడ్బందీగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణాలు అన్నింటినీ కేవలం ఏకశిలతోనే నిర్మించారు.


ఆనాటి రాజుల కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా వుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి అందరు శిల్పులు, నిపుణులు పరవశించిపోతారు. వాటిలో ప్రధానమైనవి శ్రీకృష్ణుని రాయి. దీనినే కృష్ణాస్ బట్టర్ బాల్ అని పిలుస్తారు. ఇది కృష్ణుడు ఆడుకున్న రాయి అని చెబుతారు. ఇది గుండ్రంగా ఉంటుంది. బల్లపరుపుగా ఉన్న మరో రాయిపై బ్యాలెన్స్‌ అయి ఉంటుంది. కిందకు దొర్లినట్లు దూరం నుంచి చూస్తే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటికీ దొర్లలేదు. అలాగే ఉంది. ఇది సైంటిస్టులకు ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే మారింది.


ఈ రాయి ఎత్తు 20 అడుగులు కాగా వెడల్పు 5 మీటర్లు. బరువు 250 టన్నుల వరకు ఉంటుంది. అయితే ఈ రాయిని అక్కడకు తీసుకువచ్చి పెట్టారా.. అదే సహజసిద్ధంగా అక్కడ ఏర్పడిందా.. అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ సుమారుగా 1200 ఏళ్ల నుంచి ఆ భారీ రాయి అక్కడ అలాగే ఉంది. ఇది నిజంగా విశేషమే.

ఈ రాయిని తమిళంలో వానిరైకల్‌ అని పిలుస్తారు. అంటే స్టోన్‌ ఆఫ్‌ ది స్కై గాడ్‌ అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. ఒల్లాంటయ్‌టంబో, పెరు, మచ్చు పిచ్చులలో ఉన్న భారీ ఏకశిలలకన్నా ఈ రాయి చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది.


సైన్స్‌ ప్రకారం చూస్తే.. ఈ తరహా రాయిని అలా బ్యాలెన్స్‌ చేసి ఉంచడం చాలా కష్టం. ఈ రాయి ప్రస్తుతం కేవలం 4 అడుగుల ప్రదేశంలో బ్యాలెన్స్‌ చేయబడి ఉంది. అది కూడా కొండ లాంటి ప్రదేశంలో. అంతటి భారీ రాయి అంత తక్కువ ప్రదేశంలో ఎలా బ్యాలెన్స్‌గా ఉందా అని భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు. సాధారణంగా అలాంటి రాళ్లు కిందకు జారుతాయి. కానీ ఈ రాయి 1200 ఏళ్ల నుంచి అక్కడ అలాగే కదలకుండా ఉండడం.. నిజంగా ఆశ్చర్యమే మరి.


1908వ సంవత్సరంలో అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ ఆర్థర్‌ లాలీ ఆ రాయిని చుట్టు పక్కల నివాసితులకు ప్రమాదకరంగా ఉందని భావించి దాన్ని అక్కడి నుంచి తొలగించాలని అనుకున్నాడు. కానీ ఆ రాయి అస్సలు కదలలేదు. అది అందరినీ షాక్‌కు గురి చేసింది.


ప్రఖ్యాత గాంచిన ఈ శిలను పల్లవరాజు నరసింహవర్మ ఆకాశదేవుని రాయిగా పేర్కొని, దీనిని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడు. కొందరు మాత్రం గుడి కోసం తెచ్చిన ఈ రాయిని మధ్యలోనే వదిలేసారని వాదిస్తారు. ఇంకొందరు ఇది గ్రహాంతవాసులు ఎగిరే పళ్లెం అని అంటారు. దాదాపు 250 టన్నులు బరువు వుండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పనికాదు, అందుకే ఇది ఎలియన్స్‌కి సంబంధించింది అంటారు. ఈ రాయిని పోలిన రాళ్లు ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయి. అవే ఎలియన్స్ తిరుగుతున్నారనే ఊహాగానాలు వెలువడే మెక్సికో, పెరూలు.


ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే టెక్నాలజీకి అబ్బురపకుండా ఉండలేరు. ఒకే చిత్రంలో ఆవు, పాలు తాగుతున్న దూడను చూడవచ్చు. ఆ కాలంలోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారా.. అనటానికి అనేక శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేసారనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి.ఆ ఆలయంలోని గణేశుడి విగ్రహంపై రాకెట్ లాంచింగ్ వెహికల్ కనిపిస్తుంది. దీంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక రూపాలు కనిపిస్తాయి.

ఇక్కడ విచిత్రమైన మరో అంశం బావి. కొలతలు కూడా అందుబాటులో లేని కాలంలో ఎంతో ఖచ్చితత్వంతో బావిని నిర్మించారు. అప్పట్లోనే సాంకేతిక పరిఙ్ఞానం వాడారు అనడానికి ఇది గొప్ప నిదర్శనం. ఆలయ గోపురంపై ఉండే శూలాన్ని చూస్తే టెక్నాలజీ అబ్బురపరుస్తుంది. శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడా కనిపించడు. అతని తల మీద రెండు కొమ్ములు,అలాగే హెల్మెట్ ధరించినట్లు ఉంటుంది. అచ్చం శాటిలైట్ స్థంభం మాదిరిగానే ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూస్తే రోదసిలోని వ్యోమగాముల్లాగా కనిపిస్తారు.


విమాన గోపురం చుట్టూ వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మించారు. ఉపగ్రహ వాహక నౌకలు పంపినపుడు విడుదలయ్యే వాయువులు బయటకు పోయే విధంగా ద్వారాలను నిర్మించారు. కిటికీలు,తలుపులు కనపడకుండా రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారు. ఇక్కడ లైట్ హౌస్ దాదాపు 1000 ఏళ్ల కిందట నిర్మించారని భావిస్తారు.


మహాబలిపురంలో బీచ్‌కు దగ్గర్లో ఉన్న ఆలయానికి 1984లో యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు లభించింది. ప్రతి ఏడాది డిసెంబర్‌, జనవరి సమయంలో ఇక్కడ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. కథాకళి, భరతనాట్యం, కథక్‌, మోహినీ ఆట్టం, కూచిపూడి, ఒడిస్సీ తదితర భారతీయ నృత్యాలను కళాకారులు ప్రదర్శిస్తారు. ఈ ఫెస్టివల్‌ను తమిళనాడు ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్వహిస్తుంది.

ఆలయం వద్ద చెక్క బడిన నందుల శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఆలయానికి సమీపంలో చెక్కబడిన శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన వరాహ అవతార విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది.


#Mahabalipuram

#Mamallapuram

#ShoreTemple

#Pallavas

ధ్యానం అంటే

 ధ్యానం అంటే


ధ్యానం అంటే మరేమి కాదు. ఎరుకతో మనలోకి మనం చేసె ప్రయాణం. ధ్యానంలొ మన చైతన్య పదార్థము శరీరం నుంచి మనసుకు,

మనసునించి బుద్ధికి,బుద్ధినించి ఆత్మకు ఎరుకతో ప్రయాణం చేస్తుంది.

ఇప్పుడు ధ్యానం ఎలా చేయ్యాలో తేలుసుకుందాము.

ధ్యానం కోసం మనం మొదట శరీరాన్ని మనసును

నిలువరింపచేయాలి. అంటే శారీరక కదలికలును, చూడటాన్ని, మాట్లాడటాన్ని,

ఆలోచించడాన్ని నిలుపివెయ్యాలి.

ధ్యాననికి ముఖ్యమైనది ఆసనం.


స్థిరమైన, సుఖమైన ఏదైన ఒక ఆసనాన్ని ఎంచుకోవాలి.


నేలమీదగాని మరే ఇతర కుర్చీలు బల్లలులాంటి వాటిమీద కూర్చుని కూడా చేయ్యవొచ్చు. ధ్యానం ఏ సమయములోనైన చేయ్యవొచ్చు.

ముఖ్యమైనది అనుకూలంగవుండగలిగే స్థలం అయి ఉండాలి.

హాయిగ కూచొని కాళ్ళు రెండూ ఒకదానితొ ఒకటి చేర్చి చేతివేళల్లొ వేళుంచి కళ్ళుమూసుకొని లోపలగానీ బైటగాని ఏ శబ్ధము

చేయ్యకుండా ఏ మంత్రము జపించకుండా శరీరాన్ని పూర్తిగా తేలిక చెయ్యాలి.


మనం కాళ్ళను కలిపి చేతివేళల్లో వేళ్ళు కలపడం ద్వార మన చుట్టూ

శక్తివలయం ఏర్పడుతుంది. మన ఆసనంలో స్థిరత్వాన్ని పెంచుతుంది.

కళ్ళు మనోద్వారాలు. కాబట్టి కళ్ళురెండూ మూసికొవాలి.

మంత్రోచ్ఛారణగాని మరే ఇతర శబ్ధముగానీ చేయడం మనసు చేసె పని. కాబట్టి దాన్ని సంపూర్ణంగ నిలిపి వెయ్యాలి.

ఎప్పుడు శరీరం సంపూర్ణంగా స్థిమితమౌతుందో అప్పుడు చైతన్యము

శరీర పదార్థంనుంచి మనో బుద్ధి పదార్థాలవైపు ప్రాయాణం చేస్తుంది.


మనస్సు మరేమీ కాదు, ఆలొచనల పుట్ట.

అనుక్షణం ఎన్నొ ఆలొచనలు మొదలౌతునే ఉంటాయి.

వాటివెనుక మరెన్నో ప్రశ్నలు … తేలిసినవి, తేలియనివి.

చైతన్య పదార్థాన్ని మనో బుద్ధి పదర్థాలనుంచి ఆత్మవైపు


ప్రాయాణింప చేయాడానికి మనం చేయవలసిన పని మన సహజమైన శ్వాసను గమనించడం. గమనించడం అనేది ఆత్మయోక్క ప్రక్రియ.


సాక్షిభూతంగా సహజ శ్వాసను గమనిస్థూ ఉందాలి.

ప్రయత్నపూర్వకంగా శ్వాసప్రక్రియను చేయ్యరాదు.

తనకు తానుగా శ్వాసప్రక్రియ జరుగుతూఉండాలి.

సాక్షిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి.


ఇదే ధ్యాననికి మూలము.

ఇదే ధ్యాననికి మార్గము.

ఆలొచనలవెంట పోరాదు.

ప్రశ్నలలో చిక్కుకోరాదు.

ఆలోచనలను తుంచి ధ్యాసను శ్వాసవైపు మరల్చాలి.

సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి.

పూర్తిగా శ్వాసతోనే ఉండాలి.

అప్పుడు ఆలోచనల సాంద్రత క్రమంగా తగ్గడం మొదలౌతుంది.

క్రమంగా శ్వాసపరిమాణం కూడా పలుచబడుతూ చిన్నదౌతూ వస్తుంది.


చివరకు పూర్తిగా చిన్నదై రెండు కన్నుమమ్ముల మధ్య చిన్న వెలుగుగా వుండి పోతుంది.


ఈ స్థితిలో ఆలోచనలు వుండవు. శ్వాస కూడా వుండదు.

ఇదే ఆలోచనారహిత స్థితి.

ఇదే నిర్మల స్థితి.

మంత్రానికి శక్తి




👆👆👆
మంత్రానికి శక్తి లేదు అన్న మహానుబావులారా
మీ కళ్ళతో మీరు చూసి తెలుసుకోండి,
కర్పూరం వాడలేదు,అగ్గిపుల్ల పెట్టలేదు,అగ్గికి సంబందించిgన వస్తువులు పెట్టలేదు,
పైగా కొబ్బరినీళ్లు పోసి మంత్రం తోనే అగ్గి ముట్టించిన వీరి శక్తికి ఆ బగవంతుడి అనుగ్రహము ఎంతో ఉంటే కానీ ఇలాంటివి సాధ్యం అయ్యే పరిస్థితి లేదు.

2.15 లకు ఆ సన్నివేశం కనపడుతుంది.

నిన్న 10.02.2020 రోజున KPHB 7th phase లో ఉన్న శివ టెంపుల్ యజ్ఞం చెయ్య బడింది.
యజ్ఞం నిర్వహిస్తున్న దైవజ్ఞులు హోమగుండం లోనికి అగ్ని దేవున్నీ ప్రార్ధించి ఆవాహన చేయించారు.
కనులారా చూడదగిన అద్భుత దృశ్యం.
ఈ వీడియో తీసినవారు శ్రీ రాధాకృష్ణ గారు

ఇది మన హిందు ధర్మానికి, దైవ శక్తికి 
ప్రత్యక్ష నిదర్శనం.
ఓం శివాయ నమః




పరవస్తు చిన్నయసూరి

 పరవస్తు చిన్నయసూరి - టీవీయస్.శాస్త్రి 


తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైన పేరు పరవస్తు చిన్నయసూరి.వీరు 19 వ శతాబ్దానికి చెందిన మహా పండితుడు.పరవస్తు చిన్నయసూరి ప్రసిద్ధ తెలుగు రచయిత,గొప్ప పండితుడు. ఇతడు తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పెరంబూరులో జన్మించాడు. మద్రాసు ప్రభుత్వ (ప్రెసిడెన్సీ) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డారు."పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ"అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి,చిన్నయను పరీ‍క్ష చేయించి,  సమర్థుడని గుర్తించి,"చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు.


సూరి అనగా పండితుడు అని అర్థం.చిన్నయ చాలా తరాలకు పూర్వం ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసు వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించారు.వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు.వీరు సాతాని కులానికి చెందినా, బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి,గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు.చిన్నయ1809 (ప్రభవ)లో జన్మించారు. కానీ కొందరు పండితులు ఈయన 1806లో జన్మించాడని భావిస్తున్నారు.చిన్నయసూరి గారి తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి.


వెంకటరంగ రామానుజాచార్యులు గారు సంస్కృత,ప్రాకృత,తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన శ్రీపెరంబుదూరులోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు.పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించారు. ఈయన 1836 లో నూటపదేళ్ళ వయసులో మరణించారు. వెంకటరంగ రామానుజాచార్యులుకు ఇరువురు సంతానము---బాల వితంతువైన ఒక కూతురు, ఆమె కంటే చిన్నవాడైన చిన్నయ. చిన్నయను గారాబంగా పెంచటం వలన 16 ఏళ్ళ వయసు వరకు చదువుసంధ్యలను పట్టించుకోలేదు.శ్రీ చిన్నయ సూరిగారు సరళమైన భాషలో,సులభ గ్రాహ్యంగా ఉండేవిధంగా 'బాలవ్యాకరణం'ను వ్రాసారు. దీనిని, చిన్నప్పుడు మనలో ఎందరో చదువుకున్నారు. తెలుగు భాషను పరిశోధించి, 'ఆంద్ర శబ్ద చింతామణి' ని పరిశీలించి,వినూత్న రీతిలో వ్రాసినదే 'బాల వ్యాకరణం'.ఈ గ్రంధం తెలుగు వారికి ఒక వరప్రసాదం అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.గత తరంలో,దీనిని చదువనివారు తెలుగుగడ్డపై లేరని చెప్పవచ్చును. శ్రీ చిన్నయసూరి గారు మరెన్నోవిశిష్ఠ గ్రంధాలను తెలుగు వారికి అందించారు.వాటిలో ప్రఖ్యాతి గాంచినవి--నీతిచంద్రిక,సూత్రాంధ్ర వ్యాకరణం, ఆంధ్ర ధాతుమూల,నీతి సంగ్రహము...మొదలైనవి.


చిన్నయసూరి గారు, సంస్కృతంలోనున్న పంచతంత్ర కథలలోని, మిత్రలాభం, మిత్రబేధంలను తెలుగులోకి 'నీతిచంద్రిక' పేర అనువదించారు. అనువదించటమే కాకుండా, ఆ గ్రంధానికి చక్కని తెలుగు పేరైన 'నీతిచంద్రిక' అని పేరు పెట్టారు. నీతికథలను తెలుసుకునాలనుకునే వారికి అది నిజంగా ఒక పున్నమి వెన్నెల. తరువాతి రోజుల్లో, శ్రీ వీరేశలింగం గారు, 'సంధి'మరియు 'విగ్రహం'ను సంస్కృతం నుండి అనువదించారు. అలా సంస్కృతం నుండి, కేవలం నాలుగు తంత్రములే తెలుగులోకి అనువదించబడ్డాయి. అయిదవదైన, 'కాకోలుకేయం' అనే దాన్ని  తెలుగులోకి ఎవ్వరూ అనువదించినట్లుగా తెలియదు.నాకు తెలిసినంతవరకూ, అది తెలుగులోకి అనువదించ బడలేదు. చిన్నయసూరి గారి రచనాశైలి అత్యద్భుతంగా ఉంటుంది.ఆయనశైలిని అనుకరించి, అనుసరించాలని చాలామంది ప్రయత్నించి ఘోరంగా వైఫల్యం చెందారు. చిన్నయగారి సుమధురమైన వచనరచనాశైలి లాంటి దానిని నేటివరకూ మనం గమనించలేము. శ్రీ వీరేశలింగం గారు, శ్రీ కొక్కొండ వెంకటరత్నంగారు అదే శైలిలో విగ్రహము, సంధిని వ్రాయాలనుకున్నారు కానీ, అలా వీలుపడకలేకేమో వారి బాణిలోనే నూతన వరవడిలో వ్రాసారు. కానీ, చిన్నయసూరి గారి మిత్రలాభం, మిత్రబేధంకు ఉన్నంత ఆదరణను సంధి,విగ్రహంలు నోచుకోలేదని చెప్పవచ్చును. గత తరం వారందరూ మాధ్యమిక విద్యాస్థాయిలో నీతిచంద్రికను చదివి ఉంటారు. సందేహంలేదు. తెలుగు భాషమీద పట్టు, సాహిత్యం పట్ల అభిమానం పెంచుకోవాలనుకునే వారు తప్పక చదవవలసిసిన గ్రంధం 'నీతిచంద్రిక'.


'నీతి చంద్రక'ను తెలుగులోకి అనువదించటానికి, చిన్నయసూరి గారి ముఖ్య ఉద్దేశ్యం --తేనెలూరే తెలుగు భాషలో నీతి కథలను చెప్పటమే కాదు, చల్లని వెన్నెల ప్రసరించే తెలుగు భాషాకిరణాలను తెలుగు వారిపైన ప్రసరింప చేయటం కూడా! తమిళ దేశానికే చెందిన శ్రీ T.బాలనాగయ్య సెట్టిగారు వీరి 'నీతి చంద్రిక' ను ప్రచురించిన ధన్యజీవి. వారు ప్రచురించటం వల్లనే, మనకు 'నీతిచంద్రిక'ను చదువుకునే అదృష్టం దక్కింది. శ్రీ చిన్నయసూరి గారి జీవిత చరిత్రను సమగ్రంగా శ్రీ నిడదవోలు వెంకటరావుగారు రచించారు. పరవస్తు చిన్నయసూరిగారి ఐదవతరం మనవడు పరవస్తు ఫణిశయన సూరిగారు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. మధ్యతరాల్లో ఎవరికీ పద్య వాసనలు అంటలేదు. కానీ ఫణిశయన సూరిగారు చక్కగా పద్యాలను ఆలపిస్తూ పిల్లలకు శతక, ప్రబంధ, పౌరాణిక పద్యాలను నేర్పుతున్నారు. బాగా పాడుతున్న పిల్లలకు పద్యానికి పదిరూపాయల చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఇందుకోసం వారు ఇప్పటికే తన సొంత డబ్బును సుమారు 5 లక్షల దాకా ఖర్చు చేసారు. వారు ఈ మధ్యనే 'పరవస్తు పద్యపీఠం' అనే సంస్థను ఆరంభించారు. తెలుగు భాషపై మరెంతో కృషి చేసిన శ్రీ చిన్నయసూరి గారు 1861 లో స్వర్గస్తులైనారు.ఆ మహనీయునికి, మనమందరమూ ఋణపడి ఉన్నాం! ఆ మహనీయునికి ఘనమైన నివాళిని సమర్పించుదాం !!

Leadership


 

దేవాలయల విశేషాలు

 🌺 *ఆశ్ఛర్య పరచే  మన దేవాలయల విశేషాలు* 🌺



 *సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయo** 

 *హాసంబా దేవాలయం* ,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.



*నీటితో దీపం వెలిగించే దేవాలయం* 


మధ్యప్రదేశ్.ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,   అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.


 *స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం* 


1.  కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.

2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం


*12 ఏళ్లకు ఒకసారి*

 **పిడుగుపడే తిరిగి అతుక్కునే*దేవాలయం*


 బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.



*సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:* 

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 

2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 

3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 

4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 

5. మొగిలీశ్వర్.

6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.


*నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:* 

1. మహానంది

2. జంబుకేశ్వర్ 

3. బుగ్గరామలింగేశ్వర్

4. కర్ణాటక కమండల గణపతి.

5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.

6. బెంగళూర్ మల్లేశ్వర్ 

7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం

8. సిద్ధగంగా


*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  

3. మంజునాథ్.


*శ్వాస తీసుకునే* 

కాళహస్తీశ్వర్



*సముద్రమే వెనక్కివెళ్లే* 

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.


*స్త్రీవలె నెలసరి* అయ్యే 

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  

2. కేరళ దుర్గామాత.


*రంగులు మారే ఆలయం.* 

1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.


*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 

 1. కాణిపాకం,  

2. యాగంటి బసవన్న,  

3. కాశీ తిలభండేశ్వర్,  

4. బెంగుళూరు బసవేశ్వర్

5. బిక్కవోలు లక్ష్మీగణపతి


*స్వయంభువుగా* 

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 

1. బదరీనాథ్,  

2. కేదారనాథ్ ( *ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది* )

3. గుహ్యకాళీమందిరం. 


*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 

హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.



*ఒంటి స్తంభంతో*

యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.


*రూపాలు మారే*

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.




*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి


*మనిషి వలె గుటకలు*  

వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.


*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 


*ఛాయా విశేషం* 

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం


*నీటిలో తేలే* విష్ణువు (టన్నుల బరువుంటుంది ),  నేపాల్


*ఇంకా...* 

తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్,  కంచి, 

చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం etc


*పూరీ* 

పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.


 *ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్విత* *దేవాలయాలు మాత్రమే* . ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి నమ్మండి దేవుడు నడయాడే నేల ఇది.🕉🌺🙏🙏

ధార్మికగీత - 84*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 84*

                                    *****

        *శ్లో:-  తస్కరస్య వధో దండ: ౹*

                *దాసీ దండ స్తు ముండనం ౹*

                *భార్యా దండ: పృథక్ శయ్యా ౹*

                *మిత్ర దండ మభాషణమ్ ౹౹*

                                     *****

*భా:- దండము అంటే కఱ్ఱ, నమస్కారం అనే అర్థాలు తెలిసినవే. "శిక్ష" అనే అర్థంలో నాలుగు సందర్భాలు తారసపడడం పరిపాటి.  1."దొంగ":- అమాయక ప్రజల ఆస్తులు,వస్తువాహనాలు కొల్లగొట్టి, ధనాన్ని, మనాన్ని, మానాన్ని,ప్రాణాన్ని హరించి, అంతమొందించే ఆకతాయిలకు, ఆతతాయిలకు "ఉరికంబమే" సరియైన శిక్ష.  2. "దాసి" :- నమ్మకంగా మనతో తిరుగుతూనే మన మర్మాలను,    నర్మాలను, నిధులను, విధులను పసిగట్టి, స్వార్థంతో దుర్మార్గానికి, దురాగతానికి పాల్పడే సేవక గణానికి  "తిరు క్షవరమే"  తగిన శిక్ష.3. "భార్య":- సంసారములో భార్యాభర్తలు  అన్యోన్యప్రేమ, పరస్పరగౌరవం, విశ్వాసము, అవినాభావసాహచర్యంతో కాపురం చేస్తున్నా అరుదైన కొన్ని సందర్భాలలో పట్టుదలకు పోయి, బిగుసుకు పోయినప్పుడు" వేరు వేరు శయ్యలపై శయనించడమే" భార్యామణికి విధించదగిన శిక్ష. 4."మిత్రుడు":- ఒకే కంచం. ఒకే మంచం. ఒకే మాట, ఒకే బాట గా బాల్యం నుండి విడదీయరాని మైత్రీబంధంతో ,భావసారూప్యంతో పెనవేసుకుపోయిన అనుబంధం గల మిత్రుడైనప్పటికిని, ఒక పట్టున ఆతని భావన, చేతన మనకు నచ్చని , మెచ్చని సమయంలో వివాదం పెట్టుకోకుండా, కొంతకాలం "మౌనం పాటించడమే"  అతనికి  తగిన శిక్ష. ఈ నలుగురిలో మొదటిది మినహాయించి, మిగిలిన ముగ్గురి విషయంలో నిరంతర అప్రమత్తత, సహనము, సంయమనము అవసరమని సారాంశము*. 

                                  *****

                   *సమర్పణ  :  పీసపాటి*   

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

Bhagini hasta bhojanam







ఆయన దర్శన భాగ్యం

ఆయన దర్శన భాగ్యం కలగడం ఎన్ని జన్మల పుణ్య ఫలమో ?

బాలాత్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు . 


  ‘’నాకోసం మీరు కంచి కి ఇంత దూరం రావలసిన పని లేదు .చందోలులో లలితాత్రిపురసుందరీ ఉపాసకులు తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారున్నారు కదా !ప్రతి గురువారం వారిని దర్శించండి ‘’అని కంచి కామ కోటి పీథ పరమా చార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రుల వారు చెప్పారు అంటే శాస్త్రి గారి యోగసిద్ధిమహిమ ఎంతటిదో మనకు అర్ధమవు తుంది . 


     గుంటూరు జిల్లా చంద వోలు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి ,హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896 ఆగస్ట్ ఇరవై అయిదున లో జన్మించారు .నిష్టాగరిష్ట కుటుంబం వారిది .చంద వోలు శాస్త్రి గారని అందరు పిలుస్తారు .తాడి కొండ వాసి కేదార లింగం గారు ‘’బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని ‘’వీరికి ఇచ్చారు .పదహారో సంవత్సరం దాకా ఆ మంత్రోపాసన చేసి నందు వల్ల అమ్మ వారు వీరికి పిలిస్తే పలికేది .దెందు కూరి పానకాల శాస్త్రిగారి వద్ద తర్కం ,పొదిలి సీతారామ శాస్త్రిగారి వద్ద మంత్రం నేర్చారు .యవ్వనంలోనే సన్య సించాలి లనే కోరిక కలిగింది .శ్యామలాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్యమండలాన్తర్వర్తి అయిన మహాసిద్ధుడు ఈ రూపం లో జన్మించాడని చెప్పింది .శాస్త్రిగారికి చిన్నతనం లో పినతల్లి చూపించిన ఒక దృశ్యం గోచరించింది. అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వరి అయిన కామేశ్వరి దూరంగా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది .ఒకరిని మోసుకొని ఇద్దర్నీ  తీసుకొచ్చాడు .అమ్మవారు చిరునవ్వుతో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకం లో జన్మించమని  తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది .19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ ,పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతి తో వివాహమైంది .పిన్ని చూపించింది కూడా ఈమెనే .ఆమె పేరు ను శ్రీదేవిగా శాస్త్రి గారు మార్చారు . 


                                          పాండిత్య ప్రకర్ష 


      శాస్త్రి గారు తండ్రి గారి వేద పాఠశాల నిర్వహణ లో తోడు  పడుతూ ఉన్నారు .అయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికా కు రమ్మన్నారు .వారికి ఇష్టం లేదు .పినపాటి వీరభద్రయ్య తో నేత్రావధానం ,ఎలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రి తో కవిత్వసాధన చేశారు .అప్పటికే అనేక సభలవారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టిఫికేట్స్  ఇచ్చారు .వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగలింగశాస్త్రిగారితో అనేక అవధానాలు చేసి ,ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు .పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరభారతీ స్వామి సన్నిధిలో జరిగిన అష్టావధానానికి వారు మెచ్చి ఉభయశ్లేషకు లక్ష్యంగా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతం గా చెప్పి ఒప్పించారు . 


                             అమ్మ వారి సాక్షాత్కారం 


     దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది .ఇంటివద్దే ఉండి  తండ్రికి తోడ్పడ్డారు .తిండికి గడవని పరిస్థితి .మూడు రోజులు అంతా ఉపవాసమే. మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి అన్గొస్త్రం నేలమీద పరచి నిద్ర పోయారు .10 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఒరీ! ముష్టి పెడ  తాను .కొంగు పట్టు ‘’అన్నది .దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది  అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది .తెల్లారే సరికి ఖాజీపాలెం సీతారామ రాజు గారి బండి వచ్చింది .అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపురాశి కన్పించింది . అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే. 


          అనేక గ్రామాలలో భాగవతం ,హరి వంశం ,పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరే వారు .పరమ నిష్టాగరిష్టం గా జీవించే వారు .ప్రాణాయామం తపస్సు కొనసాగించారు. ఇంట్లో వేరు సెనగ వాడలేదు. దొండకాయ ,టమేటా ,బంగాళాదుంప ,ముల్లంగి  కాబేజీ ,నిశిద్ధం. ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు తప్ప ఎప్పుడు రైలు ప్రయాణం చేయ లేదు .శాస్త్రి గారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. 


                                       అష్టసిద్దులు కైవశం 


            శాస్త్రి గారికి అష్టసిద్ధులు వశ మైనాయి .వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకో లేదు .తాడికొండ వేదపాఠశాలలో దయ్యాలు  తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పారద్రోలారు .ఒక సారి ‘’వశ్యంకర ఔషధి ‘’ని సేకరించాలని చంద్ర గ్రహణం రోజున కొండ ఎక్కి ,దాన్ని గుర్తు పట్టి తీసుకొందామని దగ్గరకు వెళ్తే ఒక బాలుడు అడ్డుకొన్నాడు .బలవంతాన లాక్కో బోతే ‘’నీకు ఈ మొక్కతో పని లేదు. నీముఖం చూస్తేనే అందరు వశులౌతారు ‘’అన్నాడు .ఇంతలో గ్రహణం వదిలింది .బాలుడు మాయమయ్యాడు .తనకు దాన్ని పొందే యోగం లేదని భావించారు .అది దత్తాత్రేయ స్వామి అది పతిగా ఉన్న ఓషధి .పూర్వజన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖదుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు .సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి  పోతుంటే తల నే లకు తగిలే సమయాన ఆయోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు .శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృశ్యుడైనాడు . 


              తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కథామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తి చేస్తున్నారు అయోధ్యకాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు .అమ్మను ఉపాశించి నిద్ర పోయారు .కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు .శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బద్దావు ‘’?అని అడిగింది .’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు .మెలకువ వచ్చి ‘’భర్మ  మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది 


      ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెనపల్లిలో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతీ కనిపించి నమస్కరించి లోపలి వెళ్ళింది .ఆమె గ్రహ పీడి తురాలు .అందర్ని కొడుతూ ,తిడుతూ ఉండేది .అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది .ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు /’’అని అడిగారు .’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది .శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు .ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది .దయ్యం వదిలింది .వేరొకసారి నాగులచవితిరోజు కాలువలో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగుపాము తోకపై ఆయన కాలు పడింది .అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వెయ బూనితే ‘’గారుడ మంత్రం ‘’జపించారు .సర్పం తల నేల కు వాల్చింది .’’స్వామీ! నీ జోలికి నేను రాలేదు .నా జోలికి నువ్వు రావద్దు .పొరపాటున నా కాలు తగిలింది .వెళ్లి పొండి  ‘’అనగానే పాము వెళ్లి పోయింది .ఆ రోజంతా గారుడ మంత్రం పతిస్తూనే ఉన్నారు . 


                           శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు .ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగాదేవి’గలగలా లాడే బంగారు గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది .శాస్త్ర్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ  ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు .బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది .తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు ..గంగమ్మ కనిపించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చావేరా?" అన్నది .’’అది నీకు పితృతర్పణం చెయ్యటానికి ఉపయోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది .’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు .ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే .’’అన్నారు .మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ .శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు . 


    ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో ,పేరు పెట్టమనో అడిగే వారు .కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త నిర్ణయం చేసే వారు .అంతే .ఆ కార్య క్రమం శుభప్రదం గా జరిగి పోయేది .దానికి తిరుగు లేదు .అదీ వారి మంత్ర సిద్ధి . 


    దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం కాంచీ పరమాచార్యులు ఉయ్యూరు కే’సి’పి’వారి ఆహ్వానం ,గురజాడ లోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో వారం రోజులున్నారు .అప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని రోజులు. అప్పుడు వారిని చూశాను .జగద్గురువుల ను వీరినీ ఒకే సారి చూసే భాగ్యం కలిగింది .అప్పుడే ‘’నడయాడే దైవం ‘’అని పరమాచార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగి నట్లు జ్ఞాపకం .10-12-1990ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతం గా చేరి పోయారు .వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారంగా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతం గా వర్ణించారు .శాస్త్రి గారు కారణ జన్ములు .వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి .

ఆయన దర్శన భాగ్యం

 ఆయన దర్శన భాగ్యం కలగడం ఎన్ని జన్మల పుణ్య ఫలమో ?

బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు .


  ‘’నాకోసం మీరు కంచి కి ఇంత దూరం రావలసిన పని లేదు .చందోలు లో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారున్నారు కదా !ప్రతి గురువారం వారిని దర్శించండి ‘’అని కంచి కామ కోటి పీథ పరమా చార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రుల వారు చెప్పారు అంటే శాస్త్రి గారి యోగ సిద్ధి మహిమ ఎంతటి దో మనకు అర్ధమవు తుంది .


     గుంటూరు జిల్లా చంద వోలు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి ,హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896 ఆగస్ట్ ఇరవై అయిదున లో జన్మించారు .నిష్టా గరిష్ట కుటుంబం వారిది .చంద వోలు శాస్త్రి గారని అందరు పిలుస్తారు .తాడి కొండ వాసి కేదార లింగం గారు ‘’బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని ‘’వీరికి ఇచ్చారు .పదహారో సంవత్సరం దాకా ఆ మంత్రోపాసన చేసి నందు వల్ల అమ్మ వారు వీరికి పిలిస్తే పలికేది .దెందు కూరి పాన కాల శాస్త్రి వద్ద తర్కం ,పొదిలి సీతా రామ శాస్త్రి వద్ద మంత్రం నేర్చారు .యవ్వనం లోనే సన్య సించాలి లనే కోరిక కలిగింది .శ్యామ లాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపం లో జన్మించాడని చెప్పింది .శాస్త్రి గారికి చిన్న తనం లో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచ రించింది .అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వారి అయిన కామేశ్వరి దూరం గా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది .ఒకరిని మోసుకొని ఇద్దర్నీ  తీసుకొచ్చాడు .అమ్మ వారు చిరు నవ్వు తో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకం లో జన్మించమని  తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది .19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ ,పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతి తో వివాహ మైంది .పిన్ని చూపించింది కూడా ఈమెనే .ఆమె పేరు ను శ్రీ దేవి గా శాస్త్రి గారు మార్చారు .


                                          పాండిత్య ప్రకర్ష 


      శాస్త్రి గారు తండ్రి గారి వేద పాథ  శాల నిర్వహణ లో తోడు  పడుతూ ఉన్నారు .అయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికా కు రమ్మన్నారు .వారికి ఇష్టం లేదు .పిన పాటి వీరభద్రయ్య తో నేత్రావధానం ,ఎలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రి తో కవిత్వ సాధన చేశారు .అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టి ఫికేట్స్  ఇచ్చారు .వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగ లింగ శాస్త్రి గారి తో అనేక అవధానాలు చేసి ,ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు .పుష్పగిరి పీథా ది పతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధి లో జరిగిన అష్టావదానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యం గా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతం గా చెప్పి ఒప్పించారు .


                             అమ్మ వారి సాక్షాత్కారం


     దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది .ఇంటి వద్దే ఉండి  తండ్రికి తోడ్పడ్డారు .తిండికి గడవని పరిస్థితి .మూడు రోజులు అంతా ఉపవాసమే .మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి అన్గోస్త్రం నేల మీద పరచి నిద్ర పోయారు .10 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఒర్ ! ముష్టి పె డ  తాను .కొంగు పట్టు ‘’అన్నది .దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది .అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది .తెల్లారే సరికి ఖాజీ పాలెం సీతా రామ రాజు గారి బండి వచ్చింది .అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది . అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే .


          అనేక గ్రామాలలో భాగవతం ,హరి వంశం ,పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరే వారు .పరమ నిష్టా గరిష్టం గా జీవించే వారు .ప్రాణాయామం తపస్సు కోన సాగించారు .ఇంట్లో వేరు సెనగ  నూనె, వేరు సెనగ వాడ లేదు .దొండకాయ ,టమేటా ,బంగాళా దుంప ,ముల్లంగి  కాబేజీ ,నిశిధం .కాశీ కి తప్ప ఎప్పుడు రైలు ప్రయాణం చేయ లేదు .శాస్త్రి గారికి మగ సంతానం లేదు 


                                       అష్ట సిద్దులు కైవశం


            శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశ మైనాయి .వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకో లేదు .తాడి కొండ వేద పాథ శాలలో దేయాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు .ఒక సారి ‘’వశ్యంకర ఔషధి ‘’ని సేకరించాలని చంద్ర గ్రహణం రోజున కొండ ఎక్కి ,దాన్ని గుర్తు పట్టి తీసుకొందామని దగ్గరకు వెళ్తే ఒక బాలుడు అడ్డుకొన్నాడు .బలవంతాన లాక్కో బోతే ‘’నీకు ఈ మొక్క తో పని లేదు .నీ ముఖం చూస్తేనే అందరు వశు లౌతారు ‘’అన్నాడు .ఇంతలో గ్రహణం వదిలింది .బాలుడు మాయమయ్యాడు .తనకు దాన్ని పొందే యోగం లేదని భావించారు .అది దత్తాత్రేయ స్వామి అది పతి గా ఉన్న ఓషధి .పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు .సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి  పోతుంటే తల నే లకు తగిలే సమయాన ఆయోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు .శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృష్యుడైనాడు .


              తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కదామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తీ చేస్తున్నారు అయోధ్యా కాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు .అమ్మను ఉపాశించి నిద్ర పోయారు .కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు .శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బద్దావు ‘’?అని అడిగింది .’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు .మెలకువ వచ్చి ‘’భర్మ  మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది


      ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెన పల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతీ కని పించి ,నమస్కరించి లోపలి వెళ్ళింది .ఆమె గ్రహ పీడి తురాలు .అందర్ని కొడుతూ ,తిడుతూ ఉండేది .అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది .ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు /’’అని అడిగారు .’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది .శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు .ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది .దెయ్యం వదిలింది .వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది .అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వెయ బూనితే ‘’గారుడ మంత్రం ‘’జపించారు .సర్పం తల నేల కు వాల్చింది .’’స్వామీ !నీ జోలికి నేను రాలేదు .నా జోలికి నువ్వు రావద్దు .పోర పాటున నా కాలు తగిలింది .వెళ్లి పొండి  ‘’అనగానే పాము వెళ్లి పోయింది .ఆ రోజంతా గారుడ మంత్రం పతిస్తూనే ఉన్నారు .


                           శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు .ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి’గలగలా లాడే బంగారు చ్గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది .శాస్త్ర్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ  ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు .బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది .తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు ..గంగమ్మ కని పించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా ?’’అన్నది .’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉప యోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది .’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు .ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే .’’అన్నారు .మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ .శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు .


    ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో ,పేరు పెట్టమనో అడిగే వారు .కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త న్నిర్ణయం చేసే వారు .అంతే .ఆ కార్య క్రమం శుభప్రదం గా జరిగి పోయేది .దానికి తిరుగు లేదు .అదీ వారి మంత్ర సిద్ధి .


    దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం కాంచీ పరమాచార్యులు ఉయ్యూరు కే’సి’పి’వారి ఆహ్వానం ,గురజాడ లోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసిన కార్య క్రమం లో వారం రోజులున్నారు .అప్పుడు రాఘవ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని రోజులు .అప్పుడు వారిని చూశాను .జగద్గురువుల ను వీరినీ ఒకే సారి చూసే భాగ్యం కలిగింది .అప్పుడే ‘’నడయాడే దైవం ‘’అని పరమా చార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగి నట్లు జ్ఞాపకం .10-12-1990ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతం గా చేరి పోయారు .వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారం గా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతం గా వర్ణించారు .శాస్త్రి గారు కారణ జన్ములు .వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి .

నాద బ్రహ్మ ఉపాసన

 నాద బ్రహ్మ ఉపాసన. అతి దగ్గరగా దేహములో వాయు రూపంలో గల నాదం దేనివలన తెలియును అనగా మననం తెలియును మౌనముగా మంత్రం మంత్ర మనగా అక్షర శబ్ద వ్యాప్తి వ్యాప్తి కలది కావున శక్తి గలది. శక్తి లేనిది చలన సహితము అగ్నియే అక్షర వ్యాప్తి తత్వం. పదే పదే అక్షర శబ్దాన్ని మనస్సుతో మననం. యిలా ఎందుకు. మనలో వాయు రూపంలో అగ్ని లక్షణమును గుర్తించుట. దానివలన దేహంలో మార్పులను అతి దగ్గరగా గ్రహించ వచ్చును. మానవ దేహ మార్పు ఎవరికి వారికి రోజు రోజూ కనిపించదు. ఎదుట వారికి కనిపించును. మానసిక మార్పులకు సాధన శబ్ద మనమే మూలం. దానిని ప్రకృతి రూపంలో పంచభూతముల ద్వారా  మాత్రమే తెలియును. బ్రబ్మును దర్శించుట యే మననం. దీనినే అహం బ్రహ్మాస్మి. నేను అనే లేని వాయు తత్వం రూపం బ్రహ్మ మునై కలిగియున్నది. యిది సత్యమే. దేహంగల జీవుడు సత్యం. మిగిలినది అసత్యం. జీవం గల దేహం నీడ సత్యం. జీవి లేని దేహం నీడ అసత్యం నీడ దేహ రూపంలో చలనము గలదు. దానికి వెలుగు కారణము వెలుగులో మాత్రమే నీడ తెలియును చీకటిలో నీడ తెలియదు. చీకటి బ్రాంతి. దేహమునకు అనేక రకముల గుణములు కలవు. గుణములు వాసన వలన తెలియును. వాసన అనుభవం కర్మ కర్మ అనుభవమే జీవ లక్షణము. కర్మానుభవమే సత్యం. సత్యం అనుభవమే ఋక్కు. దీనికి నాద బ్రహ్మ ఉపాసన యే శరణ్యం యిక వేరు మార్గం లేదు.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు..


*నడిపించే దైవం..*


అవధూతల, సద్గురువుల చరిత్రలు చదివేటప్పుడు,  కొన్ని కొన్ని సంఘటనలు మన మనసులో ముద్ర వేస్తాయి..

మొదట్లో ఇది నిజమా అనే సందేహం తో మొదలయ్యి, క్రమంగా బలమైన నమ్మకాన్ని కలిగిస్తాయి..

అలా సందేహం నుంచి మన మనసు సమాధాన పడే దాకా మన వెనుక వుండి నడిపేది కూడా ఆ సద్గురువే అన్న నిజం కాలక్రమేణా అవగతం అవుతుంది..


మన కళ్ళెదుటే దైవాన్ని త్రికరణశుద్ధి గా నమ్మి, బాగుపడే వ్యక్తులను చూసినప్పుడు ఏ సందేహాలకు తావుండదు..


అటువంటి ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాము..


పిల్లి మాల్యాద్రి అనే వ్యక్తిని, (రోళ్ళపాడు గ్రామం, వలేటివారి పాలెం మండలం, ప్రకాశం జిల్లా) సుమారు ఒక సంవత్సరం క్రిందట అతని భార్య మొగలిచెర్ల గ్రామంలో సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి తీసుకొని వచ్చింది..


మాల్యాద్రి నడువలేడు..మాట్లాడలేడు.. అంతకు 6నెలల ముందు జబ్బు చేసింది..ఒంగోలు లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించారు..డబ్బూ ఖర్చు అయింది..ఫలితం కనబడలేదు..


ఆ ఇల్లాలికి దిక్కు తోచలేదు..మరో రెండు మూడు వైద్యశాలల్లో చూపించింది..ఎక్కడికి వెళ్లినా..చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అవుతున్నది కానీ..భర్త పరిస్థితిలో మార్పులేదు.కాలం గడిచి పోతోంది..ఆవిడ మనో వేదన తీరడం లేదు..


ఒకనాడు, మొగలిచెర్ల గ్రామంలో సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి తీసుకొని పోయి, కొన్నాళ్ళు అక్కడ వుండి స్వామి వారిని నమ్మి కొలవండి మంచి జరుగుతుంది అని ఆవిడకు తెలిసిన వాళ్లలో ఒకరు  చెప్పారు..ఆ మాటలు ఆ తల్లికి మనసులో నాటుకున్నాయి.."స్వామీ! అన్ని విధాలా నేను ప్రయత్నం చేసాను..చిట్ట చివరి ఆశగా నీ చెంతకు నా భర్తను తీసుకొని వస్తున్నాను..నీదే భారం.."అని మనసులో ప్రార్ధించి..నేరుగా మొగలిచెర్ల లోని  శ్రీ స్వామివారి  సమాధి సన్నిధి చేరుకున్నది..


క్రమం తప్పకుండా శ్రీ స్వామి వారి మందిరం చుట్టూరా ప్రదక్షిణాలు భర్తను పట్టుకుని నడిపించుకుంటూ చేసింది..ఓ పదిహేను రోజులు గడిచేసరికి క్రమంగా మార్పు కనబడసాగింది..మాల్యాద్రి మెల్లగా ఒకొక్క అడుగూ వేయసాగాడు.. మరో వారం కల్లా..భార్య సహాయం లేకుండానే తానే నడిచే స్థాయికి వచ్చాడు..అలాగే మాటలు కూడా కూడబలుక్కుని మాట్లాడసాగాడు..ఇంకొక పక్షం రోజులు గడిచేసరికి..మాల్యాద్రి తానొక్కడే వరుసక్రమం లో నిలబడి..క్యూ లైన్ లో నడచివచ్చి..శ్రీ స్వామివారి తీర్ధ ప్రసాదాలు తీసుకోసాగాడు..  సరిగ్గా మండలం రోజులు గడిచేసరికి..మాల్యాద్రి కి ఉన్న జబ్బులో డెబ్భై శాతం నయమై పోయింది....ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు!..


శ్రీ స్వామివారి సన్నిధిలో వుండే మేము ఎన్ని సార్లు, యెంతో మందిని చూసినా, ప్రతి భక్తుని అనుభవమూ మాకు పాఠమే.. 


ఆ స్వామి నమ్మినవారికి నేనున్నాను అనే అభయం ఇస్తూనే ఉన్నాడు...నిష్కల్మష భక్తీకి తాను లొంగుతానని, పదే పదే ఋజువు చేస్తూనే ఉన్నాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం... ప్రకాశం జిల్లా.. సెల్..94402 66380 & 99089 73699).

రామనామ విశిష్టత

 రామనామ విశిష్టత


శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకొని, సమీపం లో ఉన్న ఆనందతాండవపురం చేరారు.


ఆ ఊరిలో పండితులు, ప్రజలు స్వామికి అఖండ స్వాగతం పలికారు.


ఆ జనసమూహంలో అనేకమంది బాలురున్నారు. ఆ బాలురందరినీ పిలిచి , ‘శ్రీ రామాయనమః’ అని నూరు పర్యాయాలు రాసి, ఆ వ్రాసిన పత్రాలను తనకు చూపించవలసినదిగా మహాస్వామి వారికి చెప్పారు. అదేవిధంగా వారంతా ‘శ్రీ రామాయనమః’ అని నూరు సార్లు వ్రాసి, ఆ పత్రాలన్నింటిని స్వామికి సమర్పించారు.


వారందరికి ఒక్కొక్కరికి ఒక్కొక కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామి వారు బహూకరించారు.


వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతూ, స్వామి అరవంలో “సొల్లు సొల్లు.” నీవు వ్రాసింది నీ నోటితో ‘చెప్పు, చెప్పు’ అని ఆదేశించారు. అక్కడ స్వామి చుట్టూ మూగిన పండితులందరూ “అయం మూకః, అయం మూకః” (అతడు మూగవాడు మూగవాడు) అని సంస్కృతంలో స్వామికి విన్నవించారు.


అయినా, స్వామి వారి మాటలను విననట్టుగా మరల ఆ పిల్లవానివైపు తిరిగి “నీ సొల్లు, సొల్లు” (నీవు చెప్పు చెప్పు) అన్నారు. అంతట ఆ బాలుడు “శ్రీ రామాయనమః” అని అందరూ వినేట్టు బిగ్గరగా అన్నాడు.


“మూకం కరోతి వాచాలం!”


ఆ సంఘటనను శ్రీ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వయంగా చూచినది.


[వైదిక వాజ్ఞ్మమయంలో రెండే తారకములు. ఒకటి 'ఓం' కారం. రెందవది 'రామ' నామం. అష్టాక్షరిలోని అగ్నిబీజమైన 'రా' కారం, పంచాక్షరిలోని అమృతబీజమైన 'మ' కారం కలిపి తారకమైనది 'రామ' నామం. రామాయణాన్ని, రామనామాన్ని నమ్ముకొని సద్గతి పొందినవారు కోకొల్లలు. రామకోటి రాయడం ఎన్నో జన్మల పుణ్య ఫలం.ఎంతకాలం రామనామం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం చదవబడుతుందో, రామాయణం ఎప్పటి వరకు చెప్పబడుతుందో, ఎప్పటిదాకా వినబడుతుందో అప్పటిదాకా మాత్రమే మానవాళి ఉంటుంది.]


శ్రీరామ రామేతి రమేరామే మనోరమే || సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే


|| జానకీకాంత స్మరాణం జై జై రామ రామ ||


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

*కార్తిక దీపారాధన

 🌺🌷🌸🌾🥀💐🌹

*కార్తిక దీపారాధన ప్రాశస్త్యం ఏమిటి*?


*దీపదో లభతే విద్యాం దీపదో లభతే శ్రుతం దీపదో లభతే చాయుః దీపదో లభతే దివమ్*


*దీపం వెలిగించినవారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులవుతారు. మోక్షాన్ని పొందుతారు.*


*సాయంత్రం శివాలయంలో దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది.*


*అప్రయత్నంగా అయినా, భక్తిభావన లేకపోయినా దీపం వెలిగించినందువల్ల అనంత పుణ్యఫలం వస్తుంది.*


*ఇదే ఫలితం విష్ణుభక్తులకు కూడా వస్తుంది. కార్తికమాసం నెల రోజులూ దీపాలు పెట్టటం సంప్రదాయం.. ఆచార విధి కూడా.*


 *ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లో అయినా దీపం వెలిగిస్తే, వైకుంఠప్రాప్తి కలుగుతుంది.*


*కార్తిక మాసంలో శనిత్రయోదశి కన్నా సోమవారం ఎక్కువ ఫలితాన్నిస్తుంది.*


*శనిత్రయోదశి కన్నా కార్తిక పూర్ణిమ వందరెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది.*


*పూర్ణిమ కన్నా బహుళ ఏకాదశి కోటి రెట్లు పుణ్యఫలితాలు అనుగ్రహిస్తుంది.*


*బహుళ ఏకాదశి కన్నా క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన, అనంతమైన ఫలితాన్నిస్తుందని భాగవతం చెబుతోంది.*


*ఈ రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి.*


                 *భక్తి*

                M.s.s.k

శ్రీలలితా సహస్రనామ వివరణ🌹

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*29. అనాకలిత సాదృశ్య చిబుకశ్రీ విరాజితా*


ఆ తల్లి చిబుకము అనగా గడ్డము యొక్క అందమునకు పోలిక చెప్పుటకు ఏ విధమైనదీ లేని ఆ గడ్డము యొక్క శోభలతో వెలుగొందుతూ వుంది.


వాగ్గేవిఐన సరస్వతి మొదలుగా, నేటి వరకూ గల కవులందరూ ఆ దేవి సౌందర్యమును వర్ణించే ప్రయత్నములు చేసినవారే.


కానీ వారిలో ఎవ్వరికీ శ్రీ మాత గడ్డము దాని సోయగము చెప్పుటకు తగిన వుపమానము దొరకలేదు. అటువంటి సాటిలేని గడ్డపు శోభలతో ప్రకాశిస్తున్నది దేవి


అద్దములో కనబడే శ్రీమాత యొక్క చుబుకమునకు ఆ తల్లి ప్రతిబింబము మాత్రమే సరిపోలుతుంది. మిగిలిన సృష్టిలో యేవీ కూడా ఆ అందము తెలియ జేయుటకు సరిపోదు.


పైగా ఆ చుబుకము అనే పదానికి "శ్రీ” అనే విశేషణము జేర్చుట వల్ల ఆ

అందమునకు పోలికే లేదు


క|| పరమేశ్వరి చిబుకమునకు, సరిపోల్చగ నేమిటౌను? చాలదే జగతిన్ మరితూగుటకే మున్నవి

తరుణిమ శోభకు సరిసమ దర్పణమొకటే!!   


        లలితానామసుగంధం

                 M.s.s.k

అకాలం కవితా సంపుటి

 https://drive.google.com/file/d/0B8PsBoDc2fVfQnBXQm83cWk5Yk1MY3BjVjZFMXBDMWpYZVQ0/view?usp=sharing

live with C19

 Head of Infectious Diseases Clinic, University of Maryland,

 USA says:


  1. We may have to live with C19 for months or years. Don't deny or panic. Don't make your life a misery. Let's learn to live with this reality.


  2. You can't destroy the C19 virus that has penetrated the cell walls, by drinking liters of hot water - you'll just be going to the bathroom more often.


  3. Washing your hands and maintaining a physical distance is your best method of protection.


  4. If you do not have a C19 patient at home, there is no need to disinfect your home.


  5. Grocery bags / plastic bags, gas stations, shopping carts and ATMs do not cause infection.Wash your hands, live your life as usual.


  6. C19 is not a food infection. It is associated with infectious droplets such as flu. There is no demonstrated risk that C19 is transmitted by ordering food.


  7. You can lose your sense of smell by using a lot of anti-allergies and viral infections. These are only non-specific symptoms of C19.


  8. Once you get home, you don't need to change clothes immediately and take a shower!

 Cleanliness is a virtue but not paranoia!


  9. The C19 virus does not fly through the air. This is a respiratory drop infection that requires close contact.


  10.The air is clean, you can walk to parks and public places (just keep your physical distance for protection)


  11. Just use regular soap against C19, no need for anti-bacterial soap. These are viruses, not bacteria.


  12. You don't have to worry about your food orders. But you can heat everything in the microwave, if you want.


  13. The possibility of bringing the C19 home in your shoes is like being struck by lightning twice a day. I've worked against viruses for 20 years - drop infections don't spread like that!


  14. You can't be protected from viruses by consuming vinegar, sugarcane juice and ginger! It's just for immunity not medicine.


  15. Wearing a mask for a long time interferes with your breathing and oxygen levels. Wear it only in crowded places.


  16. Wearing gloves is also a bad idea; the virus can accumulate in gloves and is easily transmitted if you touch your face. Better to just wash your hands regularly.


  17. Immune system gets very weak by always living in a sterile environment. Even if we are taking immune-boosting supplements / medicines, please regularly leave your house to the park / beach or anywhere else.

Immunity is increased by EXPOSURE TO PATHOGENS, not by sitting at home and consuming fried / spicy / sweet foods and fizzy drinks.


  Original article


 https://theazb.com/we-will-live-with-covid19-for-months-lets-not-deny-it-o nor-panic- dr-faheem-younus /


 Very good article ..... a must read for everyone.

Subramanya







 

నాగుల చవితి

 🌸🌺🌷🥀💐🌾🌹

*నాగుల చవితి విషయంలో పాలు పోయుట చేయవచ్చునా చేయరాదా ?*

*కార్తీకశుక్ల చతుర్థి - నాగచతుర్థీ*


*అథకార్తీకశుక్ల చతుర్ధీ నాగచతుర్థీత్యుచ్ఛతే | సా పంచమీ యుతాకార్యేతి పూర్వ మేవోక్తం| తథాచశాతాతపః - ఊర్జే శుక్ల చతుర్థీ యాసైవోపోష్యోత్తరేదినే | ఫణినః పూజయేత్తత్ర ప్రసీదంతి ఫణీశ్వరా ఇతి. అత్ర సైనోపోష్యోత్తరే దిన ఇత్యనేనైన పంచమీవిద్దాగ్రా హ్యేత్యుక్తం భవతి | ఉక్తంచ భవిష్యోత్తరే | పంచమ్యా సంయుతా కార్యా చతుర్థీ కార్తి కేసితా | మధ్యాహ్నే పూజయే త్సర్పాన్గంధపుష్పాక్షతాదిభి రితి అత్ర మధ్యాహ్న వ్యాప్తే షోడా విభాగః పూర్వోక్త ఏవే హోమసంధేయః | ఇతి కార్తీకశుక్ల చతుర్థి.


మధ్యాహ్నవ్యాప్యభావే ప్రాతఃకాలవ్యాపిన్యాం వా నాగచతుర్థీవ్రతం కార్యమ్ ఉపవాసవ్రతత్వాదితి కేచిదాహు: విశేషస్తు నాగచతుర్థీ వినాయకాచతుర్ధీవత్

మధ్యాహ్నవ్యాపినీ గ్రాహ్యా | తదాహ దేవల: -


యుగం మధ్యందినే యత్ర తత్రోపోష్య ఫణీశ్వరాన్

క్షీరేణాప్యాయష్టమ్యాం పారయేత్ ప్రయతో నరః ॥ ఇతి

యుగం చతుర్థీ / అస్యాః షోడా భేదో వతారణీయః ఏతన్నిర్ణయస్తు గణచతుర్థీ.

- నిర్ణయే 2 భిహితః


*తా|| కార్తీకశుద్ధ చవితి నాడు నాగుల చవితి ఆచరింపవలెను.*


*పంచమి విద్దయగు చవితినాడు మధ్యాహ్న కాలమున నాగపూజ చేయవలయును.*


*కార్తీక శుద్ధ చవితి పంచమీ విద్దగానుండగా ఆ మధ్యాహ్నము నాగులను గంధ, పుష్ప అక్షతలతో పూజింపవలెను.*


*మధ్యాహ్నమునకు తిధి వ్యాపించనిచో ప్రాతః కాలమునందైనను నాగ చతుర్దీ వ్రతమును చేయవలయును.*


* నాగ చతుర్ధీ నిర్ణయమును వినాయక చతుర్దీ నిర్ణయమువలెనేమధ్యాహ్న

కాల వ్యాపిత్వమును గ్రహించవలెను.*


*చవితి మధ్యాహ్న సమయమునకు ఉన్న దినముననుపవసించి, నాగులను క్షీరముచే తృప్తిపరచి పంచమి యందు పారణ చేయవలయును.*


*గణేశచతుర్థి నిర్ణయము వలెనే ఆరు విధములుగా విచారణ చేసి నిర్ణయించవలెను.*


*పురాణములలో ఈవిషయములనే చెప్పారు.*


*విశాఖకార్తెలోపాలు పోయరాదనే విషయం ఎచ్చటనూప్రధాన మైన వ్రతనిర్ణయకల్పవల్లి, కాల నిర్ణయచంద్రిక ఈ గ్రంధములలోచెప్పలేదు.*


*కనుకకార్తెఏదైననూ నాగులచవితిరోజు తప్పకుండా సర్పాలను ఆరాధించవలెను* 


                  M.s.s.k